breaking news
National Aeronautics and Space Administration
-
మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్ (నాసా) సంయుక్తంగా 2,800 కిలోల బరువు కలిగిన నిసార్ (నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు సతీష్ ధవన్ స్పేస్సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ అర్బిట్ (లియో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) కావడం విశేషం. ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేస్తుంది. ఈ ఉపగ్రహంలోని పేలోడ్స్తో భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద జీవసంపద, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం వంటి విపత్తుల గురించి స్థిరమైన డేటాను అందిస్తుంది. నిసార్ ఉపగ్రహంలో ఎల్ మరియు ఎస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ని కలిగి వుంటుంది. ఇది అధిక రిజల్యూషన్ డేటాతో పెద్ద స్వాత్ను స్వీప్ సార్ టెక్నిక్తో పని చేస్తుంది. ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్, సిం«థటిక్ ఆపార్చర్ రాడార్ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ను నాసా సమకూర్చాయి. ఈ రెండు దేశాలకు చెందిన సింథటిక్ ఆపార్చర్ రాడార్లు సుమారు 12 మీటర్లు వ్యాసార్థంలో వున్న రిఫ్లెక్టర్ యాంటెన్నాను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా నాసా మిషన్ కోసం ఇంజినీరింగ్ పేలోడ్స్ను అందిస్తుంది. ఇందులో పేలోడ్ డేటా సబ్సిస్టమ్, హై–రేట్సైన్స్ డౌన్లింక్ సిస్టమ్, జీపీఎస్ రిసీవర్లు మరియు సాలిడ్ స్టేట్ రికార్డర్ ఉన్నాయి. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్లలో ఇది మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ మిషన్ అవుతుంది. నాసా వారి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సైంటిఫిక్ పరికరాలతో బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్ఎస్సీ)లో నిసార్ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. మార్చి నెలాఖరులోపు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. -
నాలుగు దేశాలు.. నలుగురు వ్యోమగాములు
కేప్ కెనవెరాల్: నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ఆదివారం నలుగురు వ్యోమగాములు అడుగిడుతారు. మార్చి నెల నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు. ఆరు నెలలపాటు అక్కడుంటారు. నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు. అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో వేర్వేరు దేశాలకు చెందిన వారిని ఐఎస్ఎస్కు పంపించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు లేదా ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తాజా బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్బెలి అనే మెరైన్ పైలట్ నాయకత్వం వహిస్తున్నారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఇరాన్ దేశస్తులు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీ వెళ్లిపోయారు. అక్కడే జాస్మిన్ పుట్టారు. న్యూయార్క్లో పెరిగారు. అమెరికా మెరైన్స్ చేరి అఫ్గానిస్తాన్లో యుద్ధ హెలికాప్టర్లు నడిపారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఇరాన్ బాలికలకు చూపుతున్నానని ఆమె అంటున్నారు. -
నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్వర్క్
ఇకపై చందమామపై మొబైల్ ఫోన్ వాడొచ్చు. అది కూడా 4జీ, 5జీ నెట్వర్స్తో.. నమ్మడానికి కాస్తా అనుమానంగా ఉన్నా ఇదే నిజం. చందమామపై ఏకంగా ఫోన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చందమామపై 4G సెల్యూలర్ నెట్ వర్క్ అమర్చేందుకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులను నాసా అందిచనుంది. టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదట జాబిల్లిపై 4జీ/ఎల్నెటీఈ నెట్వర్స్ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరించనుంది. ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ చంద్ర ఉపరితల సమాచార మార్పిడికి ఎక్కువ దూరం, పెరిగిన వేగంతో పాటు ప్రస్తుత ప్రమాణాల కంటే ఎక్కువ విశ్వసనీయతను అందించగలదని నాసా తన కాంటాక్ట్ అవార్డు ప్రకటనలో పేర్కొంది. చదవండి: బస్సు సైజు గ్రహ శకలం.. మనకు ప్రమాదమేనా? To the moon! 🌕 We are excited to have been named by @NASA as a key partner to advance “Tipping Point” technologies for the moon, to help pave the way towards sustainable human presence on the lunar surface. So, what technology can you expect to see? (1/6) pic.twitter.com/wDNwloyHdP — Bell Labs (@BellLabs) October 15, 2020 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది నాసా లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. అప్పటికి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం అవసరమన్నారు. ఇందుకోసం నాసా నోకియా ఆఫ్ అమెరికాతో కాంట్రాక్ట్ కుదిరింది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళికలు చేపట్టింది. Our pioneering innovations will be used to build and deploy the first wireless network on the moon, starting with #4G/LTE technologies and evolving to #5G. (2/6) — Bell Labs (@BellLabs) October 15, 2020 నోకియా పరిశోధక విభాగం బెల్ ల్యాబ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్లెస్ ఆపరేషన్తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్వర్క్ను తీసుకోస్తోంది. ఈ నెట్వర్క్ కాంపాక్ట్ను సమర్థవంతంగా నిర్మించారు. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత, రేడియేషన్, వాక్యూమ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను వినియోగించుకోవచ్చు. -
మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం.. వాయేజర్
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) మూడు దశాబ్దాల క్రితం ప్రయోగించిన ‘వాయేజర్-1’ ఎట్టకేలకు సౌర కుటుంబం అంచులను దాటేసింది.. అంతరిక్షంలో 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తున్న ఈ వ్యోమ నౌక తాజాగా దాదాపు1,900 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏకంగా నక్షత్రాంతర రోదసి (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లోకి అడుగుపెట్టింది.. మానవ నిర్మిత అంతరిక్ష వస్తువు ఒకటి ఇలా నక్షత్రాంతర రోదసిలోకి చేరడం ఇదే తొలిసారి.. త ద్వారా వాయేజర్-1 మానవ జాతికి మరో అద్భుత విజయాన్ని అందించింది.. ఈ వ్యోమనౌక రోదసిలోని తీవ్ర రేడియేషన్ను కూడా తట్టుకోగలదు. సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ రోదసి అన్వేషణలో మానవుడు ఒక సరికొత్త మైలురాయిని అధిగమించాడు. ఒక మానవ నిర్మిత అంతరిక్ష సాధనం తొలిసారిగా సౌర వ్యవస్థను దాటి అంతర నక్షత్ర రోదసి ప్రాంతంలోకి ప్రవేశించింది. 1977లో నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) ప్రయోగించిన వాయేజర్-1.. 2012, ఆగస్టు 25 నాటికి సౌర వ్యవస్థను దాటినట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 12న నాసా ప్రకటించింది. వాయేజర్ విజయంతో భవిష్యత్లో ఇతర సౌర వ్యవస్థల్లోకి సైతం అంతరిక్ష నౌకలను ప్రయోగించే వెసులుబాటు కల్పిస్తుంది. ఏడాది కాలంగా: వాయేజర్-1 నుంచి అందిన సమాచారం మేరకు అది ఏడాది కాలంగా సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిలో ఉండే ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశామని వాయేజర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు. వాయేజర్-1 నుంచి వెలువడే సంకేతాలు కాంతి వేగంతో ప్రయాణిస్తూ 17 గంటల్లో భూమిని చేరతాయని, ప్రస్తుత సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. నక్షత్రాంతర ప్రదేశంలోకి ప్రవేశించినప్పటికీ.. సూర్యుడి ప్రభావం పూర్తిగా లేని ప్రాంతానికి వాయేజర్ ఎప్పుడు చేరుతుందనే విషయంలో స్పష్టత లేదు. గ్రాండ్ టూర్: సౌర వ్యవస్థలో బాహ్య గ్రహాల అన్వేషణ ఉద్దేశంతో ‘ప్లానెటరీ గ్రాండ్ టూర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని 1964లో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (ఖీజ్ఛి ఒ్ఛ్ట ్కటౌఞఠటజీౌ ఔ్చఛౌట్చ్టౌటడ)కి చెందిన గ్యారీ ఫ్లోరిడా ప్రతిపాదించాడు. ఇందులో భాగంగా రూపొందించిన మిషన్లో తొలుత నాలుగు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని నిర్ణయించారు. గురు, శని, ప్లూటో గ్రహాల అధ్యయనం కోసం 1976-77లో రెండు నౌకలను, గురు, యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాల అధ్యయనం కోసం 1979లో మరో రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని ప్రతిపాదించారు. ఆర్థిక కారణాలతో 1972లో ఈ గ్రాండ్ టూర్ నిలిచిపోయింది. అయినప్పటికీ.. గ్రాండ్ టూర్లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అధిక శాతం అంశాలను వాయేజర్ కార్యక్రమంలో చేర్చారు. వాయేజర్ ప్రాథమిక మిషన్: జంట నౌకలుగా వాయేజర్ 1, 2లను నాసా 1977లో ప్రయోగించింది. ఈ రెండింటిలో తొలుత వాయేజర్-2ను 1977, ఆగస్టు 20న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి టైటాన్-సెంటార్ రాకెట్ నుంచి ప్రయోగించారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న వాయేజర్-1ను ప్రయోగించారు. 16 రోజుల తేడాతో ఈ రెండు నౌకల ప్రయోగం జరిగింది. వాయేజర్ మిషన్ను ప్రాథమికంగా బాహ్య గ్రహాల అధ్యయనం కోసం నాసా చేపట్టింది. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను వాటి 48 చంద్రులను, ఆ గ్రహాల చుట్టూ ఉన్న వలయాలను వాయేజర్-1, 2 జంట నౌకలు అన్వేషించాయి. ఇందులో 1979, మార్చి 5న వాయేజర్-1 గురు గ్రహానికి అతి దగ్గరగా చేరుకుంది. 1979, జూలై 9న వాయేజర్-2 కూడా గురు గ్రహాన్ని సమీపించింది. అదేవిధంగా శని గ్రహానికి వాయేజర్-1 1980, నవంబర్ 12న, వాయేజర్-2 1981, ఆగస్టు 25న అతి దగ్గరగా ప్రయాణించాయి. యురేనస్కు దగ్గరగా 1986, జనవరి 24న, నెప్ట్యూన్కు 1989, ఆగస్టు 25న వాయేజర్-2 సమీపించింది. వాయేజర్ కంటే ముందే పయొనీర్ 10, 11ను బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం నాసా ప్రయోగించింది. అయితే 1998, ఫిబ్రవరి 17న వాయేజర్-1 అంతరిక్ష నౌక, పయొనీర్-10 చేరిన దూరాన్ని అధిగమించింది. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ (Voyager Inter-stellar Mission-VIM): వాయేజర్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ సౌర వ్యవస్థ ఆవల అంటే హీలియోస్పియర్ దాటి వాయేజర్ అంతరిక్ష నౌకలను తీసుకు వెళ్లాలని నిర్ణయించిన నాసా వీఐఎం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి వాయేజర్-1 సూర్యుని నుంచి దాదాపు 40 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో, వాయేజర్-2 సూర్యుని నుంచి 31 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నాయి. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్లో మూడు దశలు ఉన్నాయి. అవి.. టెర్మినేషన్ షాక్, హీలియోషీత్ అన్వేషణ, అంతర నక్షత్ర (Interstellar) అన్వేషణ. సౌర అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉన్న సౌర వ్యవస్థ మలి ప్రాంతంలో ఏదో ఒక ప్రదేశం వద్ద సూపర్ సౌర గాలులు, అంతర నక్షత్ర గాలులు ఒక దానికి ఒకటి తారసపడతాయి. వాయేజర్ అంతరిక్ష నౌక ఈ ప్రాంతాన్ని చేరడంతో టెర్మినేషన్ షాక్ దశ పూర్తయింది. ఇక్కడ సూపర్ సోనిక్ సౌర గాలులు సబ్ సోనిక్ వేగానికి తగ్గి సౌర అయస్కాంత క్షేత్రంలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. టెర్మినేషన్ షాక్ దశను వాయేజర్-1.. 94 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2004లో అధిగమించింది. అదేవిధంగా 84 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2007లో వాయేజర్-2 ఈ దశను దాటింది. ఆ తర్వాత హీలియోషీత్ ప్రాంతానికి వాయేజర్ జంట నౌకలు చేరుకున్నాయి. హీలియోస్పియర్ బాహ్య భాగాన్ని హీలియోషీత్ అంటారు. హీలియోషీత్ కొన్ని పదుల ఆస్ట్రనామికల్ యూనిట్ దూరంలో విస్తరించి ఉంటుంది. ఈ భాగాన్ని ప్రయాణించడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. హీలియోషీత్ను దాటిన తర్వాత అంతర నక్షత్ర రోదసి అన్వేషణ ప్రారంభమవుతుంది. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ ప్రధాన లక్ష్యం ఈ అంతర నక్షత్ర రోదసిని చేరడం. హీలియోస్పియర్ దాటి అంతర నక్షత్ర రోదసిల మధ్య ప్రాంతం హీలియోపాజ్. సూర్యుడి నుంచి హీలియోపాజ్ 8 నుంచి 14 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం వద్దనే మిలియన్ మైళ్ల వేగం ఉండే సౌర గాలులు 25 లక్షల మైళ్ల వేగానికి తగ్గుతాయి. మొదటి మానవ నిర్మిత సాధనం: 2012, ఆగస్టు 25 నాటికి సూర్యుడి నుంచి 18.78 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అంతర నక్షత్ర రోదసిలోకి ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత సాధనంగా వాయేజర్ గుర్తింపు తెచ్చుకుంది. ఏప్రిల్లో వాయేజర్-1 నుంచి అందిన సమాచారం ఆధారంగా గతేడాది ఆగస్టులో అది రెండు నక్షత్రాల మధ్య ఉండే అంతర నక్షత్ర రోదసిలోకి ప్రవేశించిందని నాసా, ఇతర విశ్వవిద్యాలయాల అధ్యయనంలో వెల్లడైంది. వాయేజర్-2 ప్రస్తుతం 15.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 2020 వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ప్రయాణించగల శక్తి వాయేజర్ అంతరిక్ష నౌకలకు ఉంది. ఇది సాధ్యమైతే 2020 నాటికి వాయేజర్-1 సూర్యుని నుంచి 19.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో, వాయేజర్-2 16.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. గోల్డెన్ రికార్డ: జంట వాయేజర్ నౌకలు 12 అంగుళాల బంగారు పూతతో కూడిన రాగి డిస్క్ పరికరాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఒక ఫోనోగ్రాఫ్ రికార్డు. భూమిపై ఉన్న జీవ సంప్రదాయ వైవిధ్య సమాచారాన్ని ఈ డిస్క్లో పొందుపరిచారు. కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్ సగన్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ ఈ డిస్క్లో పొందుపరిచిన సమాచారాన్ని సేకరించింది. 115 చిత్రాలు, పలు సహజ ఆవాసాల శబ్దాలను ఇందులో ఉంచారు. గాలి, ఉరుము, పక్షులు, తిమింగలాలు, ఇతర జంతువుల శబ్దాలను ఇందులో పొందుపరిచారు. భూమిపై వివిధ కాలాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు చెందిన సంగీతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. 55 భాషల్లో వ్యక్తుల సందేశాలతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వాల్దీం (Kurt Josef Waldheim) సందేశాలు గోల్డెన్ రికార్డలో ఉన్నాయి. గ్రహాంతర వాసులకు ఈ రికార్డ అందితే భూమి, దాని గురించి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. వాయేజర్-1 ప్రస్థానం లక్ష్యం: గ్రహాలు, నక్షత్రాంతర రోదసి పరిశోధన బరువు: 722 కిలోలు పరికరాలు: శ్రీహై గెయిన్ యాంటెన్నా (సౌర కుంటుంబం ఆవలి నుంచి రేడియో సంకేతాలు పంపే శక్తిమంతమైన యాంటెన్నా. భూమిపై మూడు డీప్స్పేస్ నెట్వర్క్ కేంద్రాలకు సిగ్నళ్లు పంపుతుంది. ఈ సిగ్నళ్లు భూమి ని చేరటానికి 17 గంటల సమయం పడుతుంది). శ్రీలో-ఫీల్డ్ మ్యాగ్నెటోమీటర్ (రోదసిలోని అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది). శ్రీరేడియోఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జెనరేటర్ (దీనిలోని మూడు యూనిట్లు విద్యుత్ను అందిస్తాయి. ఇందులోని ఒక్కో యూనిట్లో పీడనానికి గురి చేసిన ప్లుటోనియం-238 ఆక్సైడ్ స్పియర్లు ఉంటాయి). శ్రీప్లానెటరీ రేడియో ఆస్ట్రానమీ (సూర్యుడు, గ్రహాలు, అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సిగ్నళ్లను గుర్తిస్తుంది). శ్రీప్లాస్మావేవ్ సబ్సిస్టమ్ (ప్లాస్మా, అయస్కాంత తరంగాలను గుర్తిస్తుంది). శ్రీమ్యాగ్నెటోమీటర్ (అయస్కాంత కేత్రాలు, గ్రహాలపై సూర్యుడి ప్రభావాన్ని అంచనా వేస్తుంది). శ్రీకాస్మిక్ రే డిటెక్టర్ (కాస్మిక్ కిరణాలు, ప్లాస్మాలోని కణాలను గుర్తిస్తుంది). శ్రీప్లాస్మా స్పెక్ట్రోమీటర్ (ప్లాస్మాలో అతి తక్కువ విద్యుదాత్మకతగల కణాలను, వాటి వేగాలను, మార్గాలను గుర్తిస్తుంది). శ్రీన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, రేడియో మీటర్ (ఉష్ణోగ్రత, రసాయన మూలకాలు, దృశ్య పరారుణ కాంతిని అంచనా వేస్తుంది). శ్రీఫోటో పోలరీ మీటర్ (గురు, శని, యురేనస్ భౌతిక ధర్మాలను గుర్తిస్తుంది). శ్రీఇమేజింగ్ సైన్స్ సిస్టమ్ (గ్రహాలు, వస్తువులను రెండు కెమెరాలతో ఫోటోలు తీస్తుంది). శ్రీఅల్ట్రావయిలెట్ స్పెక్ట్రోమీటర్ (పరిసరాల్లోని వాతావరణం, రేడియేషన్ను అంచనా వేస్తుంది). శ్రీలో-ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్ డిటెక్టర్ (రోదసి నుంచి దూసుకు వచ్చే విద్యుదావేశ కణాల వేగం, దిశ, పరిమాణాన్ని గుర్తిస్తుంది) డీప్ స్పేస్ కమాండ్ నెట్వర్క్ ద్వారా రేడియో సిగ్నళ్లు పంపుతుంది. ఇంధనం-ప్లుటోనియం-238 ప్రయోగం-1977, సెప్టెంబర్ 5 ప్రయాణించిన దూరం- దాదాపు 1,900 కోట్ల కిలోమీటర్లు (125 AU) ఆగస్టు 2013 నాటికి ప్రస్తుత వేగం: సెకన్కు 17 కిలోమీటర్లు ఆగస్టు 2013 నాటికి 1979లో గురు గ్రహం దాటింది 1980లో శని గ్రహం దాటింది 2013లో సౌర కుటుంబం వెలుపలకు చేరింది గురు, శని గ్రహాలు, వాటి సహజ ఉపగ్రహాలకు సంబంధించి స్పష్టమైన చిత్రాలు పంపిన తొలి నౌక వాయేజర్-2 అత్యధిక రోజులు పని చేస్తున్న వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది. వాయేజర్-1, 2 లను 1977లో 16 రోజుల తేడాతో ప్రయోగించారు. ఇవి అప్పటి నుంచి 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తూ సమాచారం పంపుతూనే ఉన్నాయి.