breaking news
gyadari kishore kumar
-
గ్యాదరి మధ్యంతర అప్లికేషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కు హైకోర్టు షాకిచ్చింది. తన ఎన్నిక చెల్లదంటూ ఇదే నియోజకవర్గ కాంగ్రెస్నేత అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని ఎమ్మెల్యే దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. ఈ కేసులో సాక్షుల తుదిజాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ సెపె్టంబర్ 4కు వాయిదా వేసింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్యాదరి కిశోర్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కిశోర్ విజయం సాధించారు. అయితే కిశోర్ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, పోలైన ఓట్లకు, ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కల్లో తేడాలున్నాయని పేర్కొంటూ దయాకర్ 2019లో హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. కిశోర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని రద్దు చేసి, తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ ప్రధాన పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉండగా, తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎన్నికల పిటిషన్(ఈపీ)ను కొట్టివేయాలంటూ కిశోర్ మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, కిశోర్ తరఫు వాదనలను తోసిపుచ్చారు. ప్రధాన పిటిషన్ విచారణార్హమైనదేనని స్పష్టం చేశారు. సాక్షుల జాబితాను ఫైనల్ చేయాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
యూపీఏ విధానాలే ఐతే ఎన్డీయే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: యూపీఏ విధానాలు, నిర్ణయాలే అమలవుతున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, దీని కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎందుకని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్ ప్రశ్నించారు. సోమవారం టీఆర్ఎస్ నేత పి.రాజేశ్వర్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే తీసుకున్నారని బీజేపీ, ఎన్డీయే నాయకులు తప్పించుకోవడం సరైందికాదన్నారు. యూపీఏ నిర్ణయాలనే ఎన్డీయే అమలు చేయాలనుకుంటే యూపీఏ-3 అని పెట్టుకోవచ్చునని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక పచ్చచొక్కా వేసుకున్న పిచ్చికుక్కలాగా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దళితుల సంక్షేమానికి కేసీఆర్ బృహత్తర నిర్ణయం తీసుకున్నారని, దళితులకు గతంలో ఎవరూ చేయని మేలును చేస్తున్నారని చెప్పారు. దళితులకు టీడీపీ ఏం చేస్తున్నది?: ఎమ్మెల్యే గువ్వల దళితుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ ఏమీ చేయడం లేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. దళితులకు తెలంగాణ ప్రభుత్వమే అండగా ఉన్నదన్నారు. దళితుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం భూపంపిణీ చేస్తున్నదని బాలరాజు చెప్పారు. ఏపీలో టీడీపీ ఏం చేస్తున్నదో చెప్పాలన్నారు