Live TV
-
కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు
స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో లైవ్టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్లలోని హార్డ్వేర్లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్ నెట్వర్క్తో పనిలేకుండా డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్లలో లైవ్ సిగ్నల్స్ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్ఫోన్లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్లోని ఏ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
Viral Video: లైవ్ టీవీ డిబెట్లో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న నేతలు
టీవీలో ప్రసారమయ్యే లైవ్ డిబెట్ల గురించి తెలిసిందే. రాజకీయాలు, సామాజిక అంశం, ప్రస్తుతం విషయాల మీద కొంతమంది వ్యక్తులు, అనుభవజ్ఞులను తీసుకొచ్చి మాట్లాడిస్తుంటారు. పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా ఈ డిబెట్లో పాల్గొంటుంటారు. చర్చల్లో భాగంగా వారి మధ్య వాదనలు, ఆరోపణలు, విమర్శలు, అప్పుడప్పుడు పరిస్థితులు చేయి దాటి పోవడంతో భౌతిక దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్థాన్లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఛానల్ లైవ్ డిబెట్లో పాల్గొన్న ఇద్దరు నేతలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఏకంగా ఒకరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. వివరాలు.. జావేది చౌదరి హోస్ట్ చేసిన టాక్ షో ‘కల్ తక్)లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీకి న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్ను పార్టీ సెనేటర్ అయిన అఫ్నాన్ ఉల్లా పాల్గొన్నారు. ఇమ్రాన్ ఖాన్పై సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో సహనం కోల్పోయిన షేర్ అఫ్జల్ మార్వత్ తన కుర్చీలో నుంచి లేచి అఫ్నాతుల్లా ఖాన్ను చెంపదెబ్బ కొట్టాడు. ఖాన్ కూడా మార్వత్పై ప్రతిదాడికి దిగాడు. ఇద్దరూ కిందపడిమరీ కొట్టుకున్నారు. పరిస్థితి మరింత దిగజారిపోవడంతో చివరికి వీరిని యాంకర్, సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దాడిలో అఫ్నాన్ ఉల్లా ఖాన్ తలకు గాయమైంది. مرشد کو گالی دو گے تو مرید تو جواب دے گا ہی۔۔ اور جواب بنتا بھی ہے! کوئی تو ان کو انکی زبان میں سمجانے والا ہو! پکڑنا ہے یا چھوڑنا ہے 🤣😎 pic.twitter.com/i52eSgjrGL — SB_Blog (@Bukhari2204) September 28, 2023 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా సేపటి వరకు గొడవ కొనసాగడంతో ఈ దృశ్యాలను లైవ్గా చూశారు. గౌరవ హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా తన్నుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రవర్తించి తమ పరువును దిగజార్చుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. Champion @sherafzalmarwat — Samiya Kanwal (@kanwal_samiya) September 28, 2023 -
రిషి సునాక్ మంచి మనసు.. కళ్లుతిరిగి పడిపోయిన యాంకర్కు సాయం
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ మంచి మనసు చాటుకున్నారు. లైవ్ టీవీ ప్రోగ్రాంలో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయిన యాంకర్కు సాయం చేశారు. రిషి తన ప్రత్యర్థి లిజ్ ట్రస్తో టీవీ డిబేట్లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 'టాల్క్ టీవీ' డిబేట్లో తాను గెలిస్తే చేపట్టే కార్యక్రమాలపై లిజ్ ట్రస్ వివరిస్తున్న సమయంలో ఆ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న యాంకర్.. ఒక్కసారిగా కళ్లుతిరిగిపడిపోయింది. దీంతో ట్రస్ షాక్కు గురయ్యారు. మరోవైపు రిషి మాత్రం యాంకర్ పడిపోతుండగానే హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. A TV host faints during the UK's second leaders' debate between Liz Truss and Rishi Sunak pic.twitter.com/blovJGPiMK — TICKER NEWS (@tickerNEWSco) July 26, 2022 యాంకర్ బాగానే ఉన్నప్పటికీ అనుకోకుండా అలా జరిగిందని, ఆమె ప్రోగ్రాం కొనసాగించవద్దని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు డిబేట్ను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రస్, రిషి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పన్నుల్లో కోత విధిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంపైనే తాను దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు బ్రిటన్లోని పలు సర్వేలు లిజ్ ట్రస్ వైపే కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. రిషిపై ట్రస్ 24 పాయింట్ల శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. చదవండి: కరోనా మూలాల గుట్టు విప్పిన అధ్యయనం.. వైరస్ పుట్టింది అక్కడే.. కానీ ల్యాబ్లో కాదు -
లైవ్లోనే ఎంపీ చెంప పగులగొట్టింది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: ఈ రోజుల్లో టీవీలో రాజకీయ చర్చల సందర్భంగా గొడవలు జరగడం సాధారణమైపోయింది. అయితే ఆ గొడవలు ఒక్కోసారి శృతిమించి కొట్టుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితురాలు, పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్కు స్పెషల్ అసిస్టెంట్గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ లైవ్టీవీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పీపీపీ(పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ) ఎంపీ ఖాదీర్ మండోఖేల్ చెంపను పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే ఫిర్దౌస్ ఆశిక్, ఖాదీర్ మండోఖేల్లు పాకిస్తాన్లో జరుగుతున్న అవినీతిపై వాదోపవాదాలు చేసుకున్నారు. ''దమ్ముంటే మేం చేసిన అవినీతిని రుజువు చేయాలని'' ఫిర్దౌస్ ఖాదీర్కు సవాల్ విసిరారు. అయితే ఆమె మాటలు పట్టించుకోని ఖాదీర్ ఇది అవినీతి ప్రభుత్వమని పదేపదే ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఫిర్దౌస్ కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ ఖాదీర్ చొక్కా పట్టుకొని మేం ఏం తప్పుచేయలేదంటూ అతని చెంప పగులగొట్టారు. ఈ సన్నివేశం అక్కడి కెమెరాల్లో రికార్డవడంతో లైవ్ ప్రోగ్రాంను నిలిపివేశారు. అయితే విరామ సమయంలో ఫిర్దౌస్పై ఖాదీర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆమె తండ్రి గురించి తప్పుగా మాట్లాడారని అక్కడ ఉన్న వాళ్లలో కొంతమంది పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్దౌస్ ఇంతవరకు స్పందించలేదు. చదవండి: 28 మంది భార్యల ముందు 37వ సారి పెళ్లి In which special assistant to CM Punjab Firdous Ashiq Awan slaps member national assembly Qadir Mandokhel. Behind the scenes of news talkshow. pic.twitter.com/qqzURJAdlm — Naila Inayat (@nailainayat) June 9, 2021 -
టీవీ చర్చ: అనూహ్య పరిణామం..
-
టీవీ చర్చ: అనూహ్య పరిణామం.. యాంకర్పై నీళ్లు!
న్యూఢిల్లీ : ఓ టీవీ చానెల్లో సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు సహనం కోల్పోయారు. బీజేపీ నేత తనను ఉద్దేశించి ‘దేశద్రోహి’ అనడంతో కోపంతో ఊగిపోయిన ఆయన.. ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్ను ప్రత్యర్థిపైకి విసిరేశారు. దీంతో బీజేపీ నేతతోపాటు మధ్యలో ఉన్న టీవీ యాంకర్ మీద కూడా నీళ్లు పడ్డాయి. లైవ్ టీవీ చర్చలో భాగంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో భారత ఆర్మీని రాజకీయం చేయడంపై ఓ ప్రైవేటు చానెల్ లైవ్ చర్చ నిర్వహించింది. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలోక్ శర్మ, బీజేపీ నుంచి కేకే శర్మతోపాటు పలు పార్టీల నేతలు, విశ్లేషకులు పాల్గొన్నారు. చర్చ జరుగుతుండగా అలోక్ శర్మను ఉద్దేశించి బీజేపీ నేత కేకే శర్మ ‘దేశద్రోహి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన అలోక్ శర్మ ఆవేశంతో ఊగిపోయారు. నోటికొచ్చిన మాటలంటూ ప్రత్యర్థిపైకి ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్ను విసిరేశారు. దీంతో బీజేపీ నేతతోపాటు యాంకర్పైనా నీళ్లు పడ్డాయి. ఈ పరిణామంతో యాంకర్తోపాటు మిగతా ప్యానెలిస్టులు బిత్తరపోయారు. రౌడీల్లా ప్రవర్తించిన ఇద్దరు నేతలను చర్చను బహిష్కరించి యాంకర్ మిగతా చర్చను కొనసాగించారు. అయితే, యాంకర్ మీద నీళ్లు పడటంతో ఆయన తన దుస్తులను మార్చుకొని చర్చను కొనసాగించాల్సి వచ్చింది. -
లైవ్ రిపోర్టింగ్ లో మహిళా జర్నలిస్ట్ పై దాడి!
వాషింగ్టన్: అమెరికాలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగింది. ఫిలడెల్ఫియాలోని ఓ ప్రైవేట్ చానల్ మహిళా రిపోర్టర్ పై దాడి చేసిన మహిళపై అందరూ మండిపడుతున్నారు. రెండు రోజుల కిందట సిటీ హాల్ లో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని టెలిముండో ఆఫీస్ వారు తెలిపారు. ఐరిస్ డెల్గాడో గత కొన్నేళ్లుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తోంది. సిటీ హాల్ లో డెల్గాడో టీవీ లైవ్ షోలో భాగంగా రిపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో వాహిదా విల్సన్ అనే మహిళా అక్కడికి వచ్చి డెల్గాడోపై దాడి చేయడం ప్రారంభించింది. మహిళా జర్నలిస్ట్ తల, ముఖం భాగాలపై విల్సన్ అకస్మాత్తుగా దాడి చేసింది. చేతిని అడ్డు పెట్టుకుని ఏం జరిగింది, ఎందుకిలా చేస్తున్నావంటూ బాధితురాలు అడుగుతున్నా పట్టించుకోలేదు. విల్సన్ దాడి చేయడం ప్రారంభించగానే టీవీ చానల్ లో లైవ్ రికార్డింగ్ ఆపేశారు. యాంకర్ రామన్ జయాస్ ఈ విషయాన్ని గమనించి ఓ మై గాడ్ ఇలా జరిగిందేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వహీదా విల్సన్ ను అరెస్ట్ చేసినట్లు ఫిలడెల్ఫియా జిల్లా ఉన్నతాధికారి వెల్లడించారు. వీడియో సాక్షాల ఆధారంగా మహిళను అరెస్ట్ చేశామని, ఆన్ లైన్ కోర్టు డాక్యుమెంట్లలో విల్సన్ వల్ల ఇతరులకు ప్రాణహాని ఉందని పేర్కొన్నట్లు చెప్పారు. మహిళా జర్నలిస్ట్ డెల్గాడో చికిత్స తీసుకుంది. ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని టీవీ చానల్ వారు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. -
ప్రత్యక్ష ప్రసారంలో బ్రెయిన్ సర్జరీ!
