-
బ్లూఫ్రాగ్.. ఫ్రాడ్
ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం నిబంధనలకు విరుద్ధం. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ ఉపాధి హామీ పథకం) డేటా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సర్వర్లలో ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకం. గత ప్రభుత్వంలో దీనిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్కు సన్నిహితమైన బ్లూఫ్రాగ్ కంపెనీకి ఉపాధి హామీ పథకం డేటాను, యాప్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. పర్యవసానంగా సదరు కంపెనీకి గత ప్రభుత్వం నుంచి భారీగా ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఉపాధి హామీ కూలీల డేటా మొదలుకుని యాప్ ద్వారా తీసుకునే హాజరు, చెల్లింపుల వరకు అంతా వారి పర్యవేక్షణలోనే జరుగుతోంది. ప్రైవేట్ది కావడంతో తరచూ సమస్యలు వస్తుండడంతో యాప్ నిర్వహణే ఇబ్బందిగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని 46 మండలాల్లో 3,92,410 జాబ్ కార్డులున్నాయి. వీటి ఆధారంగా ఉపాధి హామీ పనులు కూలీలకు కేటాయిస్తుంటారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న 661 మండలాల్లో 61,48,411 మందికి ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులున్నాయి. ఈ క్రమంలో ఏటా వీరిలో కొందరికి ఉపాధి హామీ పనులు ఆయా మండలాల్లోని గ్రామాల్లో కేటాయిస్తుంటారు. సగటున ఒక్క రోజుకు ఒక్కొకరికి కూలి రూ.200 వరకు ఇస్తుంటారు. రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధి హామీ కూలీల నిర్వహణ, ఇతర వివరాలు నమోదు చేసే యాప్ తయారీ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఈ క్రమంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పర్యవేక్షించిన పంచాయతీ రాజ్ శాఖలోని వివిధ పథకాలు, యాప్స్ తయారీ బాధ్యతలు అప్పగించిన బ్లూఫ్రాగ్ కంపెనీకే దీనిని అప్పగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన బాధ్యత, నిర్వహణ అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు, జాబ్ కార్డుల జారీ, ఉపాధి కూలీల హాజరు ఇలా అన్నింటినీ ప్రైవేట్ కంపెనీ యాప్ ద్వారానే నిర్వహించేలా డిజైన్ చేశారు. దీనికి బ్లూఫ్రాగ్తో పాటు టీసీఎస్ జాయింట్ వెంచర్గా కేటాయించారు. దీనిలో బ్లూఫ్రాగ్ కంపెనీ ఉపాధి హామీ పథకం కోసం తొమ్మిది రకాల సేవలకు గానూ 15 యాప్స్ను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి యాప్స్ తయారీ కోసం బిల్లులు తీసుకున్నారు. ఈ క్రమంలో డేటా అంతా బ్లూఫ్రాగ్ సర్వర్ల ద్వారా మెయింటెనెన్స్ చేస్తూ సర్వర్లో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో టీసీఎస్కు డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి జాబ్ కార్డు వివరాలు బ్లూఫ్రాగ్తో పాటు టీసీఎస్ వద్ద ఉంటాయి. పథకం అమలుకు సంబంధించి యూజర్ రిజిస్ట్రేషన్, వర్క్ డిమాండ్ రిజిస్ట్రేషన్, పని కేటాయింపు, పని నిర్వహణ, హాజరు నమోదు, హాజరును పరిశీలించిడం, పని విలువ, దాని పరిశీలన, తదితర సేవల కోసం 15 రకాల యాప్స్ను సిద్ధం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో డ్వామా అధికారులు ఉపాధి హామీ వివరాలు యాప్లో నమోదులో సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఒక రోజు ముందు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం రెండు మూడు గంటలు కసరత్తు చేస్తే కానీ వివరాలు నమోదు కాకపోవడం తదితర ఇబ్బందులు ఉన్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. విలువైన ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. కర్ణాటక. తమిళనాడు, కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. సర్వర్ల, యాప్ నిర్వహణ అన్ని ఎన్ఐసీనే చూసుకుంటుంది. దానికి సంబంధించిన యాక్సెస్ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్వర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఉపాధి హామీ డేటాను సదరు ప్రైవేట్ సంస్థలు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునేలా యాక్సెస్ కంపెనీకి మాత్రమే ఉంది. ప్రభుత్వానికి యాక్సెస్ లేదు. అలాగే డేటా వేరే వారికి బదలాయించడం చట్టరీత్యా నేరం. మన రాష్ట్రంలో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో డేటా టీసీఎస్కు ఆటోమెటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారు. దీనిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకుని ఎన్ఐసీకి అప్పగిస్తే ఖజానాకు భారం తగ్గడంతో పాటు డేటా అంతా ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. పంచాయతీరాజ్ కమిషనర్కు నివేదిక ఇటీవల కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు డ్వామా అధికారులతో సమీక్ష నిర్వహించిన లోపాలపై చర్చించిన క్రమంలో విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కలెక్టర్ పంచాయతీ రాజ్ కమిషనర్కు దీనిపై సమగ్ర నివేదిక పంపారు. యాప్లోని ఇబ్బందులు మొదలుకుని అన్ని అంశాలపై సమగ్ర నివేదిక పంపారు. -
నౌకా నిర్మాణ కేంద్రంలో ప్రైవేటు పెత్తనం!
విశాఖపట్నం: దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన తూర్పు నావికాదళ నౌకా నిర్మాణ కేంద్రం క్రమశిక్షణ తప్పుతోంది. అత్యంత పారదర్శకతతో జరగాల్సిన కీలక పనులన్నీ కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. జలాంతర్గాములు, ఇతర అస్త్రాల తయారీలో నావికాదళ నిపుణులకు బదులు అనుభవంలేని బయటివ్యక్తుల పెత్తనం పెరిగిపోతోంది. కొందరు ఉన్నతాధికారుల కమీషన్ల కక్కు ర్తి దేశప్రతిష్ఠకు మచ్చ తెస్తోంది. భద్రతా వారోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నౌకానిర్మాణ కేంద్రంలో భద్రత కొరవడుతుండడం విస్మయపరుస్తోంది. నౌకాదళ మాజీ ఉద్యోగులను చేర్చుకుని ప్రైవేటు కంపెనీలు ఆడుతున్న కాసులాటలో పరువు మంటగలుస్తోంది. ఏదీ పారదర్శకత? నేవల్బేస్లోని తూర్పునావికాదళం అమ్ములపొదిలోని నౌకానిర్మాణ కేంద్రం అత్యంత కీలకమైనది. ఈ ప్రాంత సముద్రజలాల భద్రతకు కావలసిన జలాంతర్గాములు, ఇతర కీలక ఆయుధాలు, అస్త్రాల తయారీలో దీనిదే ముఖ్యపాత్ర. ఇటువంటి కీలకమైన నౌకానిర్మాణ కేంద్రంలో ప్రస్తుతం ప్రైవేటు పెత్తనం పెరిగిపోయింది. చేతిలో ఉన్న నిపుణులను కాదని ప్రతిపనికి ప్రైవేటు వారిపైనే ఆధారపడుతుండడంతో ఏక్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. శనివారం న్యూక్లియర్ సబ్ మెరైన్లో జరిగిన ప్రమాదం ఈ భయాలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం జాతీయ భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈనెల 15 వరకు నేవీతోపాటు అనేక కేంద్రాల్లో సేఫ్టీఫోర్త్ నైట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో న్యూక్లియర్ జలాంతర్గామిలో ప్రమాదం జరగడం నావికాదళం పనుల్లో నాణ్యతపై అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. అత్యంత పకడ్బందీ బందోబస్తు, బయటి ప్రపంచంతో సంబంధంలేని ఈ కేంద్రంలో ప్రస్తుతం మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రంలో జలాంతర్గాములు, ఇతర ఉత్పత్తులకు సంబంధించిన పలు కీలక పనులు జరుగుతున్నాయి. దేశరక్షణకు సంబంధించిన వీటి తయారీలో అడుగడుగునా శిక్షణ పొందిన నేవీ నిపుణులు పాత్ర అధికంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రస్తుతం లోపల ప్రైవేటు కంపెనీల హవా నడుస్తోంది. కొందరు ఉన్నతాధికారులు ప్రతీ పనిని ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. దీనివల్ల వీరి జోక్యం పెరిగిపోయి నాణ్యత నానాటికి దిగజారిపోతోంది. శనివారం జరిగిన ప్రమాదంలో నేవీ నిపుణులు లేకుండానే టెస్టింగ్ పనులు చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి ప్రమాదం చోటుచేసుకున్న న్యూక్లియర్ సబ్మెరైన్ పనులను అవుట్సోర్సింగ్కు ఇవ్వకూడదు. అధికారులు ఇదేం పట్టించుకోకపోవడంతో ఇంత నష్టం వాటిల్లిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైడ్రో పనుల టెస్టింగ్ జరిగేటప్పుడు క్వాలిటి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరపాలి. కాని అది జరగకపోవడంపై వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నౌకానిర్మాణ కేంద్రంలో ఎక్కువ పనులు ఎల్అండ్టీ సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ అనుమతుల్లేకుండా ఇతర పనులను బయట కంపెనీలకు సబ్లీజులకు ఇస్తోంది. నేవీ అధికారులకు ఈ కంపెనీలపై ఏమాత్రం అజమాయిషీ లేకుండా పోతోంది.నౌకనిర్మాణ కేంద్రంలో సుమారుగా 1100మంది వరకు నేవీ ఉద్యోగులు పనిచేస్తుంటే బయట వ్యక్తులు, కాంట్రాక్టు కూలీలు కలిపి 2,500 మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం అధికశాతం పనులు వీరి చేతులమీదుగానే జరుగుతున్నాయి. పనులను సబ్లీజులకు ఇచ్చేయడం, సొంత నిపుణులను పక్కనబెట్టి కమీషన్లకు కక్కుర్తిపడడం వల్లే ఇదంతా జరుగుతుందని మాజీ అధికారులు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ నౌకా నిర్మాణ కేంద్రంలో ఉద్యోగ విమరణ చేస్తున్న వారికి ప్రైవేటు కంపెనీలు మంచిహోదాతో తిరిగి ఉద్యోగం కల్పిస్తున్నాయి. దీంతో కొందరు సిబ్బంది ముందునుంచే వీరికి పలు కాంట్రాక్టులు లభించేలా సూచనలు, సలహాలు ఇస్తుండడంతో నౌకానిర్మాణ కేంద్రం నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement