-
ఇసుకలో ఆడేటి కుసుమ సిరిబాల!
గ్రంథపు చెక్క పాట లేనిది బతుకు లేదు. బతుకు దారి పొడుగునా అక్కడ ఒక చెట్టులాగా, ఇక్కడ ఒక ఏరులాగా పాట తగుల్తూనే ఉంటుంది. బతుకులో పాట కోసం మనం ఎదురుచూడం. అనుకోకుండా వచ్చే అతిథి వంటిది పాట. ఊత, ఊపు, ఊరట, ఉల్లాసం, ఉత్సాహం... ఎన్నో అవుతుంది మానవుని బతుకులో ఈ పాట. తల్లులు పాడేవి మహాచల్లగా, తీయగా ఉంటాయి. మొట్ట మొదటి పాట - విద్దెం విద్దెం వరహాల విద్దెం / విద్దెం చేస్తే గిద్దెడు నెయ్యి తప్పక చేస్తే తవ్వెడు నెయ్యి / మళ్లీ చేస్తే మానెడు నెయ్యి ఈ పాటలో బిడ్డ వట్టి చంటిపాప. పాకే పాపకు నిలబడ్డం నేర్పుతుంది తల్లి. బోసి నోరు విప్పి కిలకిల నవ్వుతూ చిగురు మేనుతో బిడ్డ ఈ పాటలో సాక్షాత్కరిస్తుంది. చల్ల చేసే బిడ్డ ఇసుకలోకి నడిచి వెళ్లి అక్కడ ఆడుకుంటుంది. ఇసకలో ఆడేటి కుసుమ సిరిబాల ఆ బాల పేరేమి ఆనవాలేమి / ఆనవాలు అంబరస పేరు బాలయ్య అని పాపను గర్వంగా తల్లి హెచ్చరిస్తుంది. పాప మరి కాస్త పెరుగుతాడు. పక్క పక్కనే ఆడే పాప ముంగిటిదాకా నడుస్తాడు. - కృష్ణశాస్త్రి ‘అమూల్యాభిప్రాయాలు’ పుస్తకం నుంచి. -
జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా!
గ్రంథపు చెక్క గజల్ కేవలం ఒక గీతం కాదు. ధ్వనులతో అంతర్ధ్వనులతో పొరలు పొరలుగా అల్లుకుపోయిన కమనీయ కవిత గజల్. ముషాయిరాల్లో గజల్కు ప్రాధాన్యం హెచ్చు. అది తీగలా శ్రోతల హృదయాల పందిళ్లను దట్టంగా అల్లుకుని పుష్పించి, పరిమళించి పరవశింపజేస్తుంది. గజల్ అంటే ‘కలకంఠులతో సరస సల్లాపం’ అని అర్థం చెప్పవచ్చు. అరబ్బీ భాషలో దీనికి ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందమైన లేడిపిల్ల అరుపు, సున్నితమైన పూల నుండి దారం తీయడం... ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పవచ్చు. ప్రణయ సర్వస్వం-గజల్. ‘నీవున్న మేడ గదిలో నను చేరనీయ రేమో! జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా! యేడేడు సాగరాలు, యెన్నెన్నో పర్వతాలు యెంతెంత దూరమైన బ్రతుకంతా నడిచిరానా!’ ఇదో గజల్. ప్రియుడు ప్రేయసి కోసం పడే తపన గజల్కు ప్రాణం. బాల్యదశలో మహాకవి గాలిబ్ను అధ్యయనం చేయడం ప్రారంభించాను. అగాథమైన అతని కవిత అర్థం కావడానికి చాలా తపన పడాలి. ‘‘భారతదేశానికి గాలిబ్ కవిత, తాజ్మహలు మరువరాని అందాలు’’ అని ఒక మహానుభావుడు అన్నాడట. అది సత్యం. -డా.దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ పుస్తకం నుంచి. -
సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!
గ్రంథపు చెక్క మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా. ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం. సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు. ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది.. - ‘ఆల్బర్ట్ ఐన్స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’ పుస్తకం నుంచి. -
చెక్కు చెదరని బుద్ధవాక్యం
గ్రంథపు చెక్క బుద్ధప్రతిమలానే సాంచీస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్లుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్లుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండ మీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలో కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికీ సంబంధం లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో వివరంగా నమోదు చేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. బుద్ధపాద స్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచీ చరిత్రలో నిలబడింది. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండను చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండ మీద రాస్తే నలుగురు చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండ మీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు. - వాడ్రేవు చినవీరభద్రుడు ‘నేను తిరిగిన దారులు’ పుస్తకం నుంచి. -
సైన్స్... మనిషిని దేశదిమ్మరిని చేసింది!
గ్రంథపు చెక్క మానవుడు ఇంతకుముందు లాగా ఒకచోట జీవయాత్ర సాగించే అవకాశం లేకుండా చేసింది సైన్స్. మనిషిని దేశదిమ్మరిని చేసింది. ఈనాటి మనిషి ఉదయం ఒక ఊళ్లోనూ, రాత్రి ఇంకొక ఊళ్లోనూ ఉండవలసి వస్తుంది. కొంతమంది దేశాలనే మారుస్తున్నారు. చెట్టు ఒకచోటనే పాతుకొని ఉండి బ్రతుకుతుంది. అక్కడి నుంచి కదలిస్తే, మరోచోట పాతితే తప్ప బ్రతకదు. మరోచోట పాతివేసినా బ్రతకని చెట్లున్నాయి. జంతువు కదులుతూ బ్రతకగలుతుంది. ఒక పరిధిలో, ఒక పరిస్థితిలో మాత్రమే మనగలుగుతుంది. మానవుడూ అంతే. అయితే నూతన పరిస్థితులకు జంతువుల కంటే త్వరగా ఎడ్జెస్ట్ అవుతాడు. ఈనాటికీ పల్లెటూరి నుంచి వచ్చిన రైతు, పట్టణ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి కావడం మనకు నిత్యమూ కనిపించే దృశ్యమే. వచ్చిన దగ్గరి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనే యావ తప్ప అతనికి ఇంకొకటి ఉండదు. అయినా జంతువు వలెకాక, ఎక్కడబడితే అక్కడ తనకు కావలసిన పరిస్థితులను తనకు తానై సృష్టించుకోగలుగుతున్నాడు. నూతన పరిస్థితులలో మనగలుగుతున్నాడు. అంటే క్రమక్రమేణా అతను పరిస్థితుల ప్రభావాన్ని అధిగమించి బ్రతకగలుగుతున్నాడన్నమాట. మానవుని మీద పరిస్థితుల ప్రభావం నశిస్తూ వున్నదన్నమాట. ఇక మానవునికి వేళ్ళు ఒకచోట ఉండవలసిన అవసరం లేదు. ఈ నూతన జీవితంలో అతనికి అనేక ప్రమాదాలు అపాయాలు ఎదురవుతుంటాయి. అందులో సందేహం లేదు. అయితే ఎప్పటికప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడే కదా మానవుడు క్రొత్త క్రొత్త విషయాలను కనిపెట్టింది. మానవులో ఉన్న సృజనశక్తి విజృంభించేది. మానవుడు దేవుడయ్యేది. ఇందుకు మానసిక జీవితం ప్రగాఢం కావాలి. - ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’కు గోపిచంద్ రాసిన ముందుమాట నుంచి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement