breaking news
Government Girls College
-
విద్యార్థులకు విషపు అన్నమా! ఉప్మాలో జెర్రి... భోజనంలో బొద్దింక
నాడు జగన్ పాలనలో బడి పిల్లలకు ‘గోరు ముద్ద’లతో పౌష్టికాహారం అందించారు. నేడు కూటమి పాలనలో ‘పురుగుల’ అన్నం పెడుతున్నారు. ఒకటో తారీకున పాయకారావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల వసతి గృహంలో బొద్దింక భోజనాన్ని సాక్షాత్తు హోం మంత్రి అనితే రుచి చూశారు. మూడో తేదీన ఇలాంటిదే మరో సంఘటన. తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులకు పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. 64 మంది తినగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో తీసుకొస్తానంటున్న విప్లవాత్మక మార్పులు ఇవేనా? అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న భోజన వసతి ఏమేర ఉందో తేటతెల్లమవుతోంది. అసలేం జరిగిందంటే... తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం ఉదయం ప్రార్థన జరుగుతుండగా ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారికి సపర్యలు చేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం తిన్న ఉప్మాలో జెర్రి వచ్చిందని విద్యార్థినులు వైద్యులకు తెలియజేశారు.విద్యార్థుల కథనం మేరకు.. తెలుగుగంగ కాలనీలోని బీసీ కళాశాల వసతి గృహంలో 84 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం ఉదయం 64 మంది విద్యార్థులకు ఉప్మాను అల్పాహారంగా అందించారు. యోష్ణ అనే విద్యార్థిని తనకు పెట్టిన ఉప్మాలో జెర్రి వచ్చిందని తోటి విద్యార్థులకు చూపించింది. దాంతో విద్యార్థులు ఎవరు ఉప్మా తినకుండా అక్కడ పడేసి కళాశాలకు బయలు దేరి వెళ్లిపోయారు.అయితే ప్రార్థన సమయంలో ఎం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యోష్ణ కళ్లు తిరిగి కిందపడిపోయింది. కడుపు నొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునికుమారి, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అధ్యాపకులకు చెప్పారు. అధ్యాపకులు వెంటనే వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. -
కస్తూర్బా విద్యార్థినులకు మంచినీటి కష్టాలు
చిలకలూరిపేట రూరల్, న్యూస్లైన్ పేరుకే ప్రభుత్వ బాలికా విద్యాలయం.. మూడు నెలలుగా నుంచి మంచినీటి సదుపాయం లేకపోవడంతో వందలాది మంది విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పోతవరంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయానికి ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నా.. పాతబిల్లులు మంజూరు కాలేదని నిలిపివేశారు. మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఓగేరు వాగులో బోర్వెల్ వేసినా పైపు లైన్ ఏర్పాటును విస్మరించారు. ఈ విషయంలో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థినులు చాలీచాలని నీటితో పాట్లు పడుతున్నారు. అసలే ఆ గ్రామాన్ని ఫ్లోరైడ్ గ్రామంగా అధికారులు గుర్తించారు. బోర్వెల్ నీటిని వినియోగించే అవకాశంలేకుండా పోయింది. విద్యాలయంలో ఉన్న నిధులను ప్రత్యేకంగా మంచినీటి వినియోగానికి ఖర్చుచేశారు. వారం రోజుల నుంచి ఉన్న నిధులు సైతం ఖర్చుకావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. పది రోజులగా మంచినీటి సమస్య తీవ్రమవడంతో విద్యార్థినులు కన్నీటి పర్యంతమై ఇళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ .. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్కుమార్ 2012 జూలై 20న విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థినుల విన్నపం మేరకు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం నిమిత్తం రూ. ఐదు లక్షల నిధులు విడుదల చేశారు. అప్పటివరకు పురపాలక సంఘానికి చెందిన మంచినీటి ట్యాంక్ల నుంచి రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని అందించాలని ఆదేశించారు. ఏడాది క్రితం అధికారులు బోర్వెల్ ఏర్పాటుచేసి వాటికి మోటార్లు బిగించారు. ఆ నీటిని గ్రామంలోని ఓవర్ హెడ్ట్యాంక్కు వినియోగిస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి విద్యాలయానికి పైపు లైన్ ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించకపోవడం గమనార్హం! దీనిపై విద్యాలయం ప్రత్యేకాధికారి ఎస్పీటీ కుమార్ను న్యూస్లైన్ ప్రశ్నించగా మంచినీటి ట్యాంకర్లకు బిల్లులు మంజూరు కాలేదని గ్రామీణ నీటి సరఫరా అధికారులు పేర్కొంటున్నారని చెప్పారు. బిల్లులు వచ్చాక ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. పైపులైన్ విషయం ప్రస్తావించగా అధికారుల నుంచి సమాధానాలు లభించడం లేదన్నారు. గ్రామీణ నీటి సరఫరా డీఈ వెంకటేశ్వరరావును ప్రశ్నించగా ఎన్నికల సమావేశంలో ఉన్నామని తర్వాత మాట్లాడతానని దాటవేశారు.