breaking news
medium irrigation
-
విజయనగరం సరి‘కిల్’
విజయనగరం సాగునీటి సర్కిల్ కార్యాలయం ఏర్పాటులో జిల్లా పాలకులు విఫలమయ్యారు. అక్కడి పాలకుల ఒత్తిడి మేరకు శ్రీకాకుళానికి తాజాగా సర్కిల్ కార్యాలయం మంజూరు చేయగా... ఇక్కడి అధికారపార్టీ నాయకులు చేతకానితనం వల్ల జిల్లాలో జలవనరులశాఖ ఒక కొలిక్కి రాకుండా పోయింది. ఫలితంగా జిల్లాలో ఉన్న బొబ్బిలి సర్కిల్ కార్యాలయం పరిధి కేవలం రెండు డివిజన్లకే పరిమితం కాగా... విజయనగరం డివిజన్ విశాఖపట్నంలో కొనసాగాల్సి వస్తోంది. విజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో మైనర్, మీడియం ఇరిగేషన్కు ఇంతవరకు రెండు సర్కిల్ కార్యాలయాలు ఉన్నారుు. ఇందులో ఒకటి బొబ్బిలిలో ఉండగా మరొకటి విశాఖపట్నంలో ఉంది. బొబ్బిలిలో ఉన్న సర్కిల్ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐదు ఇరిగేషన్ డివిజన్లు, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, జంఝావతి డివిజన్లు ఉన్నాయి. జిల్లాలో ఉన్న విజయనగరం డివిజనుతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అన్ని డివిజన్లు విశాఖపట్నంలో కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ తాజాగా జీవో నంబరు 106 జారీ చేసింది. దాని ప్రకారం బొబ్బిలి సర్కిల్ పరిధిలో ఇంతవరకు ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఐదు డివిజన్లు ఆ సర్కిల్ కార్యాలయం పరిధిలోకి వెళ్లారుు. పార్వతీపురం మైనర్ ఇరిగేషన్ డివిజన్, జంఝావతి డివిజన్ మాత్రమే బొబ్బిలి సర్కిల్లో మిగిలాయి. మన సంగతేమిటి? శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు వెనుక అక్కడి నేతల తీవ్ర కృషి ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన అక్కడ మంత్రి, ఇతర నాయకులు సర్కిల్ కార్యాలయం సాధిం చుకున్నారు. బొబ్బిలి కార్యాలయంతో సంబంధం లేకుండా చేసుకున్నారు. కానీ అలాంటి ప్రతిపాదనే మన జిల్లా నుంచి కూడా జలవనరులశాఖ కార్యాలయానికి వెళ్లింది. జిల్లా కేంద్రం విజయనగరంలో ఒక సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని జెడ్పీ వేదికగా తిర్మానించి ప్రతిపాదన పంపించారు. కానీ శ్రీకాకుళానికి సర్కిల్ కార్యాలయం మంజూరు చేస్తూ జారీ చేసిన ప్రభుత్వం మన ప్రతిపాదనను పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి జిల్లాపై చిన్నచూపు చూసిందని స్పష్టమవుతుంది. మంత్రు లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లే రాలేదని చర్చజరుగుతోంది. సర్కిల్ కార్యాలయం ఒక్కటైతే... వాస్తవానికి సర్కిల్ కార్యాలయం ఏర్పా టు కావాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళంలో ఉన్న ఐదు డివిజన్లతో కొత్త గా అక్కడ సర్కిల్ కార్యాలయం ఏర్పాటుతో బొబ్బిలి రెండింటికి పరిమితం కావడంతో అక్కడ పనిభారం తగ్గినట్లేనంటున్నారు. ఈ నేపధ్యంలో విజయనగరం డివిజన్తో కలిపి మూడింటిని ఒక సర్కిల్ పరిధిలోకి తీసుకొచ్చి జిల్లా పరిధిలో కొత్త సర్కిల్ ఏర్పాటు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. దీనివల్ల విజయనగరం వాసులు విశాఖపట్నం సర్కిల్కు వెళ్లే శ్రమ తగ్గుతుందని చెబుతున్నారు. బొబ్బిలిలో ఉన్న సర్కిల్ కార్యాలయం విజయనగరంలో ఏర్పాటు చేస్తే రైతులతోపాటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటుందంటున్నారు. ఆ దిశగా పాలకులు చొరవ చూపితే బాగుంటుందని ఒక సీనియర్ ఇంజినీరు అభిప్రాయపడ్డారు. -
చెరువులకు మరమ్మతులేవీ?
సాక్షి, నెల్లూరు: ఒకప్పుడు చెరువు కింద సేద్యముంటే ఆ రైతు పంట పండినట్టే లెక్క. రానురాను పరిస్థితులు మారిపోతున్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరితో చెరువులు రూపుకోల్పోతున్నాయి. పుష్కలంగా నిధులున్నా చెరువుల ఆధునికీకరణపై దృష్టిపెట్టే వారు కరువయ్యారు. రికార్డుల్లో మాత్రం మరమ్మతులకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు నమోదవుతోంది. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. క్రమేణా చెరువు కింద సేద్యమంటేనే అన్నదాత భయపడే పరిస్థితి నెలకొంది. రబీసీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని చెరువుల దుస్థితిపై నిర్వహించిన ‘ఫోకస్’లో ఈ అంశాలు వెలుగుజూశాయి. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 732, పంచాయతీరాజ్ పరిధిలో 984, మేజర్ ఇరిగేషన్ పరిధిలో 66 చెరువులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ పరిధిలో కనుపూరు కెనాల్ కింద 85, స్వర్ణముఖి బ్యారేజీ కింద 10 చెరువులు ఉన్నాయి. మొత్తం 1,877 చెరువుల పరిధిలో 4,04,202 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏడాదిలో జిల్లాలో సగటున నమోదుకావాల్సిన వర్షపాతం 1080 మిల్లీమీటర్లు. అక్టోబర్ చివరినాటికే 653 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా ఇప్పటివరకు 632.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ క్రమంలో చెరువుల్లో ఓ మోస్తరు నీరు చేరింది. చెరువులు ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో అరకొర నీరు చేరినా ఉపయోగం లేకుండా పోతోంది. దుస్థితిలో చెరువులు గతంలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చిన సమయంలో జిల్లాలోని పలు చెరువుల కట్టలు, తూములు దెబ్బతిన్నాయి. వాటికి శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. బోగోలు చెరువుకట్ట తెగిపోయి చాలాకాలమైనా తాత్కాలిక రింగ్బండ్తోనే సరిపెట్టారు. రూ.85 లక్షల అంచనాలతో టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి, ఓ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయినా ఇప్పటివరకు పనులు మొదలుకాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు దొరవారిసత్రం, గంగపట్నం, సీతారామపురం మండలం పడమర్లవారి చెరువు, ఓరుగుండ్లపల్లి, ఊచగుంటపాళెం చెరువులకు గండ్లుపడ్డాయి. ఓజిలి చెరువుకట్ట దెబ్బతింది. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సివున్నా మన పాలకులు, అధికారులకు పట్టడం లేదు. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ చెరువులో మట్టిని స్థానికులు అక్రమంగా త వ్వుకుపోవడంతో లోపలంతా అస్తవ్యస్తంగా తయారైంది. రాపూరు, సైదాపురం చెరువుల్లో వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇలా చెప్పుకుంటే పోతే జిల్లాలోని దాదాపు అన్ని చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉంది. కోట్లలో లెక్కలు ఓ వైపు చెరువులన్నీ అధ్వానస్థితిలో ఉండగా ఏటా కోట్లాది రూపాయలతో ఆధునికీకరణ పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు రూ.49 కోట్లు వెచ్చించి 566 చెరువులను ఆధునికీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.23 కోట్లతో 355 చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు పేర్కొంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరో 374 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ కోట్లాది రూపాయలు ఎక్కడకు పోతున్నాయో ఏమో గానీ జిల్లాలో మెజారిటీ చెరువులు అధ్వానంగా ఉండటంతో సేద్యం అన్నదాతకు ఓ అగ్నిపరీక్షలా మారింది. పనులు జరుగుతున్నాయి: కోటేశ్వరరావు, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టిన పనులు ఆలస్యమవుతున్నాయి. మిగిలిన పనులు మాత్రం జరుగుతున్నాయి. త్వరలోనే అన్నిచెరువులు, కాలువల ఆధునికీకరణ పూర్తి చేస్తాం.