murmur Balancing Reservoir
-
Puffed Rice: మరమరాలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
మరమరాలను పఫ్డ్ రైస్ అని కూడా పిలుస్తారు. దీన్ని బెస్ట్ స్నాక్ ఐటమ్గా చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఉగ్గాని, పిడతకింద పప్పు వంటి పేర్లతో రకరకాల స్నాక్ ఐటెమ్స్ చేసుకుని తింటారు. ముఖ్యంగా వీటితో చేసే లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్ చాలా బాగుంటాయి. దీన్ని పలు ప్రాంతాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తారు. అలాంటి మరమరాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా!. ఇది బెస్ట్ టైమ్ పాస్ ఫుడ్ స్నాక్ మాత్రమే కాదు.ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరమరాలలో విటమిన్ డి, విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం, దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుంది. వీటిని రోజూ స్నాక్గా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకల బలానికి.. మరమరాలలో విటమిన్ డి, బిలతో పాటు కాల్షియం, ఐరన్, థయామిన్, రిబోఫ్లావిన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. ముఖ్యంగా ఈ పోషకాలు ఆస్టియోపొరోసిస్ ముప్పును తగ్గిస్తాయి. ఎముకలను బలంగా ఉంచుకోవడానికి మరమరాలు స్నాక్గా తీసుకోండి. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగితే.. రోజువారి ఆహారంలో దీన్ని జోడించడం వల్ల త్వరితగతిన కోలుకుంటారు. అధిక బరువు సమస్య.. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది.ఎక్కువ కాలం ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోకుండా.. నియంత్రిస్తుంది. బరువు తగ్గేవారికి మరమరాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జంక్ ఫుడ్కు బదులుగా మరమరాలు తీసుకుంటే.. బరువు కంట్రోల్లో ఉంటుంది. గ్లుటెన్ ఫ్రీ.. మరమరాలు గ్లూటెన్ ఫ్రీ గోధుమలు తినని వారు ఇది మంచి ఇది మంచి ఆప్షన్ మరమరాలతో బరువు పెరగకుండా ఉంటారు. గ్లూటెన్ అలర్జీతో బాధపడేవారు ఉంటారు. దీంతో వారు గోధుమలు వాటితో తయారు చేసిన ఆహారాలు తినలేని పరిస్థితి ఉంటుంది. ఇది గోధుమలకు మంచి ప్రత్యామ్నాయం. సోడియం.. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇది తీసుకుంటే మంచి స్నాక్ ఐటం సోడియం శాతం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉప్పు ఉండదు కాబట్టి ఇది మంచి హెల్తీ ఆప్షన్ గా సులభంగా తినొచ్చు. బీపీ పెరుగుతుందనే భయం ఉండదు. జీర్ణ సమస్యలకు చెక్.. మరమరాలు పేగు ఆరోగ్యానికి మంచిది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి. మరమరాలను నీటిలో నానబెట్టి సాఫ్ట్ గా అయ్యాక తీసుకుంటాం కాబట్టి ఇది సమయం పడుతుంది. పేగు ఆరోగ్యానికి జీర్ణసమస్యలు దరిచేరవు. జీర్ణర సమస్యలతో బాధపడేవారు ఏ ఆలోచన లేకుండా సులభంగా తినవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ డైట్లో చేర్చుకునే ముందు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు మేరకు అనుసరించటం మంచిది. (చదవండి: హెయిర్ స్ట్రైయిట్నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్) -
ట్రయల్కు రెడీ!
గోదావరి మొదటి దశకు సన్నాహాలు సర్కారు అనుమతికి జలమండలి ఎదురుచూపు ముర్మూరు నుంచి బొమ్మకల్ వరకు ట్రయల్ రన్ నగరంలో పూర్తి కాని రింగ్ మెయిన్ పనులు సాక్షి, సిటీబ్యూరో : గోదావరి మంచినీటి పథకం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజల స్రవంతి) మొదటి దశ ప్రయోగ పరీక్షకు జలమండలి సన్నాహాలు పూర్తి చేసింది. తొలి దశలో కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 54 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్కు 20 ఎంజీడీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ట్రయల్ రన్లో పైప్లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్లైన్ల జాయింట్లను పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నెలాఖరులో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి 1.5 కి.మీ. దూరంలోని ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని గ్రావిటీ ద్వారా తరలించారు. అక్కడి నుంచి బొమ్మకల్- మల్లారం- కొండపాక- ఘన్పూర్ మార్గంలో రూ.3,800 కోట్ల అంచనాతో రిజర్వాయర్లతో పాటు సుమారు 186 కి.మీ. పైప్లైన్లు పూర్తయిన విషయం విదితమే. గోదావరి తొలిదశలో గ్రేటర్కు 172 ఎంజీడీల నీటిని తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా బసంత్నగర్ వద్ద రైల్వే పట్టాల కింద నుంచి 20 మీటర్ల మార్గంలో 3000 డయా మీటర్ల వ్యాసార్థం గల భారీ పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మరో రెండు రోజుల్లో పూర్తి చేసి... ట్రయల్ రన్కు మార్గం సుగమం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి పథకానికి నెలకు సుమారు 70 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనికి జలమండలి రూ.30 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. నగరంలో సరఫరాకు మరో రెండు నెలలు.. ప్రస్తుతం ప్రయోగ పరీక్షలో కేవలం ముర్మూరు నుంచి బొమ్మకల్ రిజర్వాయర్ వరకే నీటి పంపింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి మల్లారం, కొండపాక, ఘన్పూర్ రిజర్వాయర్ల మార్గంలో ప్రయోగ పరీక్షలకు 50 రోజుల సమయం పడుతుంది. నగర వ్యాప్తంగా గోదావరి జలాల సరఫరాకు మరో రెండు నెలల సమయం పట్టనుంది. అడ్డంకులివే.. ఘన్పూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి నగర వ్యాప్తంగా గోదావరి జలాల సరఫరాకు అవసరమైన 67 కి.మీ. మార్గంలో చేపట్టిన రింగ్మెయిన్ పైప్లైన్ పనుల పూర్తికి పలు చోట్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. రింగ్మెయిన్-1... గుండ్లపోచంపల్లి రైల్వే ట్రాక్ ప్రాంతంలో 30 మీటర్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉంది. గుండ్లపోచంపల్లి గ్రామస్తులు పైప్లైన్ మార్గం మార్చాలని ఒత్తిడి చేస్తుండడంతో సుమారు 1420 మీటర్ల మేరకు పనులు నిలిచాయి. రింగ్మెయిన్-2... శామీర్పేట్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారిలో సుమారు 2.5 కి.మీ. మార్గంలో పనులకు జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతులు అవసరం. కౌకూర్ వద్ద రక్షణ శాఖకు సంబంధించిన 1.20 ఎకరాల స్థలంలో పైప్లైన్ పనులకు సంబంధిత శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. వాణీనగర్, మెట్టుగూడ, మల్కాజ్గిరి ప్రాంతాల్లో పైప్లైన్ పనులకు రైల్వే శాఖ అనుమతించాల్సి ఉంది.