-
భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం బాబుకు కొత్తేమీ కాదు!
బంజారాహిల్స్: చంద్రబాబు.. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి రాబట్టుకోవడం ఇదేం కొత్త కాదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అనుమతి ఇస్తే మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన తరువాత.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేందుకు తన భార్యను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్పై ఒత్తిడి పెంచిన విషయాన్ని తామెవరూ మరచిపోలేదన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాబును టీడీపీలో చేర్చుకోని పక్షంలో.. గర్భవతినైన తాను ప్రసవించేది లేదని భువనేశ్వరి బెట్టు చేసిందని.. అందుకే చంద్రబాబును పార్టీలోకి చేర్చుకున్నానని స్వయంగా ఎన్టీఆర్ తనతో చెప్పారని వెల్లడించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చతో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, సీఎం జగన్ మాట్లాడిన మాటలను మూడు నాలుగుసార్లు విన్నానని, వారెవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించినట్లు తనకు కనబడలేదు.. వినబడలేదని అన్నారు. గతంలో అప్పుడప్పుడూ చంద్రబాబు తన ఇంటికి వచ్చేవాడని.. ఆ సమయంలో మామను దుర్బాషలాడే వాడని వివరించారు. సానుభూతి కోసమే ఇదంతా చేసినట్లుగా నిన్నటి ఘటన అనిపించిందన్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబును మించినవారు లేరని చెప్పారు. గతంలో టీడీపీకే చెందిన ఓ ఎమ్మెల్యే చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడాడని.. ఇది సభలో మాట్లాడింది కాదన్నారు. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఖర్చుల కోసం దాచుకున్న రూ.20 లక్షలు కూడా బ్యాంకు నుంచి ఆయనకు రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్పారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఒక రాత్రంతా ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలంటూ బాబు డబ్బులు కూడా పంపించినట్లు విమర్శలున్నాయని నాదెండ్ల చెప్పారు. -
‘తినటానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్ ఏడ్చారు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబు భార్యను ఏమి అనలేదని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త నాదెండ్ల భాస్కరరావు అన్నారు. గతంలో టీడీపీలో చేరేందుకు చంద్రబాబు తన భార్య ద్వారా ఎన్టీఆర్పై ఒత్తిడి తెచ్చాడని గుర్తు చేశారు. కూతురు కోసం ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ చెక్కులు పాస్కాకుండా చంద్రబాబు చేశాడని విమర్శించారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఏడ్చారని గుర్తు చేశారు. చదవండి: ‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’ చంద్రబాబు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని నాదెండ్ల అన్నారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ‘ఎన్టీఆర్కు తన పిల్లలు అన్నం కూడా పెట్టలేదు. తినడానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్ ఏడ్చారు. ఎన్టీఆర్ 20 లక్షల రూపాయలను చంద్రబాబు లాక్కున్నాడు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవద్దని ఎన్టీఆర్కు చెప్పాను. పార్టీలో చేరేందుకు చంద్రబాబు నా దగ్గరకు వచ్చాడు. ఎన్టీఆర్ను కూడా చంద్రబాబు దుర్భాషలాడాడు.’ అని నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. చదవండి: ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. బాబు మాటలు నమ్మొద్దు: లక్ష్మీ పార్వతి -
పౌరసత్వ చట్టం కొత్తది కాదు: మాజీ ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ చట్టం కొత్తది కాదు, సవరించిన కొత్త చట్టంతో ఎవరికి ఎటువంటి నష్టం చేకూరదు, అభూత కల్పనలు నమ్మవద్దని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు, లబ్థి పొందేందుకే.. పౌరసత్వ బిల్లుపై అపోహలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ బిల్లుతో మతాలకు సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే పౌరసత్వ సవరణ బిల్లు చట్టమైందని, అనవసరంగా అపోహలు పెంచి దేశాన్ని కల్లోలం చేయవద్దని నాదెండ్ల విన్నవించారు. భారతీయ ముస్లింలకు హాని కలిగించేలా చట్టంలో ఏమి పొందుపరచలేదని పేర్కొన్నారు. దేశంలో ఓటర్ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు ఏవిధంగా ఉన్నాయో అలానే ఐడీ ఉంటే చాలు, ఎవరిని వెల్లగొట్టరు అని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో పౌరసత్వ సవరణ బిల్లును చించడంలో అర్ధం లేదన్నారు. -
మోదీ, అమిత్ షాలతో నాదెండ్ల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ఈ నెల 6న హైదరాబాద్లో అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ఎటువంటి పదవి కట్టబెట్టలేదు. నాదెండ్లతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్, రామగుండం డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, టీడీపీ నాయకులు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్, మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి తదితరులు కూడా అదే రోజు బీజేపీలో చేరారు. కాగా, నాదెండ్ల కుమారుడు మనోహర్ జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. -
బీజేపీలో చేరిన నాదెండ్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. దానిలో భాగంగా శనివారం (జూలై 6) దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన మహిళ సోని బీజేపీ సభ్యురాలిగా అమిత్షా సమక్షంలో తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలాఉండగా... చాన్నాళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చులకనగా చూడొద్దు... బహిరంగ సభలో అమిత్షా మాట్లాడుతూ.. ‘బీజేపీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. పార్టీలో ఎన్నో గెలుపోటములు చూశాం. మమ్మల్ని చులకనగా చూసిన కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదు. తెలంగాణలో 20 లక్షల సభ్యత్వమే మా లక్ష్యం. పేదలు మహిళలకోసం బడ్జెట్లో ఎన్నొ పథకాలు ప్రకటించాం. 2022 కల్లా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతాం’అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయిన అనంతరం అమిత్షా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement