breaking news
timmajipet
-
ఈతకు వెళ్లి.. తండ్రి, కొడుకుల మృతి
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాజిపేటకు చెందిన బోయ గురువయ్య(40)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు శివ(9)కు ఈత నేర్పేందుకు తండ్రి రోజూ గ్రామ శివారులోగల అమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వెళ్లిన వారు రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సర్పంచ్ వేణుగోపాల్గౌడ్ను ఆశ్రయించారు. ఆయనతోపాటు గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా కొత్తబావి గట్టుపై దుస్తులు కనిపించాయి. బావిలో వెతుకగా శివ, గురువయ్యల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. -
చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందినవారుగా పోలీసులు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.