CM C Chandrasekhar
-
కేసీఆర్ ఊరికి రూ.5 కోట్లిచ్చిన కేంద్రం
వరంగల్ (ఖానాపురం) : కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు ఇప్పటివరకు రూ.5కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.కోటిన్నర మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం బుధరావుపేట గ్రామంలో ప్రారంభించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘునందన్రావు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తన గ్రామానికి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలుసుకున్న కేసీఆర్ పరువు కాపాడుకునేందుకు ఇంటింటికి రూ.10లక్షలు ఇచ్చాడన్నారు. ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచి్చందని, ఇందులో మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.9వేలు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలు మాత్రమే కేటాయించిందన్నారు. 2014, జూన్ 2 నుంచి రాష్ట్రంలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిధులు ఖర్చు చేసిందో సమాచార హక్కు చట్టం ద్వారా యువకులు దరఖాస్తు చేసి తెలుసుకోవచ్చన్నారు. 1978లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని చెప్పగా.. కాంగ్రెస్ పెద్దలకు ఎలా అర్థమైందోగానీ గరీబీ హఠావో అంటే గరీబోళ్లను గ్రామాల అవతల పెట్టారన్నారు. కేసీఆర్ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు. అభివృద్ధిపై చర్చించడానికి చర్చలు, డిబేట్లకు సిద్ధమని ఆయన కేటీఆర్కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు కేసీఆర్ది అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి, మండల పార్టీ నాయకులు రాజుయాదవ్, జల్లి మధు, యాకస్వామి, సలీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖానాపురంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు రఘునందన్రావు సంఘీభావం తెలిపారు. పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే రఘునందన్రావు సమక్షంలో బీజేపీలో చేరారు. -
10న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను 10న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 872 పరీక్ష కేంద్రాల్లో గత నెల 15 నుంచి 30 వరకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో ఫస్టియర్కు సంబంధించి 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,51,648 మంది ఉన్నారు. -
సిద్దిపేట మెడికల్ కాలేజీకి
పాక్షిక స్వయం ప్రతిపత్తి ముఖ్యమంత్రి వద్దకు ఫైలు పంపిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: సిద్దిపేటలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే మెడికల్ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సంబంధిత ఫైలును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆమోదముద్ర కోసం పంపించారు. వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తిగా సంబంధిత మెడికల్ కాలేజీల ద్వారానే చేపట్టాలనేది ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం నిమ్స్ కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగానే ఉంటోంది. కర్ణాటకలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులు స్వయం ప్రతిపత్తిని అమలుచేస్తున్నాయని.. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొదట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సొంత జిల్లాలోని మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఖాళీల భర్తీ.. పాక్షిక స్వయం ప్రతిపత్తితో ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది నెలలు గడవక ముందే తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ లేదా డిప్యూటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల మారుమూల మెడికల్ కాలేజీలకు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. బదిలీలు, డిప్యూటేషన్ల కారణంగా ఒకవైపు మెడికల్ విద్యార్థులకు, మరోవైపు బోధనాసుపత్రుల్లోని రోగులకు శాపంగా మారుతోంది. పాక్షిక స్వయంప్రతిపత్తితో ఈ పరిస్థితికి చెక్ పడనుంది. ఈ మెడికల్ కాలేజీలో కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా రిటైర్ అయ్యే వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాలి. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే చేరుతారు కాబట్టి సమస్యలు తలెత్తవు. 2018–19 నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు 2018–19 నుంచి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంసీఐ ప్రతినిధి బృందం సిద్దిపేటకు వెళ్లి పరిశీలించాక అక్కడ మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతివ్వనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సిద్దిపేట మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరనుంది. నర్సింగ్ సీట్లకు కూడా అనుమతి కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది.