-
ఆఫ్రిది డకౌట్.. అయినా భారీ విజయం
సెయింట్ మోర్టిజ్: ఐస్ క్రికెట్ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించినా అతడి జట్టు ఓడిపోయింది. షాహిద్ ఆఫ్రిది డకౌటైనప్పటికీ అతడి టీమ్ గెలిచింది. సెయింట్ మోర్టిజ్ ఐస్ క్రికెట్ 2018లో భాగంగా గురువారం జరిగిన టి20 మ్యాచ్లో రాయల్స్ ఎలెవన్ చేతిలో ప్యాలెస్ డైమండ్స్ ఎలెవన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓపీ షా సునామీ ఇన్నింగ్స్తో 165 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ సునాయాసంగా ఛేదించింది. షా 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. 15.2 ఓవర్లలో రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కల్లిస్ 36, స్మిత్ 23 పరుగులు సాధించారు. డైమండ్స్ బౌలర్లలో రమేశ్ పొవార్ 2 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్, మలింగ చెరో వికెట్ తీశారు. సెహ్వాగ్ నాయకత్వంలోని డైమండ్స్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు సాధించింది. సెహ్వాగ్ చెలరేగి ఆడి అర్ధసెంచరీ బాదాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సిర్లతో 62 పరుగులు చేశాడు. సైమండ్స్ 40 పరుగులు పిండుకున్నాడు. మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. రాయల్స్ బౌలర్లలో అబ్దుల్ రజాక్ 4, షోయబ్ అక్తర్ 2 వికెట్లు కూల్చారు. ఆఫ్రిది, మెక్కల్లమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
సెహ్వాగ్ చితకొట్టాడు
సెయింట్ మోర్టిజ్: రిటైర్ అయినా వీరూ పవర్ తగ్గలేదు. మామూలు మైదానంలో కాదు ఐస్ స్టేడియంలోనూ సెహ్వాగ్ చెలరేగుతున్నాడు. స్విట్జర్లాండ్లోని సెయింట్ మోర్టిజ్లో జరుగుతున్న ఐస్ టి20 టోర్ని ఆరంభ మ్యాచ్లో వీరూ సత్తా చాటాడు. షాహిద్ ఆఫ్రిది నాయకత్వంలోని రాయల్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ప్యాలెస్ డైమండ్స్ ఎలెవన్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సెహ్వాగ్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు బాదాడు. సిక్సర్తో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. సైమండ్స్ 40 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన డైమండ్స్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 200 స్ట్రైక్ రేటుతో సెహ్వాగ్ విజృంభించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అతడి ఫొటోలు షేర్ చేసి, కామెంట్లు పెట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement