breaking news
viral feavers
-
లక్నోలో విష జ్వరాల విజృంభణ: ఆందోళనలో బాధితులు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అంతుచిక్కని, విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ వైరల్ ఫీవర్స్తో ఇప్పటికే చాలామంది ఆసుపత్రుల పాలవ్వగా రాజధాని నగరం లక్నోలో పలు ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడు తున్నాయి. 40 మంది పిల్లలు సహా, 400 మందికి పైగా చేరడం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్లో గత వారం రోజుల్లో వైరల్ జ్వరాల పీడితుల సంఖ్య 15 శాతం పెరిగింది. వాతావరణ మార్పులతో వస్తున్న సాధారణ ఫ్లూ అని అందోళన అవసరం లేదని వైద్యులు చెబుతునప్పటికీ, కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతుండటం తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలైంది. నగరంలోని బలరాంపూర్ సివిల్ ఆసుపత్రి, లోహియా ఇన్స్టిట్యూట్లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వీటితోపాటు మహానగర్ భౌరావ్ దేవరాస్, రాణి లక్ష్మీబాయి, లోక్బంధు, రాంసాగర్ మిశ్రా, మ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా జ్వర పీడితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా పీడియాట్రిక్స్ విభాగంలో బాధితులు క్యూ కడుతున్నారు. అలాగే పాథాలజీలో, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరం, ఇతర సంబంధిత వ్యాధుల కేసులలో 20 శాతం పెరుగుదల కనిపిస్తోందని సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ ఎస్కె నందా తెలిపారు. -
వైరల్ నరకం!
బేగంపేటకు చెందిన హర్షవర్థన్కు సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి తీవ్ర జ్వరం వచ్చింది. జ్వరం చూస్తే 100 డిగ్రీలు దాటింది.. భరించలేని ఒంటి నొప్పులు. మంచంపై నుంచి లేచి కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి.. డాక్టర్ దగ్గరికెళ్తే.. చికెన్ గున్యాగా అనుమానించి.. పరీక్షలు చేయించారు. తీరా చూస్తే.. వైరల్ ఫీవర్ అని తేలింది. నాగోల్కు చెందిన రాజేశ్వరి వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. మంచంపై నుంచి లేవలేని పరిస్థితి. ఇంట్లోని బంధువులు ఆమెను చేయిపట్టి లేపేందుకు యత్నిస్తే.. నొప్పిని భరించలేక విలవిల్లాడింది. చికిత్స కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్తే.. డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. పరీక్షలు చేయించారు. ఇక్కడా అదే.. సాధారణ వైరల్ ఫీవర్. సాక్షి, హైదరాబాద్ : హర్షవర్థన్, రాజేశ్వరి మాత్రమే కాదు.. గ్రేటర్లో వేలాది మందికి ఇదే తరహాలో తీవ్రమైన జ్వరం, భరించలేని ఒంటినొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి ఈ సీజన్లో జలుబు, తలనొప్పి, జ్వరంతోపాటు కొద్దిపాటి ఒళ్లునొప్పులు సాధారణమే. అయితే, ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో జలుబు, తలనొప్పి, జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లు నొప్పులు (కంబైన్డ్ ఫీవర్స్) ఉన్నాయని చెబుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రి ఓపీకి వస్తున్నవారిలో 30 శాతం మంది జ్వరంతోపాటు తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నవారే. ఈ లక్షణాలను చూసి.. డెంగీ, చికెన్ గున్యా, మలేరియాగా అనుమానించి, వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. తీరా రిపోర్టుల్లో నెగెటివ్ రావడం.. వైరల్ ఫీవర్ అని తేలడం అయోమయాన్ని కలిగిస్తోంది. డెంగీ, చికున్గున్యాలో కన్పించే లక్షణాలే సాధారణ వైరల్ ఫీవర్ లోనూ కనిపించడంతో రోగు ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. నగరంలో కాలుష్య తీవ్రత ఎక్కువ. జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి ఉదయం 10 గంటల వరకు నిద్రపోతుంటారు. తెల్లవారుజామున విడుదలయ్యే సూర్యకిరణాల్లో విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది. కానీ ఈ సమయంలో మనం ఇంట్లో ఉండటంతో ఈ విటమిన్ లోపం కన్పిస్తోంది. దీనికి తోడు మధుమేహ బాధితులు కూడా ఎక్కువ. ఇతరులతో పోలిస్తే... వీరి ఆరోగ్యం కొంత సున్నితంగా ఉంటుంది. మద్యం, మాంసాహారాలను అతిగా తీసుకోవడంతో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సమతుల ఆహార లోపంతో పాటు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో శరీరం పటుత్వాన్ని కోల్పోయి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. సాధారణ జ్వర పీడితులతో పోలిస్తే... విటమిన్ డి లోపం ఉన్న బాధితుల్లో జ్వరం వస్తే నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొందరు నడవలేక కిందపడి పోతుంటారు. -డాక్టర్ నవోదయ, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి ప్రస్తుతం ఆస్పత్రుల్లో నమోదవుతున్న సాధారణ జ్వరపీడితుల్లోనూ డెంగీ, చికున్గున్యా లక్షణాలు కన్పిస్తున్నాయి. వ్యాధినిర్ధారణ కోసం వైద్యులు వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపుతున్నారు. తీరా రిపోర్ట్ చూస్తే.. సాధారణ వైరల్ ఫీవర్గా తేలుతుంది. నగరంలో కొత్త వైరస్ అంటూ ఏమీ లేదు. కానీ విటమిన్ లోపంతో బాధపడుతున్న బాధితుల్లో జ్వరం ఉన్నప్పుడు ఒంటినొప్పులు కొంత ఎక్కువగా ఉండటం సహజమే. -డాక్టర్ శంకర్, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -
తూర్పుగోదావరి జిల్లాలో విష జ్వరాలు ప్రభలుతున్నాయి
-
విష జ్వరాల బారిన ఆ గ్రామం..
ముల్కలపల్లి(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం గ్రామం విష జ్వరాల బారిన పడింది. గ్రామంలోని పలువురు విష జ్వరాలు రావడంతో సమీపంలోని పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో గ్రామంలో మంగళవారం నుంచి ప్రభుత్వం హెల్త్క్యాంప్ను నిర్వహిస్తోంది. ఈ హెల్త్క్యాంప్ను, సంబంధిత గ్రామాన్ని బుధవారం అడిషనల్ డీఎమ్ అండ్ హెచ్వో పుల్లయ్య సందర్శించారు. గ్రామంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు.