-
మంత్రి గంటాకు చేదు అనుభవం..!
సాక్షి, విశాఖపట్నం : జన్మభూమి అంటూ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న టీడీపీ నేతలకు నిరసనలు తప్పడం లేదు. సీఎం నుంచి మంత్రులు దాకా, మంత్రులు నుంచి ఎమ్మెల్యేలు వరకూ ప్రజాగ్రహజ్వాలకు గురవుతున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పొగరి సీఎం చంద్రబాబు సభలో మహిళలు వ్యతిరేక నినాదాలతో మార్మోగించగా.. ఇప్పుడు విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. మధురవాడ సాయిరాం కాలనీలోని జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆయనకు స్థానిక సమస్యలపై నిరసన జ్వాల ఎగసిపడింది. స్థానిక సమస్యలపై ప్రశ్నలవర్షం కురవడంతో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ మంత్రి గంటాను స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్కు అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంచేశారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారులు - కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 15వ వార్డులో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదంటూ అధికారులను నిలదీశారు. కాలనీలో నీరు, రోడ్లు, డ్రైనేజీ లేక అల్లాడుతుంటే పరిష్కారం చూపని జన్మభూమి తమకొద్దూ అంటూ, ఇక్కడినుంచి వెళ్లిపోండని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు - అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులో జరిగిన జన్మభూమి కార్యాక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తిత్లీ తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు అధికారుల్ని, అధికార పార్టీ నేతల్ని నిలదీశారు. దీంతో అధికార పార్టీ నేతలు నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. తుపాను కారణంగా తీవ్రం నష్టపోయి రోడ్డున పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని పైగా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. -
జన్మభూమి సభల్లో టీడీపీ ప్రచారం
హిందూపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జన్మభూమి-మాఊరు సభల్లో అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదివారం పట్టణంలోని 25, 26, 27 వార్డుల్లో సభలు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగరోజు అందరూ సంతోషంగా ఉండాలని రేషన్కార్డుదారులకు చంద్రన్న కానుకలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిíస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం కొత్త రేషన్కార్డులు, చంద్రన్నకానుకల బ్యాగులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. వార్డుల్లోని సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయసాగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement