breaking news
SESHU
-
విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి
తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు శేషు(60) మృతి చెందారు. కొన్నాళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నై ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న శేషు.. నేడు(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. శేషు పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్ శేషు.2002లో ధనుష్ చిత్రం తుళ్లువదో ఇలామైలో వెండితెర అరంగేట్రం చేశారు. విజయ్ టీవీ కామెడీ షో ‘లొల్లు సభ’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా నటుడు సంతానంతో గొప్ప స్నేహం ఉంది. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమాలో శేషు ఉంటాడు. ఇక ఈ మధ్య సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కూడా శేషు నటించి మెప్పించాడు. అదే ఆయన చివరి చిత్రం. శేషుకు ముగ్గురు కొడుకులు. బుధవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శేషు మరణ వార్త విన్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. -
AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ వ్యవస్థ పుట్టిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు శఠగోపం పెట్టారని తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన ఓ సమావేవంలో ఆయన మాట్లాడారు.. 300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. -
సాక్షి స్పెషల్ చిట్ చాట్ విత్ అడవి శేషు
-
మ్యాజిక్ మీ చేతుల్లోనే...
మహిళకు తండ్రి... భర్త మర్రి చెట్టులాంటి వారు. ఆ నీడ చల్లగా ఉంటుంది. కానీ... కాంతిని మింగేస్తుంది. ప్రతి వనిత... స్వయం ప్రకాశిత. ఆ మ్యాజిక్ అర్థం చేసుకుంటే తనూ ఓ మహావృక్షమే. పిల్లల పెంపకం దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు... ఇలాంటి ఎన్నో విషయాలను సాక్షితో పంచుకున్నారు... ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ జయశేషు పట్టాభిరామ్. బీవీ పట్టాభిరామ్ మీ పెళ్లి నాటికే మెజీషియన్ కదా! మిమ్మల్ని మ్యాజిక్తో ఇంప్రెస్ చేసేవారా? అవును, చాలా. మోచేతి దగ్గర కాయిన్ పెట్టి రుద్దేవారు. కాయిన్ మాయమయ్యేది. ఏమైందో చెప్పమనే వారు. కొంతసేపటికి తీసి చూపించేవారు. ఎలా మాయం చేశారో, మళ్లీ ఎలా తీశారో ఎంత ఆలోచించినా తెలిసేది కాదు. రెండేళ్ల పాటు అదే కాయిన్ మ్యాజిక్తో ఆటపట్టించారు. మిమ్మల్ని ఎప్పుడైనా హిప్నటైజ్ చేశారా? ఆ గొంతులోనే ఏదో మాయ ఉంది. మామూలుగా చెప్పినా సరే హిప్నటైజ్ అయిపోతాం. ఇక పని గట్టుకుని హిప్నటైజ్ చేయాల్సిన అవసరమే రాలేదు. అంటే ఎప్పుడో పెళ్లయిన కొత్తలోనే... అది హిప్నటిజం అని మీకు తెలియక ముందే మిమ్మల్ని హిప్నటైజ్ చేసినట్లున్నారు. మీరింకా బయటపడలేదా ఆ మాయ నుంచి? (నవ్వేసి...) ఏమో? ఏం మాయ చేశారో! ఎలా మాయ చేశారో తెలియడం లేదు. తెలివైన భర్తతో సంసారం కష్టమా, సౌకర్యమా? ఆయన తెలివితేటల ప్రదర్శన అంతా బయటే. ఇంట్లో చాలా మామూలుగా ఎదుటి వారిని అర్థం చేసుకునే మనిషిగా ఉంటారు. అందుకే నాకెటువంటి కష్టం రాలేదు. నేను ఆయనకు భార్యను మాత్రమే కాదు, స్టూడెంట్ని, ఆయన రచనలకు తొలి రీడర్ని. క్రిటిక్ని కూడా. సైకాలజిస్ట్గా మీ కెరీర్ ఎప్పుడు మొదలైంది? పెళ్లికి ముందేనా? లేదు, మాది కాకినాడ. మా నాన్న ఇంజనీర్. అమ్మ మా చిన్నప్పుడే పోవడం వల్ల టెన్త్తో చదువాపేయాల్సి వచ్చింది. నాలో ఆ కొరత అలాగే ఉండిపోయింది చాలా కాలంపాటు. మా అబ్బాయి స్కూలుకెళ్లసాగిన తర్వాత మళ్లీ చదవడం మొదలుపెట్టాను. ఓపెన్ యూనివర్శిటీలో బి.ఎ, బిఈడీ, డబుల్ ఎం.ఎ (తెలుగు లిటరేచర్, సైకాలజీ) చేశాను. ఆ తర్వాత సైకాలజిస్టుగా కెరీర్ మొదలుపెట్టాను. పెళ్లికి ముందు చదువుకుని ఉంటే ఇప్పుడిలా నిరంతర విద్యార్థిగా మారేదాన్ని కాదేమో. ఇప్పటికీ సైకాలజీలో కొత్తగా ఏ కోర్సు వచ్చినా చదువుతున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఒక సైకాలజిస్ట్ ఉండగా మళ్లీ మీరు అదే కోర్సు ఎందుకు చేశారు? నేను ఇంట్లో ఖాళీగా ఉండటం అనేదే ఉండదు. బాలవికాస్ ట్రైనింగ్ వంటి ఏదో ఒక పనిలోనే ఉంటాను. మధ్యలో ఎప్పుడు కొంచెం ఖాళీగా కనిపించినా సరే... సైకాలజీ మీద పబ్లిష్ అయిన ఆర్టికల్స్ ఇచ్చి, పాయింట్స్ రాసిపెట్టమని అడిగేవారు. అలా చైల్డ్ సైకాలజీ మీద ఆసక్తి కలిగింది. అప్పట్లో మా వారి కౌన్సెలింగ్ సెంటర్ ఇంట్లోనే. ఆయన కౌన్సెలింగ్ ఇవ్వడం చూసి ఈ ప్రొఫెషన్ బాగుందనుకున్నాను. పైగా ఇందులో నాకు బాస్ నేనే! ఇరవై ఏళ్ల అనుభవంలో పిల్లల్లో మీరు గమనించిన మార్పు ఉందా? ఉంది. తరం మారింది. ఇంటి ముఖచిత్రం మారిపోయింది. అలాగే పిల్లలూ మారిపోయారు. ఇరవై ఏళ్ల కిందట పేరెంట్స్ నుంచి ‘మా పిల్లలు టీవీకి అతుక్కుపోతున్నారు. చదువు మీదకు మళ్లించడం మా వల్ల కావడం లేదు’ అంటూ వచ్చేవాళ్లు. అప్పట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రభావం పెద్దగా లేదు పిల్లల మీద. ఇప్పటి పేరెంట్స్ పిల్లలు ‘స్మార్ట్ఫోన్ వదలట్లేదు’ అంటున్నారు. స్మార్ట్ఫోన్, ట్యాబ్లతో ఫేస్బుక్, వాట్సప్ చాటింగ్తోనే గడుపుతున్నారు, ఎలా మానిపించాలో తెలియట్లేదని వస్తున్నారు. పిల్లల్ని సున్నితంగా డీల్ చేయగలిగిన మ్యాజిక్ పేరెంట్స్లో ఉంటుంది. ఎటొచ్చీ వాళ్లు ఆ స్కిల్ని బయటకు తీయగలగాలంతే. అప్పటికీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్న సమస్య ఏదీ లేదా? అప్పుడూ ఇప్పుడూ కామన్ కంప్లయింట్ మెమరీ గురించి. ‘మా పిల్లలకు మెమొరీ తక్కువగా ఉంది. కాన్సెంట్రేషన్ చేయలేకపోతున్నారు, చదివినా గుర్తుండటం లేదు. జ్ఞాపకశక్తి పెరగడానికి మందులుంటాయా’ అని అడుగుతుంటారు. నిజానికి అందరి మెమొరీ ఒకటే. ట్రైన్డ్ మెమొరీ, అన్ట్రైన్డ్ మెమొరీ మాత్రమే ఉంటాయి. మెదడును వాడకపోతే జ్ఞాపకశక్తి మసకబారుతుంది. వాడుతుంటే చురుగ్గా ఉంటుంది. మా చిన్నప్పుడు అందరికీ ఎక్కాలు కంఠతా వచ్చేవి. కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఎక్కాలు మర్చిపోయాం. ఇంటర్నెట్ అరచేతిలోకి వచ్చాక అన్నింటినీ మర్చిపోతున్నాం. మనకు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయింది అని అడిగితే... బుర్రను వాడి, వేళ్లతో లెక్క వేయడం లేదు. గూగుల్ని అడుగుతున్నాం. బ్రెయిన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ వాడే సాధనంగా మార్చేస్తున్నాం. బ్రెయిన్ను వాడాలి, ప్రాక్టీస్లో ఉంటేనే చురుగ్గా ఉంటుంది. పిల్లలను నొప్పించకుండా చానలైజ్ చేయడం సాధ్యం కాదంటారా! నొప్పించకుండా నేర్పిస్తేనే సాధ్యమవుతుంది. ‘ఇది చేయవద్దు’ అని ఎప్పుడూ చెప్పకూడదు. ఏది చేయాలో అంత వరకే చెప్పి వాళ్లు ఎలా చేస్తారో అలా చేయనివ్వాలి. క్లాస్లో నేనిచ్చే యాక్టివిటీలు కూడా అలాగే ఉంటాయి. అద్దంలో చూస్తూ స్టార్ గీయడం, టూత్పిక్స్ని బోర్డు మీద అమర్చడం వంటివి చేస్తున్నంత సేపు పిల్లలకు మరో లోకం ఉండదు. అంతగా నిమగ్నమవుతారు. అది అలవాటుగా మారితే ప్రతి పనినీ అంతే ఏకాగ్రతతో చేస్తారు. తల్లి పిల్లలతో టైమ్ గడపకుండా తానో ఫోన్లో ఉంటే పిల్లలు మరో ఫోన్లో మునిగిపోతారు. అమ్మ ‘నో’ అంటే నాన్నతో కొనిపించుకుంటారు. దీనిని నివారించి తీరాల్సిందే. ఇది మా అబ్బాయి విషయంలో మేము పాటించిన సూత్రం కూడా. పెంకిగా ఉన్న మా పిల్లవాడు ఇప్పుడు అమెరికాలో పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు పాడయిపోతున్నారని తరచూ వింటున్నాం మరి! తల్లిదండ్రులు పిల్లలతో గడపకపోతే ఏ పిల్లలైనా సరే పాడయిపోతారు. పిల్లలతో గడపడం ఎందుకంటే వాళ్ల దృష్టి ఎప్పుడు ఎటు మరలుతుందో తెలుసుకోవడానికే. ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు. గదిలో కూర్చుని పని చేసుకుంటున్నారని పూర్తిగా వదిలేస్తారు పెద్దవాళ్లు. ఇంటర్నెట్లో పిల్లలకు అవసరమైన విజ్ఞానంతోపాటు పెడదారి పట్టించే సైట్లు బ్లింక్ అవుతుంటాయి. వాటిని క్లిక్ చేయకుండా ఉండలేరు. నిఘా పెట్టకూడదు, కలివిడిగా ఉంటూనే ఓ కంట గమనించాలి. చూడకూడని సైట్ ఓపెన్ అయి ఉన్నట్లు గమనించినా సరే ఆ క్షణంలోనే కోప్పడి నానా గందరగోళం చేయకూడదు. తర్వాత నిదానంగా చెప్పాలి. పిల్లలతో పేరెంట్స్ ఆటలాడే అలవాటు ఉంటే చాలా సమస్యలు ఆ ఇంటి ఛాయలకు కూడా రావు. వంటగదిలో పిల్లల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ తరం భార్యాభర్తల్లో చాలా గొడవలకు కారణం వంటే అవుతోంది. ఏ పిల్లలైనా సరే అమ్మానాన్నలు శ్రద్ధ పెడితే చక్కగా పెరుగుతారు. మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతారు. ఒక ఆడమగ పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం ప్రకృతి ధర్మం. వాళ్లను సరిగ్గా పెంచడం సామాజిక ధర్మం. లోపాలు లేని మనిషి అంటూ ఉండరు. అయితే లోపాలను అధిగమించాలనే సంకల్పం ఉండాలి. తప్పులు పెద్దవాళ్లవే! కౌన్సెలింగ్తో జీవితాలు బాగుపడటం చూశాక ఈ ప్రొఫెషన్ మీద గౌరవం కలిగింది. పిల్లలతో గడిపే అవకాశం ఉండటంతో ఈ కెరీర్ చాలా సంతోషాన్నిస్తోంది. పరివర్తన తేవడానికి నేనిచ్చే టైమ్ షెడ్యూల్స్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నిజానికి ఎప్పుడూ తప్పు పిల్లల్లో ఉండదు. వాళ్లను ఎలా డీల్ చేయాలో తెలియని పెద్దవాళ్లదే సమస్య. చైల్డ్ సైకాలజిస్ట్గా నేను కౌన్సెలింగ్ ఇచ్చేది కూడా పేరెంట్స్కే. మీ వారిలో మీరు చూసిన పర్సనాలిటీ డిఫెక్ట్స్? నేను ఆయనను కరెక్ట్ చేయాల్సిన సందర్భాలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవేమీ లేవు. కానీ టైమ్ మేనేజ్మెంట్ విషయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు ‘టెన్షన్ వద్దు, యు కెన్ మేనేజ్ సచ్ థింగ్స్ ప్రాపర్లీ’ అని చెప్తుంటాను. మీ వారిలో మీకు నచ్చని విషయాలు... కాఫీ ఇచ్చిన తర్వాత చల్లారే వరకు తాగరు. అరగంట తర్వాత నేను మళ్లీ ఆ గదిలోకి వస్తే... ఆయన మాత్రం నేను కాఫీ తెచ్చినప్పుడు ఏ పుస్తకంలో మునిగిపోయి ఉన్నారో, అదే భంగిమలో ఉంటారు. ‘కాఫీ చల్లారిపోయింది’ అంటే ‘ఊ’ అంటారు. కాఫీ ఇచ్చినప్పుడు ఒక ‘ఊ’, చల్లారిపోయినప్పుడు ఒక ‘ఊ’ అంతే. మరొకటి ఏమిటంటే... ఆయన ఎప్పుడూ ఒకేలా డ్రస్ వేసుకోవడం. ‘అవే సూట్, సఫారీల్లో చూసి చూసి విసుగొస్తోంది, మార్చండి’ అనేదాన్ని. చివరికి మా అబ్బాయి పెళ్లికి మాత్రం పట్టుపట్టి కుర్తా, పైజామా వేయించగలిగాను. (భర్త బీవీ పట్టాభిరామ్తో...) – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘జూనియర్ ఎమ్మెస్’ అనడం బాగుంది..
కడియం : తనను ‘జూనియర్ ఎమ్మెస్’గా సినీవర్గాలు పిలవడం ఆనందంగా ఉందని ‘జబర్దస్త్ శేషు’ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని దుళ్ళలో శుక్రవారం ఆయన సందడి చేశారు. సోదరుడు అద్దంకి శ్రీనివాస్ గృహప్రవేశానికి కుటుంబసమేతంగా వచ్చిన శేషు.. తనవైన పంచ్ డైలాగ్లతో బంధుమిత్రులను నవ్వించారు. ఈ సందర్భంగా శేషు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ‘కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మామ, బాబు బంగారం’ చిత్రాల్లో చేసిన పాత్రలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. సాయిధరమ్తేజ, రాజ్తరుణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రాలతోపాటు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఇలాంటి మంచి పాత్రలనే పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ‘వైశాఖం, మిస్టర్’ చిత్రాలతో కలిపి 8 సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు.తాను నేర్చుకున్న మిమిక్రీ జబర్దస్్తలో, సినిమాల్లో నటించేందుకు బాటలు వేసిందన్నారు. వస్తున్న మంచి పాత్రల ద్వారా జనంలో గుర్తింపు వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు ఉత్సాహపడ్డారు. -
నోటితో పాటు ముక్కుకు ప్లాస్టర్ వేయడంతోనే..
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితులను సీపీ మహేందర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. తెలిసిన వ్యక్తులే స్నేహపూర్వకంగా నమ్మించి హత్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నిందితులకు కఠినశిక్ష పడేలా ఆధారాలు సేకరించామని అన్నారు. కిడ్నాప్ వ్యవహారం జరిగిందిలా.. శేషు కుమార్ అలియాస్ సాయి అనే యువకుడు రవి, మోహన్ అనే ఇద్దరు మిత్రులతో కలిసి ముందుగా ప్లాన్ చేసి ఈ నెల 16న అభయ్ను కిడ్నాప్ చేశారని సీపీ వెల్లడించారు. టిఫిన్ తీసుకురావడానికి వచ్చిన అభయ్ను లిఫ్ట్ ఇవ్వమని అడిగి.. సాయి తన రూంకు తీసుకెళ్లాడని, తరువాత స్నేహపూర్వకంగా మాట్లాడి కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పి నోటితో పాటు ముక్కుకు ప్లాస్టర్ వేయడంతో అభయ్ మృతి చెందాడని ఆయన వెల్లడించారు. అభయ్ మృతి చెందిన తరువాత నిందితులు రైళ్లో వెళ్తూ.. అతని తల్లిదండ్రులను డబ్బుకోసం డిమాండ్ చేశారని తెలిపారు. ముగ్గురు నిందితులను ఇచ్చాపురం, బర్హాంపురంలలో అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారం ప్లాస్టర్లు, కొత్త ఫోన్లు, సిమ్ కార్డులు కొనుగోలు చేసి నిందితులు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డారని కమిషనర్ వెల్లడించారు. డబ్బు సంపాదించి సినిమాల్లో నటించాలనే కోరికతో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. దీనికి కొన్ని సినిమాలు, ఫేస్బుక్ పరిచయాలు ప్రేరేపించాయని కమిషనర్ వెల్లడిచారు. -
ఆటోలోనే అభయ్ కిడ్నాప్!
కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ♦ ఏపీలో అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ♦ ఆటో డ్రైవర్ పాత్రపైనా దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసు కొలిక్కి వస్తోంది. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు సభ్యులు ముఠా కట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళంలో గాలింపు చేపట్టిన టాస్క్ఫోర్స్ బృందాలు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్లో వీరితోపాటు ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అభయ్ను ఆటోలో కిడ్నాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. అభయ్ని దారుస్సలాం నుంచి ఆటోలో తీసుకువెళ్లినట్లు తేలడంతో ఆ ఆటోను గుర్తించే పనిలో పడ్డారు. ఆటోడ్రైవర్ పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. హత్య ఆటోలో ఉండగా జరిగిందా? దిగిన తర్వాత జరిగిందా? అన్నది నిర్ధారించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ‘‘అభయ్ కిడ్నాప్, హత్యకు సంబంధించి అనేక కీలకాధారాలు సేకరించాం. నిందితుల కోసం పది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరో 24 గంటల్లో కేసును పూర్తిగా కొలిక్కి తెస్తాం’’ అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి శనివారం ‘సాక్షి’తో అన్నారు. కిడ్నాప్ చేశారిలా.. రాజమండ్రికి చెందిన శేషు అలియాస్ సాయి దిల్సుఖ్నగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్నగర్ కేంద్రంగా పని చేసే కార్తికేయ కన్సల్టెన్సీ ద్వారా ఓ వృద్ధాశ్రమంలో బాయ్గా చేరాడు. కొన్నాళ్ల పాటు ఈ ఉద్యోగం చేసిన శేషు.. తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాడు. ఆర్నెలల తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చి అభయ్ తండ్రి రాజ్కుమార్ ఇంటి సమీపంలోనే ఉండే ప్రదీప్ థాకర్ అనే ప్లాస్టిక్ వ్యాపారి ఇంట్లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే అభయ్తో పరిచయం పెంచుకొన్నాడు. చాలీచాలని వేతనంతో కష్టంగా మారడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. ఏపీకి చెందిన మరో ముగ్గురితో కలిసి అభయ్ కిడ్నాప్కు పథక రచన చేశాడు. వీరంతా కలిసి తొలుత అభయ్ని అతడి స్కూల్ నుంచే కిడ్నాప్ చేయాలని భావించినా అది కుదరకపోవడంతో ఇంటి సమీపం నుంచి అపహరించాలని నిర్ణయించుకున్నారు. టిఫిన్ కోసం బయటకు వచ్చిన అభయ్ని మాటల్లో పెట్టిన శేషు.. అతడి స్కూటీ పైనే దారుస్సలాం వరకు తీసుకువెళ్లాడు. అక్కడ మిగిలిన నిందితులతో కలిసి ఆటోలోకి మార్చాడు. తర్వాత అభయ్ హత్య, పార్శిల్ చేసి సికింద్రాబాద్లో వదిలేయడం, రాజ్కుమార్కు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేయడం చేశారు. తర్వాత సికింద్రాబాద్ నుంచి రైల్లో విజయవాడ మీదుగా పారిపోయారు.