-
'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం
కొయ్యూరు: గంజాయిని రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఆ గ్రామంలోని యువకులు ముందుకు కదిలారు. తమ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేయటంతోపాటు.. ఇకపై గ్రామస్తులు ఎవరూ గంజాయి పండించకూడదని తెలియజెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చౌడుపల్లి గ్రామాన్ని ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. కొందరు గ్రామస్తులు అక్కడ గంజాయిని పండిస్తున్నారు. గ్రామ యువకులు పలువురు గురువారం అక్కడికి చేరుకుని, సుమారు ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక నుంచి గ్రామస్తులు ఎవరూ గంజాయిని పండించరని, ఎవరైనా తోటలను వేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. దీనిపై కొయ్యూరు సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ.. గంజాయి ఎక్కువగా సాగవుతున్న మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు ఈ విధంగా చైతన్యవంతులై గంజాయి తోటలను స్వయంగా వారే ధ్వంసం చేయటం శుభపరిణామమన్నారు. -
బంతి బంతికీ బెట్టింగ్..
సాక్షి, దత్తిరాజేరు(విజయనగరం) : ఇంతవరకు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ నేడు గ్రామాలకూ చేరుకుంది. ప్రపంచ కప్ సీజన్లో దాదాపు సగభాగం పూర్తయింది. దీంతో బెట్టింగ్రాయుళ్లు కూడా జోరందుకున్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు క్రికెట్ బుకీలు నియోజకవర్గంలోని పలు గ్రామలకు చేరుకుని తిష్ట వేశారు. క్రికెట్ అంటే పిచ్చి అభిమానం ఉన్న యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బుకీలు ఇచ్చిన నంబర్కు ఫోన్ చేసి ఏ టీమ్ మీద బెట్టింగ్ కడుతున్నామో చెబితే చాలు.. ఆ టీమ్ గెలిస్తే బుకీ నేరుగా డబ్బులు తీసుకువచ్చి ఇస్తాడు. ఒకవేళ టీమ్ ఓడిపోతే బెట్టింగ్ కట్టిన వారు వారున్న ప్రదేశానికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బెట్టింగ్ కట్టేటప్పుడు కూడా బుకీలు పలు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఎవరు పడితే వారితో కాకుండా... తమ అనుచరులు పరిచయం చేసిన వారితో బెట్టింగ్లకు పాల్పడుతుంటారు. నియోజకవర్గంలోని గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలలో పలు హోటళ్లు.. దాబాల వద్ద బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. చాలా గ్రామాలలో యువత సరదాగా పందాలకు అలవాటు పడి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దుబారా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త పుంతలు బెట్టింగ్రాయుళ్లు వివిధ రకాల్లో బెట్టింగ్లు కడుతున్నారు. ఏ మ్యాచ్ గెలుస్తుందో అంచనా వేసి సాధారణంగా బెట్టింగ్లు కడుతుంటారు. అయితే తాజాగా టీమ్ ఎన్ని పరుగులు చేస్తుంది.. ఏ క్రికెటర్ హాఫ్/సెంచరీ చేస్తాడు.. మొత్తం పరుగుల సరి సంఖ్య అవుతుందా.. బేసి సంఖ్య అవుతుందా... ఫస్ట్/ లాస్ట్ బాల్ బౌండరీ కొడతారా.. లేదా.. తదితర విధానాల్లో బెట్టింగ్ జరుగుతోంది. చితికిపోతున్న యువత బెట్టింగ్ల వల్ల యువత ఆర్థికంగా చితికిపోతోంది. డబ్బులు పోయిన సందర్భాల్లో చాలా మంది ఇళ్లల్లో డబ్బులు దొంతనం చేస్తున్నారు. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో బయటకు చెప్పలేకపోతున్నారు. మరికొంత మంది యువకులు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ్ కప్ మ్యాచ్లకు సంబంధించి ప్రతి రోజూ రూ. లక్షల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు స్పందించి క్రికెట్ బెట్టింగ్లపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
చెంబెడు నీటితో చెరువు నింపుతాం
జనగామ: జలం కోసం జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ యువకులు నిర్ణయించారు. పెంబర్తిలోని పెద్ద చెరువు ఎండిపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. చుక్క నీరు లేక ఎండుతున్న పంటలకు తోడు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన చలించిపోయిన యువకులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక యువకులు చొప్పరి సంతోష్, సతీష్, ఏదునూరి రాము, గుడికందుల ప్రశాంత్, మణికంఠ, సాయి, పల్లపు శ్రీకాంత్, గుజ్జుల వేణు, పల్లపు హరీశ్ ఆధ్వర్యాన ఇంటింటికి చెంబెడు నీళ్ల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వెయ్యి దరఖాస్తులు అందించిన యువకులు మరో నిరసన చేపట్టారు. ఇంటింటికీ చెంబు చొప్పున సేకరించిన నీటితో పెద్ద చెరువును నింపే యత్నం చేస్తామని, అప్పుడైనా ప్రజాప్రతినిధులు మేల్కొంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం వంద బిందెల నీటిని పెద్దచెరువులో పోసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపి సత్తా చాటుతామని యువకులు పేర్కొన్నారు. -
ప్రతి నెలా ‘పట్టు’బడే!
ఉద్యోగం మానేసి పట్టు పురుగుల పెంపకం చేపట్టిన యువకుడు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది.. ప్రణాళికాబద్ధంగా ముందడుగు.. నెలకు రూ. 30 వేల నికరాదాయం పొందుతున్న వైనం వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకుండా పోతున్న ఈ రోజుల్లో కన్నీటి సేద్యం చేయడం కన్నా.. పట్నంలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటే మేలన్నది గ్రామీణ యువతను ఇప్పటికీ బలంగా ఆకర్షిస్తున్న భావన. అయితే, పొరుగూళ్లో చిన్నాచితకా ఉద్యోగాల కన్నా సొంతూళ్లో ప్రణాళికాబద్ధమైన సేద్యం ఎంతో మేలని మూతి మీద మీసం కూడా ఇంకా సరిగ్గా మొలవని ఈ లేత కుర్రాడు తన చేతల ద్వారా చాటిచెబుతున్నాడు. శిక్షణ పొంది పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నాడు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు... సొంతూళ్లో పట్టు పురుగుల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జించాలి అనే కోరికతో ఉద్యోగం మానేసి సొంతూరు చేరుకున్నాడు. చదువుకొని ఉద్యోగం చేసుకోక ఇవన్నీ ఎందుకని ఇంట్లో వాళ్ల నుంచి, స్నేహితులు, ఇరుగుపొరుగు నుంచి విమర్శలు వచ్చినా సహించాడు. తల్లిదండ్రులను ఒప్పించి పెట్టు బడి సమకూర్చుకున్నాడు. కష్టం ఫలించి తొమ్మిది నెలల తరువాత తను ఊహించిన లాభాలు ఒళ్లో వాలాయి. వెక్కిరించిన నొసళ్లే ప్రశంసాపూర్వకంగా చూశాయి. మేమూ నీదా రిలోనేనంటూ మరికొంత మంది యువకులు ముందుకు వచ్చారు. ఇంతా సాధించిన ఆ యువకుడి పేరు పొట్టవర్తిని భార్గవ్. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని కన్నాపూర్ ఆయన స్వగ్రామం. భార్గవ్ జగిత్యాలలో ఇంటర్ పూర్తి చేసి, హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివాడు. డిప్లామా పూర్తి చేసి ఒక సెవెన్ స్టార్ హోటల్లో నెలకు రూ. 8 వేల జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం భార్గవ్కు తృప్తినివ్వలేదు. ఇప్పుడు బాగానే ఉన్నా తరువాత పరిస్థితి ఏమిటి? అనిపించేది. తను అద్దెకున్న ఇంటి యజమాని నాయక్ సెరి కల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తుండేవారు. ఆయనతో పరిచయం పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తిని పెంచింది. బాగా ఆలోచించి స్వంత ఊళ్లో పట్టు పురుగుల పెంపకంతో ఉపాధి పొందడమే సరైన మార్గమని నిశ్చయిం చుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాయక్ సలహాతో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో కేంద్ర పట్టు పురుగుల పెంపకం పరిశోధన, శిక్షణ కేంద్రంలో 2 నెలలు, హిందూపూర్లో 15 రోజులు శిక్షణ తీసుకున్నాడు. రూ. 5 లక్షలతో పట్టు పురుగుల పెంపకానికి ఓ షెడ్డు వేశారు. పట్టు పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించగా వారు షెడ్డు నిర్మాణానికి లక్ష రూపాయలు, స్టాండ్లు, ట్రేలు, చంద్రికలు నెట్లు కట్టుకోవటానికి రూ. 38 వేలు అందజేశారు. మేత కోసం రాజమండ్రి నుంచి మల్బరీ మొక్కలను తెప్పించి ఎకరంలో మల్బరీ తోటను పెంచారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా మల్బరీ తోటకు కూలీల ఖర్చు కోసం ఏడాదికి రూ. 53 వేలు కేటాయించగా రూ. 13 వేలతో మొక్కలు నాటించి, కలుపు తీయించటం వంటి పనులు పూర్తి చేశారు. ఏడాదికి మూడుసార్లు పేడ ఎరువును వేయటం, నీరు కట్టటం తప్ప మల్బరీ తోట పెంచేందుకు ఖర్చులేవీ లేవు. మల్బరీ తోట 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తుంది. తోట ఆరు నెలలు వయసుకొచ్చాక ఆకు సమృద్ధిగా లభిస్తుండటంతో వంద గుడ్లతో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించారు. 2013 అక్టోబర్లో మొదటి బ్యాచ్ వచ్చింది. ఖర్చుకు 8 రెట్లు ఆదాయం.. సుమారు రూ. 30 వేల వరకు నికరాదాయం పొందాడు. మొదటి బ్యాచ్తోనే తాను అనుకున్న ఫలితాన్ని సాధించాడు భార్గవ్. వంద గుడ్లు కొనుగోలు ఖర్చు రూ. 650, షెడ్ను రసాయనాలతో కడిగేందుకు రూ. 500, నాలుగో దశలో ఆకు కోసేందుకు రూ. వెయ్యి, చంద్రికలు నుంచి గూళ్లను తొలగించేందుకు ముగ్గురు కూలీలకు రూ. 450 ఖర్చు కాగా, మార్కెట్కు తరలించేందుకు మరో రూ. వెయ్యి ఖర్చయ్యాయి. మొత్తం రూ. 3,600 ఖర్చు కాగా.. 89 కేజీల పట్టుగూళ్ల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 360 ధర లభించటంతో రూ. 32,040 ఆదాయం లభించింది. జల్లి (మెత్తపడ్డ) గూళ్లు ఎనిమిది కిలోలు రాగా కిలోకు రూ. 50 ధర లభించింది. మొత్తం రూ. 32,440 ఆదాయానికి గానూ.. ఖర్చులు పోను రూ. 28,800 నికరాదాయం వచ్చింది. ఇది ఒక్క బాచ్ (29 -32 రోజులు) ఆదాయం మాత్రమే. ఇప్పటివరకూ 9 బ్యాచ్లు వచ్చాయి. ప్రతి బ్యాచ్లోనూ రూ. 29 - 32 వేల వరకు ఆదాయంతో మొత్తం రూ. 2.50 లక్షల వర కూ నికరాదాయం వచ్చింది. ముందు జాగ్రత్తలతో మేలు పట్టు పురుగుల పెంపకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందంటున్నారు భార్గవ్. పురుగులు కుబుసం విడిచినప్పుడు, రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు ఫార్మనిక్ పౌడర్ చల్లాలి. విసర్జకాల నుంచి వైరస్ రాకుండా పొడి వాతావరణం కోసం కాల్చిన సున్నం చల్లాలి. పట్టు పురుగులను ప్రతి పూటా నిశితంగా పరిశీలించటం, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా షెడ్ను రసాయనాలతో కడగటం ద్వారా 90 శాతం నష్టాలను నివారించవచ్చునని చెపుతున్నారు. రోజూ స్వయంగా మేత కోసి వేస్తూ, పట్టు పురుగులను పరిరక్షిస్తూ, సకాలంలో చర్యలు తీసుకోవటంతో పెద్ద ఇబ్బందులేమీ రాలేదంటున్నారు భార్గవ్. తామంతా అసాధ్యం అన్నదాన్ని భాస్కర్ తమ కళ్లముందే సాధించటంతో మరికొందరు రైతులు పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకొస్తున్నా రు. భార్గవ్ స్వంత గ్రామంలో ఆరుగురు, చుట్టు పక్కల గ్రామాల్లో 15 మంది రైతులు వచ్చే తొలకరి నుంచి మల్బరీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమ వుతున్నారు. వీరందరికీ మల్బరీ మొక్కలు అందించేందుకు భార్గవ్ రెండెకరాల్లో నర్సరీని పెంచుతున్నారు. - పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా పంటల సాగు కన్నా పట్టుపురుగుల పెంపకం మేలు ప్రారంభంలోనే షెడ్ల నిర్మాణం కోసం పెద్ద మొత్తం ఖర్చు చేయాలి. తర్వాత తక్కువ ఖర్చుతోనే మంచి ఆదాయం పొందవచ్చు. మరో రెండెకరాల్లో మల్బరీ తోటను పెంచి, పట్టు గుడ్ల సంఖ్యను 300కు పెంచటం ద్వారా నెలకు రూ. లక్ష సంపాదించాలనేది ప్రస్తుతం నా లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పంటల సాగు కన్నా పట్టు పురుగుల పెంపకం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. ఉద్యోగం కన్నా పట్టుపురుగుల పెంపకం నాకు ఎక్కువ సంతృప్తినిస్తున్నది. శిక్షణ తీసుకుంటే సత్ఫలితాలు సాధించడం సులభం. - పొట్టవర్తిని భార్గవ్(89789 92613), యువ రైతు, కన్నాపూర్, జగిత్యాల మండలం, కరీంనగర్ జిల్లా
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement