-
మనోళ్లు దంచికొట్టారు.. ఒక్కడే 323 నాటౌట్! 357 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Arunachal Pradesh- Hyderabad lead by 357 runs: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన సాగుతోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్లో తిలక్ వర్మ కెప్టెన్సీలో నాగాలాండ్పై 194 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్.. రెండో మ్యాచ్లో రాహుల్ సింగ్ గహ్లోత్ సారథ్యంలో మేఘాలయను 81 రన్స్తో చిత్తు చేసింది. 172 పరుగులకే ఆలౌట్ ముచ్చటగా మూడో మ్యాచ్లోనూ అద్భుత ఆట తీరుతో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు మరో భారీ గెలుపుపై కన్నేసింది. ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ మొదలైంది.సొంతగడ్డపై నెక్స్జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ను 172 పరుగులకే కట్టడి చేసింది. సంచలన ఆరంభం.. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు తీయగా.. టి.త్యాగరాజన్ రెండు, సాకేత్, ఇల్లిగరం సంకేత్ తలా ఓ వికెట్ తీశారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, గహ్లోత్ రాహుల్ సింగ్ సంచలన ఆరంభం అందించారు. 33 ఫోర్లు, 21 సిక్సర్లు తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగా.. గహ్లోత్ 105 బంతుల్లో 185 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తన్మయ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. రంజీ మ్యాచ్లో తన్మయ్ టీ20 తరహా ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ మొదటి రోజు వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తన్మయ్కు తోడుగా అభిరథ్ రెడ్డి 19 రన్స్తో క్రీజులో ఉన్నాడు. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
Hyd: రెండ్రోజుల్లోనే టెస్టు ఖతం.. వరుసగా రెండో విజయం
రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో హైదరాబాద్ నాగాలాండ్ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. -
హైదరాబాద్ ఓటమి.. కేదార్ జాదవ్ కెప్టెన్సీలో మహారాష్ట్ర గెలుపు
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్హజారే ట్రోఫీలో హైదరాబాద్కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్లు నెగ్గిన హైదరాబాద్ ఆపై వరుసగా మూడు మ్యాచ్లలో పరాజయంపాలైంది. మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అజీమ్ కాజీ (80), కౌశల్ తాంబే (38), కెప్టెన్ కేదార్ జాదవ్ (32 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్లో ఆంధ్ర, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
ఆరోగ్య సంరక్షణపై దశాబ్దాల నిర్లక్ష్యం
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న వసతులను మెరుగుపర్చే విషయంలో మోదీ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. పైగా కొందరు బీజేపీ కీలక నేతల అహేతుకమైన, అశాస్త్రీయమైన ఆలోచనా తీరు కలవరం కల్గిస్తోంది. ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. పరస్పరం ఆరోపించుకునే క్రీడను కట్టిపెడదాం. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థది ఒకానొక దుఃఖకరమైన నిర్లక్ష్యపూరితమైన విషాదకర గాథ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ పరమ నిర్లక్ష్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలనలోనే ఇలా జరిగిందని చెప్పలేము. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న నిరంతర నిర్లక్ష్య ఫలితంగానే ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న పెనుసవాళ్లను ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థ చేష్టలుడిగిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కూడా తీవ్రంగా విరుచుకుపడింది కానీ దాన్ని మనం కొన్ని అగ్రదేశాల కంటే కాస్త మెరుగైన రీతిలోనే ఎదుర్కోగలిగాం. కానీ ఆ తర్వాతే నిర్లక్ష్యం, అలసత్వం ఆవరించింది. 2021లో కరోనా సోకిన కేసులు, మరణాల రేట్లు ఇతరదేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని సంబరపడిపోయాం. ఆ తర్వాత సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మ్యుటెంట్ రకాలతో విరుచుకుపడింది. అప్పటికే చాలీచాలని సౌకర్యాలతో, తక్కువ మంది వైద్య సిబ్బందితో కునారిల్లుతున్న ఆరోగ్య మౌలిక వసతుల కల్పనా రంగం దీని తాకిడిని ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇప్పుడున్న అంబులెన్సుల కంటే అయిదు రెట్ల సంఖ్యలో అంబులెన్సులు భారత్కు అవసరమని తెలుస్తోంది. అంబులెన్స్ సౌకర్యం లేక కార్లు, రిక్షాలలో సైతం తీసుకుపోతున్న కరోనా రోగులు శ్వాస సమస్యతో రొప్పుతూ, ఆసుపత్రిలో బెడ్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాల వర్ణనలతో టీవీలు, సోషల్ మీడియా నిత్యం ముంచెత్తుతున్నాయి. అనేకమంది ఆసుపత్రుల వెలుపలే చనిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కాలంలో ప్రపంచదేశాలన్నింటికంటే అధికంగా భారత్లోనే కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తం కరోనా మరణాల్లో మూడో వంతు భారత్లోనే సంభవించాయి. అయితే అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు అధికంగా వాస్తవ మరణాలు ఉంటున్నాయని ఆధార సహితంగా తెలుస్తూండటం గమనార్హం. ఈరోజుల్లో యావత్ ప్రపంచ దృష్టి భారత్మీదే కేంద్రీకృతమై ఉందంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సింది లేదు. గంగానదిలో డజన్లకొద్దీ శవాలు తేలియాడుతున్న భయానక దృశ్యాలు వణికిస్తున్నాయి. ఈ పవిత్ర నది గట్లలో భారీ యంత్రాల సాయంతో గోతులు తవ్వుతూ నదిలో కొట్టుకువస్తున్న శవాలను పూడ్చటానికి స్మశాన క్షేత్రాలను రూపొందిస్తున్నారు. గత బుధవారం ఒక టీవీ చానల్ వారు ఉత్తరప్రదేశ్ లోని ఎటావాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిని సందర్శించారు. దాంట్లో 100 పడకలు ఉన్నాయి. కానీ అంతకుమించిన రోగులు ఆసుపత్రిలో నేలమీద పడుకుని ఉన్నారు. ఇదే ఘోరమనుకుంటే అంతమంది రోగులున్న ఆ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కానీ, నర్సు కానీ కనిపించలేదంటే నమ్మశక్యం కాదు. చివరకు ఆసుపత్రి పాలనాయంత్రాంగం నుంచి ఒక్కరూ అక్కడ లేకపోవడం విచారకరం. పైగా పారిశుధ్య సిబ్బంది గైర్హాజరీతో ఒక్క టాయెలెట్ కూడా అక్కడ పనిచేయడం లేదు. ఇంతవరకు మహమ్మారి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వైరస్ వ్యాపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉనికిలోనే లేని నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వసతి కల్పన ఘోరంగా ఉంటోంది. భారత్కు 73 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం ప్రాధమ్యాలను దేశం నిర్ణయించుకోవలసి వచ్చింది. విషాదకరంగా ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే రెండు అత్యంత కీలకమైన రంగాలను ప్రారంభం నుంచి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దేశంలో ఉన్నత విద్యారంగంలో ప్రపంచ స్థాయి బోధనా సంస్థలను నెలకొల్పారు. అద్భుతమైన ఆసుపత్రులను నిర్మించారు. కానీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ప్రాథమిక పాఠశాలలు లేవు. వైద్య క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ లేవు. దీని ఫలితంగానే ముఖ్యంగా బాలికల్లో అక్షరాస్యతా స్థాయి పడిపోయింది. అదేవిధంగా సగటు ఆయుర్దాయం కూడా పడిపోయింది. మంచి ప్రజారోగ్య సంరక్షణకు ఇదే అసలైన సూచిక. చైనా, చివరకు ముస్లిం దేశమైన ఇండోనేషియా వంటి అతిపెద్ద దేశాలు కూడా తమ ప్రాధమ్యాలను సరైన విధంగా నిర్ణయించుకున్నాయి. ఇవి తొలి నుంచీ ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చాయి. ఈ రెండు దేశాల్లోనూ 1947 నాటికి భారత్ కంటే తక్కువ అక్షరాస్యతను, తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండేవి. కానీ 1980లలో ఈ రెండు కీలక రంగాల్లో ఈ దేశాలు అవలీలగా భారత్ని దాటి ముందుకెళ్లిపోయాయి. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. వివిధ కేంద్రప్రభుత్వాలు నియమిస్తూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల ఎంపికలోనే ప్రజారోగ్యానికి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది దాగి ఉంది. జనతాపార్టీ తరపున రాజ్ నారాయణ్, కాంగ్రెస్ తరపు ఏఆర్ ఆంతూలే వంటి వారు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అత్యంత ప్రముఖ, అగ్రశ్రేణి సంస్థలు సైతం కాలం గడిచేకొద్దీ నిర్వహణాలోపం, అవినీతి కారణంగా ప్రమాణాలు దిగజార్చుకుంటూ వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న హిల్ స్టేషన్ అయిన కసౌలీలో 1904లోనే కేంద్ర పరిశోధనా సంస్థ (సీఆర్ఐ)ని నెలకొల్పారు. ఇది ఒకప్పుడు పలు రకాల వ్యాక్సిన్లు, సీరమ్ల తయారీదారుగా పేరుకెక్కింది. వీటిలో కొన్నింటిని ఎగుమతి కూడా చేసేవారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు అన్బుమణి రామ్దాస్ని కేంద్ర ఆరోగ్యమంత్రిగా చేశారు. ఈయన కాంగ్రెస్ కూటమిపార్టీల్లో ఒక పార్టీకి చెందిన నేత. నా అభిప్రాయంలో ఆయన ఎంపిక ఏమాత్రం సరైనది కాదు. ఆయన హయాంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన ఒక ప్రతికూల నివేదిక కారణంగా అంతవరకు వ్యాక్సిన్లు, సీరమ్ల ప్రముఖ ఉత్పత్తిదారుగా ఉన్న సీఆర్ఐ కేవలం ఒక పరీక్షా ప్రయోగశాల స్థాయికి కుదించుకుపోయింది. ప్రభుత్వ నిర్వహణలో ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. కానీ ఇప్పుడు జ్యోతిష శాస్త్రానికి సైన్సు స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పైగా ప్రత్యామ్నాయ వైద్యాన్ని అలోపతి కంటే ఆధిక్యతా స్థానంలో ఉంచాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ, వైద్య ఆవిష్కరణల పేరిట సెమినార్లు ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఆవు విసర్జించే వ్యర్థ పదార్ధాలను కేన్సర్ వంటి కీలక వ్యాధులకు కూడా ఉపశమన కారులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలు దేశంలో చలామణీ అవుతున్నప్పుడు, సమర్థవంతమైన, ఆధునిక ఆరోగ్య మౌలిక వసతులను మనం ఏర్పర్చుకోగలమా? శాస్త్రీయ దృక్పథాన్ని, మానవవాదాన్ని, ప్రశ్నించి సంస్కరించే స్ఫూర్తిని అభివృద్ధి పర్చుకోవడం ప్రతి పౌరుడి విధి అని రాజ్యాంగమే నిర్దేశించింది. సైన్స్, ఔషధ రంగంలో భవిష్యత్తులో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ భారత రాజ్యాంగం ప్రవచించిన ఈ విశిష్ట వాక్యాన్ని ప్రముఖంగా పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: రాహుల్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
నేడే యూపీ తొలిదశ
పశ్చిమ యూపీలోని 73 స్థానాలకు ఎన్నికలు లక్నో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ కుమారుడు పంకజ్(నోయిడా), ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అల్లుడు రాహుల్ సింగ్(బులంద్షహర్ జిల్లా సికందరాబాద్ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్నగర్ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్నగర్లోని 887 పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక ముస్లిం హత్యకు గురైన దాద్రీ నియోజకవర్గం(గౌతమ్బుద్ధ నగర్ జిల్లా) లోనూ ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలిదశ పోలింగ్ మిగతా ఆరు దశల పోలింగ్పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఎస్పీ–కాంగ్రెస్కు ఓటేయండి: యూపీ తొలిదశ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోల్కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ సయ్యద్ మహ్మమద్ నూరూర్ రెహ్మన్ బర్కతీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆరెస్సెస్లు విభజనవాద రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయని, అవి ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement