-
ఒపీనియన్ పోల్స్ : మూడు రాష్ట్రాల్లో బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలతో సత్తా చాటనుందని తాజా ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి కీలక రాష్ట్రాల్లో ఓటమి తప్పదని స్పష్టమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీర్ఘకాలంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీని రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని ఈ సర్వే అంచనా. వేసింది. రాజస్ధాన్లో ఓటర్లు సీఎం పదవికి కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్ వైపు అత్యధికంగా మొగ్గు చూపారు. కాగా 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే స్ధితిలో ఉందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. రాజస్ధాన్లో సీఎం వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కార్పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్ధాయిలో నెలకొనడంతో అక్కడ కాంగ్రెస్ సులభంగా విజయం సాధించనుందని సర్వే అంచనా వేసింది. ఇక మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో ఇరు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో కొద్దిపాటి తేడా ఉన్నా కాంగ్రెస్కు స్వల్ప మొగ్గు ఉండటంతో అధికార పగ్గాలు ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందన్నది సర్వే అంచనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజస్ధాన్లో కాంగ్రెస్కు 142 స్ధానాలు దక్కుతాయని, బీజేపీ కేవలం 56 స్ధానాలకు పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. యువనేత సచిన్ పైలట్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న ఓటర్లు 36 శాతం కాగా, ప్రస్తుత సీఎం వసుంధరా రాజేకు 27 శాతం ఓటర్లు సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ను సీఎంగా 24 శాతం మంది కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో.. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు122 స్ధానాలు దక్కుతాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి. 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు మేజిక్కు ఫిగర్ను దాటి 47 స్ధానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 108, 40 స్ధానాలకు పరిమితమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్లనే తదుపరి సీఎంలుగా ఎక్కువ మంది ఓటర్లు కోరుకోవడం గమనార్హః. కాంగ్రెస్, బీజేపీలకు మధ్యప్రదేశ్లో వరుసగా 42.2 శాతం 41.5 శాతం ఓట్లు దక్కువచ్చని, చత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 38.9 శాతం, బీజేపీకి 38.2 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్లో కాంగ్రెస్కు 49.9 శాతం, బీజేపీకి 34.3 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 మధ్య ఎన్నికలు జరుగుతాయని ఈసీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లగడపాటి సర్వేకు ఎల్లో కలరింగ్!
సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని, ప్రజల ఆదరణను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వేస్తున్న చవకబారు ఎత్తుగడలు ప్రజల్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఉన్న బంధాన్ని తెంచేందుకు చేస్తున్న పలు ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్రలో దాదాపు తుడుచుకుపెట్టుకుపోయిన తెలుగుదేశం అభ్యర్ధులను అరువు తెచ్చుకుని పోటీలో దిగింది. అయినా తెలుగుదేశం పార్టీపై నమ్మకం, విశ్వసనీయత కలుగకపోవడంతో అనేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల సినీనటుడు పవన్ కళ్యాణ్ తో చేసిన ప్రయోగం దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాంతో ఏం చేయాలో తెలియక 'సర్వే'పాటి రాజగోపాల్ హడావిడిగా రంగంలోకి దించారు. ప్రెస్ మీట్ పేరుతో లగడపాటి సర్వేలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పేలా నాటకమాడించారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీల కూటమి విజయం సాధిస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. ఎన్నికల నిబంధనలు కారణాల వల్ల పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నానని చివరగా ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్నారు. రెండు కళ్ల సిద్దాంతంతో అడ్డగోలు విభజనకు కారణమైన టీడీపీని నిలదీయాల్సి పోయి... కీలక ఎన్నికల తరుణంలో అదేపార్టీకి అనుకూల ప్రచారానికి తెరలేపారు. ఎన్ని ఎత్తుగడలు, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజాతీర్పును ఇలాంటి చవకబారు చేష్టలతో అడ్డుకోలేమన్నది వారికి కూడా తెలియందే కాదు. అయినా ఏదో విధంగా లబ్ది పొందాలనే ఆశతో 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటిని కూడా చంద్రబాబు వాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్వేలు, పొత్తులు, సినీ గ్లామర్ లాంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయలేదని సగటు ఓటరు అభిప్రాయం. నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. తీర్పు ఇవ్వడానికి ఓటర్లు మే 7 తేది కోసం వేచి చూస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, లగడపాటి సర్వే ప్రభావం సగటు ఓటరు తీర్పుపై ఉండదనేది త్వరలోనే అర్దమవ్వడం ఖాయం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement