breaking news
Macksville
-
'నీ గురించి మాట్లాడేందుకు గర్వపడుతున్నా'
మాక్స్విలేలో హ్యూస్ అంత్యక్రియల కార్యక్రమంలో అందరికంటే ముందుగా దేశం తరఫున, కుటుంబం తరఫున ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రసంగించాడు. పంటి బిగువన కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేసినా... మధ్యలో తట్టుకోలేక ఏడుస్తూ క్లార్క్ చేసిన ప్రసంగం సంక్షిప్తంగా... 'హ్యూస్... నీ గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నా. నిన్ను చూసి మాక్స్విలే గర్విస్తోంది. చిన్న వయసులో ఆటకు, కుటుంబానికి దూరమైనందుకు బాధగా ఉంది. అయితే ఆటపై నీవు వేసిన ముద్ర ఎప్పటికీ చెదిరిపోదు. గత గురువారం రాత్రి సిడ్నీ మైదానంలో నడుచుకుంటూ వెళ్తుంటే అదే పచ్చిక నా పాదాలను తాకింది. గతంలో నీవు, నేను, మన సహచరులు ఎంతో మంది ఇక్కడ భాగస్వామ్యాలను నెలకొల్పాం. మన కలలను సాకారం చేసుకున్నాం. నీవు పడిపోయిన ప్రదేశంలో మోకాళ్లపై వంగి పచ్చికను తాకా. ప్రమాణం చేసి చెబుతున్నా.. నీవు మాతోనే ఉన్నావనే అనుభూతి కలిగింది. నేను ఆడిన చెత్త షాట్ గురించి మాట్లాడటం, రాత్రి పూట చూసిన సినిమాల గురించి చర్చించడం, అప్పుడప్పుడు నీ ఆవుల గురించి కొన్ని పనికి రాని నిజాలు నాతో పంచుకోవడం.. వీటిని ఎన్నటికీ మర్చిపోలేను. ఈ మైదానం నాకెప్పటికీ ఓ పవిత్ర భూమిగానే ఉంటుంది. ఇక్కడ నీ ఉనికిని నేను ఆస్వాదిస్తా. క్రికెట్ను అభిమానించే ప్రతి ఒక్కరు హ్యూస్కు నివాళులు అర్పిస్తూనే ఉంటారు. ఫొటోలు, మాటలు, ప్రార్థనలు, చర్చల ద్వారా ప్రపంచం మొత్తం స్ఫూర్తిని చాటింది. కరాచీలో ఓ బాలిక క్యాండిల్తో నివాళి అర్పిస్తే, ఆటకే మాస్టర్లు అయిన సచిన్, వార్న్, లారా ప్రపంచానికి తమ శోకాన్ని చూపించారు. ఈ క్రికెట్ స్ఫూర్తి మా అందర్ని కట్టిపడేసింది. క్రికెట్ బంధం ప్రపంచం మొత్తం తమ బ్యాట్లను బయటపెట్టి నివాళులు అర్పించేలా చేసింది. అందుకే ప్రపంచంలో క్రికెట్ గొప్ప ఆటగా మారిపోయింది. నా తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా. ఆటలో నిన్ను ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాం' -
హ్యూస్కు కన్నీటి వీడ్కోలు
మెల్బోర్న్: అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు ముగిశాయి. మాక్స్విలేలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. దేశవాళీ మ్యాచ్ సందర్భంగా తలకు బౌన్సర్ తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే. హ్యూస్ అంత్యక్రియలకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హాజరయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్తో పాటు ఇతర క్రికెటర్లు, అధికారులు, భారత్ జట్టు తరపున రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వేలాది మంది అభిమానులు, స్నేహితులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో హ్యూస్ మృతికి సంతాపం తెలియజేశారు. (ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి) -
నేడు క్రికెటర్ హ్యూస్ అంత్యక్రియలు