-
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్పై ఓటింగ్లో పాల్గొనలేదు. పార్టీ విప్ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కేసీఆర్ సైగలతో సభ నడుపుతారా?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సైగలతో శాసనసభను నడపడం దుర్మార్గమని, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తన వ్యవహారశైలి మార్చుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, నేతలు కోదండరెడ్డి, అనిల్ యాదవ్లతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ విద్యార్థులను, అమరులను అవమానించిందని.. అమరుల కుటుంబాలకు అణా పైసా కేటాయించలేదని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అది ఏమైందని రేవంత్ నిలదీశారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు ఇస్తామన్న టీఆర్ఎస్ సర్కారు.. దాన్ని రూ.3 లక్షలకు కుదించిందని మండిపడ్డారు. శాసనమండలి రెండు, మూడు రోజులే నడపడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ బడ్జెట్ ప్రసంగం సమయంలో నిరసనలు తెలిపిన సభ్యుల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని.. కానీ ఇప్పుడు స్పీకర్ తీరు దారుణమని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ సభ్యులందరినీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, దాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని స్పష్టం చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, నిరసనలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయం గుర్తులేదా అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల పట్ల కూడా స్పీకర్ తీరు సరిగా లేదని.. దీనిపై మంగళవారం గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. స్పీకర్ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పక్షనేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కన్నెత్తి చూడకపోవడం అవమానకరమని, దళితుడిని సీఎల్పీ లీడర్గా సహించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రం రాజుల చెరలో ఉన్నట్టుగా.. సభాపతి బంట్రోతుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం ఉంటే సభ్యులు ప్రజాసమస్యలను ప్రస్తావించే అవకాశం ఉండేదని స్పష్టం చేశారు. చట్టసభా.. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా?: భట్టి విక్రమార్క అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కనీసం పట్టించుకోలేదని.. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘ఇది చట్టసభనా? లేక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా? ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా అవమానిస్తున్నారు. సభా సంప్రదాయం ఉండదా..? మేం కూడా సభ నడిపించామంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా గొంతు నొక్కుతున్నారు. కనీస విధానాలు తెలియని సభాపతిని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది. ఇది మీ ఇల్లు కాదు. మేం కూడా ప్రజల నుంచి గెలిచి వచ్చాం. ప్రజా సమస్యలను ప్రస్తావించి తీరుతాం. స్పీకర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం’’అని స్పష్టం చేశారు. -
ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం
సాక్షి, ముంబై: అసెంబ్లీ సమావేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్పై గందరగోళం సృష్టించినందుకు వేటుపడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను శుక్రవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ట్వీట్ చేశారు. అంతేగాకుండా పక్షపాతం లేకుండా తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సస్పెన్షన్ రద్దయినందుకు 12 బీజేపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. అసలేం జరిగింది.. 2021లో జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ఓబీసీ రిజర్వేషన్పై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్కు అనుకూలంగా గళం విప్పారు. ఓబీసీ రిజర్వేషన్ కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో అధికార మహావికాస్ ఆఘాడికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో విపక్ష సభ్యులపై తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో స్పీకర్ సీటులో కూర్చున్న భాస్కర్ జాదవ్ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించారని, ఆయనపై దాడిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలపై సంవత్సరకాలం పాటు సస్పెండ్ వేటు పడింది. అప్పటినుంచి ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనం మెట్లు ఎక్కలేదు. బీజేపీ శాసనసభ్యులు స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చదవండి: (ఒక సెషన్కు మించి సస్పెన్షన్) మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక ఎమ్మెల్యేను 60 రోజులకంటే ఎక్కువ సస్పెండ్ చేయడమంటే, ఒక విధంగా ఎమ్మెల్యే పదవి రద్దు చేయడంతో సమానమని కోర్టు పేర్కొంది. ఎలాంటి నియోజకవర్గమైనా ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధి లేకుండా ఉండరాదు. దీంతో సంవత్సర కాలంపాటు సస్పెండ్ వేటు వేయడం తప్పని పేర్కొంటూ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార బలంతో విపక్షాలను అణచివేయాలని ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టని విపక్షాలు వ్యాఖ్యానించాయి. సుప్రీంకోర్టు పెత్తనం తగదు: రావుత్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన ఎంపీ సంజయ్ రావుత్ శుక్రవారం ఓ మీడియా చానెల్తో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విధాన్ సభ అధికారాలను ఆక్రమించుకుందని, పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు. గతంలో రాజ్యసభలో మా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు సస్పెండ్కు గురయ్యారు. ఆ సమయంలో సుప్రీం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే 12 మంది ఎమ్మెల్యేల జాబితాకు ఇంతవరకు క్లియరెన్స్ ఇవ్వక పోవడంతో గత రెండు సంవత్సరాల నుంచి వారు వేచి చూస్తున్నారు. ఆ ఫైల్ ఇంతవరకు గవర్నర్ వద్దే పడి ఉందని, ఇప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కే ఉన్నప్పటికీ దీనిపై సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని రావుత్ ప్రశ్నించారు. రిజర్వేషన్ చర్చ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నానా రభస చేశారు. సభా నియమాలు ఉల్లంఘించడమేకాకుండా, కార్యకలాపాలు సాగకుండా అడ్డుకున్నారు. అందువల్లే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సి వచ్చిందన్నారు. కానీ సు ప్రీంకోర్టు తీర్పు సభా నియమాలపై ఆధిపత్యంగా భా విస్తున్నామన్నారు. చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న సుప్రీంకోర్టు గవర్నర్ వద్దనన్న మా 12 మంది ఎమ్మెల్యేల ఫైల్ విషయంలో ఎందుకు స్పం దించడం లేదని, జోక్యం చేసుకుని ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ముంబై: బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం తీర్మానాన్ని ఆమోదిం చింది. వారు స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్తో అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం 12 మంది ఎమ్మెల్యేలు ముంబై, నాగపూర్లోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని అనిల్ పరబ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, సభా వ్యవహారాలను తామే బహిష్కరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తాము బయ టపెడుతు న్నామని, అందుకే సభలో ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించలేదన్నారు. అధికార శివసేన ఎమ్మెల్యేలే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫడ్నవిస్ చెప్పారు. భాస్కర్ జాదవ్ ఘటనపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. -
సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ శాసన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో సీఎం జగన్ సందేశం ప్రజలకు చేరకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ తమ్మినేని సీతారాం సభా నియమాలు ఉల్లంఘించిన పలువురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, చిన రాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, వెంకట్రెడ్డి నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్ను నేటి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement