breaking news
Tamma Koti Reddy
-
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం
దేశ ఆర్థికాభివృద్ధిపై అవగాహన పెంపొందించుకునేందుకు ఎన్సీఈఆర్టీ పదో తరగతితో పాటు 12వ తరగతిలోని స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి 2, 5, 6 చాప్టర్లను అధ్యయనం చేయాలి. ఆయా అంశాలకు సంబంధించిన విస్తృత అవగాహన కోసం ఉమా కపిల; మిశ్రా అండ్ పూరి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. 2014-15 బడ్జెట్, ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలను విశ్లేషించాలి. - డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. ఎకానమీ సివిల్స్ మెయిన్స్ జీఎస్-3 పేపర్లో ఎకానమీ సిలబస్ను అభివృద్ధి ముఖ్యాంశంగా రూపొందించారు. అభ్యర్థులు ఏ అంశానికి సంబంధించైనా స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా సిద్ధమవాలి. కాన్సెప్టులపై స్పష్టత ఏర్పరుచుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. సిలబస్లోని అంశాలకు సంబంధమున్న సమకాలీన పరిణామాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. భారత ఆర్థిక వ్యవస్థ 11, 12వ పంచవర్ష ప్రణాళికలు; ప్రభుత్వ రంగం- వనరుల సమీకరణకు ఆధారాలు; ఉపాధి రహిత వృద్ధి; ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయం- ప్రత్యామ్నాయ యంత్రాంగం వంటి అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు, లోటు బడ్జెట్ విధానం, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ఉపాధిస్తంభన అంశాలపై దృష్టిసారించాలి. సమ్మిళిత వృద్ధి 11, 12వ ప్రణాళికల పత్రాల్లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడం; సామాజిక అభివృద్ధి ద్వారా సమ్మిళిత వృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమ్మిళిత వృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయాలి. భారత్లో విద్య, ఆరోగ్య రంగాల స్థితిగతుల నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన అంశం ఆధారంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ప్రభుత్వ బడ్జెటింగ్ ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరం. 2014-15 బడ్జెట్ను అధ్యయనం చేయాలి. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, మూలధన రాబడి, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలపై పట్టు సాధించాలి. వ్యవసాయ రంగం దేశంలోని ముఖ్య పంటలు, ఆహార ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ, అవరోధాలు తదితరాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. పంటల తీరుతెన్నులు, నీటిపారుదల పద్ధతులు, నీటిపారుదలలో రకాలు, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు వంటివాటిపై అవగాహన అవసరం. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని వనరులు, అభివృద్ధి పాఠ్యాంశాలను చదవడం వల్ల అనేక అంశాలపై స్పష్టత వస్తుంది. భారత వ్యవసాయ నివేదిక, ఆర్థిక సర్వేలు కూడా ఉపకరిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు-మద్దతు ధరలు, రాయితీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహారభద్రత అంశాలపై పట్టు సాధించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వాణిజ్య సదుపాయ ఒప్పందం, భారత్లో ఆహార భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. టెక్నాలజీ మిషన్లు (టెక్నాలజీ మిషన్- కాటన్, టెక్నాలజీ మిషన్- హార్టికల్చర్ తదితరాలు) ముఖ్యమైనవి. దేశంలో ఆహార శుద్ధి పరిశ్రమను సన్రైజ్ పరిశ్రమగా చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నందువల్ల ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. కానీ, ప్రామాణిక పుస్తకాల్లో ఆహారశుద్ధి పరిశ్రమకు సంబంధించిన సమకాలీన పరిణామాల సమాచారం లభ్యం కావడం లేదు. అందువల్ల కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను ఉపయోగించుకుని,అవగాహన పెంపొందించుకోవచ్చు. బిజినెస్ లైన్లో ప్రచురితమైన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ- ముఖ్య సవాళ్లు ఆర్టికల్ ఉపయోగపడుతుంది. భారత్లో అమలవుతున్న భూసంస్కరణలు సాంఘిక, ఆర్థికాభివృద్ధికి ఎంత వరకు దోహదపడ్డాయి? భూ సంస్కరణలు, కౌలు సంస్కరణల అమల్లో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను తెలుసుకోవాలి. పారిశ్రామిక విధానాలు సరళీకరణ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులు, మూలధన మార్కెట్పై ప్రభుత్వ నియంత్రణల తొలగింపు, పారిశ్రామిక లెసైన్సింగ్ విధానం సరళీకరణ, ఆర్థికాభివృద్ధిలో బహుళ జాతి సంస్థల పాత్ర ముఖ్యమైన అంశాలు. భారత పారిశ్రామికాభివృద్ధిపై 1991 పారిశ్రామిక విధానం ప్రభావంపై అవగాహన ఉండటం తప్పనిసరి. అవస్థాపనా సౌకర్యాలు, పెట్టుబడులు స్వాతంత్య్రానంతరం అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిని పరిశీలించాలి. దీనికోసం ఆర్థిక సర్వేను అధ్యయనం చేయాలి. శక్తి సంక్షోభం, ఆర్థికాభివృద్ధిపై ప్రభావం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అవస్థాపనా సౌకర్యాల ప్రగతి తదితర అంశాలు ప్రధానమైనవి. {పభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలోని వివిధ పథకాలు, విధివిధానాలైన బీవోవో (బిల్డ్- ఓన్-ఆపరేట్), డీసీఎంఎఫ్ (డిజైన్-కన్స్ట్రక్ట్- మేనేజ్-ఫైనాన్స్), బీవోటీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్) తదితరాలపై అవగాహన అవసరం. ప్రణాళిక సంఘం తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ నివేదిక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- భారత అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నివేదిక ఉపయోగపడతాయి. సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్లో కొత్తగా చేర్చిన ప్రపంచ చరిత్రకు సంబంధించి పారిశ్రామిక విప్లవం, అమెరికన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవంపై దృష్టిసారించాలి. ఆయా విప్లవాల తీరుతెన్నులు, ఫలితాలను విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి. వీటి నుంచి తప్పనిసరిగా వివిధ కోణాల్లో ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. - డా॥పి.వి.లక్ష్మయ్య, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్. చరిత్ర సివిల్స్ ఔత్సాహికులు ప్రిలిమ్స్ను, మెయిన్స్ను విడివిడిగా చూడకూడదు. ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్నప్పుడే చరిత్ర పాఠ్యాంశాలను మెయిన్స్ కోణంలోనూ అధ్యయనం చేయాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చదివితేనే విజయం సొంతమవుతుంది. 2011 వరకు యూపీఎస్సీ సిలబస్లో కేవలం భారతదేశ చరిత్ర, సంస్కృతి మాత్రమే ఇచ్చారు. కొత్త మార్పుల్లో జనరల్ స్టడీస్ మొదటి పేపర్లో భారతదేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్రను కూడా చేర్చారు. మొత్తం చరిత్ర సిలబస్ను పరిశీలిస్తే మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి.. 1) భారతీయ సంస్కృతి ఇందులో ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకున్న సాంస్కృతికపరమైన కళలు, సాహిత్యం, నిర్మాణ రంగాలను చేర్చారు. వివిధ కాలాల్లో రాజకీయ చరిత్రను తెలుసుకుంటూ వీటికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. కళలు, సంస్కృతికు సంబంధించి గతంలో సివిల్స్లో వచ్చిన ప్రశ్నలు: 1 Point out the chief characterestics of the architecture of any two of the following? a) Temples of Khajuraho b) Taj Mahal c) Victoria Memorial నాట్యం, సంగీతం, నాటకం- గత ప్రశ్నలు: 1 Which are the classical dances of India? Where did they originate? Name on distinguished dancer (Who is living) of each school of classical dance. Are the efforts adequate for promotion such dances in India? If not, what further measures would you suggest for the promotion of classical dances. 2 In which regions of India did the following dances originates? 1) Bhangra 2) Garba 3) Mohini Attam 4) Kathak 5) Bamboo dance ఉత్సవాలు, పండగలు- గత ప్రశ్నలు: In which state/states of India are the following festivals celebrated by a large number of people? a) Baisakhi b) Rath yatra c) Bihu d) Pongal e) Onam సంస్కృతిపై ప్రభావం చూపిన సంస్థలు-గత ప్రశ్నలు: 1 Why was the National Cadet Corps (NCC) was established in 1948? How is the corps organised and who are eligible to join it? who are responsible for running the organisation? 2 Explain briefly the importance of the following? a) INA b) Asiatic c) Indian Council of cultural relations భారతీయ సమాజం, సంస్కృతిపై ప్రభావం చూపిన వ్యక్తులు- గత ప్రశ్నలు: 3 Describe briefly the impact of the following on India? a) Leo Tolstoy b) Kemal Ataturic c) Karl Marx 2) ఆధునిక భారతదేశ చరిత్ర భారతీయ సంస్కృతితో పోల్చితే ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలను చదివి, గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీనికి సంబంధించి మెయిన్స్ సిలబస్లో మూడు ప్రధాన భాగాలున్నాయి. అవి.. ఎ) స్వాతంత్య్ర పోరాటానికి ముందు, బి) స్వాతంత్య్ర పోరాటం, సి) స్వాతంత్య్ర పోరాటం తర్వాత. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే ఆధునిక భారతదేశ చరిత్రపై ఎలా పట్టు సాధించాలనే దానిపై అవగాహన వస్తుంది. గత ప్రశ్నలు: 1 What were the motives which led to the partition of Bengal? What were its consequences? Why was it annulled? 2 When was the system of Open Competitive Examination in the Indian Civil Service introduced. Analyse the growth of Indian Civil Service till the passing of the Government of India Act, 1919. 3) 18వ శతాబ్దం నుంచి ప్రపంచ చరిత్ర ఈ విభాగాన్ని కొత్తగా చేర్చారు. ఆధునిక భారతదేశ చరిత్రను అవగాహన చేసుకోవాలంటే ఆధునిక ప్రపంచ చరిత్రపై పట్టు సాధించడం అవసరం. అందుకే చరిత్ర సిలబస్లో దీన్ని చేర్చారు. ఇది ప్రిలిమనరీ పరీక్షలో లేదు. 2013లో వచ్చిన ప్రశ్నలు: 1. 'Late comer' Industrial Revolution in Japan involved certain factors that were markedly different from what west had experienced. (Analyze) 2. 'American Revolution was an economic revolt against mercantilism' substantiate. 3. What policy instruments were deployed to contain the great Economic Depression? -
