జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం: వెంకయ్య
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో పార్లమెంట్లోని ప్రధాని చాంబర్లో సీనియర్ మంత్రులతో వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఏకాభిప్రాయంతో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు చాలా లాభం చేకూరుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు.ఈ భేటీలో రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితర కేంద్రమంత్రులు పాల్గొన్నారు.