-
టీడీపీ నేతల కక్కుర్తి.. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో డబ్బులు వసూలు!
సాక్షి, కర్నూలు: కర్నూలు నడిబొడ్డున గాయత్రి ఎస్టేట్లో టీడీపీ కార్యాలయం ఉంది. ఇక్కడ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం ప్రతిష్టించనున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పనిలో పనిగా పార్టీ కార్యాలయాన్ని కూడా కాస్త ఆధునికీకరించారు. అయితే, విగ్రహం పేరుతో వసూలు చేసిన చందాలపై ఆపార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. విగ్రహం ప్రతిష్టాపన పేరుతో జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రూ.50లక్షలు వసూలు చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో పాటు ఆపార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు భారీగా చందాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, పాటు టైల్స్, కిటికీలు, తలుపులు ఇలా ఒక్కొక్కటీ ఒక్కో నేత విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు మండల స్థాయి, గ్రామ స్థాయి నేతల నుంచి కూడా సోమిశెట్టి విరాళాలు సేకరించారని, ఈ మొత్తం రూ.50 లక్షలదాకా ఉందని, ఇందులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా ఖర్చు కాలేదని, మిగిలిన నిధులు సోమిశెట్టి జేబులోకి వెళ్లాయని చంద్రబాబు పర్యటనకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
నిర్భయ కేసు నమోదు..డాక్టర్ అరెస్టు
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): మైనర్ బాలికపై అత్యాచార యత్ననికి పాల్పడిన డాక్టర్ రాంగోపాల్రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సంఘటనా స్ధలంలో అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ రవీంద్ర, బాధితుల ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద , నిర్భయ సెక్షన్ 376,354ఎ, ఫోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు రాజమహేంద్రవరంలోని ఆదిత్య ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలికపై ఒక వైద్యుడు అత్యాచారయత్నం చేశాడు. రాజమహేంద్రవరంలోని శ్రీరామనగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక నాన్నమ్మ ఇటీవల మృతిచెందడంతో ఆమె మానసికంగా కుంగుబాటుకు లోనైంది. ప్రభుత్వ కార్మిక ఆస్పత్రిలో(ఈఎస్ఐ)చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈఎస్ఐ అనుబంధ ఆసుపత్రి అయిన స్థానిక దానవాయిపేటలోని ఆదిత్య ఆసుపత్రిలో ఈనెల 7వ తేదీన చేర్చారు. ఆదివారం ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బాలిక వద్దకు డాక్టర్ రాంగోపాలరెడ్డి వచ్చి బాలిక అత్తను బయటకు పంపి బాలికను డాక్టర్ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆమె ఎదురుతిరగడంతో శరీరంపైన పలుచోట్ల గాయపరిచాడు. ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలోకి వచ్చి బాలికను పిలవడంతో ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది. ఏమైందని అడిగేలోగా సదరు డాక్టర్ గదిలో నుంచే బయటకు వచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని డాక్టర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ముదురుతున్న విభేదాలు
పులివెందుల, న్యూస్లైన్ : పులివెందుల టీడీపీలో నెలకొన్న విభేదాలు ముదురుతున్నాయి. పులివెందుల సెగ్మెంట్లో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీని ఢీకొట్టలేక సతమతమవుతున్న ‘దేశం’కు విభేదాల సెగ మరిం త కుంగదీస్తోంది. పార్టీ టిక్కెట్ వ్యవహారంలో సతీష్రెడ్డి, రాంగోపాల్రెడ్డిల మధ్య పొడచూపిన విభేదాలు కీలక నేతలనుంచి.. సాధారణ కార్యకర్తల స్థా యి వరకు పాకాయి. ఒక వర్గం టీడీపీ అభ్యర్థి సతీష్రెడ్డికి అండగా ఉండగా.. మరొక వర్గం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్రెడ్డికి మద్దతు పలుకుతూ వస్తుండటం చూస్తే.. ‘దేశం’ పరిస్థితి ఏమవుతుం దోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంగమ్మ చింతలలో ఆత్మీయ సదస్సు తొండూరు మండల టీడీపీ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి ఆధ్వర్యంలో తొండూరు మండలం కృష్ణంగారిపల్లె సమీపంలో ఉన్న గంగమ్మ చింతల దేవాలయం వద్ద జరిగిన కార్యకర్తల ఆత్మీయ సదస్సుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్రెడ్డి హాజరై చర్చించారు. ఈ సదస్సుకు తొండూరు మండలం నుంచి అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. సతీష్రెడ్డి నామినేషన్ సందర్భంగా తమను విస్మరించారని టీడీపీ కీలక నేతలు రాంగోపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్ధాల తరబడి సేవ చేస్తున్న వారిని పక్కనపెట్టడంపట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా.. గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా కనీసం సమాచారం అందించే నాథుడు లేకపోవడం విచారకరమన్నారు. అటు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ.. ఇటు రైతులకు సంబంధించి 2011-12 రబీ పంటల బీమా కోసం ఆమరణ దీక్ష పేరుతో ఉద్యమం చేపట్టి ప్రజలలో పార్టీ ప్రతిష్ట పెంచిన రాంగోపాల్రెడ్డిని ఎందుకు విస్మరిస్తున్నారంటూ పలువురు ప్రశ్నించారు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పార్టీని అంటిపెట్టుకుని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న రాంగోపాల్రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తొండూరు మండల కార్యకర్తలు, నాయకులు తేల్చి చెప్పారు. సదస్సుకు వెళ్లవద్దంటూ కొంతమంది ఫోన్లు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని పలువురు కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. తొండూరు మండల టీడీపీ అధ్యక్షులు దస్తగిరిరెడ్డి, మాజీ అధ్యక్షులు రమణారెడ్డి, పాలూరు ఈశ్వరరెడ్డి, మల్లేల టీడీపీ నాయకులు చింతకుంట చంద్రశేఖరరెడ్డి, హరుణ్, సింగిల్ విండో డెరైక్టర్ తుమ్మలపల్లె నాగేశ్వరరెడ్డి, సైదాపురం ఓబుళరెడ్డి, నాగేశ్వరరెడ్డి, గంగనపల్లె చిన్న ఓబుళరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు గంగ శేఖర్, తేలూరు సూర్యనారాయణరెడ్డి, కొత్తపల్లె గంగిరెడ్డి, మడూరు గోపాల్, గోటూరు విశ్వనాథరెడ్డి, బ్రహ్మానందరెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు సదస్సులో పాల్గొన్నారు. 29న చక్రాయపేటలో ఆత్మీయ సదస్సు కార్యకర్తల మనోభావాలు కాపాడటమే లక్ష్యంగా సీనియర్ కార్యకర్తల సమస్యలను తెలుసుకోవడమే ధ్యేయంగా ఆత్మీయ సదస్సులను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఈనెల 29న చక్రాయపేట మండలంలో, 30న వేముల మండలంలో ఆత్మీయ సదస్సులను నిర్వహిస్తున్నామని.. అనంతరం మిగతా మండలాల్లో కూడా సదస్సులు ఉంటాయని రాంగోపాల్రెడ్డి తేటతెల్లం చేశారు. కొట్టుకున్న తెలుగుతమ్ముళ్లు పులివెందుల రూరల్/అర్బన్, న్యూస్లైన్ : నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మ రోసారి భగ్గుమన్నాయి. సోమవారం పార్టీ కార్యాల యంలోనే టీడీపీ నేతలు పుచ్చా వరప్రసాద్రెడ్డి, హే మాద్రిరెడ్డి కొట్టుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరి గిన మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలలో డబ్బు పంపిణీ విషయంపై వాదోపవాదాలు జరిగి ఒకరిపైఒకరు చేయి చేసుకున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో అభ్యర్థులు, ఇతరత్రా వాటికి సంబంధించిన డబ్బుల లావాదేవీలో ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. అవి మితిమీరడంతో పార్టీ కార్యాల యంలో కార్యకర్తల అందరి ముందే ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement