-
ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది. ► 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్సైట్ల ద్వారా మోసపోయారు. ► 10 శాతం మంది వెబ్సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు. ► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది. ► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు. ► సంబంధిత ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు. ► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు. ► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు. ► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది. -
డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి భాగా విస్తరించడంతో అన్ని రంగాలలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చింది. నగదు చెల్లింపుల విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి చిన్న వస్తువు కొనడానికి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. దీంతో ప్రతి రోజు లావాదేవీలు చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగి పోతున్నాయి. ఇటువంటి సైబర్ నేరగాళ్ల భారిన పడకండా సౌకర్యవంతంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కార్డు వివరాలను సేవ్ చేయకండి మీరు ఆన్లైన్లో కొనుగోళ్లు చేసేటప్పుడు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయకుండా చూసుకోవడం మంచిది. మనలో చాలా మంది ఆన్లైన్లో త్వరగా చెల్లింపులు చేయడానికి వారి వివరాలను సేవ్ చేస్తారు. అయితే, ఇలా చేయడం వల్ల మీ ఆన్లైన్ కొనుగోలు పూర్తైన తర్వాత మీ కార్డు సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువ. అందుకని, మీ ఆన్లైన్ కొనుగోలు తర్వాత కార్డు వివరాలు సేవ్ చేయకపోవడం లేదా క్లియర్ చేయడం మంచిది. లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడండి డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైనది అనుమానాస్పద యాప్లు, వెబ్సైట్లను వాడకపోవడం. యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న విశ్వసనీయ అధికారిక యాప్లను మాత్రమే ఉపయోగించడం మంచిది. అలాగే, ప్రైవేట్/వర్చువల్ బ్రౌజర్లను, HTTPS://తో ప్రారంభమయ్యే సురక్షిత కనక్షన్లను ఎంచుకుని మరింత భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఆన్లైన్ లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడటం మంచిది. దీనివల్ల మీ కార్డు వివరాలు సేవ్ కావు. పాస్వర్డ్లు షేర్ చేయవద్దు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లు ఎల్లప్పుడూ బలంగా ఉంచేలా చూసుకోవడం మంచిది. పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడం, సైబర్ దాడులకు గురికాకుండా ఉండటానికి క్రమం తప్పకుండా పాస్వర్డ్లు మార్చుతూ ఉండాలి. అలాగే, మీ పాస్వర్డ్లు లేదా ఎటిఎం పిన్ వంటి వివరాలను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మీ బ్యాంకుకు తెలియజేయండి. ఒన్-టైమ్-పాస్వర్డ్(ఓటీపీ) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మరింత భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. పేవరల్డ్ సీఈఓ ప్రవీణ్ దాబాయ్ మాట్లాడుతూ - "సురక్షితమైన లావాదేవీల కోసం విశ్వనీయ వెబ్సైట్లలో మాత్రమే డెబిట్/ క్రెడిట్ కార్డులను ఉపయోగించాలని, ఓటీపీని ఎవరితోనూ పంచుకోకూడదని, వెర్చువల్ కీ బోర్డును మాత్రమే ఉపయోగించాలని, వెబ్సైట్ నుంచి తప్పనిసరిగా లాగవుట్ అవ్వాలి" అని తెలిపారు. పబ్లిక్ కంప్యూటర్లు/వై-ఫై నెట్వర్క్లు వాడొద్దు ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, ఇతర మోసపూరిత కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువ. కావున పబ్లిక్ పరికరాలు లేదా వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అలాగే ధృవీకరించబడిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్సైట్లు ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలకు ఎక్కువ రక్షణను అందిస్తాయి. మోసపూరిత యాప్లతో జాగ్రత్త.. యాప్ స్టోర్, ప్లే స్టోర్లో కూడా చాలా నకిలీ యాప్లు ఉన్నాయి. వీటిని నెగటివ్ రివ్యూలు, తక్కువ సంఖ్యలో డౌన్లోడ్లు, 'ధృవీకరించబడిన' బ్యాడ్జ్ లేకపోవడం ద్వారా గుర్తించవచ్చు. మీరు మీ స్మార్ట్ఫోన్లో యాప్లు డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో దృవీకరించబడిందా లేదా అని నిర్ధారించుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్లకు కూడా చట్టబద్ధత ఉండాలి. యాప్లను ఇస్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్, ఎస్ఎమ్ఎస్ మొదలైన వాటికి అనుమతి నిరాకరించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
ఓటీపీలు లేకుండానే రూ.లక్షలు కొట్టేశారు
సాక్షి, సిటీబ్యూరో: వారు ముగ్గురు బిహార్ యువకులు. పదో తరగతి వరకు చదివిన వారు ప్లంబర్లుగా పని చేసేవారు. బతుకుదెరువు నిమి త్తం నగరానికి వలసవచ్చిన వీరు యూట్యూబ్ వీడియోల ద్వారా ఓటీపీ నంబర్లు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసే వెసులుబాటు ఉన్న ఈ–కామర్స్ సైట్లపై అధ్యయనం చేశారు.డెబిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు, సీవీవీ తెలిస్తే చాలు కార్డు కాలపరిమితి చెప్పే ఆన్లైన్ అప్లికేషన్లపై పట్టు సాధించారు. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినట్లుగా నటిస్తూ ముందున్న ఖాతాదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో కార్డు వివరాలను సోల్డర్ సర్ఫింగ్ ద్వారా తెలుసుకుని ఆన్లైన్ షాపింగ్ చేసేవారు. ఇలా దాదాపు 200 మంది నుంచి దాదాపు రూ.15లక్షలకు పైగా కాజేసిన ఈ మిత్ర త్రయాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 18 సెల్ఫోన్లు, ఐదు సిమ్కార్డులు, రూ.1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లతో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం వివరాలు వెల్లడించారు. బాధితుల డబ్బుతోనే విమానయానం... బిహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లా, బంతారియా–జగదీశ్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్ తొమ్మిదో తరగతి చదివాడు. ఆన్లైన్పై పట్టు సాధించిన అతను అదే గ్రామానికి చెందిన స్నేహితుడు వినోద్ కుమార్, సెమర్ గ్రామానికి చెందిన మంజేష్ కుమార్తో కలిసి ఫిబ్రవరిలో బతుకు దెరువు కోసం షాద్నగర్కు వలస వచ్చి ఓ ప్రైవేట్ పైపులైన్ కంపెనీలో ప్లంబర్లుగా చేరారు. జీతం చాలకపోవడంతో మనీష్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ మోసాలను ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో షాద్నగర్లోని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బులు చేసేవారిలా నటిస్తూ ముందున్న వారి కార్డు వివరాలు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్కు ఫోన్ చేసి ఖాతాదారునిగా చెప్పుకుని ఖాతాలో నగదు వివరాలు తెలుసుకునేవారు. అనంతరం ‘బ్యాంక్ కార్డు వాలిడిటర్స్’ యాప్ ద్వారా ఆ డెబిట్ కార్డు కాలపరిమితి తెలుసుకొని, ఓటీపీ నంబర్ అవసరం లేని ఈ–కామర్స్ వెబ్సైట్ల నుంచి సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసేవారు. ఇందుకుగాను తరచూ సెల్ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు మారుస్తూ వేర్వేరు చిరునామాలు ఇచ్చేవారు. తాము బుక్ చేసిన వస్తువులను తెచ్చుకునేందుకు ఇతర నగరాలకు వెళ్లేందుకోసం విమాన టికెట్లను కూడా బాధితుల డబ్బులతోనే బుక్ చేసుకునేవారు. నాలుగు నెలలుగా షాద్నగర్ నుంచి తమకు తెలియకుండా బ్యాంక్ ఖాతాల నుంచి షాపింగ్ చేస్తున్నట్లు తన సెల్కు ఎస్ఎంఎస్లు వస్తున్నాయని పేర్కొంటూ దాదాపు 75 బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న రూ.3,89,500 పోయినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. దొరికిపోయింది ఇలా... సైబరాబాద్ సైబర్ క్రైమ్కు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా షాద్నగర్ నుంచే ఉండటంతో ఆయా బ్యాంక్ ఖాతాదారులతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం మాట్లాడింది. శంషాబాద్, షాద్నగర్ బస్టాండ్లు, షాద్నగర్ ఏటీఎంకు సమీపంలో డెలివరీ చేసిన వస్తువుల వివరాలపై డెలివరీ బాయ్లను విచారించారు. ఏటీఎంలలోని సీసీటీవీ కెమెరాల పుటేజీల ఆధారంగా మనీష్, వినోద్లను పట్టుకున్న పోలీసులు వారి వివరాల ఆధారంగా మంజేష్ కుమార్ను అరెస్టు చేశారు. ‘ఇప్పటివరకు వీరి సెల్ఫోన్ ద్వారా లభ్యమైన సమాచారాన్ని బట్టి 200 మంది వరకు బాధితులు ఉన్నారు. వీరు పాత డేటాను డిలీట్ చేయడంతో ఇంకా చాలా మంది బాధితులు ఉండొచ్చు. పోలీసు కస్టడీకి తీసుకొని విచారించి పూర్తి విషయాలు తెలుసుకుంటామ’ని సీపీ సజ్జనార్ తెలిపారు. ‘బ్యాంక్ కార్డు వాలిడిటర్స్’ కు నోటీసులు జారీ చేస్తామన్నారు. బ్యాంక్లు కూడా ఫిర్యాదు అందినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్ స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్ఐ గౌతమ్, హెడ్కానిస్టేబుల్ సిద్దేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించారు. -
ఖాతాదారులకు ఎస్బీఐ సూచన
-
ఆమె అలా చెప్పకూడదని తెలియక...
ముంబై : ఇటీవల ఆన్లైన్ మోసాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం. బ్యాంకు అధికారులమంటూ కాల్ చేస్తున్న వారికి, అకౌంట్ వివరాలు, ఫోన్కు వచ్చిన ఓటీపీ వంటి కోడ్లు చెప్పకూడదని పలుమార్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ముంబైలో ఓ మహిళ తన అమాయకత్వంతో సైబర్ నేరగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న అని పోలీసులు ప్రశ్నించగా.. అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదంటూ బిక్కమొహం వేసేసింది. తనకసలు ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి అసలేం తెలియదని చెప్పింది. నావీముంబైలోని నెరూల్కు చెందిన తస్నీమ్ ముజకర్ మోడక్ అనే మహిళ తనకున్న జాతీయ బ్యాంకులో ఇటీవలే 7.20 లక్షల రూపాయలు క్రెడిట్చేసింది. మే 17న తస్నీమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తను ఎస్బీఐ మేనేజర్గా పరిచయం చేసుకున్నాడు. కొన్ని సాంకేతిక సమస్యలతో మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందని చెప్పాడు. అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాలన్నాడు. అతడు చెప్పినట్టే చేసిన తస్నీమ్ అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. వారం వ్యవధిలో అలా 28 సార్లు ఆ ఆన్లైన్ మోసగాడికి తన ఓటీపీ చెప్పింది. ఇలా ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98, 973 కాజేశాడు. పాస్బుక్లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన తస్నీమ్కు తన అకౌంట్ నుంచి రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసింది. దీంతో వెంటనే నెరూల్ పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ నేరగాడు మొత్తం మూడు సిమ్ కార్డులతో తస్నీమ్కు ఫోన్ చేసి, ఓటీపీ వివరాలు రాబట్టినట్టు తెలిపారు. ముంబై, నోయిడా, గుర్గావ్, కోల్కతా, బెంగళూరుల నుంచి ఈ లావాదేవీలు సాగించినట్టు పేర్కొన్నారు. 16 అంకెల డెబిట్ కార్డు నెంబర్, కార్డుపై ప్రింట్ అయిన పేరు, 3 అంకెల సీవీవీ నెంబర్ అన్నీ చాలా రహస్యంగా ఉంచుకోవాలని ఆమెకు పోలీసులు చెప్పారు. తన భర్త కువైట్లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement