-
మానస సరోవరం: ముమ్మరంగా సహాయక చర్యలు!
ఢిల్లీ: మానస సరోవర యాత్రలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అనే తెలుగు యాత్రికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెల్సిందే. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్కు నేపాల్ అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తర్వగా తరలించేందుకు నేపాల్ రాయబార కార్యాలయంతో ఏపీభవన్ అధికారులు సంప్రదింపులు చేపడుతున్నారు. కేరళకు చెందిన మరో యాత్రికుడు కూడా ఈ మానస సరోవర యాత్రలో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు తెలిసింది. యాత్రికులకు తరలించేందుకు అధికారులు ఏడు విమానాలను ఏర్పాటు చేశారు. సిమికోట్ నుంచి నేపాల్గంజ్కు 104 మంది యాత్రికుల తరలించారు. తెలుగువారి బాగోగులు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ గంజ్కు ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ఒక టీంను ఓఎస్డీ రవి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం పంపుతున్నామని ఏపీ భవన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. మానస సరోవర యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. హిల్సా బేస్ క్యాంప్ లో చిక్కుకున్న వారికి అవసరమైన వైద్య చికిత్స అందించాలన్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన వారు సురక్షితంగా రావాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్రలో అపశృతి అమర్నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) అనే తెలుగు మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం అందింది. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆధ్యాత్మిక సౌరభం... ఆనంద విహారం...
విహారి వెండి వెలుగులతో అబ్బురపరిచే హిమవత్పర్వతాలు.. అలల సడులతో అలరించే సరోవరాలు.. పరమేశ్వరుడు కొలువైన ప్రదేశంగా పేర్కొనే కైలాసగిరి సందర్శన.. ఒక్కసారి చూసినా జీవితకాలం గుర్తుండిపోయే రమణీయ దృశ్యాలు.. ఇవన్నీ కైలాస - మానస సరోవర యాత్రలో అడుగడుగునా కళ్లకు కడతాయి. ఇటు ప్రకృతి రామణీయకత, అటు ఆధ్యాత్మిక సౌరభాలను అనుభూతించే అరుదైన విహారం ఈ కైలాస - మానస సరోవర యాత్ర. కైలాస - మానస సరోవరయాత్ర ఇలా వెళ్ళి, అలా వచ్చేసే తీర్థయాత్ర కాదు. ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యాత్రకు నేను మరో 44 మందితో కలసి వెళ్ళాను. ఆ రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు నుండి మా యాత్ర మొదలైంది. ఢిల్లీ వెళ్లి, అక్కడి నుండి విమానంలో నేపాల్ రాజధాని ఖాట్మండుకు సాయంత్రం చేరాం. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు ట్రావెల్ బస్సులో టిబెట్ చేరుకున్నాం. అటు నుంచి ఎత్తై సుందర ప్రదేశం నాగర్కోట్ సందర్శించి, దాదాపు 300 కి.మీ దూరమున్న నేపాల్ చివరి ప్రదేశమైన తోతాపాణి చేరుకున్నాం. ఇక్కడికి దగ్గరలోనే నేపాల్-చైనా సరిహద్దు ఉంది. ఈ రెండు భూభాగాల మధ్య ఉన్న నది మీదుగా రాకపోకలు సాగించడానికి ఏర్పాటుచేసిన వంతెనను ‘ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్’ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జి దాటే సమయంలో లగేజీని మోయడానికి కూలీల అవసరం ఉంటుంది. మనం ఒక బ్యాగును కష్టపడి మోయవలసి వస్తే అటువంటి ఐదు బ్యాగులను ఒక నేపాలీ మహిళ వీపు మీద వేసుకొని సునాయాసంగా అటువైపు చేరుస్తుంది. ఎముకలు కొరికే చలిలో... అటువైపు చైనా ఆక్రమిత టిబెట్ భూభాగాన్ని జుగ్ము అంటారు. జుగ్ములో వీసా, పాస్పోర్టుల తనిఖీలు పూర్తిచేసుకున్న తరువాత ఇక్కడి నుండి హిమాలయ పర్వత చరియలను, లోయలను వీక్షిస్తూ సాయంకాలం 5 గంటలకు ‘న్యాలం’ చేరాం. మన రూపాయలను ఇక్కడే ‘యువాన్’లోకి మార్చుకోవాలి. ఇక్కడికి రాగానే అందరికీ తల భారంగా, వాంతు వచ్చినట్లు అనిపించడం మొదలైంది. దీనికంతటికీ కారణం - ఎత్తై భూభాగానికి వెళ్లటమే. విపరీతమైన చలిగాలుల వల్ల చేతికి, కాళ్లకు సాక్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే! వాతావరణానికి అలవాటు పడటానికి మాకు కొన్ని మాత్రలు ఇచ్చి రెండు రాత్రులు, ఒక పగలు అక్కడే ఉంచారు. మూడవరోజు ఉదయం 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి ‘సాగా’ మీదుగా ‘న్యూ డొంపా’ అనే ప్రాంతం చేరుకున్నాం. సాగా దగ్గర 30 కి.మీ. తప్ప తక్కిన రోడ్డంతా విమానాశ్రయంలో మాదిరి ‘రన్ వే’ లా అనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కడా విద్యుత్ లేదు. సౌరవిద్యుత్, జనరేటర్లతో మాత్రమే కొంతసేపు దీపాలు వెలుగుతాయి. ఆ రోజు రాత్రి ‘న్యూ డొంపా’లో బస చేసి, ఉదయం 150 కి.మీ ప్రయాణించి మానససరోవరం చేరుకున్నాం. ప్రయాణంలో ఎక్కడ చూసినా ఇసుకతిన్నెలు, మేటలే. ఎక్కడా పచ్చని చెట్టూ చేమా లేవు. వర్షానికి ఇసుకలో మొలిచే పచ్చికను మేస్తూ జడల బర్రెల్లాంటివి గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని గ్రామాలు కనిపించాయి. మట్టి ఇళ్ల్లలోనే అక్కడి వారి నివాసం. ముగ్ధ మనోహర సరోవరం మానస సరోవరం 20-25 కి.మీ ఉండగా కైలాస పర్వతం కనిపిం చింది. అది మాటల్లో వర్ణించలేని అద్భుతం. శరీరంలో ఒక విధమైన ప్రకంపనలు. ఇక్కడ నుంచి చైనా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలుష్య రహిత బస్సులో 25 కి.మీ ప్రయాణించాం. మానస సరోవర పరిక్రమ చేయించుకుంటూ ఒకచోట ఆపారు. హిమగిరులు కరిగి వచ్చిన నీళ్లు... చాలా చల్లగా, అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయి. తెల్లవారుజామున రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్యన శివపార్వతులతో పాటు దేవతలు ఈ సరోవరంలో స్నానాలు ఆచరిస్తారని ప్రతీతి. ఆ సమయంలో సరోవరాన్ని తిలకించడానికి భక్తులు రాత్రి జాగరణ చేసి ఈ ప్రాంతానికి చేరుకుంటారట. ఆ రోజు సరోవరంలో స్నానం చేసి, రాత్రి 12 గంటల తర్వాత లేచి, తిరిగి మానస సరోవరం ఒడ్డుకు చేరుకున్నాం. తెల్లవారు జామున సరోవరపు అందాలను తిలకించడానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ అద్భుతాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ప్రాణవాయువు అందని గిరి పరిక్రమ మరుసటి రోజు ఉదయం కైలాసగిరి పరిక్రమకు వెళ్లాం. యమద్వారం గుండా కైలాస పరిక్రమ పూర్తిచేయాలంటే మూడు రోజులు పడుతుంది. 30 కి.మీ. తప్పక నడవాలి. టిబెటియన్లకూ, చైనీయులకూ ఈ 54 కి.మీ పరిక్రమ చేయడానికి ఒక్కరోజు చాలు. అంత వేగంగా నడవగలరు వారు. ఇక్కడ పరిక్రమకు గుఱ్ఱాల మీద ప్రయాణించవచ్చు. ఇక్కడి జుతుల్పుక్ ప్రాంతం చేరుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. దారీ తెన్నూ ఉండదు. ప్రాణవాయువు తక్కువ. హృద్రోగ సమస్య ఉన్నవారు ఈ ప్రాంతానికి వెళ్లరు. సాధారణ భక్తులు పరిక్రమ చేయాలంటే కర్పూరం వాసన చూస్తూ, ఆక్సిజన్ సిలెండరును చేతపట్టుకొని వెళతారు. మూడవ రోజు వాహనాల్లో ప్రయాణం చేసే వీలుంటుంది. పరిక్రమ పూర్తయిన తర్వాత మేం బస చేసిన చోటుకి వచ్చి, మరుసటి రోజు తిరుగు ప్రయాణమయ్యాం. ఈ యాత్రలో కైలాస పరిక్రమ అతి కష్టం. కానీ అత్యుద్భుతమైన ఆ ప్రాంతాలను వీక్షించాలనే సంకల్పం ముందు అది పెద్ద కష్టం అనిపించదు. - మాంగాటి గోపాల్రెడ్డి (వ్యాసకర్త) ఇలా వెళ్లాలి... కైలాస్ - మానస సరోవర్ యాత్ర దాదాపు15 రోజులు. ఢిల్లీ - ఖాట్మండ్ - టిబెట్ - న్యాలం మీదుగా మానస సరోవర్ చేరుకోవాలి. న్యాలంలో మన రూపాయలను చైనా కరెన్సీ ‘యువాన్’లోకి మార్చుకోవాలి. భారతీయ కరెన్సీ 10 రూపాయలకు ఒక చైనా ‘యువాన్’ ఇస్తారు. న్యాలంలో సిమ్ కార్డులు లభిస్తాయి. అక్కడి నుంచి మన ప్రాంతానికి ఎస్టీడీ ఫోన్ చేసుకోవాలంటే నిమిషానికి 3 యువాన్లు ఛార్జి. కైలాస్ యాత్రకు వెళ్లడానికి ముందు వైద్య పరీక్షలు (ఇ.సి.జి, రక్తపరీక్షలు, హిమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ షుగర్, స్ట్రెస్ పరీక్షలు) అవసరం అవుతాయి. అన్ని ప్రధాన నగరాల నుంచి కైలాస్ - మానస సరోవర్ యాత్రకు బుక్ చేసుకోవడానికి ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ యాత్రకు ఒక్కొక్కరికీ దాదాపు 77 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏటా మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రకు అనువైన సమయం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement