India great success
-
టార్పిడోల తయారీ కోసం వీఈఎం, టీకేఎంఎస్ ఒప్పందం
హైదరాబాద్: భారత్లో సంయుక్తంగా టార్పిడోలను ఉత్పత్తి చేయడానికి వీఈఎం టెక్నాలజీస్, టీకేఎంఎస్ సహకార ఒప్పందం (టీమింగ్ అగ్రిమెంట్)పై సంతకాలు చేశాయి. టార్పిడో అంటే జలాంతర్గాములు, యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే సముద్ర యుద్ధ ఆయుధం. టార్పిడోకు సంబంధించిన సాంకేతికత బదిలీ, “మేక్ ఇన్ ఇండియా”కు ఊతం ఇచ్చేలా హెవీవెయిట్ టార్పిడోను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఈ సహకార ఒప్పందం చేసుకున్నారు. భారత మార్కెట్కు ఆధునిక హెవీవెయిట్ టార్పిడోలు సరఫరా కావడానికి ఈ ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక స్వావలంబనకు ఊతం ఇవ్వడం, స్థానిక రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో టీకేఎంఎస్ సంస్థ సహకార ఒప్పందం (టీమింగ్ ఒప్పందం)పై సంతకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ప్రముఖ రక్షణ సంస్థ ఆయుధ వ్యవస్థలు, గగనతల వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. అట్లాస్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మైఖేల్ ఓజెగోవ్స్కీ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ టార్పిడో సాంకేతికత బదిలీ ద్వారా భారత నౌకాదళం మరింత శక్తిమంతం అవుతుందని తెలిపారు. వీఈఎం టెక్నాలజీస్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు.మొదటి దశలో ఈ సహకార ఒప్పందం ద్వారా.. హెవీవెయిట్ టార్పిడో తయారవుతుంది. భవిష్యత్లో అభివృద్ధి చేసే టార్పిడో ప్రోగ్రామ్స్లో టీకేఎంఎస్, వీఈఎం మధ్య మరింత సహకారం కూడా సాధ్యమని భావిస్తున్నారు.వీఈఎం, టీకేఎంఎస్ మధ్య సంయుక్త సంస్థను కూడా స్థాపిస్తారు. ఈ సంస్థ ద్వారా భారత మార్కెట్కు దీర్ఘకాలంగా ఉన్నత ప్రమాణాల హెవీవెయిట్ టార్పిడోల సరఫరా జరుగుతుంది. అదే సమయంలో ఎగుమతి అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. టీకేఎంఎస్ విభాగమైన అట్లాస్ ఎలక్ట్రానిక్ వీఈఎంకు అవసరమైన సాంకేతికత బదిలీ చేస్తుంది. సాఫ్ట్వేర్ అనుమతి పత్రాలు కూడా అందిస్తుంది. దీనివల్ల భారత తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం అవుతుంది.టీకేఎంఎస్ ప్రపంచంలోని ప్రముఖ నౌకాదళ సంస్థల్లో ఒకటి. కీల్, విస్మార్, ఇటజాయి వంటి ప్రాంతాల్లో మూడు నౌకాశ్రయ కర్మాగారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,100 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జలాంతర్గామి నౌకలు, సముద్ర ఉపరితల యుద్ధ నౌకలు, సముద్ర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, భద్రతా సాంకేతికత రంగాల్లో వ్యవస్థ సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కీల్ కేంద్రంలో సుమారు 3,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భేష్
వాషింగ్టన్: బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో భారత్ గతేడాది గణనీయమైన పురోగతి సాధించిందని అమెరికా అధికార నివేదిక ఒకటి వెల్లడించింది. 2017లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పురోగతి సాధించిన 14 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అమెరికా కార్మిక శాఖ శనివారం విడుదల చేసిన ‘చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ లేబర్’వార్షిక నివేదికలో ఈ వివరాలున్నాయి. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు ప్రపంచంలోని 132 దేశాలు తీసుకుంటున్న చర్యలను కచ్చితంగా అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మరింత కఠిన ప్రమాణాలను వాడినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం కొలంబియా, పరాగ్వే, భారత్సహా 14 దేశాలే ఈ ప్రమాణాలను అందుకున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం బాల కార్మిక చట్టంలో చేసిన సవరణలతోపాటు చట్టాన్ని సరిగ్గా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని పేర్కొంది. -
కుర్రాళ్లు లెక్క సరిచేశారు
ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత్ ఘన విజయం ముంబై: బ్యాట్స్మెన్తోపాటు బౌలర్లు కూడా రాణించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత అండర్–19 జట్టు 129 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలి వన్డేలో 23 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ రెండో మ్యాచ్లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్ను 1–1తో సమం చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్ హిమాన్షు రాణా (66 బంతుల్లో 58; 10 ఫోర్లు), హార్విక్ దేశాయ్ (62 బంతుల్లో 75; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కమలేశ్ నాగర్కోటి (32 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు), శుభ్మన్ గిల్ (24), అభిషేక్ శర్మ (24) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ నాలుగు, హెన్రీ బ్రూక్స్ మూడు వికెట్లు తీశారు. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. రాలిన్స్ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడినా... మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత్ తరఫున స్పిన్నర్ అనుకూల్ రాయ్ మూడు వికెట్లు పడగొట్టగా... శివమ్, ఇషాన్ పోరెల్లకు రెండేసి వికెట్లు లభించాయి. సిరీస్లోని మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.


