-
జీన్స్ వేసుకుంటానంటే బాలికను కొట్టి చంపేశారు
డియోరియా: జీన్స్ ప్యాంట్ వేసుకుంటానని పట్టుబట్టిన ఓ బాలికను ఆమె కుటుంబీకులే కొట్టి చంపారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా సవ్రేజీ ఖర్గ్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నేహా పాశ్వాన్ (17) జీన్స్, టాప్ ధరిస్తానంటూ మొండికేయగా కుటుంబసభ్యులు సోమవారం ఆమెను తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డియోరియా–కస్య మార్గంలోని పటన్వా వంతెనపై నుంచి విసిరేశారు. అయితే, ఆ మృతదేహం రైలింగ్కు చిక్కుకుని అక్కడే ఉండిపోయింది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అమ్మమ్మ, తాత సహా 10 మంది కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, బాలికను జీన్స్ వేసుకుంటానని చెప్పినందుకే కోపంతో కొట్టి చంపామంటున్న మృతురాలి కుటుంబసభ్యుల మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెనుక వేరే కారణాలు ఉండి ఉండొచ్చుననీ, అవేంటో దర్యాప్తులో వెలుగులో చూస్తాయని చెబుతున్నారు. -
మైనర్ బాలిక దారుణహత్య; రోజు మొత్తం బ్రిడ్జి కింద వేలాడుతూ
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం సంచలనం సృష్టించింది. బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయంలోకి వెళితే.. 17 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిన వాళ్లు.. తల్లికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోవడంతో డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేయగా.. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ
దేవ్రియా: ఉత్తరప్రదేశ్లోని దేవ్రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ను ముకుంద్ భాస్కర్మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు. -
ఒవైసీ మాట్లాడితే తప్పులేదా.. ఎందుకీ రాద్దాంతం?
లక్నో: ముస్లింల వద్ద కూరగాయలు కొనుగోలు చేయవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనను తాను సమర్థించుకున్నారు. ‘నేనేమైనా తప్పుగా మాట్లాడానా’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మహమ్మారి కరోనా వ్యాప్తికి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ప్రార్థనలు కారణమంటూ సురేశ్ తివారి గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తన నియోజకవర్గం డియోరియాలో పర్యటించిన ఆయన.. ‘‘ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ముస్లింల వద్ద కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. సరేనా’’ అని వ్యాఖ్యానించారు. (లాక్డౌన్: రోడ్డుపై బైఠాయించిన ఎంపీ) ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మతపరమైన, వివక్షపూరిత వ్యాఖ్యలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం దేనికి సంకేతమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన సురేశ్ తివారి.. ‘‘నేను నా నియోజకవర్గంలో పర్యటించినపుడు ఓ పది మందిని కలిశాను. లాక్డౌన్ గురించి మేం మాట్లాడుకున్నాం. అప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి ముస్లిం వ్యాపారులు కాయగూరలు అమ్మేటపుడు వాటిపై ఉమ్మివేయడం గమనించామని చెప్పారు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గర వస్తువులు కొని కరోనా తెచ్చుకోవద్దని నేను చెప్పాను. (బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు) ఒక ఎమ్మెల్యేకు సమస్య గురించి ఏం చేయాలని అడిగినపుడు.. నేనేం చెప్పాలి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుపట్టడానికి ఏముంది? ఎందుకు దీన్ని రాద్దాంతం చేస్తున్నారు’’అని ప్రశ్నించారు. అదే విధంగా.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు ఎన్నోసార్లు హిందువుల గురించి అభ్యంతరకర, తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని విమర్శించారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికిస్తున్నారని... స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడే ఒవైసీ లాంటి వారిని మాత్రం ఏమీ అనలేరని అసహనం వ్యక్తం చేశారు. -
చిత్రహింసలు.. ఆపై రెండేసి పెళ్లిళ్లు
లక్నో : బిహార్లోని ముజఫర్పూర్ షెల్టర్ హోం ఘటన మరువక ముందే ఉత్తర ప్రదేశ్లోని డియోరియోలో వసతి గృహంలో బాలికల లైంగిక హింస ఘటన వెలుగులోకి వచ్చింది. డియోరియోలో వసతి గృహం నుంచి పారిపోయి బయటకు వచ్చిన ఓ బాలిక అక్కడ జరిగే అకృత్యాల గురించి బయట పెట్టింది. షెల్టర్ హోం నిర్వహకురాలు గిరిజా త్రిపాఠి బాలికలను చిత్ర హింసలకు గురిచేసేవారని, కొంత మంది బాలికలకు వారి కన్నా రెట్టింపు వయసున్న వారితో రెండేసి పెళ్లిళ్లు చేసేవారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో షెల్టర్ హోంపై దాడి చేసిన పోలీసులు మరో 24 మంది బాలికలకు కాపాడారు. షెల్టర్ హోం అకృత్యాల నుంచి బయటపడిన బాలికలతో మంగళవారం ఆరుగురు మహిళా సభ్యుల బృందం మాట్లాడింది. తమను హోంలో చిత్ర హింసలకు గురిచేసేవారని, లైంగికంగా వేధించేవారని బాలికలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేపి ప్లోర్ మొత్తం శుభ్రం చేయించేవారని, తినడానికి కేవలం రెండు చపాతీలు మాత్రమే ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పని చేయాడానికి నిరాకరిస్తే వారికి ఆపూట భోజనం పెట్టే వారు కాదని బాలికలు వాపోయారు. కాగా బాలిక ఫిర్యాదుతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసిన పోలీసులు 24 మంది బాలికలను రక్షించామని తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా నడుస్తున్న వసతి గృహలపై కేంద్ర శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ లోక్సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement