breaking news
Shortage of alcohol
-
తప్పని మద్యం కొరత?
28 నుంచి వచ్చే నెల 6 వరకు బేవరేజెస్కు సెలవు సాక్షి, విజయవాడ : జిల్లాలో మరో మూడు రోజుల్లో మద్యం కొరత ఏర్పడనుంది. అంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మద్యం బేవరేజేస్లో లెక్కలు చూడటానికి వీలుగా వారం రోజులు సెలవులు ప్రకటించారు. దీంతోపాటు వైన్షాపుల లెసైన్స్ కాలపరిమతి జూన్తో ముగియనుండటంతో జిల్లాలో మద్యం కొరత తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో బేవరేజేస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో కొరతను అధిగమించటానికి చర్యలు చేపట్టారు. అయితే నిల్వలను పెంచారు కాని షాపుల వారీగా కోటాను నిర్ణయించకపోవడంతో కొరత అనివార్యంగా మారనుంది. ఎందుకంటే పెరిగిన మొత్తాన్ని సిండికేట్ వ్యాపారులే కొనుగోలు చేసే అవకాశం ఉండడం చిన్న వ్యాపారులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. జిల్లాలో 296 వైన్షాపులు, సుమారు 175 బార్లున్నాయి. వీటి ద్వారా నెలకు జిల్లాలో సుమారు 105 కోట్లరూపాయల మద్యం వ్యాపారం సాగుతుంది. ఇప్పటి వరకు వివిధ డిస్టిలరీస్ నుంచి వచ్చే మద్యంకు ఎక్సైజ్ స్టిక్టర్లతో బేవరేజ్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన జరగటంతో ఎక్సైజ్, బేవరేజ్లు అంధ్ర, తెలంగాణా రాష్ట్రాల వారీగా విభజన జరుగుతుంది. దీంతో జూన్ నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్టికర్లతో విక్రయాలు జరుగుతాయి. దీంతో ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు బేవరేజ్కు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 20 ఎక్సైజ్ సర్కిళ్లపరిధిలో ఉన్న వైన్షాపులు, బార్లకు గుడివాడ, విజయవాడలోని బేవరేజేస్ ద్వారా మద్యం విక్రయిస్తుంటారు. మచిలీపట్నం డివిజన్ పరిధిలోని 9 సర్కిళ్లకు గుడివాడ నుంచి విజయవాడ డివిజన్లోని 11 సర్కిళ్లకు విజయవాడ బేవరేజ్ నుంచి నిల్వలు అందుతాయి. ప్రతి నెల జిల్లాలో సగటున 3 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే పది రోజులు శెలవులు రావటంతో అధికంగా న్విల్ని బేవరేజ్ ద్వారా విక్రయాలు చేయటానికి కసరత్తు చేసి నిల్వలు పెంచారు. జిల్లాలో నెలవారీ కోటా మూడు లక్షల కేసులతో పాటు అదనంగా మరో 70 వేల కేసులు మంజూరు చేయాలని ఎక్సైజ్ , బేవరేజ్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో జిల్లాలో మరో 70 వేల కేసులు మద్యం విక్రయాలకు అంగీకారం లభించింది. 24 వతేదీ లోపు డీడీ తీసిన వ్యాపారులకు మాత్రమే 27 వరకు నిల్వలు ఇస్తారు. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ మద్యం నిల్వలు కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ జూన్ 7 నుంచి యధావిధిగా కొత్త రాష్ట్రం స్టికర్లతో విక్రయాలు సాగుతాయి. -
మద్యం కొరత
మంచిర్యాల అర్బన్, న్యూస్లైన్ : ఎన్నికల పుణ్యమాని జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. మందు బాబులకు మద్యం దొరకని పరిస్థితి. తక్కువ ధర మద్యం దొరుకకపోవడంతో జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నిత్యం పగలే కళకళలాడే మద్యం దుకాణాలు బోసిపోతున్నాయి. రిటైల్ వైన్ దుకాణాల్లో తక్కువ ధర మద్యం లేకపోవడంతో మందుబాబులు నిర్వాహకులతో వాదనకు దిగుతున్నారు. దీంతో చీకటి పడగానే దుకాణాలను మూసి వేస్తున్నారు. మద్యం రాజకీయ పార్టీలకు అమ్మి మద్యంను బ్లాక్ చేస్తున్నారని మద్యం బాబులు ఆరోపిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో తక్కువ ధర మందు అమ్ముడవుతుంది. చీప్లిక్కర్, ఐబీ, ఎంసీ, రాయల్స్టాగ్, బ్లెండర్ స్ప్రైడర్ మందు దొరకడం లేదు. రిటేల్ దుకాణాల్లో మద్యం లేకపోగా బార్ షాపుల్లో మద్యం లభిస్తుండడంతో మందు ప్రియులు డబ్బులు లెక్క చేయకుండా బార్లో మద్యం తాగుతున్నారు. బీర్లకు పెరిగిన డిమాండ్ వేసవి కాలం కావడం పెపైచ్చు మద్యం అందుబాటులో లేకపోవడంతో బీర్లకు గిరాకీ పెరిగింది. సహజంగానే వేసవిలో బార్లలో గిరాకీ ఉంటుంది. అభ్యర్థులు వారి వెంట తిరిగే వారికి ధర ఎక్కువైన కొనుగోలు చేస్తున్నారు. కాగా, మద్యం వ్యాపారులు బెల్ట్ దుకాణాలకు మద్యం నిల్వలు డంప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ముందస్తుగానే మద్యం నిల్వలు పెట్టారని అందుకే మద్యం దుకాణాల్లో తక్కువ ధర మద్యంకు కొరత ఏర్పడిందనే వాదనలు లేకపోలేదు. మద్యం ఎందుకు దొరకడం లేదు మద్యం విచ్చలవిడి అమ్మకాలను నియంత్రించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయంతో కొరత ఏర్పడిందని మద్య నిషేధశాఖ అధికారులు వాదిస్తున్నారు. 2012-13 సంవత్సరంలో మార్చిలో మద్యం వ్యాపారులు ఎంత కొనుగోలు చేశారో ఈ ఏడాది అంతే మద్యం కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీంతో ఎన్నికల సందర్భంగా అధికంగా మద్యం కొనుగోలు చేయడం కుదరడం లేదు. దీంతో నిర్ధేశిత కోటా మద్యంను సరఫరా చేస్తున్నారు. పైగా రోజు మద్యం నిలువలను కలెక్టర్కు స్థానిక మద్య నిషేధశాఖ అధికారులు పంపిస్తున్నారు. అధికారుల నిఘా కారణంగా పెద్ద మొత్తంలో ఎవరికి మద్యం అమ్మరాదు.