breaking news
Edengardens
-
IPL 2022: ప్లే ఆఫ్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయితే..? విజేత ఎవరు?
ఐపీఎల్-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్లు ముగియగా.. ప్లే ఆఫ్స్కు ఆయా జట్లు సిద్దమవుతున్నాయి. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం(మే24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అదే విధంగా మే25న ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే కోల్కతా వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్కు,ఫైనల్కు బీసీసీఐ కొత్త నిబంధనలను రూపొందించింది. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగించి, నిర్ణీత సమయంలో ఆట సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేలుస్తారు. ఒక వేళ సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. కాగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 కోసం ఎటువంటి రిజర్వ్ డేను బీసీసీఐ కేటాయించలేదు. అయితే ఫైనల్కు మాత్రం రిజర్వ్ డేను కేటాయించారు. ఒక వేళ మే29న ఫైనల్కు ఎటువంటి అంతరాయం కలిగినా.. మ్యాచ్ను తిరిగి మే 30న నిర్వహించనున్నారు. ►క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులతో పాటు అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్కు రెండు గంటల రిజర్వు టైమ్ని కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ►ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైతే రెండు గంటల వరకు నిర్ణీత 20 ఓవర్లలో ఎటువంటి కుదింపు ఉండదు. ►అదే విధంగా మ్యాచ్కు వర్షం కారణంగా అంతరాయం కలిగితే ఇన్నింగ్స్ బ్రేక్ 20 నిమిషాలను 10 నిమిషాలకు కుదిస్తారు. ►వర్షం వల్ల మ్యాచ్ కటాఫ్ టైం దాటిపోతే.. ప్లేఆఫ్ మ్యాచ్ల్లో ఇరు జట్లు అయిదేసి ఓవర్ల చొప్పున ఇడే ఆవకాశం ఉంటుంది. ప్లేఆఫ్స్లో కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ జరగడానికి రాత్రి 11.56 వరకు అవకాశం ఉంటుంది. కాగా ఐదు ఓవర్ల మ్యాచ్కు ఎటువంటి టైమ్అవుట్లు ఉండవు. ►ఒకవేళ ఫైనల్లో ఐదు ఓవర్ల మ్యాచ్కు కటాఫ్ సమయం తెల్లవారుజామున 12:26 నిమిషాలు. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 వర్షం కారణంగా రద్దు అయితే? ►ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో అదనపు సమయం ముగిసేలోగా కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ని కూడా నిర్వహించడానికి సాధ్యం కాకపోతే.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ►ఈ మ్యాచ్లకు సూపర్ ఓవర్ కటాఫ్ టైమ్ ఉదయం 12:50 నిమిషాలు. ►సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాని తరుణంలో లీగ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. ► ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే లేనుందున.. ఈ మ్యాచ్ల్లో ఒక ఇన్నింగ్స్ పూర్తి అయ్యాక.. రెండో ఇన్నింగ్స్ మధ్యలో వరుణుడు అంతరాయం కలిగిస్తే.. డక్వర్త్-లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు. ఫైనల్ రూల్స్ ►ఒకవేళ ఫైనల్ మ్యాచ్ మే 29న ప్రారంభమై మధ్యలో ఆగిపోతే, రిజర్వ్ డే రోజున మిగతా మ్యాచ్ను నిర్వహిస్తారు. ►ఫైనల్లో టాస్ వేసిన తర్వాత ఆట సాధ్యం కాని పక్షంలో, రిజర్వ్ రోజున జట్లకు మళ్లీ తాజాగా టాస్ ఉంటుంది. ►ఫైనల్కు అంతరాయం కలిగినప్పుడు 3గంటల 20నిమిషాలతో పాటు అదనంగా రెండు గంటల సమయం ఉంటుంది. ►ఇక ఫైనల్ రోజు గానీ రిజర్వ్ ఫైన్ డే రోజు గానీ సూపర్ ఓవర్ జరగడానికి ఉదయం1.20 వరకు అవకాశం ఉంటుంది. ► కాగా రిజర్వ్డే రోజునైనా కనీసం ఐదు ఓవర్లు ఆటకూడా ఆటసాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు చదవండి: IPL 2022: తుఫాను దాటికి ఈడెన్ గార్డెన్స్ కుదేలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్లేమో అక్కడే! Kalbaisakhi in #Kolkata look at #EdenGarden…. pic.twitter.com/mw7IuDVRe2 — Kamalika Sengupta (@KamalikaSengupt) May 21, 2022 -
గిల్క్రిస్ట్ నీ ఏడుపు ఆపు: భజ్జీ
న్యూఢిల్లీ : ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో డీఆర్ఎస్ విధానం ఎంత కీలకపాత్ర పోషింస్తుందో అందరికి తెలిసిందే. అంపైర్ పొరపాటుగా అవుట్ ఇచ్చినా బ్యాట్సమెన్ వెంటనే డీఆర్ఎస్ను కోరి సత్ఫలితాలు సాధిస్తున్నారు. అటు బౌలింగ్ చేసే జట్లు కూడా డీఆర్ఎస్ ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాయి. తాజాగా విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో బుమ్రా హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. కాగా, రెండో టెస్టు మ్యాచ్లో 44వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని కోహ్లి డీఆర్ఎస్ కోరడంతో బుమ్రా హ్యాట్రిక్ ఘనతను నమోదు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియన్ మాజీ వికెట్కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ట్విటర్లో స్పందిస్తూ ' తానూ ఆడే రోజుల్లో డీఆర్ఎస్ లేకపోవడం వల్లే హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించాడని' పేర్కొన్నాడు. దీనిపై భజ్జీ స్పందిస్తూ 'ఆరోజు నువ్వు మొదటి బంతికే ఔటవ్వకపోతే ఎక్కువసేపు ఆడేవాడివి అనుకుంటున్నావా ? గిల్లీ ! ఇప్పటికైనా నీ ఏడుపు ఆపు.. నువ్వు ఆడిన రోజుల గురించి మాట్లాడడం నీకు సరైనదిగానే కనిపిస్తుంది. కానీ అప్పటి నిర్ణయాలు అయితే మారవు, దానికి నువ్వే ఉదాహరణ, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు అంటూ' భజ్జీ చురకలంటించాడు. ఈడెన్గార్డెన్ వేదికగా 2001లో ఆసీస్తో జరిగిన టెస్టులో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 72వ ఓవర్లో వరుసబంతుల్లో రికీ పాంటింగ్, గిల్క్రిస్ట్, షేన్వార్న్లను ఔట్ చేశాడు. No DRS 😩 https://t.co/3XsCqk9ZiR — Adam Gilchrist (@gilly381) August 31, 2019 -
బై... బై... ఈడెన్
ఇలా జరిగిందేం..? తలపట్టుకున్న క్యాబ్ కోల్కతా: ఈడెన్గార్డెన్స్లో సచిన్ ఆడే చివరి టెస్టు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)... మూడో రోజే మ్యాచ్ అయిపోవడంతో తలపట్టుకుంది. నాలుగు, ఐదు రోజుల్లో సచిన్ సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు. నాలుగోరోజే మ్యాచ్ ముగిసినా తమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా ప్లాన్ చేశారు. సెలబ్రిటీలందరినీ నాలుగో రోజు మ్యాచ్కు ఆహ్వానించారు. 199 కిలోల గులాబీ పూలు చల్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మ్యాచ్ మూడో రోజే ముగిసింది. సచిన్కు మమతా బెనర్జీ ‘చిత్రం’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తను గీసిన ఓ చెట్టు చిత్రాన్ని సచిన్కు బహూకరించారు. దీంతోపాటు సచిన్కు తలపాగాను అందించగా దాన్ని మాజీ కెప్టెన్ గంగూలీ అతడి తలకు అలంకరించాడు. మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా 199 బంగారు ఆకులతో కూడిన మర్రి చెట్టు విగ్రహాన్ని, టాస్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు నాణేన్ని సచిన్కు అందించారు. -
తొలి టెస్టులో భారత్ ఘన విజయం
సచిన్ ఫేర్వెల్ పార్టీని పాడు చేస్తాం... మాస్టర్ను విజయంతో వెళ్లనివ్వం... ఇవీ సిరీస్కు ముందు వెస్టిండీస్ ఆటగాళ్ల బీరాలు. కానీ కరీబియన్ ఆటగాళ్లు కోల్కతా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. సచిన్ టెండూల్కర్ను ఐదు రోజుల పాటు చూడనివ్వకుండా మూడు రోజుల్లోనే పూర్తిగా చేతులెత్తేశారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ధోనిసేన తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగులతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. రోహిత్ శర్మకు అండగా నిలిచిన అశ్విన్ కూడా సెంచరీ పూర్తి చేసి భారత్కు భారీ ఆధిక్యాన్ని అందిస్తే... పేసర్ షమీ తన సంచలన బౌలింగ్ను రెండో ఇన్నింగ్స్లోనూ కొనసాగించి ఐదు వికెట్లు తీశాడు. వెరసి... సచిన్ ఫేర్వెల్ సిరీస్లో తొలి అంకాన్ని భారత్ జట్టు విజయవంతంగా ముగించింది. కోల్కతా: ఉత్కంఠ లేదు... కానీ ఆసక్తికర మలుపులు ఉన్నాయి. ఒత్తిడి లేదు... కానీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండో రోజు లంచ్ సమయానికి కష్టాల్లో ఉన్న భారత్ అనూహ్యంగా పుంజుకున్నా... విజయం దక్కుతుందనే ధీమా లేదు. మూడో రోజు ఉదయం గెలుపునకు ఇరుజట్లు సమాన దూరంలో ఉన్నా... ఒక్క సెషన్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కష్టాల నుంచి ఆధిపత్యం దిశగా వెళ్లిన ధోనిసేనకు అరంగేట్రం హీరో మహ్మద్ షమీ (5/47) తన సూపర్ బౌలింగ్తో ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ఈడెన్గార్డెన్స్లో శుక్రవారం ముగిసిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. సచిన్ తుది అంకానికి ఘనమైన ఆరంభాన్నిచ్చిన టీమిండియా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 354/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 129.4 ఓవర్లలో 453 పరుగులకు ఆలౌటైంది. దీంతో 219 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ (177) తన ఫామ్ను కొనసాగించగా, అశ్విన్ (124) కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. షిల్లింగ్ఫోర్డ్కు 6, పెరుమాల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్కు దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్లో 54.1 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. డారెన్ బ్రేవో (37), పావెల్ (36), గేల్ (33), చందర్పాల్ (31 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. షమీ 5, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 234 