breaking news
uppala ramu
-
గూండాలను వెన‘కేసు’కొస్తారా?
గుడివాడ రూరల్: బీసీ మహిళ, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ గూండాలు తిరిగి వారిపైనే అక్రమ కేసు బనాయించి మరో డ్రామాకు తెర తీశారు. నాగవరప్పాడు వద్ద జెడ్పీ చైర్పర్సన్ భర్త తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని, అందులో ఉన్న వైఎస్సార్ సీపీ నేత తనను దూషించారంటూ తెలుగు మహిళా నేత మాదాల సునీతతో సోమవారం గుడివాడ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. అయితే తమ కళ్లముందే దాడి చేసిన గూండాలను పోలీసులు వెనకేసుకు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్ పర్సన్ హారికకు ప్రభుత్వమే కారుతోపాటు డ్రైవర్ను కూడా సమకూర్చిందని, మహిళను ఢీకొట్టారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గుడివాడలో ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో..’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు తీవ్రంగా యత్నించారు.వివాదాస్పద పోస్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రాకుండా సభకు వెళ్లే రహదారుల్లో గంజాయి, మద్యం తాగిన టీడీపీ కిరాయి గూండాలు కాపు గాసి వీరంగం సృష్టించారు. పచ్చ ముఠాలు తమ ఎదుటే జెడ్పీ చైర్ పర్సన్ కారును ధ్వంసం చేసి మారణాయుధాలతో సంచరించినా పోలీసులు స్పందించకుండా ప్రేక్షకపాత్ర వహించారు. హత్యాయత్నానికి పథకం వేసిన టీడీపీ గూండాలను అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. చిన్న చిన్న సెక్షన్ల కింద తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారు. బాబు, లోకేశ్ డైరెక్షన్లోనే..!సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్లోనే గుడివాడలో టీడీపీ కిరాయి గూండాలు అలజడి సృష్టించినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మరో కొత్త డ్రామాకు తెర తీశారు. జెడ్పీ చైర్పర్సన్ భర్త తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని ఫిర్యాదు చేసిన తెలుగు మహిళా నేత మాదాల సునీతను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. జెడ్పీ చైర్పర్సన్ ఫిర్యాదుపై మీనమేషాలు లెక్కించిన పోలీసులు.. సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఆగమేఘాలపై ఉప్పాల రాముతోపాటు మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైనా గతంలో టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. తిరిగి ఆయనపైనే అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన అసలు జిల్లాలోనే ఉండకూడదని పోలీసులు ఆదేశించారు. కోర్టు అనుమతి తీసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమైనా పోలీసులు సహకరించడం లేదు. కేతిరెడ్డి లేకపోతే తాడిపత్రిలో తమ అరాచకాలకు అడ్డు ఉండదనేది టీడీపీ పన్నాగం. ఇక ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నెల్లూరు ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపైనా నెల్లూరులో పచ్చముఠాలు ఓ పథకం ప్రకారం దాడికి తెగబడ్డాయి. ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో చొరబడి 80 ఏళ్ల వయసున్న ఆయన మాతృమూర్తిని భయభ్రాంతులకు గురి చేసి విధ్వంస కాండకు దిగారు. తిరిగి ప్రసన్నకుమార్రెడ్డిపైనే కేసులు బనాయించారు. -
ఇక్కడే మీటింగ్ పెడతాం.. మీకు దమ్ముంటే ఉప్పాల రాము సవాల్
-
ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై కేసు నమోదు
-
టీడీపీ కార్యకర్త డ్రామా.. ఉప్పాల హారిక భర్తపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై గుడివాడ పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ నాయకురాలి ఫిర్యాదుతో ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి తర్వాత కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో, రంగంలోకి కూటమి పెద్దలు.. బాధితులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కొత్త డ్రామాకు, డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు.తాజాగా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి రివర్స్లో వారిపైనే కేసు పెట్టారు. పచ్చ బ్యాచ్ ప్లాన్లో భాగంగా హారిక భర్త రాము.. తన కాలుపై కారు ఎక్కించాడని టీడీపీ నాయకురాలు మాదాల సునీత ఆరోపించారు. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతల సాయంతో సునీత.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాముతో సహా నందివాడ మండలం వైఎస్సార్సీపీ నేత కందుల నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు. అయితే, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి ఘటనలో మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్
గన్నవరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఘన స్వాగతం పలికారు. పెడన మండలంలో జరిగే వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉప్పాల (రమేష్)రాము వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరు అవుతారు. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా పెడన మండలానికి రోడ్డు మార్గంలో బయల్దేరారు. కూడురు గ్రామపంచాయతీ శివారులోని కృష్ణాపురం చేరుకుని అక్కడ పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్ప్రసాద్ కుమారుడు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రమేష్ వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి అక్కడ నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి హైదరాబాద్ వెళతారు.