-
రామ.. రామ! భద్రాద్రి ఈవో అత్యుత్సాహం.. ఆలయానికి ఒకరోజు తాళం
సాక్షి, భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో బుధవారం ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. వివరాలివి. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు. దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం యాగశాలలో శఠగోపానికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పారు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. చదవండి: ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి -
యాదాద్రీశుడి సేవలో గవర్నర్
యాదగిరిగుట్ట: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రధానాల యం తూర్పు రాజగోపురం వద్ద గవర్నర్ దంపతు లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులు కొలు వైన స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. ముఖ మండపంలో వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అంద జేశారు. దైవదర్శనం తరువాత గవర్నర్ దంపతులు ప్రధానాలయ కట్టడాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఉత్తర రాజగోపురం వద్ద తమిళిసై మాట్లా డుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రానికి వచ్చిన చిన్నారులతో గవర్నర్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయానికి వచ్చిన గవర్నర్... 2:10 గంటలకు తిరిగి వెళ్లారు. గవర్నర్ వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్రెడ్డి తదితరులున్నారు. గవర్నర్ పర్యటనకు దూరంగా ఈఓ.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానా లయం పునఃప్రారంభమైన తరువాత తొలిసారి స్వయంభూలను దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశ మైం ది. యాదాద్రీశుడి దర్శనానికి శనివారం మధ్యా హ్నం గవర్నర్ వస్తున్న విషయాన్ని రాజ్ భవన్ అధికారులు ఆలయ అధికారులకు ముందుగా నే సమాచారం అందించారు. ఆలయ మర్యాద లు, ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్కు ఈవో స్వా గతం పలకాలి. అలాగే దగ్గరుండి పూజలు చే యించాల్సి ఉంది. కానీ ఈవో గీతారెడ్డి గవర్న ర్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆల య అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి గవర్నర్ దంపతులను దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. తరువాత స్వ యంగా లడ్డూ ప్రసాదం అందజేశారు. అయితే గవర్నర్ పర్యటనకు డుమ్మాకొట్టిన ఈవో... సా యంత్రం ఆలయంలో జరిగిన సేవలో, ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొనడం గమనార్హం. చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
వచ్చేనెలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
సాక్షి, విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ఆలయ ఈవో ప్రకటించారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2న మండల దీక్ష ప్రారంభం కాగా, అదేరోజు పందిరిరాట ఉంటుంది. 22న అర్థమండల దీక్ష, 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. నవంబరు 3న తెప్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయని ఈవో వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాల నిర్వాహణ ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో మాస్క్, వ్యక్తిగత దూరం లాంటి నిబంధనలను భక్తులు పాటించాలని విఙ్ఞప్తి చేశారు. అమ్మవారి సిరిమాను చెట్టు గుర్తింపు వంటి ప్రక్రియ సైతం నిబంధనల మేరకే కొనసాగుతుందని స్పష్టం చేశారు. వృద్దులు, చిన్నారులు, గర్బిణీలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతి లేదని తెలిపారు. అయితే ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించాలన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలో గల మూడు రథాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. -
తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్కుమార్ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు. -
‘అన్ని దేవాలయాలకు ఒకే వెబ్సైట్’
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది భవానీ దీక్షా విరమణలకు అరు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. 13 లక్షల 39 వేల లడ్డూలను భవానీలకు విక్రయించామని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చీరలు, లడ్డూ ప్రసాదాల ద్వారా అమ్మవారికి 2 కోట్ల 53 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఇరుముడుల ద్వారా వచ్చిన సామాగ్రికి 26 న ఆక్షన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆక్షన్లో ఎవరైనా పాల్గొనవచ్చని, ప్రతీ మంగళవారం వృద్ధాశ్రమాలకు భోజన అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నవృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 26 న సూర్యగ్రహణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నామన్నారు. రేపు(డిసెంబర్ 25) రాత్రి 9 గంటల 30 నిముషాలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తున్నామని అన్నారు. తిరిగి 26 సాయంత్రం అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా నకిలీ వెబ్ సైట్లపై ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాయాలకు ఒకటే వెబ్ సైట్ ఉండాలని ప్లాన్ చేస్తున్నామని, జనవరి 8 న అన్ని దేవాలయాల ఈవోలతో దేవాదాయ శాఖ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇకపై దుర్గమ్మ దర్శనం కోసం ముందుగానే అన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు భక్తులకు కల్పిస్తున్నామని ఈ ప్రక్రియ ఉగాది నాటికి అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement