breaking news
Horticultural University VC
-
women's day 2025 అవగాహన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు!
‘అన్నం ముద్దను మన నోటికి చేర్చే రైతు కష్టానికిఅవగాహన, సాంకేతికత, ఆర్థిక వెన్నుదన్ను అందిస్తేవ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు’ అంటున్నారు డాక్టర్ నీరజా ప్రభాకర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్శిటీకి ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్గా చేసి, అగ్రికల్చర్యూనివర్శిటీలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి హెడ్గా, సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. 42 ఏళ్లుగా ఈ రంగంలో చేస్తున్న కృషిని, చోటు చేసుకుంటున్న మార్పులను, నేటి తరం ఆలోచనలనూ మన ముందు ఆవిష్కరించారు. ‘‘రైతు నేలలో విత్తనాలు వేసిన రోజు నుంచి నీటి సదు΄ాయాలు, భూసారం, వాతావరణం, తెగుళ్లు.. అన్నింటినీ దాటుకొని రైతు కష్టం మన చేతికి వచ్చేవరకు ఏయే దశలు దాటుతుంది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం. ఉల్లిపా యలు వేసిన మార్గం..మాది వ్యవసాయం కటుంబం. చదువుకునే రోజుల నుంచి ఉల్లిపాయలపై మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ఎప్పుడూ విస్మయానికి లోను చేస్తుండేవి. ఆ ఆలోచనతోనే 1983లో ఎమ్మెస్సీ హార్టీ్టకల్చర్, అటు తర్వాత ‘ఉల్లిపాయలు– నీటి యాజమాన్యం’ మీద పీహెచ్డీ చేశాను. 1994 లో సంగారెడ్డి ఎఆర్వో నర్సరీ ఇంచార్జ్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మూడేళ్లకు ఉల్లి ధరలుæపెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఉల్లి సాగులో ఎక్కువ దిగుబడి సాధించడానికి శిక్షణాతరగతులు నిర్వహించాం. అక్కణ్ణుంచి మామిడి, జామ, స΄ోట, సీతాఫలం అంటు మొక్కలతోపాటు జామ, పనస వంటి పండ్లు, మల్లె మొక్కల... అమ్మకాలు కూడా ప్రాంరంభించాం.ప్రాంతానికి తగిన విధంగాఏ ప్రాంతానికైనా అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండే పంటలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి అన్ని సీజన్లలో ఎలా పండించవచ్చో సాధించి చూ΄ాం. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ (అఖిల భారత సమన్వయ సంస్థ కూరగాయల పరిశోధన)లో ఆరేళ్లు పని చేశాను. రైతుల దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎంచుకున్న సాగు పద్ధతులు స్వయంగా తెలుసుకొని, మార్పులూ చేశాం. బీర, దోస, సొరకాయ, గుమ్మడి.. మొదలైన వాటిలో క్రాసింగ్,, హైబ్రీడ్స్ మీద వర్క్ చేశాను.పారిశ్రామిక రంగానికి జత చేయాలిఆ తర్వాత 15 ఏళ్లు అధ్యాపకురాలిగా ఉన్నాను. సీనియర్ ప్రొఫెసర్గా ప్రమోషన్ ఆ తర్వాత 20 రోజుల్లోనే కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ కి ఫస్ట్ రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ పోస్టింగ్ వచ్చింది. దేశంలోనే హార్టికల్చర్ యూనివర్శిటీస్లో ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్గానూ గుర్తింపు లభించింది. మొదటిసారి విద్యార్థులనుపారిశ్రామిక రంగానికి అటాచ్ చేస్తూ స్కిల్స్ నేర్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేశాం. కమర్షియల్ హార్టికల్చర్, నర్సరీ, ఫ్లోరికల్చర్, మష్రూమ్స్పై పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో తయారుచేసే నిల్వ పదార్థాలు, సుగంధ తైలాల తయారీలోనూ ట్రైనింగ్ ఇచ్చాం. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్స్, మామిడిపై పరిశోధన, ప్రదర్శనలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులను ప్రోత్సహించాం. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో మన రైతులకు, స్టూడెంట్స్కు మధ్య చర్చలు జరిపాం.నవతరం దృష్టి మారాలి..ఐదారేళ్ల నుండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అయితే, అమ్మాయిలు ఫీల్డ్కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అవగాహన కలిగినవారు వెనుకంజ వేస్తే వ్యవసాయ రంగం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ రంగంలోకి వచ్చేవారు పొలాలకు వెళ్లడానికి ఉదయం, సాయంత్రం సమయాలను ఎంచుకోవడం వంటి స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యం. రైతులు ఏ విధంగా కష్టపడతారో ఈ రంగంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నవారు కూడా అంత కష్టపడాల్సి ఉంటుంది. చేసే పనిలో అంకితభావం ఉంటే మంచి ఫలితాలను ΄÷ందగలం’’అని వివరించారు.- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కోర్సు చెయ్యి.. పంట వెయ్యి
సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఏ పంటలు వేయాలని ఆలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో వీళ్లను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. రైతులు, యువ రైతులకు కొత్త పంటలపై అవగాహన పెంచేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని రెండు పరిశోధన స్థానాల్లో 3 సర్టిఫికెట్ కోర్సులను మొదలుపెట్టబోతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పరిశోధన స్థానంలో కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకం గురించి.. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలోని పరిశోధన స్థానంలో ఆయిల్ పామ్ పెంపకం, నిర్వహణ గురించి సర్టిఫికెట్ కోర్సుకు శిక్షణ ఇవ్వనుంది. ఆయిల్ పామ్ శిక్షణ ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు.. కూరగాయలు, పూల మొక్కల పెంపకం కోర్సులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్నాయి. ఒక్కో కోర్సు 10 రోజులు.. ఫీజు రూ. 5 వేలు కోర్సుకు సంబంధించిన ప్రతి బ్యాచ్లో 20 మందికి థియరీ, ప్రాక్టికల్స్ను వివరించను న్నారు. వీటికి స్టడీ మెటిరీయల్నూ అందించనున్నారు. ఒక్కో కోర్సు 10 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కోర్సుకు రూ. 5 వేల ఫీజు వసూలు చేయనున్నారు. కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు www.rktrhu. ac.in వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రూ. 5 వేల డీడీతో పాటు దరఖాస్తును ‘ది డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వన విశ్వవి ద్యాలయం, ములుగు, జిల్లా సిద్దిపేట’కు పంపాలి. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లను అందిస్తారు. తొలి విడతలో మూడు కోర్సు లు, త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభిం చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యువ రైతులు సద్వినియోగం చేసుకోవాలి పంటల సాగుపై సర్టిఫికెట్ కోర్సులను వర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి ప్రారంభిస్తున్నాం. చాలా మంది నెట్లో చూసి నేర్చుకుంటున్నా.. వాళ్లకు కావాల్సింది తెలియదు. ఈ కోర్సు శిక్షణలో వారికి కావాల్సింది నేర్పిస్తారు. ఉద్యాన శాఖ అమలు చేసే ప్రభుత్వ పథకాలను ఆ శాఖ వారు వచ్చి ఓ రోజు వివరిస్తారు. 10 రోజులు శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందిస్తాం. దరఖాస్తులకు చివరి తేదీ లేదు. ఒక్కో బ్యాచ్ 20 మందితో నిర్వహిస్తాం. – భగవాన్, వర్సిటీ రిజిస్ట్రార్ -
ప్రత్యామ్నాయ పంటలపై సర్టిఫికెట్ కోర్సులు
సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో రైతులకు సాయపడేందుకు వ్యవసాయ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైతులకు కొత్త రకాల పంటలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా వివిధ పంటల విధానంపై ముఖ్యంగా యువ రైతులకు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 పరిశోధన స్థానాలు, రెండు పాలిటెక్నిక్లు, రెండు బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞాన కేంద్రం కొనసాగుతున్నాయి. తొలుత రెండు పరిశోధనా స్థానాల్లో మూడు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకంపై రెండు కోర్సులను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పరిశోధన స్థానంలో, అయిల్ పామ్ పెంపకం, నిర్వహణపై ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని పరిశోధన స్థానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి బ్యాచ్లో 20 మందికి శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే స్టడీ మెటీరియల్ సైతం అందించనున్నారు. ఒక్కో కోర్సులో 20 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులకు నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించనున్నారు. జనవరి మొదటివారంలో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ తెలిపారు. -
ఉద్యానంలో ఉజ్వల భవిత!
వ్యవసాయం.. మానవ నవ జీవనానికి ఆరోప్రాణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని! లక్షలు ఆర్జించే కొలువులను కాదని కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలం బాట పడుతుంటే, మరికొందరు ఉన్నతోద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. వ్యవసాయం అంటేనే ఒకప్పుడు నిర్లక్ష్యపు చూపు చూసిన యువత నేడు ‘పంటల’ కోర్సులపై మక్కువ పెంచుకుంటోంది.. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధరంగమైన ఉద్యానశాఖలో ఉద్యోగావకాశాలు, కోర్సులు, భవిష్యత్ అవకాశాలు తదితర అంశాలపై డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి.ఎం.సి.రెడ్డితో ‘భవిత’ ఇంటర్వ్యూ.. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు లక్ష్యాలేమిటి? వాటి సాధనలో ఎంతవరకు విజయవంతమయ్యారు? ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వర్షాభావ పరిిస్థితులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, సహజవనరుల (నీరు) తగ్గుదల, భూసార నిస్సారం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉద్యాన పంటలపై చేపట్టాల్సిన పరిశోధనలు, ఉద్యాన పంటల ప్రాముఖ్యత ,అభివృద్ధి అవకాశాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 2007, జూన్ 26న ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఇలాంటి విశ్వవిద్యాలయం భారత దేశంలో రెండోది కావడం విశేషం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన అనుబంధ కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు 2008, ఏప్రిల్ 1 నుంచి ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి. అదే ఏడాది మే 10 నుంచి వర్సిటీ స్వయంప్రతిపత్తి హోదాతో పనిచేస్తోంది. ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా 2011, ఆగస్టు 1న మార్చారు. విద్య, పరిశోధన, విస్తరణ ముఖ్య ఉద్దేశాలుగా విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. ఇప్పుడదే లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకేస్తున్నాం. ప్రస్తుతం విశ్వవిద్యాయలం అందిస్తున్న కోర్సులేవి? ప్రస్తుతం హార్టికల్చరల్ పాలిటెక్నిక్, బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్, పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాం. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి అర్హతలేంటి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు అర్హులు. ఇంటర్మీడియెట్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అనర్హులు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. ఏడేళ్ల విద్యా కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల (నాన్ మునిసిపల్ పరిధి) పాఠశాలలో చదివుండాలి. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణులైన వారు కూడా కోర్సులో ప్రవేశాలకు అర్హులే. ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన గ్రేడ్ను బట్టి కోర్సుకు ఎంపిక చేస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల వ్యవధి ఎంత? దీని స్వరూపం ఎలా ఉంటుంది? కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 23 సబ్జెక్ట్లను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిలో మొదటి ఏడాది 12, రెండో ఏట11 చొప్పున పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. వీటితో పాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లూ ఉన్నాయి, వీటిలో ఉద్యాన పంటల సాగు, చీడపీడల నివారణ, నీటి పరివాహక ప్రాంత యాజమాన్యం, సాగుకు అనుకూలమైన నేలల గురించి పాఠ్యాంశాలుంటాయి. పాలిటెక్నిక్ హార్టికల్చర్ కోర్సులు పూర్తి చేసినవారికి ఎలాంటి అవకాశాలున్నాయి? ప్రభుత్వ ఉద్యానశాఖలో విస్తరణ అధికారి (హెచ్ఈఓ) ఉద్యోగానికి డిప్లొమా చేసినవారే అర్హులు. అలాగే ప్రైవే టు సంస్థల్లోనూ, నర్సరీలలోనూ అవకాశాలుంటాయి. ప్రాంగణ నియామకాలు కూడా నిర్వహిస్తున్నారు. బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును అందించే కళాశాలలు, సీట్ల సంఖ్య, ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అనంతరాజుపేట (కడప), మోజర్ల (మహబూబ్నగర్), రాజేంద్రనగర్ (రంగారెడ్డి), వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి)లలో కళాశాలలు ఉన్నాయి. సీట్ల సంఖ్య 230. ఇంటర్మీడియెట్ బైపీసీ చదివి, ఎంసెట్లో సాధించిన ర్యాంకు ప్రాతిపదికన బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసిన వారికి ఎలాంటి అవకాశాలున్నాయి? బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ ఉద్యానశాఖ అధికారిగా స్థిరపడొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్లు, నర్సరీ, విత్తనశుద్ధి కర్మాగారాలలో అధికారులుగా ఉద్యోగావకాశాలుంటాయి. తితిదే పరిధిలో ఉద్యాన రూపకల్పన (గార్డెనింగ్ డిజైనింగ్), టూరిజం పరిశ్రమలో గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ ఉద్యోగాలకూ వీరు అర్హులే. ప్లాంట్ డాక్టర్స్గా, రైతులకు సలహాదారులుగా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంతంగా నర్సరీలు స్థాపించి స్వయం ఉపాధి బాటలో సాగవచ్చు. అంతేకాదు ఇతర డిగ్రీ విద్యార్థుల తరహాలో సివిల్ సర్వీసెస్, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయొచ్చు. విశ్వవిద్యాలయం పరిధిలో ఎమ్మెస్సీ, పీహెచ్డీలలో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? వీటిలో ప్రవేశానికి అర్హతలేమిటి? ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఫ్రూట్ సైన్స్, కూరగాయల శాస్త్రం, పూలమొక్కల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, సుగంధ ద్రవ్య, ఔషధ మొక్కల పెంపకం వంటి వాటిని స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకోవచ్చు. రాజేంద్రనగర్, వెంకటరామన్నగూడెం, అనంతరాజుపేట, మోజర్ల కళాశాలల్లో ఎమ్మెస్సీ సీట్లున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశించొచ్చు. అకడమిక్ మెరిట్కు 50 శాతం, ప్రవేశ పరీక్షకు 50 శాతం ప్రాధాన్యమిచ్చి సీట్లను కేటాయిస్తారు. హార్టికల్చర్ పీహెచ్డీ కోర్సులు వెంకటరామన్నగూడెం, రాజేంద్రనగర్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో సరిపడినన్ని కళాశాలలున్నాయని భావిస్తున్నారా? ప్రస్తుతం డిమాండ్కు అనుగుణంగా కళాశాలలు లేవని చెప్పొచ్చు. వీటి సంఖ్య పెంచడానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. యూనివర్శిటీ పరిధిలో మొత్తం ఎన్ని పరిశోధనా కేంద్రాలున్నాయి. వీటి స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశమేంటి? మొత్తం 27 పరిశోధనా కేంద్రాలున్నాయి. జాతీయ స్థాయి సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), రాష్ట్ర ఉద్యాన మిషన్ ప్రాజెక్టులను పరిశోధనాంశాలుగా తీసుకుంటారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచడం, పోషక విలువల అభివృద్ధి, ఆహారభద్రత, అనుకూల వాతావరణం కల్పించడం, ఆహార పదార్థాల నిల్వ సామర్థ్యం పెంచి రైతులు మెరుగైన ఆదాయం ఆర్జించేలా చూడటం, ఎగుమతులు, ప్రాసెసింగ్ పద్ధతులను ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యాలుగా పరిశోధన కేంద్రాలు ఆవిర్భవించాయి. రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాల వివరాలు, వాటి ఏర్పాటు లక్ష్యం ఏమిటి? విశ్వవిద్యాలయం పరిధిలో మూడు కృషి విజ్ఞాన కేంద్రా లు ఉన్నాయి. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని పందిరిమామిడి, కరీంనగర్ జిల్లాలోని రాంగిరిఖిల్లాలలో ఉన్నాయి. ఇవి ఉద్యాన విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం, సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మోతాదులో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, ఆయా పంటకాలాల్లో ఎదురయ్యే సమస్యలపై అన్నదాతలకు అవగాహన కల్పించడం వంటివి చేస్తున్నాయి. ఆదర్శ రైతులకు శిక్షణ, కిసాన్ మేళాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ప్రసార మాధ్యమాల ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడం వంటి సేవలనూ కూడా అందిస్తున్నాయి. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధనల ఫలితంగా కనిపెట్టిన కొత్త రకం వంగడాలు ఏవైనా ఉన్నాయా? విశ్వవిద్యాలయం పరిధిలో ఆవిష్కరించిన కొత్త రకం వంగడాలు చాలా ఉన్నాయి. మామిడిలో మంజీర, కేఎంహెచ్-1, నీలేషాన్, నీలుద్దీన్, నీల్ గోవా, స్వర్ణ వంటివి ఉన్నాయి. నిమ్మ: బాలాజీ. అరటి: కొవ్వూరు బొంత. జామ: సఫేద్ జామ్, కోహిర్ సఫేదా. కంద: గజేంద్ర. చిలగడదుంప: సామ్రాట్, కిరణ్, ఆర్ఎన్ఎస్పీ-1. కొబ్బరి: గోదావరి గంగ, డబుల్ సెంచరీ, గౌతమి గంగ, కేరా బస్తర్, కల్ప ప్రతిభ. వంగ: భాగ్యమతి, గులాబి, శ్యామల. పొట్లకాయ, చిక్కుడు, గుమ్మడికాయ, మిరప వంటి పంటలకు సంబంధించి కూడా కొత్త వంగడాల ఆవిష్కరణ జరిగింది. పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలలో నిర్వహించే పరిశోధనల్లో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారా? విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనల్లో భాగస్వాములను చేస్తుంటాం. అలాగే విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. యూనివర్సిటీ పరిధిలో రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నారు? కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) ద్వారా రైతులకు పంటసాగు, ఉత్పత్తి పెంచడంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక రైతు శిక్షణ కేంద్రం వెంకటరామన్న గూడెం కేవీకేకు అనుబంధంగా ఉంది. ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నారా? వీటిద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? విశ్వవిద్యాలయంలో ఆంధ్రాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, రుచి సోయా ఇండస్ట్రీస్, విభా సీడ్స్, క్యాడ్బరి ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలతో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి. వై.మురళీకృష్ణ - న్యూస్లైన్, తాడేపల్లిగూడెం. బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ ఉద్యానశాఖ అధికారిగా స్థిరపడొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్లు, నర్సరీ, విత్తనశుద్ధి కర్మాగారాలలో అధికారులుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఫ్రూట్ సైన్స్, కూరగాయల శాస్త్రం, పూలమొక్కల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, సుగంధ ద్రవ్య, ఔషధ మొక్కల పెంపకం వంటి వాటిని స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకోవచ్చు.