breaking news
thanuja
-
నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?
బిగ్బాస్ 9 హౌస్లో విజయవంతంగా 12 వారాలు పూర్తయ్యాయి. ఆదివారం ఎపిసోడ్లో దివ్య ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోవడం చాలామంది ఊహించిందే. మరకొరు కూడా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇకపోతే 13వ వారానికిగానూ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ చిత్రవిచిత్రంగా జరిగింది. అటు సుమన్ శెట్టి, ఇటు తనూజ.. డీమన్కి చిన్నపాటి షాక్లు ఇచ్చారు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమేం జరిగింది? నామినేషన్స్లో ఎవరెవరున్నారు?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక హారర్ సినిమా)ప్రతి సభ్యులు ఇద్దరి సభ్యులకు చెందిన బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. తొలుత ఇమ్మాన్యూయేల్.. రీతూ, పవన్ పేర్లు చెప్పాడు. భరణి వచ్చి.. తన మెడిసన్స్తో ప్రాంక్ చేయడం నచ్చలేదని సంజనని, గతవారం సరిగా కనిపించలేదు అని పవన్ని నామినేట్ చేశాడు. రీతూ.. సుమన్, సంజనాని నామినేట్ చేసింది. తనూజ అయితే పవన్ పేరు చెప్పింది. కానీ ఈ డ్రామా కాస్త విచిత్రంగా నడిచింది.తనూజ.. తొలుత ఇమ్మూని నామినేట్ చేస్తున్నట్లు చాలాసేపు మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నన్ను నామినేషన్లోకి లాగాడు. ఏదో మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్ని విసిరి పారేశాం అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పు అని అడిగింది. దీనికి ఇమ్మూ తనవైపు నుంచి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు సడన్గా డీమన్ పవన్ పేరు చెప్పి తనూజ షాకిచ్చింది. ఇప్పటివరకు నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్లా అనిపించిందని పవన్ ఆశ్చర్యపోయాడు. అలానే సంజనని కూడా నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ అయితే వేరే లెవల్ కామెడీ అని చెప్పొచ్చు. నువ్వు హౌస్లో గట్టి గట్టిగా అరుస్తావ్, నాకు అది డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి రీతూని నామినేట్ చేశాడు. దీంతో రీతూ షాకయింది. మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడిగితే.. వాళ్లకు భయమేమో చెప్పలేదు, నాకు భయం లేదు చెప్తున్నా అని వివరణ ఇచ్చాడు. తర్వాత డీమన్ పవన్ పేరు చెబుతూ.. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, మాకంటే నువ్వే స్ట్రాంగ్ గనుక ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని కారణం చెప్పాడు. దీనికి ఏమనలో తెలీక పవన్ నవ్వుకున్నాడు.ఇక సంజన.. పవన్, రీతూని నామినేట్ చేసింది. డీమన్ పవన్.. తొలుత ఇమ్మూ పేరు చెప్పి కాస్త నవ్వించి తర్వాత సంజన, తనూజ పేర్లు చెప్పాడు. చివరగా కెప్టెన్ కల్యాణ్.. భరణిని నామినేట్ చేశాడు. అలా ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. వారిలో సంజన, రీతూ, భరణి, పవన్, తనూజ, సుమన్ ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్) -
బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి బిగ్బాస్ షాక్ ఇచ్చాడు. పచ్చళ్ల పాపని బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో రమ్య ఒకరు. రెండు వారాల క్రితం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఒకరిగా 9వ సీజన్లో అడుగుపెట్టింది. కానీ వచ్చిన తొలిరోజు నుంచే టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్ల్లో మగాళ్లతోనే బాగానే పోటీ పడుతున్నప్పటికీ నోటి దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్పై కామెంట్స్ చేయడం లాంటి వాటి వల్ల నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు వచ్చిన మొదటిరోజునే తనూజ-కల్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కూడా ఈమెకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు)ఇకపోతే ఈ వారం రమ్యతో పాటు రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, రాము, సంజన, కళ్యాణ్ నామినేషన్స్లో నిలిచారు. వీళ్లలో చూస్తే రమ్య, సాయి తప్పితే మిగిలిన వాళ్లంతా చాలారోజులుగా హౌస్లో ఉన్నారు. పలుమార్లు నామినేషన్స్లోనూ ఉన్నారు. దీంతో ఈ వారం వీళ్లందరికీ బాగానే ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్లో నిలిచినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కల్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నట్లు టాక్. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉండగా.. రమ్యగా చాలాతక్కువగా ఓటింగ్ రావడంతో ఈమెని ఎలిమినేట్ చేసేశారట.వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమెనే ఆయేషా. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని ఫిక్స్ అయిన నిర్వహకులు.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఎలిమినేట్ చేసేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్) -
