breaking news
Earths surface
-
పుడమి పొర చిరిగిపోతోందా?
వాషింగ్టన్: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఖండాలుగా విడిపోయిన భూఉపరితం కొన్ని కోట్ల సంవత్సరాలక్రితం ఒకే అఖండ గోండ్వానా ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడీ ఖండాలు నెమ్మదిగా మరింత దూరంగా వెళ్తున్నా యనే సిద్ధాంతమూ వింటున్నాం. అయితే ఈ ఖండాలు దూరంగా జరిగే క్రమంలో కేవలం ఉపరితల భూమి మాత్రమే చీలిపోవడంలేదని మహాసముద్రాల అడుగుల వందల కిలోమీటర్ల లోతులోనూ భూమి పొర చీలిపోతోందని తాజా అధ్యయనంలో తేలింది. దూరంగా జరిగినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదని అనుకో కూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఖండాల భూగర్భ పొర చీలిపోవడంతో దాని అడుగున ఉన్న శిలాద్రవ మ్యాంటిల్ పొర నుంచి భడభాగ్ని లాంటి శిలాద్రవం బయటకు ఎగజిమ్మే ఆస్కార ముంది. దీంతో కొత్తగా లెక్కలేనని అగ్నిపర్వ తాలు పుట్టుకొచ్చే ప్రమాదముందని భూభౌగో ళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త అగ్ని పర్వ తాలు కోట్ల ఏళ్లపాటు అలాగే శిలాద్రవం, మాగ్మాను ఎగజిమ్మే పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో స్పష్టమైంది. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘నేచర్ జియోసైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా వేర్వేరు భూఫలకాలకొనలు పరస్ప రం ఢీకొనడం, రాపిడి సందర్భాల్లోనే అగ్ని పర్వ తాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు కొత్తగా సముద్ర గర్భంలోనూ అగ్నిపర్వతాలు ఏర్పడి కోట్ల సంవత్సరాలపాటు అవి అలాగే క్రియాశీలకంగా ఉండిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలోని సౌతాంప్టన్ విశ్వ విద్యాలయం, పోట్స్డామ్లోని జీఎఫ్జెడ్ హెల్మ్ హోట్జ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్, పోట్స్డ్యామ్ యూనివర్సిటీ, కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యా లయం, స్వాన్సియా యూనివర్సిటీలోని పరిశో ధకుల బృందం సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టింది. కంప్యూటర్ స్టిములేషన్ విధానంలో ఖండాల చీలిక కారణంగా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరగబోయే విపరిణామాలను వీళ్లు విశ్లేషించగలిగారు. -
మన నిర్వాకం వల్లే భూతాపోన్నతి!
స్టాక్హోం: భూతాపం అంతకంతకూ పెరగడానికి మనుషుల పనులే ముఖ్య కారణమనడానికి మరిన్ని రుజువులు దొరికాయని ఐక్యరాజ్యసమితి కమిటీ పేర్కొంది. ఈ శతాబ్దాంతానికి 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ మేరకు భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనావేసింది. వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) శుక్రవారం వెలువరించిన తాజా నివేదిక ప్రకారం.. సముద్ర మట్టం 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్ల మేరకు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. భూతాపోన్నతి వల్ల వడగాడ్పులు, వరదలు, కరువు బెడదలు తీవ్రతరమవుతాయని ఈ నివేదిక హెచ్చరించింది. మానవాళి శిలాజ ఇంధనాల వినియోగాన్ని భారీగా తగ్గించడం ప్రారంభిస్తే తప్ప మున్ముందు ఎదురయ్యే వాతావరణ విపత్తుల ముప్పును తగ్గించుకోలేమన్న విషయం ఐపీసీసీ తాజా నివేదిక ద్వారా విస్పష్టమవుతోందని పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. గత 60 ఏళ్లలో భూతాపం పెరగడానికి సగానికి సగం కారణం మనుషులేనని చెబుతూ.. ఈ విషయంపై 95%నిర్థారణకు వచ్చినట్లు ఐపీసీసీ శాస్త్రవేత్తల బృందం తాజా నివేదికలో పేర్కొంది. 2007లో ఈ బృందం వెలువరించిన నివేదికలో దీన్ని 90 శాతంగా పేర్కొంది. అంటే.. మానవాళి నిర్వాకం వల్లే భూతాపం పెరుగుతోందని రోజులు గడుస్తున్నకొద్దీ బలమైన ఆధారాలు లభిస్తున్నాయన్న మాట. ఐపీసీసీ తాజా నివేదిక మానవాళికి ఒక హెచ్చరిక వంటిదని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగాధిపతి క్రిస్టినా ఫిగ్యురెస్ వ్యాఖ్యానించారు. మానవాళిని పెనుముప్పు నుంచి తప్పించేందుకు జాతీయ ప్రభుత్వాలు తక్షణం భూతాపోన్నతిని తగ్గించే చర్యలకు శ్రీకారం చుట్టాలని, 2015లో జరిగే వాతావరణ సమావేశాల్లో పటిష్టమైన ఒడంబడిక చేసుకోవాలని ఆమె సూచించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ కూడా ఈ నివేదికను జాగ్రత్తపడేందుకు కాలం మించిపోతున్నదని తెలియజెప్పే హెచ్చరికగా భావించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీసీసీ గత 25 ఏళ్లలో నాలుగు నివేదికలను వెలువరించింది. భూతాపోన్నతి స్థితిగతులపై రూపొందించ తలపెట్టిన మూడు నివేదికల వరుసలో ఇప్పుడు వెలువరించినది మొదటిది. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రకృతి వైపరీత్యాల తీవ్రత మరింత పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల అధిక విని యోగం వల్ల భూఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలకు సంబంధించిన కంప్యూటర్ నమూనాల ప్రాతిపదిక గా 2100 నాటికి ఉష్ణోగ్రత ఎంత పెరిగే అవకాశం ఉందో ఐపీసీసీ అంచనా వేసింది.