రోజులు ఎంతగానో మారిపోయాయి. ఒకప్పుడు లైవ్ ప్రొగ్రామ్లంటే ఏ సంగీత కచేరిలో, ఆడియో ఫంక్షన్లో, వేడుకలు, ఉత్సవాలో చూపించేవారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఒక స్టంట్ గా మారిపోయాయి. ఒక వ్యక్తి తనను అనకొండ సర్పం మింగుతుండగా ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ప్రకటించాడు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఓ టీవీ చానెల్ వినూత్న లైవ్ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వైద్యులు ఒక వ్యక్తి మెదడుకు శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా లైవ్ లో ప్రసారం చేసింది. దీనిపై కొందరు ఆశ్చర్యం, కొందరు విస్మయం వ్యక్తం చేశారు. 'బెయిన్ సర్జరీ లైవ్' పేరిట గత ఆదివారం నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. క్లీవ్ల్యాండ్ లోని కేస్ మెడికల్ సెంటర్ యూనివర్సిటీ ఆస్పత్రిలో 49 ఏళ్ల గ్రెగ్ గ్రిండ్లే అనే వ్యక్తి మెదడుకు వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ కార్యక్రమంతా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రత్యక్ష ప్రసారం వైద్యులు మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివిధ ప్రొసీజర్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాము ఇందుకు సిద్ధపడ్డామని తెలిపారు. కార్యక్రమం ప్రసారానికి ముందు వ్యాఖ్యాత బ్రియంట్ గంబెల్ మాట్లాడుతూ తాము లైవ్ లో చూపిస్తున్నది సంగీత కచేరి కాదని, ఈ కార్యక్రమం గురించి వీక్షకుల అంచనాలు తమకు తెలుసని పేర్కొన్నారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న గ్రిండ్లేకు శస్త్రచికిత్స విజయం లేదా వైఫల్యం వల్ల జీవన్మరణ ప్రభావం ఉండకపోయినా.. ఇది విజయవంతమైతే చాలా ఏళ్లపాటు అతని జీవితంపై ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యక్ష ప్రసారం మెదడు గురించి పండుగ జరుపుకోవడం లాంటిదని పేర్కొన్నారు. -
లైవ్లో చూడటం తగ్గిపోతోంది...!
ధోరణి నేటి యువత గురించి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) వారి ఆందోళన ఇది. ప్రస్తుత తరంలో లైవ్ టీవీ చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని బీబీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం తమ ఛానల్ప్రసారాల విషయంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా యువతలో లైవ్ ప్రసారాల మీద ఆసక్తి తగ్గిపోతోందని బీబీసీ విశ్లేషిస్తోంది. ఎక్కువ ఆసక్తిని రేకెత్తించే ఫుట్బాల్ మ్యాచ్లు, ఇష్టమైన క్రీడా ప్రసారాలను తప్పిస్తే... ఫలానా ప్రోగ్రామ్లను తప్పనిసరిగా లైవ్లో చూడాలనే కోరిక వ్యక్తం చేసేవాళ్లు తగ్గిపోతున్నారని తమ అధ్యయనంలో తేలిందని బీబీసీ వాళ్లు ప్రకటించారు. ఎందుకలా.. అంటే ఎవరి పనిలో వారు బిజీగా ఉండటం ఒక కారణం అయితే.. లైవ్లో చూడలేకపోయిన కార్యక్రమాన్ని మళ్లీ చూడటానికి అనేక అవకాశాలు ఉండటం మరో కారణం అని బీబీసీ అధ్యయనకర్తలు విశ్లేషించారు. ఇంటర్నెట్ పుణ్యమా అన్ని టీవీ ఛానళ్లూ, మీడియా సంస్థలు వెబ్తో అనుసంధానం అయ్యాయి. తమ కార్యక్రమాలను వీడి యోల రూపంలో స్టోర్ చేసి ఉంచుతున్నాయి. అలాంటి కార్యక్రమాలను వీక్షించడానికి అధునాతన గాడ్జెట్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో దేన్ని ఎప్పుడైనా చూసుకోవచ్చనే భావన ఏర్పడింది. ప్రత్యేకించి 16 నుంచి 24 యేళ్ల మధ్య వారు దాదాపుగా ఈ అభిప్రాయానికి వచ్చేశారట! దీంతో ఇంతకుముందులా లైవ్ కవరేజిపై గొప్ప ఆసక్తి ఏమీ లేదని అధ్యయనకర్తలు అంటున్నారు. అయితే మధ్యవయసు వారిలో మాత్రం ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తి యథావిధిగా కొనసాగుతోందని బీబీసీ పేర్కొనడం గమనార్హం. ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తిని తగ్గించుకొన్న కుర్రతరం ఆ సమయాన్ని ఫోన్ను ఆపరేట్చేయడానికో, నిద్రకో కేటాయిస్తోందని కూడా అధ్యయనకర్తలు వివరించారు. ఏదైనా సంచలన విషయం సంభవించినా... ఆ విషయం గురించి తెలిస్తే... అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్లో చూడటానికి అవకాశం ఉండటం, యూట్యూబ్లో వీడియోల రూపంలో వీక్షించడానికి అవకాశం ఉండటంతో... ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తి తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించడానికి కూడా వీలు లేదని అధ్యయనకర్తలు అభిప్రాయపడటం విశేషం. -
'లైవ్ టీవీ 'యాక్షన్ షురూ!
దేశంలో మొదలైన మొబైల్ టీవీ విప్లవం డీటీహెచ్ సంస్థల ప్రవేశంతో పోటాపోటీ ఒక్క ఏడాదిలోనే 89% వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్లు వాటి సాయంతో భారీగా విస్తరిస్తున్న మొబైల్ టీవీ మార్కెట్ హైదరాబాద్: ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సుకుమార్... తీరా ఆ రోజు వచ్చేసరికి మాత్రం టీవీ చూడలేకపోయాడు. అర్జెంటు పనిమీద ఊరికి బయల్దేరాడు. మనసంతా ఫలితాలపైనే ఉండటంతో... ప్రతి 10 నిమిషాలకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. బస్సులో పక్కవాళ్లు విసుక్కున్నారు కూడా. కాకపోతే... ఇదంతా ఐదేళ్ల కిందటి మాట. ఇప్పుడు సుకుమార్కే కాదు... చేతిలో స్మార్ట్ఫోన్ ఉన్నవాళ్లెవ్వరికీ ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు. కావలసిన చానెల్ మార్చుకోవచ్చు. చేతిలో ఫోన్ పట్టుకుని దాన్లో టీవీ చూసేయొచ్చని పదేళ్ల కిందట కొందరు ఊహించినా... అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకుని ఉండరు. ఇప్పటికే ఆలస్యమైందని కొందరు భావిస్తున్నా... స్మార్ట్ఫోన్లలో లైవ్టీవీ విప్లవం ఇండియాలో రానేవచ్చింది. అతివేగంగా పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వినియోగం ఈ విప్లవాన్ని మరింత ఎగదోస్తోంది. ఈ ఏడాదిలో చేసిన స్మార్ట్ఫోన్ ఇన్సిడెన్స్, నీల్సన్ ఇన్ఫర్మేట్ మొబైల్ ఇన్సైట్ల అధ్యయనాన్ని కలిపి చూస్తే... ఒక్క పట్టణ భారతంలోనే దాదాపు 5.1 కోట్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 89 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. ఎందుకంటే 2012 నాటికి ఉన్న స్మార్ట్ఫోన్ వినియోగదారులు 2.7 కోట్ల మందే. టాటా స్కై సంస్థ చెబుతున్నదాని ప్రకారం దాని కస్టమర్లలో 60% మంది వీడియోలను మొబైల్లో చూస్తున్నవారే. దీనికితోడు డేటా, వైఫై సేవలు విస్తరించటం, ఎలాంటి మల్టీమీడియా కంటెంట్నైనా హ్యాండిల్ చేసే శక్తిమంతమైన మొబైల్స్ మార్కెట్లోకి రావటంతో వీటికి ఆకాశమే హద్దవుతోంది. రంగంలోకి దిగ్గజాలు... మొబైల్లోకి లైవ్టీవీ రావ టానికి ప్రధాన కారణం ప్రధాన డీటీహెచ్ సంస్థలన్నీ ఈ రంగంలోకి ప్రవేశించటమేనని స్పష్టంగా చెప్పొచ్చు. డిష్ టీవీ ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో లైవ్టీవీ చూసేందుకు వీలైన ‘డిష్ ఆన్లైన్’ అప్లికేషన్ను విడుదల చేసింది. బోలెడన్ని కేటగిరీలు, చానెళ్లున్న ఈ అప్లికేషన్ను రూ.49కే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ స్ట్రీమింగ్ను ‘డిట్టో టీవీ’ అందిస్తోంది. అయితే డిష్ పోటీదారు టాటా స్కై మరో అడుగు ముందుకేసి ‘ఎవ్రీవేర్ టీవీ’ పేరిట కొత్త అప్లికేషన్ను మార్కెట్లోకి తెచ్చింది. టీవీ చూడటానికే కాక... దాన్ని రికార్డ్ చేసుకోవడానికీ వీలు కల్పించటం దీని ప్రత్యేకత. వీడియో ఆన్ డిమాండ్తో పాటు వారం కిందటి టీవీ షోలు కూడా చూపించే ఈ యాప్కు టాటా స్కై నెలకు రూ. 60 వసూలు చేస్తోంది. ఇక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ.. వినియోగదారులు లైవ్టీవీ చూస్తూనే ట్వీట్ చేసుకోవటం, ఇతరులతో మాట్లాడటం వంటి అవకాశాల్ని కల్పిస్తోంది. ఈ ట్వీట్లు ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ప్రసారమవుతాయి కూడా. ఇక డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు ఇండిపెండెంట్ యాప్ డెవలపర్లూ ఈ రంగంపై సీరియస్గా దృష్టిపెట్టారు. టీవీ షోలు చూస్తూ వాటి గురించి, ఇతరత్రా మాట్లాడుకునేవారు ఎక్కువవుతుండటంతో ఆ రకంగా సోషల్ నెట్వర్కింగ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే వీటికి చిన్నచిన్న పరిమితులూ ఉంటున్నాయి. టాటా స్కై యాప్కు ఐఫోన్ వెర్షన్ తప్ప ఆండ్రాయిడ్ వెర్షన్ ఇంకా రాలేదు. హెచ్డీఎంఐ కంటెంట్ను మొబైల్ ద్వారా మెయిన్ టీవీలో నేరుగా ప్రసారం చేసే అవకాశం లేదు. ఇన్ని పరిమితులున్నా... కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ మధ్య లైవ్టీవీ విస్ఫోటనం స్థాయికి వెళ్లటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఫ్రీగా చూడొచ్చు కూడా... మొబైల్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ... ఇలా ఎక్కడైనా యప్టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే న్యూస్ చానెళ్ల వరకూ ఉచితంగానే వస్తున్నాయి. చాలా చానెళ్లు వాటి లైవ్ టీవీలను ఫ్రీగానే ఇస్తున్నాయి. వీటికి ఇంటర్నెట్ చార్జీలు తప్ప... టీవీకంటూ ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ జి టివి, ఇండియా లైవ్టీవీ వంటి యాప్స్ కూడా చాలానే ఉన్నాయి. -
5pm Express News 19th July 2013
-
షిర్డీలో ప్రమాదం.. నరసరావుపేట వాసుల మృతి
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 9th july 2013
-
Sakshi WorldToday 9th July 2013
-
AP 23 Evening News 7th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 8th July 2013
-
ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్తా కృషిచేయాలి : ఎంపీ మేకపాటి
-
రిలయన్స్ ఇండస్ట్రీస్కు కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది : నారాయణ
-
ఎంపీ పాల్వాయి గోవర్థన్రెడ్డి మీడియా సమావేశం
-
కేంద్ర హోం మంత్రి షిండేతో దిగ్విజయ్ సింగ్ భేటీ
-
Sakshi Cinema 5th July 2013
-
Sakshi Cinema 2nd July 2013 - Sakshi TV
-
ప్రాపర్టీ ప్లస్ 2nd july 2013
-
క్రైం రిపోర్టర్ 1st july 2013
-
సాక్షి భవిత 30th June 2013
-
AP23 సాక్షి న్యూస్ 30th June 2013
-
సాక్షి న్యూస్ వీక్ 30th June 2013
-
సాక్షి వరల్డ్ టుడే 30th June 2013
-
భూమన కరుణాకర్ రెడ్డితో సాక్షి న్యూస్ మేకర్
-
కాఫీ విత్ సాక్షి 30th June 2013
-
Sakshi Sports 28th June 2013