సంజనాను కాపాడుతున్న బిగ్బాస్.. తనూజపై నెగటివ్
బిగ్బాస్ సీజన్-9 నుంచి ప్రియ ఎలిమినేట్ తర్వాత శ్రీజలో కాస్త ఎక్కువ ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్లో శ్రీజ చాలా జాగ్రత్తగా తన ఆట ఆడింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్లో దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనే స్ట్రాటజీ శ్రీజ వేసింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ కంటే ఇమ్యూనిటీ టాస్కులు పెట్టి బిగ్బాస్ తన పంతా మార్చుకున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. సోమవారం ఎపిసోడ్లో కిచెన్ చుట్టూ సంజన, తనూజ మధ్య పెద్ద వార్ నడిచింది. అయితే, తనూజపై సంజనా చేసిన కామెంట్స్ను బిగ్బాస్ కొన్ని టెలికాస్ట్ చేయలేదు. కేవలం తనూజాదే తప్పు అన్నట్లుగా ఎపిసోడ్లో చూపించారు. లైవ్ చూసిన నెటిజన్లు ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.సోమవారం ఎపిసోడ్ కిచెన్ నుంచే మొదలైంది. కొంచెం పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను సంజనా అడుగుతుంది. దీనికి తనూజ ఓకే చెప్పింది. దీంతో సంజనా కిచెన్ దగ్గరికెళ్లి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్తో చెప్పకుండానే తనపని తాను చేసుకుంటుంది. అలా మీరే ఫుడ్ చేసుకుంటే ఎలా అంటూ వాళ్లిద్దరూ ఆమెను ఆపేస్తారు. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేశాం మళ్లీ ఇది దేనికి అని డీమాన్ అడుగుతాడు. మరోవైపు దివ్య కూడా రెడీ అవ్వాలి ఎక్కువ టైమ్ లేదంటూ కెప్టెన్తో చెప్పింది. అప్పుడు శ్రీజతో చేయించుకుంటానని సంజన అంటుంది. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే తనూజ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చిదంటూ తనూజ అడుగుతుంది. దీంతో సంజనా ఫైర్ అవుతుంది. అయ్యో ఏంటమ్మా చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ తన నోటికి పని చెప్పింది. ఆమెకు కౌంటర్గా తనూజ కూడా వాయిస్ పెంచింది. నా డిపర్ట్మెంట్కి వచ్చి మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటూ సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన వాదనను పూర్తిగా బిగ్బాస్ చూపించలేదు.సంజనా కావాలనే ట్రిగ్గర్ చేస్తుందా..?సోమవారం ఎపిసోడ్ చూసిన వారందరూ తనూజాది తప్పు.. సంజనానే కరెక్ట్ అనుకుంటారు. కానీ, బిగ్బాస్ లైవ్ చూసిన వారికి మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో సంజనాది మొత్తం నెగటివ్నే ఉంటుంది. తనూజపై ఆమె దారుణమైన కామెంట్లు చేసినప్పటికీ వాటిని టెలికాస్ట్ చేయలేదు. దీంతో తనూజపై నెగటివిటీ కనిపిస్తుంది. బిగ్బాస్ లైవ్ చూసిన వారందరూ ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఆమె కావాలనే కంటెస్టెంట్స్ను ట్రిగ్గర్ చేస్తుందని అర్థం అవుతుంది. సంజనా రీఎంట్రీ కోసం తనూజ చేసిన సాయం గురించి తెలిసిందే. కానీ, దానిని కూడా తక్కువ చేస్తూ ఆమె ఇమాన్యూల్తో విమర్శలు చేస్తుంది. అదొక సాయమా ఏంటి అంటూ దాటేసింది. ఆపై తనూజకు సిగ్గు, లజ్జా లేదంటూ సంజనా విరుచుకుపడింది. అదొక చీప్, చెత్త, చీప్ మెంటాలటీ అంటూ తనూజపై నోటికి వచ్చిన మాటలు సంజనా అనేసింది. ఆపై శ్రీజను కూడా విమర్శించింది. తన కోసం దుస్తులు కూడా త్యాగం చేయలేదంటూ శ్రీజను కూడా తిట్టేసింది. ఇవన్నీ బిగ్బాస్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. దీంతో అందరూ సంజనానే కరెక్ట్ అంటూ అనుకోవడం సహజమే.ఇద్దరికీ ఇమ్యూనిటీఈ వారం నామినేషన్స్ నుంచి ఇద్దరికి ఇమ్యూనిటీ లభించింది. అందుకోసం 'వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు' అంటూ ఒక టాస్క్ను పెట్టారు. ఇందులో 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున ఆరు టీములుగా బిగ్బాస్ విభజించాడు. అయితే, ఫైనల్గా సుమన్ శెట్టి, తనూజ తమ గేమ్తో పాటు ఇంటి సభ్యుల సపోర్ట్తో ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకున్నారు.Sacrifice chesina gratitude kuda ledu 🤮 siggu lajja anta 👎🏻#BiggBossTelugu9 pic.twitter.com/ewyzHv3atI— Voice 🏎️ (@Ak12Mr_) September 30, 2025 -
నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.షేడ్స్ చూపిస్తున్న కామనర్స్ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్బాస్. కామనర్స్ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.చేతులెత్తి దండం పెట్టిన తనూజఅంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.అర్హత లేదని హెచ్చరికఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
#BiggBossTelugu9 : బిగ్బాస్ 9 సీజన్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
మా ఇంటిబిడ్డలా చూసుకుంటాం.. అభయమిచ్చిన నాగ్
'ముద్దమందారం' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కూతుర్ని టీచర్ను చేయాలనుకుంటే తనూజ మాత్రం నటనవైపు అడుగులు వేసింది. కాలేజీలో చదువుతున్న సమయంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా సినిమా చేసింది. మూడేళ్లు మాటల్లేవ్దాంతో ఆమె తండ్రి మూడేండ్లు నటితో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజయ్యాక తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ముద్ద మందారం సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహికతోనే తన దశ తిరిగిపోయింది. తాజాగా ఆమె తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్నకు యాక్టింగ్ అస్సలు ఇష్టం లేదు. అయినా హైదరాబాద్కు వచ్చి యాక్టింగ్ ద్వారా పేరు సంపాదించుకున్నాను. తప్పకుండా శిక్షిస్తారుఅప్పుడు వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు బిగ్బాస్కు వెళ్తున్నా అని కూడా నాన్నకు తెలియదు. ఆయన తప్పకుండా నన్ను శిక్షిస్తారు. నాతో మాట్లాడరు.. నాన్నకు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో నాగ్.. ఆడపిల్లను మా ఇంటిబిడ్డలా చూసుకుంటాము. ఇండస్ట్రీ గురించి ఎటువంటి భయం అవసరం లేదు అని అభయమిచ్చాడు. -
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజలంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. -
గిరిజనుల కులదైవం ఫోటోతో పాటు వైఎస్ఆర్ గారి ఫోటో..
-
ఎంపీ తనూజా రాణి ప్రమాణస్వీకారం
-
ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదని
బొమ్మనహళ్లి : ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బుధవారం సాయంత్రం ఆనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన బి.తనూజ(22) ఇదే పట్టణంలోని కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. తల్లిదండ్రులు మగ్గం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. సదరు యువతి తాను చదివే కళాశాలలోనే ఓ యువకుడిని ప్రేమించింది. తమకు వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు అంగీకరించకపోవడంతో బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఘోరం..
ట్రాక్టర్ బోల్తా.. టెన్త్ విద్యార్థిని మృతి పది మందికి తీవ్రగాయాలు.. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు యల్లనూరు: కూలీలు, విద్యార్థులతో బయల్దేరిన ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్పెషల్ క్లాస్కు వెళుతున్నానని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోతివా అంటూ మృతి చెందిన విద్యార్థిని తనూజ తల్లిదండ్రులు రాములు, గురక్కలు బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నీర్జాంపల్లి సమీపంలో గ్రామానికి చెందిన పెద్దిరాజు, ఆయన భార్య రామలక్ష్మమ్మ, పెద్దిరాజు తమ్ముడు చంద్రయ్య, ఆయన భార్య జయమ్మలు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ట్రాక్టర్లో ఇసుకను తీసుక తేవడానికి బయల్దేరారు. అదే సమయంలో నీర్జాంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థులు తనూజ(15), భాస్కర్, గంగామహేష్, కామాక్షి, మణికంఠ, భారతి, పృధ్విలు తాము చదువుకుంటున్న పార్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు వెళ్లేందుకు ట్రాక్టర్లో ఎక్కారు. గ్రామం దాటి కొంతదూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తాపడింది. అందరూ తీవ్రంగా గాయపడటంతో హుటిహుటిన పులివెందుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తనూజ మృతి చెందింది. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థిని భారతిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ఆస్పత్రికి తరలించారు. కామాక్షి, మణికంఠలను అనంతపురం, పెద్దిరాజును కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులు గంగామహేష్, భాస్కర్తో పాటు చంద్రయ్య, జయమ్మ, రామలక్ష్మమ్మలు పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శ: రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్జేడీ ప్రతాప్రెడ్డి పులివెందుల ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
చిన్నారి ప్రాణం తీసిన టీవీ
విడపనకల్లు (ఉరవకొండ): ప్రమాదవశాత్తు టీవీ (టెలివిజన్) మీద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని కరకముక్కల గ్రామంలో సోమవారం చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మప్ప, లక్ష్మీదేవిల కూతురు తనూజ(4) ఇంట్లో ఆడుకుంటూ, టీవీకి ఉన్న స్టాండ్ను పట్టుకుని ఊపడంతో.. టీవీ మీద పడింది. దీంతో చిన్నారి తలకు గాయమై స్పహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