గోధుమ విస్తీర్ణం పెరగడానికి కారణం?
డాక్టర్ తమ్మా కోటిరెడ్డి పొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ పంటల తీరు - పంటల పద్ధతులు సాంకేతికపరమైన అంశాల్లో భాగంగా పంటల తీరును నిర్ణయించడంలో మేలు రకమైన వంగడాలతోపాటు, యాంత్రీకరణ, సమాచార లభ్యత, మొక్కల రక్షణ వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అవస్థాపనా సౌకర్యాల్లో భాగంగా నీటిపారుదల, రవాణా, నిల్వ, వాణిజ్యం, మార్కెటింగ్ ప్రాసెసింగ్ లాంటి అంశాలు పంటల తీరు నిర్ణయిస్తాయి. సాంఘిక, ఆర్థిక అంశాల్లో భాగంగా భూ యాజమాన్యం, ఆర్థిక వనరుల లభ్యత, కమతాల పరిమాణం, శ్రామిక లభ్యత, కుటుంబాలకు అవసరమైన ఆహారం, ఇంధనం, విత్తం (ఊజ్చీఛ్ఛి) వంటి అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో తోడ్పడతాయి. సహజ, ఆర్థిక, చారిత్రాత్మక, సాంఘిక అంశాలతోపాటు ప్రభుత్వ విధానం కూడా పంటల తీరును నిర్ణయించడంలో ప్రధాన భూమిక వహిస్తుంది. పన్నులు, సబ్సిడీలు, ఉత్పాదితాల లభ్యత, పరపతి లభ్యతకు సంబంధించి ప్రభుత్వ విధానాలు పంటల తీరును ప్రభావితం చేస్తాయి. స్వాతంత్య్రానికి ముందు కాలంలో వ్యవసాయ రంగం, పంటల తీరులాంటి అంశాల్లో ప్రభుత్వ విధానం పరిధి తక్కువగా ఉండేది. స్వాతంత్య్రానంతరం నీటి పారుదల విస్తరణ, సేకరణ ధర, మద్దతు ధర లాంటి అంశాల్లో వివిధ ప్రభుత్వ విధానాల కారణంగా పంటల తీరును నిర్ణ యించడంలో ప్రభుత్వ విధానాల పరిధి పెరిగింది. భారత్లో పంటల తీరు పణాళికల కాలంలో ముఖ్యంగా గత నాలుగు దశాబ్దాల కాలంలో భారత్లోని పంటల తీరు లో గణనీయమైన మార్పులు సంభవించాయి. 1960వ దశకంలో నూతన సాంకేతిక విజ్ఞానం కారణంగా దేశ మధ్యభాగం మొత్తం పంట విస్తీర్ణంలో గోధుమ పంట విస్తీర్ణం పెరిగింది. ఇదే కాలంలో ముడి ధాన్యాలు (ఇౌ్చటట్ఛ జట్చజీట), పప్పుధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణం తగ్గింది. 1980వ దశకం మధ్య భాగంలో ‘టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స ప్రారంభించిన తర్వాత నూనె గింజల కింద ఉండే భూ విస్తీర్ణం పెరిగింది. 1992-93 నాటికి వంటనూనె గింజల కింద ఉండే భూ విస్తీర్ణం వృద్ధి చెందడంతోపాటు భారత్ వంటనూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. భారత్ తన ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, పంట సమతౌల్యత లక్ష్యాన్ని సాధించడానికి ఇటీవల కాలంలో ఉద్యానవన పంటల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించింది. స్వాతంత్య్రానంతరం పంటల తీరులో సంభవించిన మార్పులు\u3102?్చట1. మొత్తం పంట విస్తీర్ణంలో ఆహార పంటలైన తృణ ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల వాటా 3/4 వంతు ఉంటుంది. ఆహార ధాన్యాల కింద ఉన్న మొత్తం భూవిస్తీర్ణంలో తృణ ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం ఎక్కువ. 1950-51లో ఆహార ధాన్యాల కింద ఉన్న మొత్తం భూ విస్తీర్ణం 97.3 మి.హెక్టార్లు కాగా ఈ మొత్తంలో 80.4% తృణ ధాన్యాల కింద ఉండటాన్ని గమనించవచ్చు. 2012-13లో ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణం 120.2 మి.హె.కాగా ఈ మొత్తంలో తృణ ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం 96.7 మి.హె. స్వాతంత్య్రానంతరం 1950-51, 2012-13లో మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూవిస్తీర్ణంలో పప్పుధాన్యాల పంట కింద ఉన్న విస్తీర్ణం 19 నుంచి 20% మాత్రమే.\u3102?్చట2. భారత్లో ఆహార పంటల్లో వరి చాలా ముఖ్యమైంది. 1950-51లో 30.8 మి.హె. లలో వరిని పండించారు. మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో వరి పంట కింద ఉన్న విస్తీర్ణం 1950-51లో 31.6%. 2012-13లో 42.4 మి.హె. విస్తీర్ణంలో వరి పంట కింద ఉన్న విస్తీర్ణం 35.3%. దీన్ని బట్టి మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో వరిపంట కింద ఉన్న విస్తీర్ణం 1/3 వంతుగా పేర్కొనవచ్చు. ఇటీవలి కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వరి పంట కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదలను గమనించవచ్చు. ప్రత్యేక వరి ఉత్పత్తి కార్యక్రమాలు, వరి ఉత్పత్తిలో ప్రవేశపెట్టిన సాంకేతిక విజ్ఞానం కారణంగా వరి దిగుబడిలో దేశవ్యాప్తంగా పెరుగుదల సంభవించింది.\u3102?్చట3. స్వాతంత్య్రానంతరం ముడి ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో తగ్గుదలను గమనించవచ్చు. జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న పంటల కింద ఉన్న భూ విస్తీర్ణం మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణంలో 1950-51లో 28.6% నుంచి 2012-13లో 20.5%నికి తగ్గింది. లాభదాయకత తక్కువగా ఉండటం, పరిమిత డిమాండ్, ఉత్పాదితాల ధరల్లో పెరుగుదల కారణంగా ఈ పంటల కింద ఉన్న భూ విస్తీర్ణంలో తగ్గుదల ఏర్పడింది. మరోవైపు బియ్యం, గోధుమల నుంచి ముడి ధాన్యాలు పోటీని ఎదుర్కొంటున్న కారణంగా ఆయా పంటలకు డిమాండ్ తగ్గింది. అంతేకాకుండా భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ముడి ధాన్యాల ధరల కంటే బియ్యం, గోధుమ ధరలు తక్కువగా ఉండటం కూడా ఆయా పంటల కింద ఉన్న భూ విస్తీర్ణం తగ్గడానికి కారణమైంది.1950-51లో నూనె గింజల కింద ఉన్న విస్తీర్ణం 10.7 మి.హె.కాగా, 1985-86లో 19.మి.హె.కు పెరిగింది. 1980వ దశకం ముందు కాలంలో వంటనూనెకు సంబంధించి స్వదేశీ డిమాండ్ను తీర్చే క్రమంలో భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడింది. వంటనూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే క్రమంలో భారత్ 1980వ దశకంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.1985-86లో ‘జాతీయ నూనె గింజల అభివృద్ధి ప్రాజెక్టు, 1986, మేలో టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్సీడ్స (ఖ్ఛీఛిజిౌౌజడ ఝజీటటజీౌ ౌ ౌజీట్ఛ్చఛీట), 1987-88లో ఆయిల్ సీడ్స ప్రొడక్షన్ థ్రస్ట్ ప్రోగ్రా మ్ (ైజీ ట్ఛ్చఛీట ్కటౌఛీఠఛ్టిజీౌ ఖీజిటఠట్ట ్కటౌజట్చఝఝ్ఛ)ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాల అమలు కారణంగా నూనె గింజల పంట కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది.1998-99లో నూనె గింజల కింద ఉన్న విస్తీర్ణం 26.2 మి.హె.కు పెరిగింది. తర్వాత కాలంలో పంట విస్తీర్ణంలో తగ్గుదల ఏర్పడినప్పటికీ 2012-13లో నూనె గింజల పంట విస్తీర్ణం 26.5 మి.హె.కు పెరగడాన్ని గమనించవచ్చు.\u3102?్చట5. భారత్లో రెండో ముఖ్యమైన ఆహార ధాన్య పంట గోధుమ. 1950-51లో మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో గోధుమ విస్తీర్ణం 10% మాత్రమే. తర్వాత కాలంలో హరిత విప్లవం కారణంగా గోధుమ పంట విస్తీర్ణంలో పెరుగుదల సంభవించింది. 2012-13లో 29.7 మి.హె.లలో గోధుమను పండించగా మొత్తం ఆహార ధాన్యాల విస్తీర్ణంలో గోధుమ విస్తీర్ణం వాటా 24.7%గా నమోదైంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్లలో గోధుమ పంట కింద ఉన్న విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది. మద్దతు ధరలు అధికంగా ఉండటం, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ లభ్యత వంటి అంశాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో గోధుమ పంట కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది.\u3102?్చట6. వాణిజ్య పంటల్లో భాగంగా చెరకు పంట కింద ఉన్న భూ విస్తీర్ణం 1950-51లో 1.7 మి.హె.కాగా, 1985-86 నాటికి 2.8 మి.హె.కు, 2012-13 నాటికి 5.1 మి.హె. కు పెరిగింది. పత్తి పంట కింద ఉన్న భూ విస్తీర్ణం 1950-51లో 5.9 మి.హె. కాగా, 2012-13లో 12 మి.హె.కు వృద్ధి చెందిం ది. ఇదేకాలానికి సంబంధించి జనుము, గోగునార కింద ఉన్న భూ విస్తీర్ణం 0.6 మి.హె. నుంచి 0.9 మి.హె.కు పెరిగింది. పంట పద్ధతులు బహుళ పంటలను భారత వ్యవసాయ రంగం ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు. భారత్లోని మొత్తం పంట విస్తీర్ణంలో వర్షాభావ వ్యవసాయం విస్తీర్ణం 92.8 మి.హె. (65 శాతం). వర్షాభావ, మెట్ట ప్రాంతాలలో ఒకే పంట కింద ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు అధిక నష్ట భయాలు ఏర్పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో అనేక బహుళ పంట పద్ధతులు ప్రాచుర్యం పొందాయి. దేశంలోని సాంఘిక - ఆర్థిక వాతావరణం నేపథ్యంలో అనేక మిలియన్ల రైతు కుటుంబాల్లో ఆహార భద్రత పెంపు ముఖ్యాంశంగా నిలిచింది. దేశంలో 56.15 మిలియన్ ఉపాంత కమతాలు (ఒక హెక్టార్లోపు), 17.92 మి. చిన్న కమతాలు (1 నుంచి 2 హె), 13.25 మిలియన్ సెమీ మీడియం (2 నుంచి 4 హె) కమతాలు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పంట ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కమతాల పరిమాణం తక్కువగా ఉన్న స్థితి కారణంగా వ్యవసాయ రంగం వ్యాపార కార్యకలాపంగా కాకుండా జీవనాధార వ్యవసాయంగా మిగిలిపోయింది. ప్రస్తుతం దేశంలో 250 రెండు పంటల పద్ధతులు అమల్లో ఉన్నట్లు అంచనా. భారత్లో అధిక నీటి పారుదల వసతి కలిగిన పంటలుగా వరుసక్రమంలో చెరకు, గోధుమ, బార్లీ, ఆవాలు, వరి, పొగాకు, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ నిలిచాయి. రాష్ట్రాలవారీగా నీటిపారుదల వసతి గల పంట విస్తీర్ణాన్ని పరిశీలించినప్పుడు పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా.. హర్యానా, ఉత్తరప్రదేశ్లు తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి. అంచ నా వేసిన 250 రెండు పంటల పద్ధతుల్లో ముఖ్యంగా 30 దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అమల్లో ఉన్నాయి. వీటిలో వరి - గోధుమ, వరి - వరి, వరి - వేరుశెనగ, పత్తి - వేరుశెనగ, పత్తి - గోధుమ, వరి- మినుములు, పెసలు, ఉలవలు, కందులు, వరి- జొన్న, వరి-చెరకు, చెరకు-గోధుమ, పత్తి -మినుములు/పెసలు/ ఉలవలు/కందులు, సోయాబిన్ - గోధుమ అతి ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. విస్తీర్ణం పరంగా నీటి పారుదల వసతి గల ముఖ్యమైన పంటలను పరిశీలించినప్పుడు చెరకు పండించే మొత్తం విస్తీర్ణంలో 87.9% విస్తీర్ణం నీటిపారుదల వసతి కలిగి ఉంది. తర్వాత గోధుమ 84.3%, బార్లీ 60.8%, ఆవాలు సంబంధితమైనవి 57.5%, వరి 46.8%, పొగాకు 41.2%, పత్తి 33.2%, ముడి శెనగలు 21.9%, మొక్కజొన్న 21.8%, వేరుశెనగ 19.2% విస్తీర్ణంలో నీటి పారుదల వసతి కలిగి ఉన్నాయి. ముఖ్యమైన పంట పద్ధతులకు సంబంధించి ప్రత్యేకాంశాలు వరి - గోధుమ: దేశవ్యాప్తంగా వరి - గోధుమ పంట పద్ధతి ఎక్కువగా అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాధాన్యం పొందింది. ఈ రాష్ట్రాల్లో 10.5 మి.హె. భూమి వరి-గోధుమ కింద ఉంది. గత కొనేళ్లుగా ఈ పద్ధతికి సంబంధించి దేశవ్యాప్తంగా వృద్ధి అధికంగా ఉన్నప్పటికీ ఈ పంటల ఉత్పాదకతలో స్తంభన ఏర్పడింది. భవిష్యత్తులోనూ ఉత్పాదకతలో వృద్ధి తక్కువగా ఉండే సూచనలున్నాయి. భూగర్భజలాలు క్షీణించడం, తూర్పు, మధ్య భారతదేశాల్లో ఎరువుల వాడకం తక్కువగా ఉండటం; వ్యాధులు, చీడపీడలు పెరగడం, వాయవ్య మైదాన ప్రాంతాల్లో ఉత్పాదితాల వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం లాంటి అంశాలు వరి - గోధుమ ఉత్పాదకత తగ్గడానికి కారణాలవుతున్నాయి. వరి - వరి: ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలోని నీటిపారుదల వసతి గల భూముల్లో వరి-వరి పంటల పద్ధతి ప్రాధా న్యం పొందింది. ఆయా రాష్ట్రాల్లో 6 మి. హెక్టార్ల భూమిని ఈ విధానంలో సాగు చేస్తున్నారు. భూసారం క్షీణించడం, సూక్ష్మపోషకాహార లోటు, నైట్రోజన్ వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం, న్యూట్రిమెంట్స్ వినియోగంలో అసమతౌల్యం, శ్రామికుల కొరత వంటి అంశాలు ఈ పంటల పద్ధతి ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నాయి. కేరళలో ఈ పద్ధతి కింద భూ విస్తీర్ణం తగ్గుతుంది. ఇదే సమయంలో అధిక లాభదాయకత, తక్కువ శ్రమ సాంద్రతతో కూడిన తోట పంటల కింద ఉండే భూవిస్తీర్ణం పెరుగుతుంది. అసోంలో వరి-వరి పంట పద్ధతిలో ఉత్పాదకత తగ్గడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, న్యూట్రిమెంట్ల వినియోగం తక్కువగా ఉండటంతోపాటు భూ సార క్షీణతను కారణాలుగా పేర్కొనవచ్చు. చెరకు- గోధుమ: 3.4 మి.హె. భూమిలో చెరకు పంట సాగులో ఉంది. ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్లోని మొత్తం పంట విస్తీర్ణంలో 68% చెరకు సాగు కింద ఉంది. ఈ పద్ధతి అసోంలోని జోర్హాట్, సిబ్ షాగర్, సోనిత్పూర్, మహారాష్ర్టలోని అహ్మద్నగర్, కొల్హాపూర్, కర్ణాటకలోని బెల్గాం జిల్లాల్లో ప్రాధాన్యత పొందింది. చెరకు, గోధుమకు సంబంధించి ఆలస్యంగా నాటడం, న్యూట్రియంట్స్ వినియోగం సరిపోయినంతగా లేకపోవడం, చెరకుకు సంబంధించి నైట్రోజన్ వినియోగ సా మర్థ్యం తక్కువగా ఉండటం లాంటి అంశాలను చెరకు- గోధుమ పంటల పద్ధతి ఎదుర్కొంటున్న సమస్యలుగా పేర్కొనవచ్చు. పత్తి - గోధుమ: ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్లోని ఒండ్రు నేలల్లో పత్తిని విస్తారంగా పండిస్తున్నారు. మరోవైపు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని నల్లరేగడి నేలల్లో పత్తి ముఖ్యమైన పంట. పత్తికి సంబంధించి స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాల లభ్యత అధికంగా ఉన్న కారణంగా పత్తి - గోధుమ పంటల పద్ధతి ఉత్తర భారతదేశంలో ప్రాధాన్యత పొందింది. ఈ వ్యవస్థ కింద ఉన్న విస్తీర్ణంలో పత్తి వాటా 70 నుంచి 80%గా ఉంటుంది. దేశ మధ్య ప్రాంతంలో నీటిపారుదల వసతి గల ప్రాంతాల్లో పత్తి-గోధుమ పంటల పద్ధతి అమలులో ఉంది. పత్తి దిగుబడి వచ్చిన వెంటనే గోధుమ నాటడానికి ఆలస్యం జరగడం, పత్తికి సంబంధించి నైట్రోజన్ వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల మొత్తం ఉత్పాదకత లోపించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోకపోవడంలాంటి అంశాలను పత్తి-గోధుమ పంటల పద్ధతి ఎదుర్కొంటున్న సమస్యలుగా పేర్కొనవచ్చు.