breaking news
half day classes
-
అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈమేరకు గురువారం ప్రజా భవన్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం డైరెక్టరేట్లోనూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్లలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించాలన్నారు. -
రేపటి నుంచి ‘ఒంటిపూట బడి’
అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘ఒంటిపూట బడి’ నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయన్నారు.ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు కొనసాగించాలన్నారు.వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలో పిల్లలను దృష్టిలో ఉంచుకొని కేంద్రాల పని వేళల్లో మార్పు చేసినట్లు చెప్పారు.


