breaking news
national parks
-
ESZ: మైనింగ్, పరిశ్రమలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అడవుల పరిరక్షణ కోసం మైనింగ్, పరిశ్రమల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను నిషేధించింది. దేశవ్యాప్తంగా ఎకో-సెన్సిటివ్ జోన్లు (ESZ పర్యావరణ సున్నిత మండలాలు), చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ మేరకు శుక్రవారం.. బఫర్ జోన్కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ జోన్ల వెంబడి జరుగుతున్న తయారీ, తయారీ సంబంధిత కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగుతాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రం తరపున.. చీఫ్ కన్జర్వేటర్ ESZ హోదా కింద వచ్చే నిర్మాణాల జాబితాను సిద్ధం చేసి మూడు నెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు ఉండరాదని పేర్కొంది. -
వాటి సందర్శనకు అధిక రుసుం చెల్లించాల్సిందే..
వాషింగ్టన్ : అమెరికాలోని జాతీయ ఉద్యానవనాలను సందర్శించే విదేశీ పౌరుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయాలని కోరుతూ యూస్ సెనేటర్ ఓ చట్టాని ప్రతిపాదించారు. తాజ్ మహల్ వంటి స్మారక కట్టడాల నుంచి భారత్ ఇలాగే వసూల్ చేస్తోందని ఊటంకిస్తూ అమెరికన్ అవుట్ డోర్ చట్టానికి సవరణగా సెనేటర్ మెక్ ఎంజీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలోని అనేక ప్రముఖ స్మారక చిహ్నాలు, జాతీయ ఉద్యానవనాలను సందర్శించే విదేశీ పౌరుల నుంచి 16-25 డాలర్ల వరకు అదనపు రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలోని ఉద్యానవనాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మైక్ ఎంజి పేర్కొన్నారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పార్కుల నిర్వాహణ ఖర్చులు దాదాపు 12 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును గతేడాదితో పోల్చితే కేవలం 4.1 బిలియన్ డాలర్లు మాత్రేమే ఖర్చు అయ్యింది. అంటే ప్రతి ఏడాది పార్కుల నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటం వల్ల ఈ సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. మన దేశానికి వచ్చే విదేశీ సందర్శుకుల తాకిడి పెరుగుతున్నందువల్ల వారిని దేశంలోకి అడుగుపెట్టేముందు 16-25 డాలర్లు చెల్లించాలని కోరాలి. యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది జాతీయ ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఏడాది 14 మిలియన్లకు పైగా విదేశీ ప్రజలు జాతీయ ఉద్యాన వనాలను సందర్శిస్తున్నారు’. అని సెనేటర్ తెలిపారు. (అర్థనగ్నంగా పెయింట్, సోషల్ మీడియాలో దుమారం) ‘మన జాతీయ సంపదను పెంచడం కోసం ఈ చట్టం చేయాలని కోరడం న్యాయమే. ఉదాహరణకు భారతదేశంలోని తాజ్ మహల్ వద్ద విదేశీ సందర్శకులు 18 డాలర్లు చెల్లించాలి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ను సందర్శించే విదేశీ పర్యాటకులు రోజుకు 25 డాలర్లు చెల్లించాలి. స్థానిక సందర్శకులు మాత్రం కేవలం 6.25 డాలర్లు చెల్లిస్తారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి అనేక యూరోపియన్ దేశాలు పర్యాటక మౌలిక సదుపాయాలకు ఉపయోగించే హోటళ్ల గదులపై పర్యాటక పన్ను వసూలు చేస్తున్నాయి. కావున భవిష్యత్తు తరాల కోసం అమెరికా జాతీయ సంపదను కొనసాగించడానికి ఈ చట్టం అవసరం.’ అని సెనేటర్ మైక్ ఎంజీ పేర్కొన్నారు. -
మన పార్కులన్నీ నాశనమవుతున్నాయి: ఒబామా
నేషనల్ పార్క్: ప్రపంచ వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దీని బారిన అమెరికా పడిందని, దాని ఫలితాన్ని అనుభవిస్తోందని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ భవిష్యత్లో ఎదురవనున్న సమస్య అని ఇక అనుకోవాల్సిన అవసరం లేదని, అది ఇప్పటికే ప్రవేశించిన సమస్య అందరు కలిసి ఎదుర్కోవాల్సిన అతిపెద్ద విళయం అని ఒబామా అన్నారు. గ్లోబల్ వార్మింగ్పై ఆయన అమెరికాలోని నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఇక ఎలాంటి తప్పు చేయవద్దు. వాతావరణ మార్పు అనేది ఎంతో దూరంలో లేదు. అది ఒక ఎదుర్కోవాల్సిన ప్రమాదం. ఇప్పటికే అమెరికాలోని జాతీయ పార్కులన్నీ దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఊహించని విధంగా మంచు కరిగిపోతోంది. ఇది ఇప్పటికే ప్రవేశించిన ప్రమాదం. తప్పక ఎదుర్కోవాలి' అని ఒబామా అన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా పార్క్ వద్ద తన కుటుంబంతో గడుపుతున్న ఒబామా ఈ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘హంగుల్’ జీవిని ఏ పార్కులో చూడొచ్చు?
భారతదేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 1. పశ్చిమ బెంగాల్లోని జల్దపార సంరక్షణ కేంద్రంలో పరిరక్షిస్తున్న జంతువు ఏది? 1) అడవి గాడిద 2) ఏనుగు 3) ఖడ్గమృగం 4) పులి 2. కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? 1) జార్ఖండ్ 2) మధ్యప్రదేశ్ 3) ఉత్తరప్రదేశ్ 4) ఛత్తీస్గఢ్ 3. అడవి గాడిదల (Wild ass) సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? 1) ఉత్తరప్రదేశ్ 2) అసోం 3) రాజస్థాన్ 4) గుజరాత్ 4. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం? 1) దుద్వా 2) కార్బిట్ 3) కజిరంగ 4) గిర్ 5. హంగుల్ అనే అంతరించి పోతున్న జీవిని ఏ జాతీయ పార్కులో చూడొచ్చు? 1) దాచిగాం 2) గిర్ 3) చంద్రప్రభ 4) బందీపూర్ 6. {పాజెక్టు టైగర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1) 1972 2) 1973 3) 1974 4) 1992 7. భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన బయోస్పియర్ ఏది? 1) సుందర్బన్స 2) సిమ్లిపాల్ 3) కచ్ 4) నీలగిరి 8. పులులు అధికంగా ఉన్న రాష్ర్టమేది? 1) మహారాష్ర్ట 2) కర్ణాటక 3) మధ్యప్రదేశ్ 4) కేరళ 9. ఆలివ్రిడ్లే తాబేళ్లు అధికంగా ఏ తీరంలో పెరుగుతాయి? 1) వంగతీరం 2) కోరమాండల్ 3) ఉత్కళతీరం 4) మలబార్ 10. {పపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1) ఏప్రిల్ 21 2) మార్చి 21 3) మే 21 4) జూన్ 21 11. సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు? 1) సుందరి 2) సాల్ 3) చిర్ 4) టేకు 12. సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే రూసాగడ్డి ఏ జిల్లాలో లభిస్తుంది? 1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్ 3) కరీంనగర్ 4) ఖమ్మం 13. ఆసియాటెక్ సింహాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది? 1) కజిరంగా (అసోం) 2) బందీపూర్ (కర్ణాటక) 3) సరిస్కా (రాజస్థాన్) 4) గిర్ (గుజరాత్) 14. దేశంలో అతిపెద్ద జంతుప్రదర్శనశాల ఉన్న ప్రాంతమేది? 1) ముంబై 2) చెన్నై 3) కోల్కతా 4) ఢిల్లీ 15. రంగన్ తిట్టూ పక్షి సంరక్షణా కేంద్రం ఎక్కడ ఉంది? 1) మైసూర్ 2) బెంగళూరు 3) హుబ్లీ 4) బందీపూర్ 16. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 1) గుజరాత్ 2) ఉత్తరాఖండ్ 3) హిమాచల్ ప్రదేశ్ 4) ఒడిశా 17. కిందివాటిలో బయోస్పియర్ రిజర్వ కానిది? 1) అగస్థ్యమలై 2) నల్లమలై 3) నీలగిరి 4) పచ్మర్హి 18. సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది? 1) భోపాల్ 2) సిమ్లా 3) జబల్పూర్ 4) అలహాబాద్ 19. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి టైగర్ రిజర్వ ఏది? 1) కజిరంగా (అసోం) 2) పన్నా (మధ్యప్రదేశ్) 3) బందీపూర్ (కర్ణాటక) 4) రణతంబోర్ (రాజస్థాన్) 20. ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట- 2013 ప్రకారం భారతదేశంలో విస్తీర్ణం పరంగా అడవులు తక్కువగా ఉన్న రాష్ర్టం ఏది? 1) గోవా 2) పంజాబ్ 3) అరుణాచల్ ప్రదేశ్ 4) హర్యానా 21. ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట-2013 ప్రకారం విస్తీర్ణపరంగా అధిక అడవులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? 1) దాద్రానగర్ హవేలీ 2) అండమాన్ నికోబార్ దీవులు 3) డామన్ డయ్యూ 4) చంఢీఘర్ 22. ఏ రకం అడవులు నౌకా నిర్మాణంలో, న్యూస్ప్రింట్ తయారీలో ఉపయోగపడతాయి? 1) మడ అడవులు 2) ఆల్ఫైన్ అడవులు 3) ఉష్ణమండల ముళ్లజాతి అడవులు 4) హిమాలయాల్లోని సమశీతోష్ణ అడవులు 23. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా ముఖ్యమైన అడవులు ఏవి? 1) ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అడవులు 2) మడ అడవులు 3) ఉష్ణమండల తేమతో కూడిన ఆకు రాల్చే అడవులు 4) ఆల్ఫైన్ అడవులు 24. మంచిగంధం వృక్షాలు ఏ రాష్ర్టంలో ప్రబలంగా విస్తరించి ఉన్నాయి? 1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్ 3) పశ్చిమబెంగాల్ 4) కర్ణాటక 25. దేవదారు చెట్లు సాధారణంగా ఏ అడవుల్లో కనిపిస్తాయి? 1) ఉష్ణమండల సతతహరిత అడవులు 2) ఆల్ఫైన్ అడవులు 3) ముళ్లజాతి అడవులు 4) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 26. అసోంలోని మానస్ సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి? 1) ఎలుగుబంటి 2) అడవి గాడిద 3) పులి 4) పక్షులు 27. కింద పేర్కొన్నవాటిలో ఎక్కడ అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్నాయి? 1) అండమాన్ నికోబార్ దీవులు 2) అరుణాచల్ ప్రదేశ్ 3) అసోం 4) మేఘాలయ 28. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1) అక్టోబర్ 5 2) సెప్టెంబర్ 10 3) జూన్ 9 4) జూన్ 5 29. భారతదేశంలో చివరిసారిగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ ఏది? 1) కచ్ 2) పన్నా 3) పచ్మర్హి 4) అగస్థ్యమలై 30. కవ్వాల్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) రాజస్థాన్ 2) గుజరాత్ 3) తెలంగాణా 4) మధ్యప్రదేశ్ సమాధానాలు 1) 3; 2) 2; 3) 4; 4) 3; 5) 1; 6) 2; 7) 4; 8) 3; 9) 3; 10) 2; 11) 1; 12) 2; 13) 4; 14) 3; 15) 1; 16) 4; 17) 2; 18) 4; 19) 3; 20) 4; 21) 2; 22) 1; 23) 3; 24) 4; 25) 2; 26) 3; 27) 1; 28) 4; 29) 2; 30) 3. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల కోసం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులకు సబంధించి ఏయే అంశాలను ఎలా చదవాలో తెలపండి. - కె. ఊర్మిళ, నర్సాపూర్. పోటీ పరీక్షల దృష్ట్యా ‘భారత దేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు’ పాఠ్యభాగం ప్రత్యేకమైంది. భారత దేశ భూగోళ శాస్త్రంలో మిగిలిన అంశాలు కింది తరగతుల నుంచి ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటూ ఎక్కువసార్లు రిపీట్ అవుతాయి. కానీ ఇది భిన్నమైంది. ప్రతి పరీక్షలో దీని నుంచి 2, 3 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వలు మొదలైనవి వందల సంఖ్యలో, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందువల్ల వీటిలో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి, వార్తల్లోకి వచ్చినవాటిని గుర్తించుకోవాలి. ఆయా ప్రదేశాలు, నదులు తదితర ప్రత్యేక అంశాల ఆధారంగా వీటికి పేర్లు పెట్టారు. ఇలాంటివాటిని బట్టి ఏయే రాష్ట్రాల్లో ఏయే సంరక్షణ కేంద్రాలున్నాయో గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు కింది ప్రశ్నను గమనించండి. ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? 1) ఢిల్లీ 2) సిమ్లా 3) డెహ్రాడూన్ 4) భోపాల్ సమాధానం: 3. దీంతోపాటు ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా డెహ్రాడూన్లోనే ఉన్నాయి. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేకంగా ఏ జీవుల సంరక్షణ కోసం ఏయే పార్కులు/రిజర్వులను ఏర్పాటు చేశారో టేబుల్ రూపంలో పొందుపరుచుకొని తరచూ పునశ్చరణ చేసుకోవాలి. ఈ విభాగం నుంచి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా మంచి మార్కులు సంపాదించవచ్చు. భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వలు బయోస్పియర్ రిజర్వ స్థాపించిన సం. రాష్ర్టం నీలగిరి 1986 తమిళనాడు నందాదేవి 1988 ఉత్తరాఖండ్ నోక్రెక్ 1988 మేఘాలయ మానస్ 1989 అసోం సుందర్బన్స 1989 పశ్చిమ బెంగాల్ మన్నార్ సింధుశాఖ 1989 తమిళనాడు గ్రేట్ నికోబార్ 1989 అండమాన్ నికోబార్ సిమ్లిపాల్ 1994 ఒడిశా దిబ్రూ-సైకోవా 1997 అసోం దిహంగీ- ది బంగ్ 1998 అరుణాచల్ ప్రదేశ్ పచ్మర్హి 1999 మధ్యప్రదేశ్ కాంచన్జంగ్ 2000 సిక్కిం అగస్థ్యమలై 2001 కేరళ అచానక్మర్ మధ్యప్రదేశ్, - అమర్కంఠక్ 2005 ఛత్తీస్గఢ్ కచ్ 2008 గుజరాత్ కోల్డ్డిజర్ట 2009 హిమాచల్ ప్రదేశ్ శేషాచలం 2010 ఆంధ్రప్రదేశ్ పన్నా 2011 మధ్యప్రదేశ్ ముల్కల రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, హరీష్ అకాడమీ, హన్మకొండ. అప్రెంటీస్షిప్: ఫ్యాక్ట్ ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్) టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్కు దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ అప్రెంటీస్ సీట్ల సంఖ్య: 40 విభాగాలు: మెకానికల్, కెమికల్, కంప్యూటర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్. కాలపరిమితి: ఏడాది. అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. వయసు: 23 ఏళ్లకు మించకూడదు. ట్రేడ్ అప్రెంటీస్ సీట్ల సంఖ్య: 118 విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, సీఓపీఏ, ప్లంబర్, వెల్డర్, ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్. కాలపరిమితి: కెమికల్ ప్లాంట్ ఏడాదిన్నర, మిగతావి ఏడాది. అర్హతలు: కెమికల్ ప్లాంట్కు బీఎస్సీ(కెమిస్ట్రీ), మిగతా వాటికి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్: 15 విభాగాలు: ఆఫీస్ సెక్రటరీషిప్, అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్, సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. కాలపరిమితి: ఏడాది. అర్హతలు: సంబంధిత విభాగంలో ఒకేషనల్ గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 23 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: జనవరి 5 నుంచి 13 వరకు నిర్వహించనున్న రాత పరీక్ష ద్వారా. వెబ్సైట్: http://fact.co.in/ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చాందాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్/ డిప్లొమా హోల్డర్ల నుంచి అప్రెంటీస్షిప్కు దరఖాస్తులు కోరుతోంది. {V>y్యుయేట్ అప్రెంటీస్: 6 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కాలపరిమితి: ఏడాది. అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కాలపరిమితి: ఏడాది. అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 24 వెబ్సైట్: http://ofchanda.gov.in/