breaking news
business leaders
-
బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట
దేశంలో జీఎస్టీ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తూ సెప్టెంబర్ 22 నుండి 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేట్ల వ్యవస్థకు మారాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ వ్యాపార దిగ్గజాలు స్వాగతించారు. రాధికా గుప్తా, హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ చర్యను పౌరులకు "పెద్ద దీపావళి బహుమతి" గా అభివర్ణించారు. 'ప్రతి భారతీయుడికి బిగ్ దీవాలీ గిఫ్ట్. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ముడి ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. చౌకైన కిరాణా సరుకులు, ఆరోగ్య సంరక్షణలో ఉపశమనం, సరసమైన విద్య, రైతులకు మద్దతు" అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ సంస్కరణ జీవనాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ద్వంద్వ ప్రయోజనాలతో "నెక్ట్స్-జనరేషన్ జీఎస్టీ" దిశగా ఒక అడుగు అని అన్నారు.ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా ‘ఎక్స్’ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "చాలా క్లిష్టమైన సమయంలో చాలా ప్రగతిశీలమైన చర్య, ఇది డిమాండ్, సెంటిమెంట్ రెండింటినీ పెంచడానికి సహాయపడుతుంది! ప్రపంచం మనల్ని ఒక మూలకు నెట్టినప్పుడు, మరింత గట్టిగా పోరాడటానికి మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి" అని రాసుకొచ్చారు.మరిన్ని సంస్కరణలు ప్లీజ్...మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు యుద్ధంలో చేరాం. మరింత వేగవంతమైన సంస్కరణలు వినియోగాన్ని, పెట్టుబడులను వెలికితీసేందుకు ఖచ్చితమైన మార్గం. ఇవి ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాయి. ప్రపంచంలో భారతదేశ స్వరాన్ని పెంచుతాయి. కానీ స్వామి వివేకానందుని ప్రసిద్ధ ఉపదేశాన్ని గుర్తు చేసుకుందాం: 'లేవండి, మేల్కొనండి. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపవద్దు'. కాబట్టి, మరిన్ని సంస్కరణలు, ప్లీజ్...’ అంటూ పోస్ట్ చేశారు.చదవండి: జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్నిత్యావసరాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం కేటగిరీలను విలీనం చేస్తూ రేట్లను రెండు శ్లాబులుగా హేతుబద్ధీకరించాలని 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. Big Diwali gift 🎁 for every Indian!GST on daily essentials, healthcare, education & farming inputs slashed.🛒 Cheaper groceries💊 Relief in healthcare📚 Affordable education🚜 Support for farmersNext-gen GST = ease of living + boost to economy.— Harsh Goenka (@hvgoenka) September 3, 2025Extremely progressive step at a very critical time that should help boost both demand and sentiment! When the world pushes us into a corner, we push ourselves to fight back harder. pic.twitter.com/DnU7k5tTgq— Radhika Gupta (@iRadhikaGupta) September 3, 2025We have now joined the battle…More and faster reforms are the surest way to unleash consumption and investment.Those, in turn, will expand the economy and amplify India’s voice in the world.But let’s remember the famous exhortation of Swami Vivekananda:“Arise, awake, and… https://t.co/rDoRtjsCw1— anand mahindra (@anandmahindra) September 3, 2025 -
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
ముంబై: లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్లో ముంబైలోని ఆరు లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబైలోని మలబార్ హిల్లో ఓటు వేశారు. #WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటింగ్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూసి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Industrialist Anil Ambani stands in a queue at a polling booth in Mumbai, as he waits for the voting to begin.#LokSabhaElections2024 pic.twitter.com/UUCC9iOmyu— ANI (@ANI) May 20, 2024 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్దార్ రోడ్లోని పోలింగ్ బూత్లో కూతురు అనన్య బిర్లాతో కలిసి ఓటు వేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. The privilege of deciding who will govern us…It’s a blessing. Never turn your back on a blessing… pic.twitter.com/rkSAr2CQMh— anand mahindra (@anandmahindra) May 20, 2024 ముంబైలోని పెద్దార్ రోడ్డు సమీపంలో తన కుటుంబంతో కలిసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, హెచ్డీఎఫ్సీ మాజీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.VIDEO | Lok Sabha Elections 2024: "I, along with my family cast our votes together. It is a very proud moment for every Indian and it is a moment of pride to participate in an election of 140 crore people," says RBI governor Shaktikanta Das (@DasShaktikanta) after casting his… pic.twitter.com/YEPMHmKCqn— Press Trust of India (@PTI_News) May 20, 2024 -
బిజినెస్ లీడర్ 'అట్లూరి'కి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
అమెరికాలోని భారతీయ తెలుగు కమ్యూనిటీ వ్యాపార ప్రముఖులలో ఒకరైన 'అట్లూరి'కి ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 (ఐఎస్ఎఫ్ 2023) ఈవెంట్లో 'లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు' లభించింది. దశాబ్దాలుగా వ్యాపార ఆలోచనలతో అనేక ఔత్సాహిక స్టార్టప్ ఆలోచనలకు వేదికగా పనిచేసిన CXO ఫోరమ్ రూపశిల్పిగా ఉన్నందుకు ఈ అవార్డును అందుకున్నట్లు సమాచారం. స్టార్టప్లలో చాలా మంది ఒకే విధమైన ఆలోచనను కలిగి ఉంటారు. కానీ కొత్త సాంకేతికతలు, మార్కెట్ పోకడలను అవలంబించడం ద్వారా వారు అభివృద్ధి చెందాలని అట్లూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ సూరంపూడి (ఐటీసీ లిమిటెడ్లోని అగ్రి & ఐటీ బిజినెస్ గ్రూప్ హెడ్), డా.డి నాగేశ్వర్ రెడ్డి (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ & ఏఐజీ హాస్పిటల్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ & చీఫ్), వినీత్ రాయ్ (ఆవిష్కార్ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్) డా.గల్లా రామచంద్ర నాయుడు (అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్), డా.పి రాజ మోహన్ రావు (యునైటెడ్ టెలికామ్స్ గ్రూప్ చైర్మన్) మొదలైన వారికి కూడా అవార్డులు అందించినట్లు సమాచారం. -
భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం
వాషింగ్టన్: భారత్లో మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత వ్యాపార రంగంలో పారదర్శకమైన, సానుకూలమైన పాత్ర పోషించేందుకు అనువైన వాతావరణాన్ని భారత్, అమెరికా సంయుక్తంగా సృష్టించాయని ఆయన ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్లోని కెన్నడీ సెంటర్లో అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి వ్యక్తులు, దాతలతో మోదీ భేటీ అయ్యారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యం అనేది అనువుగా మార్చుకున్న సంబంధం కాదు. ఇది పరస్పర వాగ్దానాలు, నిబద్దతకు నిదర్శనం’ అని మోదీ నొక్కిచెప్పారు. ‘ వాషింగ్టన్లో భిన్న రంగాల దిగ్గజాలతో భేటీ అద్భుతంగా కొనసాగింది. ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సైతం పాల్గొనడం విశేషం. భారత ప్రగతిపథ ప్రస్థానంలో భాగమయ్యేందుకు, దేశ అవకాశాల గనిని ఒడిసిపట్టేందుకు అమెరికా పెట్టుబడిదారులకు ఇదే చక్కని సమయం’ అని మోదీ ట్వీట్చేశారు. భారత్లో 75,000 కోట్ల పెట్టుబడి: గూగుల్ ‘భారత్లో దాదాపు రూ.75,000 కోట్ల(10బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టబోతున్నాం. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా సంబంధిత వివరాలు ఆయనతో పంచుకున్నాను’ అని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్లో భాగంగా గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ(గిఫ్ట్)లో తమ గ్లోబల్ ఫిన్టెక్ వ్యాపారకార్యకలాపాలను ప్రారంభిస్తామని గూగుల్ వెల్లడించింది. జీపేకు సపోర్ట్గా ప్రత్యేక కార్యకలాపాలను ‘గిఫ్ట్’లో మొదలుపెడతారని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ‘ఫిన్టెక్ రంగంలో భారత నాయకత్వాన్ని గూగుల్ గుర్తిస్తోంది. అందకే భారత్లో చిన్న, భారీ పరిశ్రమలకోసం సేవలు అందిస్తాం. దాంతోపాటే అమెరికాసహా ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే సేవలు కొనసాగుతాయి. ఈ ఏడాది చివరినాటికి ముఖ్యంగా మహిళల సారథ్యంలో మొదలయ్యే అంకుర సంస్థలకు మద్దతుగా నిలుస్తాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. అమెజాన్ మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అదనంగా 15 బిలియన్ డాలర్లు (రూ.1,23,000 కోట్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్లో తన ఉనికిని మరింత పెంపొందించుకోవాలని అమెజాన్.కామ్ భావిస్తున్నట్లు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలియజేశారు. ఈ అదనపు పెట్టుబడి 2030 నాటికి భారత్లోని వివిధ వ్యాపారాలలో సంస్థ మొత్తం పెట్టుబడిని 26 బిలియన్లకు (రూ.2,13,200 కోట్లకు) చేరుస్తుందని జస్సీ పేర్కొన్నారు. భారతీయ స్టార్టప్లను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులను సులభతరం చేయడం, డిజిటల్ పరివర్తన, గ్లోబల్ మార్కెట్లో అభివృద్ధి చెందడానికి వ్యక్తులు వంటి అంశాలపై చర్చించారు. -
నేను ఓడిపోతే మార్కెట్లు ఢమాల్..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయంపై అగ్ర దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత కార్పొరేట్ దిగ్గజాలతో మంగళవారం సాయంత్రం ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడతూ ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించని పక్షంలో అమెరికా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే తమ మార్కెట్లు వేలకు వేల పాయింట్ల మేర పెరుగుతాయని, తాను ఓడితే అవి మీరెన్నడూ చూడని రీతిలో పేకమేడల్లా కూలిపోతాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ భారత కార్పొరేట్లను కోరారు. కార్పొరేట్లు, నూతన పెట్టుబడులకు నియంత్రణలు, పన్నులను తగ్గించామని చెప్పుకొచ్చారు. గతంలో ఒక్క హైవే ప్రాజెక్టు క్లియరెన్స్కు 20 ఏళ్ల సమయం పడితే తాము క్లియరెన్స్ ప్రక్రియను రెండేళ్లకు కుదించామని పేర్కొన్నారు. పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ట్రంప్తో భేటీ అయ్యారు. చదవండి : ఆయుధాల అమ్మకానికే ఆ డీల్.. -
కష్టాల కడలిలో కంపెనీలు..!
ప్రస్తుతం యూరోపియన్ కంపెనీలన్నీ కష్టాల కడలిలో ఉన్నాయని బిజినెస్ లీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల్లో నెలకొంటున్న మాదిరిగా యూరోపియన్ దేశాల్లో ప్రాంతీయ రాజకీయ ప్రమాదాలు, యూరోపియన్ శరణార్థ సంక్షోభం, వ్యాపారాల విజయానికి పెద్ద ప్రమాదాలుగా మారుతున్నాయని బిజినెస్ లీడర్లు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్ లో బ్రెగ్జిటే అత్యంత ప్రమాదకరంగా మారిందని డెలాయిట్ నిర్వహించిన తాజా యూరోపియన్ సీఎఫ్ఓ సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 17 యూరోపియన్ దేశాల్లో 1,500 సీఎఫ్ఓలపై డెలాయిట్ ఈ సర్వేను చేపట్టింది. క్యాపిటల్ మార్కెట్, ఫండింగ్, బిజినెస్ రిస్క్, మొత్తంగా మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాలపై విశ్లేషణ చేపట్టింది. 2016లో యూరప్ లో అతిపెద్ద కంపెనీలు సాధించే ఫైనాన్సియల్ విజయాలకు ఎదురవుతున్న సవాలపై ప్రధానంగా దృష్టిసారించి డెలాయిట్ ఈ రిపోర్టును రూపొందించింది. ప్రాంతీయ రాజకీయాల ఆధిపత్యం, జనాభా పెరుగుదల, కరెన్సీ విలువలు పడిపోవడం, ఆర్థిక విధానంలో భయాందోళనలు, డీప్లేషన్, వంటివి దేశాల్లో ఉన్న ప్రధాన అవరోధాలుగా సర్వే పేర్కొంది. ప్రాంతీయ రాజకీయాల సంక్షోభం అత్యధిక యూరప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల మదిలో కొనసాగుతున్న అతిపెద్ద సమస్యగా సర్వే గుర్తించింది. దురదృష్టవశాత్తు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ ప్రజాభిప్రాయం రావడం ప్రస్తుతం బిజినెస్ లకు అతిపెద్ద నష్టంగా సీఎఫ్ఓలు పరిగణించారని సర్వేలో వెల్లడైంది. ఈ ఫలితాలు యూకే సీఎఫ్ఓల్లో సెంటిమెంట్ ను బలహీనపరస్తోందని రిపోర్టు నివేదించింది. యూకే ఎజెండాను బ్రెగ్జిట్ రెఫరెండం డామినేట్ చేస్తుందని పేర్కొంది. యూకేలోని చాలా అతిపెద్ద కంపెనీలు ఊహించని విధంగా రెఫరెండం వచ్చిందని, బ్రెగ్జిట్ కు ఇంకా కంపెనీలు ప్రిపేర్ కాన్నట్టు డెలాయిట్ రిపోర్టు తెలిపింది. -
పారిశ్రామికవేత్తలతో కేసీఆర్ భేటీ