breaking news
M K Narayanan
-
పశ్చిమ బెంగాల్ గవర్నర్ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ల్యాండ్ హెలీకాప్టర్ ఒప్పందం కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను సాక్షిగా విచారించారు. 3600 కోట్ల రూపాయిలకు సంబంధించి ముడుపుల వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. సీబీఐ అధికారులు శుక్రవారం నారాయణన్ విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్గా నారాయణన్ బాధ్యతుల చేపట్టకుముందు జాతీయ భద్రత సలహాదారుగా వ్యవహరించారు. హెలికాప్టర్లను కొనుగోలు చేసేముందు 2005లో జరిగిన సమావేశాల్లో నారాయణన్ పాల్గొన్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఖూ కూడా నారాయణన్తో పాటు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీజీ ఆ సమయంలో వాంఖూ ఉన్నారు. అగస్టా కేసులో వాంఖూను కూడా ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. అగస్టా ఒప్పందంలో 360 కోట్ల రూపాయిలు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో గతేడాది రద్దు చేశారు. భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. -
సౌరవ్ గంగూలీకి గౌరవ డాక్టరేట్!
క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బెంగాల్ ఇంజినీరంగ్ అండ్ సైన్స్ యూనివర్సిటీ(బీఈఎస్ యూ) గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. గంగూలీకి ఓ జ్క్షాపికతోపాటు గౌరవ డాక్టరెట్ ను గవర్నర్ ఎంకే నారాయణన్ అందచేశారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. తనకు లభించిన అవార్డుల్లో ఇదే అత్యుత్తమం అని అన్నారు. తన రాష్ట్రం తరపున లభించిన ప్రతి అవార్డు తనకు ఉత్తమైందనే అని అన్నారు. ప్రతి విద్యార్థి హార్డ్ వర్క చేయాలని.. వారి వారి రంగాల్లో అత్యుత్తమ శిఖరాలను అందుకోవాలని గంగూలీ సలహా ఇచ్చారు.