-
ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారా? లేదా?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఆడపిల్లలకు అమానుషంగా.. హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారా? లేదా? అనేదీ తేలుస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. ‘ఒకవేళ మేం సుమోటోగా తీసుకోకుంటే.. ఈ కేసును పాతేరేసేవారేగా’అంటూ ప్రభుత్వం, పోలీసులపై మండిపడింది. ‘కేసు దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకోసం ఎందుకు ప్రయత్నించలేదు. దర్యాప్తు ఎలా చేయాలో కూడా మేమే చెప్పాలా?’అని పోలీసులను ధర్మాసనం నిలదీసింది. ఈ కేసుకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. చిన్నారుల్లో హార్మోన్ తాలుకు అవశేషాలను పరీక్షించాలని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాకేశ్ సహాయ్ను ఆదేశించింది. ఇతర మందులేమైనా చిన్నారులపై ప్రయోగించారా? అనే విషయాన్నీ తెలపాలంది. ప్రజ్వల, శిశు గృహకేంద్రాల్లో ఉన్న బాధిత చిన్నారులకు తగిన రక్షణ కల్పించాలని.. ఆసుపత్రులకు వచ్చినపుడు వీరి స్వేచ్ఛ, గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో పోలీసులు, వైద్యులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. ఇకపై ‘యాదాద్రి’కేసును ప్రతి మంగళవారం విచారిస్తామని చెబుతూ.. కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. షీటీమ్స్ అధికారి నేతృత్వంలో సిట్ ‘యాదాద్రి’అమానుష ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారణ జరిపింది. జిల్లా జడ్జీ నుంచి తాము తెప్పించుకున్న చిన్నారుల వివరాలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేయరాదని మీడియాను ఆదేశించింది. దీంతోపాటుగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విధివిధానాలను రూపొందించి.. అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి ఘటనలకు సంబంధించి కింది కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, బెయిల్ పొందిన నిందితులకు సంబంధించిన సమాచారం వివరాలను 24 గంటల్లో తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. షీటీమ్స్ నుంచి ఓ బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటుచేస్తామన్న డీజీపీ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆదేశించింది. సశాస్త్రీయంగా తెలుసుకుంటాం! పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘ఆ చిన్నారులపై హార్మోన్ ఇంజక్షన్లు వాడినట్లు మాకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు’అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని.. దీనిపై మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. హార్మోన్ ఇంజక్షన్లు వినియోగాన్ని తామే సశాస్త్రీయంగా తేల్చుకుంటామని స్పష్టం చేసింది. అసలు బాధితులకు ఏం వైద్య పరీక్షలు నిర్వహించారని ధర్మాసనం ప్రశ్నించగా.. బాధితులతో పాటు నిందితులకు కూడా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించామని శరత్ వెల్లడించారు. ‘డీఎన్ఏ టెస్ట్తో ఎంతవరకు ఉపయోగం? శాస్త్రీయ ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు ప్రయత్నించారా? ఆ చిన్నారులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న వ్యక్తుల వీర్యాన్ని సేకరించారా? ఎండోక్రైనాలజీ వైద్యుల చేత హార్మోన్ల పరీక్ష చేయించారా? బాధిత చిన్నారుల రక్తంలో హా ర్మోన్ల అవశేషాయాలు ఉన్నాయో లేదో తెలుసుకున్నారా? ఎందుకు ఈ శాస్త్రీయ ఆధారాల కోసం ప్రయత్నించడం లేదు. దర్యాప్తు ఎలా చేయాలో కూడా మేమే చెప్పాలా?’అంటూ నిలదీసింది. తర్వాత శరత్ తన వాదనలను కొనసాగిస్తూ.. చిన్నారుల విషయంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించారన్నారు. ఆ చిన్నారుల పేర్ల మీద ఆధార్ కార్డులు తీసుకుని, వారిని తమ పిల్లలుగా, సమీప బంధువుల పిల్లలుగా చెప్పుకుంటూ వచ్చారని, దీంతో నిర్వాహకుల తీరుపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రాలేదన్నారు. పిల్గా తీసుకోకుంటే.. పాతరేసేవారే! ఈ కేసులో ఎంత మందికి బెయిల్ వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. వైద్యుడికి మాత్రమే బెయిల్ వచ్చిందని, దీన్ని రద్దుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని శరత్ చెప్పారు. దీనిపై కోర్టు మండిపడుతూ.. ‘బెయిల్ రాకుండా చేయడం వేరు. దీన్ని రద్దు చేయించడం వేరు. బెయిల్ ఇస్తుంటే సంబంధిత కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నారు? అసలు ఆ వైద్యుడి బెయిల్ను ఆ పీపీ వ్యతిరేకించారా? పీపీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని ఉండకపోతే.. పరిస్థితేంటి? చక్కగా ఈ కేసును పాతర వేసేవారు. అంతేకదా?’అంటూ గట్టిగా నిలదీసింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న చిన్నారుల్లో కొందరు ప్రజ్వల, శిశుగృహ సంస్థల సంరక్షణలో ఉన్నారని, ఈ కేసులో తాము కూడా ప్రతివాదులుగా చేరి కోర్టుకు సహాయకారిగా ఉండాలనుకుంటున్నామని సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ చెప్పారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా ఎవరూ ఆ చిన్నారులను కలిసేందుకు వీల్లేదని.. వారి రక్షణ, గోప్యత విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలంటూ పోలీసులకు పలు సూచనలుచేసింది. పరిహారంతో పరిస్థితులు మారవని.. సమాజంలో అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని పేర్కొంది. -
బస్టాప్ను అడ్డాగా చేసుకుని అమ్మాయిలను..
సాక్షి, హైదరాబాద్: బస్టాప్లో అమ్మాయిలను కను సైగలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ఆకతాయి. ప్రతిరోజు అమ్మాయిలను తన వెంట రమ్మని వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పేట్బషీరాబాద్ డివిజన్ షీ టీమ్ బృందం సభ్యులు ఆ ఆకతాయిని సోమవారం వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతల్ షా థియేటర్ సమీపంలో ఉన్న బస్టాప్లో గత కొంత కాలంగా భగత్సింగ్ నగర్కు చెందిన బాలాజీ అశోక్ గరిబీ(26) బస్టాప్లో నిలబడే మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంపై పలువురు షీ టీమ్స్ డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీ నతానియల్కు ఫిర్యాదు చేశారు. దీంతో పేట్బషీరాబాద్ డివిజన్ షీ టీమ్స్ ఏఎస్సై శ్రీనివాస్కు సదరు ఫిర్యాదును పరిశీలించమని ఆదేశించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్టాప్లో షీ టీమ్ బృందం మాటు వేశారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్వయంగా గమనించారు. అశోక్ గరిజీని అదుపులోకి తీసుకొని జీడిమెట్ల పిఎస్కు అప్పగించారు. -
ప్రేమజంటను కాపాడిన పోలీసులు
కరీంనగర్క్రైం: నగరశివారులోని మానేరుడ్యాం పరిసర ప్రాంతాల్లో ఓ ప్రేమజంటను దాడినుంచి కాపాడారు. షీటీం, టాస్క్ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్తో ఓ యువకుడిని రక్షించారు. గురువారం ఓ వర్గానికి చెందిన యువతి, మరోవర్గానికి చెందిన యువకుడితో నగ రశివారులోని డీర్పార్క్కు వచ్చింది. కాగా యువతి వర్గానికి చెందిన కొం దరు అతడిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న షీటీం, టాస్క్ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి యువకుడిని కాడాపారు. దాడికి యత్నించిన వారిని వన్టౌన్లో అప్పగించారు. కొద్దిమాసాలుగా కరీంనగర్లో ఓ వర్గానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. తమవర్గానికి చెందిన యువతులతో మా ట్లాడుతున్న యువకులపై దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన పో లీసు ఉన్నతాధికారులు టాస్క్ఫోర్స్ను రంగంలోకి దించారు. వీరు నగరశివారులోని మానేరుడ్యాం, పార్క్ల వద్ద నిఘా పెట్టినట్లు తెలిసింది. -
కాల్ చేస్తే.. ఆకతాయిల తాట తీస్తారు
రాజమహేంద్రవరం పోలీసు అర్బన్జిల్లాలో షీ టీం సేవలు పవర్ చూపిస్తామంటున్న షీ టీం లీడర్ రమణమ్మ అమ్మాయిలను వేధించాలనుకునే కుర్రకారుకి ఇక చెడ్డ రోజులు వచ్చినట్టే. యువతులతో పాటు మహిళలను వేధించేవారు ఎక్కడుంటే.. అక్కడ షీ టీం ప్రత్యక్షమవుతుంది. ఒక్కఫోన్ కాల్ చేస్తే.. ఆకతాయిల తాట తీసేందుకు షీ టీం ఉవ్విళ్లూరుతోంది. రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా పరిధిలో ఇటీవల షీ టీం సేవలు అందుబాటులోకి వచ్చాయి. షీ టీం నంబరు : 99590 66755 కోరుకొండ : ఎవరైనా మహిళలు అల్లరిమూకల వేధింపుల బారిన పడితే.. ఒక్క ఫోన్కాల్ చేస్తే చాలు షీటీం పవర్ ఏమిటో చూపిస్తామంటున్నారు రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా నార్త్ సెంట్రల్జోన్ షీ టీం లీడర్, గోకవరం ఏఎస్సై ఎంవీ రమణమ్మ. శనివారం ఆమె కోరుకొండలో విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు షీ టీం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, కాలేజీలు, హైస్కూళ్లు, ప్రధాన కూడళ్లు, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో షీ టీం పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. షీ టీంలో ఆరుగురు మహిళా పోలీసులు మఫ్టీలో ఉంటారని చెప్పారు. ఆకతాయిలు అల్లరి చేసినా, ఈవ్టీజింగ్కు పాల్పడినా.. అలాంటి వారి వివరాలు సెల్ : 99590 66755 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. త్వరలో వాట్సాప్ నంబర్ కూడా తెలియజేస్తామని వెల్లడించారు. కీలకపాత్ర పోషించే ఈ విభాగానికి అసత్య సమాచారం ఇవ్వవద్దని కోరారు. ఎక్కడైతే విద్యార్థినులు సమస్యల్లో ఉంటారో.. అక్కడ షీ టీం ప్రత్యక్షమవుతుందని రమణమ్మ తెలిపారు. గత రెండు రోజుల్లో మహిళలు, యువతను వేధిస్తున్న కోరుకొండలో ముగ్గురిని, రాజమహేంద్రవరంలో ఒకరిని, గోకవరంలో ఇద్దరిని పట్టుకుని, పోలీసు స్టేసన్కు తరలించినట్టు పేర్కొన్నారు. తొలుత కౌన్సెలింగ్ ఇచ్చి వదలి వేస్తామని, వారిలో మార్పు రాకపోతేlకేసులు నమోదు చేస్తామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులను కూడా చైతన్య పరుస్తున్నట్టు చెప్పారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 9 సీట్లలో గెలుపు ఖాయం
- అంచనాలకు మించి..
- Lok Sabha Election 2024: నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
- Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
Advertisement