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (బి) షిల్లింగ్ఫోర్డ్ 23; విజయ్ (స్టంప్డ్) రామ్దిన్ (బి) షిల్లింగ్ఫోర్డ్ 26; పుజారా (సి) రామ్దిన్ (బి) కొట్రీల్ 17; సచిన్ ఎల్బీడబ్ల్యూ (బి) షిల్లింగ్ఫోర్డ్ 10; కోహ్లి (సి) పావెల్ (బి) షిల్లింగ్ఫోర్డ్ 3; రోహిత్ ఎల్బీడబ్ల్యూ (బి) పెరుమాల్ 177; ధోని (సి) రామ్దిన్ (బి) బెస్ట్ 42; అశ్విన్ (బి) షిల్లింగ్ఫోర్డ్ 124; భువనేశ్వర్ (సి) గేల్ (బి) షిల్లింగ్ఫోర్డ్ 12; షమీ (స్టంప్డ్) రామ్దిన్ (బి) పెరుమాల్ 1; ఓజా నాటౌట్ 2; ఎక్స్ట్రాలు: 16; మొత్తం: (129.4 ఓవర్లలో ఆలౌట్) 453. వికెట్లపతనం: 1-42; 2-57; 3-79; 4-82; 5-83; 6-156; 7-436; 8-444; 9-451; 10-453. బౌలింగ్: బెస్ట్ 17-0-71-1; కొట్రీల్ 18-3-72-1; షిల్లింగ్ఫోర్డ్ 55-9-167-6; పెరుమాల్ 23.4-2-67-2; స్యామీ 12-1-52-0; శామ్యూల్స్ 4-0-12-0. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: గేల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 33; పావెల్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 36; డారెన్ బ్రేవో (సి) రోహిత్ (బి) అశ్విన్ 37; శామ్యూల్స్ ఎల్బీడబ్ల్యూ (బి) షమీ 4; చందర్పాల్ నాటౌట్ 31; రామ్దిన్ (సి) విజయ్ (బి) షమీ 1; స్యామీ (బి) షమీ 8; షిల్లింగ్ఫోర్డ్ (బి) షమీ 0; పెరుమాల్ రనౌట్ 0; బెస్ట్ (సి) అశ్విన్ (బి) ఓజా 3; కొట్రీల్ (బి) షమీ 5; ఎక్స్ట్రాలు: 10; మొత్తం: (54.1 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్లపతనం: 1-33; 2-101; 3-110; 4-120; 5-125; 6-152; 7-152; 8-152; 9-159; 10-168 బౌలింగ్: భువనేశ్వర్ 6-1-20-1; షమీ 13.1-0-47-5; అశ్విన్ 19-2-46-3; ఓజా 13-3-27-0; సచిన్ 3-0-18-0. ఓవరాల్గా 9 వికెట్లు తీసిన షమీ... అరంగేట్రంలో మ్యాచ్ను గెలిపించిన తొలి పేసర్గా రికార్డులకెక్కాడు. మునాఫ్ (7/97) రికార్డును అధిగమించాడు. రోహిత్, అశ్విన్ల ఏడో వికెట్ భాగస్వామ్యం 280 పరుగులు భారత్ తరఫున ఉత్తమం. టెస్టు అరంగేట్రంలో నరేంద్ర హిర్వాణి (16/136) తర్వాత మెరుగైన గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్ షమీ (9/118). టెస్టు అరంగేట్రంలో భారత్ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ రోహిత్ (177). వెస్టిండీస్పై ఇన్నింగ్స్ తేడాతో గెలవడం భారత్కు ఇది మూడోసారి. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు అంతకంటే ఎక్కువ పడగొట్టిన మూడో భారత బౌలర్ షమీ. కెరీర్ తొలి టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్ షమీ. ఎనిమిదో నంబర్ బ్యాట్స్మన్గా రెండు సెంచరీలు సాధించిన నాలుగో భారత క్రికెటర్ అశ్విన్. తొలి టెస్టులోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న ఐదో భారత క్రికెటర్ రోహిత్. ధోని కెప్టెన్సీలో భారత్ 25 టెస్టులు గెలిచింది. ఒకే నాయకుడి సారథ్యంలో ఇదే అత్యధికం. సొంతగడ్డపై భారత్ సాధించిన 71 టెస్టు విజయాల్లో సచిన్కు భాగస్వామ్యం ఉంది. సెషన్-1 ఓవర్లు: 27.4 పరుగులు: 99 వికెట్లు: 4 బెస్ట్ బౌలింగ్లో చెరో ఫోర్ కొట్టిన అశ్విన్, రోహిత్లు క్రమంగా క్రీజులో కుదురుకున్నారు. షిల్లింగ్ఫోర్డ్ ఓవర్లో ఆచితూచి ఆడిన అశ్విన్.. తర్వాత బెస్ట్ ఓవర్లో బంతిని స్వీపర్ కవర్ వైపు మళ్లించి కెరీర్లో రెండో సెంచరీ (159 బంతుల్లో)ని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ అడపాదడపా బౌండరీలు కొట్టినా... ఎక్కువగా సింగిల్స్, డబుల్స్పైనే దృష్టిపెట్టారు. ఈ క్రమంలో 150 పరుగుల మార్కును దాటిన అతన్ని పెరుమాల్ అవుట్ చేశాడు. గింగరాలు తిరుగుతూ వచ్చిన బంతి రోహిత్ ప్యాడ్ను తాకుతూ వెళ్లడంతో అంపైర్ ఎల్బీగా అవుటిచ్చాడు. అయితే రీప్లేలో బంతి వికెట్లకు కాస్త పక్కగా వెళ్లినట్లు స్పష్టమైంది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన భువనేశ్వర్ (12)తో పాటు నిలకడగా ఆడుతున్న అశ్విన్... షిల్లింగ్ఫోర్డ్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు. తర్వాతి ఓవర్లోనే షమీ (1)ని పెరుమాల్ బోల్తా కొట్టించడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఓవరాల్గా ఈ సెషన్లో భారత్ చివరి నాలుగు వికెట్లను 17 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ‘వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకూడదని అనుకున్నాం. దానికి కట్టుబడి బ్యాటింగ్ చేశాం.ఈ మ్యాచ్ నాకు చిరస్మరణీయమైంది. నేను సాధించిన దానితో సంతృప్తిగా ఉన్నా’ - రోహిత్ ‘షమీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. మంచి నాణ్యమైన బౌలర్ లభించాడు. ముంబై టెస్టు తర్వాత మేమందరం భావోద్వేగ స్థితిలో ఉంటామేమో’ -అశ్విన్ సెషన్-2 ఓవర్లు: 33 పరుగులు: 112 వికెట్లు: 3 లంచ్ తర్వాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన విండీస్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. షమీ బౌలింగ్లో వరుస ఫోర్లు కొట్టిన గేల్ ఊపుమీదున్నట్లు కనిపించినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివరకు భువీ ఓ షార్ట్ బాల్తో అతన్ని వెనక్కి పంపాడు. ఓజా బౌలింగ్లో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ పావెల్... బ్రేవోతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. రెండో వికెట్కు 68 పరుగులు జోడించాక పావెల్ను అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన శామ్యూల్స్ కుదురుకోకముందే షమీ బోల్తా కొట్టించాడు. దీంతో విండీస్ 110/3 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది. సెషన్-3 ఓవర్లు: 21.1 పరుగులు: 56 వికెట్లు: 7 టీ తర్వాత అశ్విన్, షమీల జోరుకు కరీబియన్లు చిత్తయ్యారు. నిలకడగా ఆడుతున్న బ్రేవోను కట్టుదిట్టమైన బంతులతో అశ్విన్ దెబ్బతీశాడు. చందర్పాల్ నిలబడినా... రెండో ఎండ్లో సహచరులు పెవిలియన్ బాటపట్టారు. హైకోర్టు ఎండ్ నుంచి షమీని బౌలింగ్కు దించిన ధోని అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ఈ యువ పేసర్ వరుస విరామాల్లో రామ్దిన్ (1), స్యామీ (8), షిల్లింగ్ఫోర్డ్ (0), కొట్రీల్ (5)ల వికెట్లు తీసి షాకిచ్చాడు. చివర్లో పెరుమాల్ (0) రనౌట్ కాగా, బెస్ట్ (3) వికెట్ అశ్విన్కు దక్కింది. ఓ దశలో 101/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 67 పరుగుల తేడాతో చివరి 9 వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. ఈ సెషన్లో షమీ హవా నడిచింది.