-
ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..?
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని ఎగుమతిదారులతోపాటు భారతీయ పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని తెలిపాయి. ఎగుమతులకు అనుగుణంగా రవాణా ఖర్చులు పెరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో ఓ గ్లోబల్ షిప్పింగ్ లైన్నూ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ వర్గాలు సూచించాయి. దీనివల్ల భారతీయ సంస్థలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు వ్యయభారం తగ్గనుందని చెప్పాయి. 2021లో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చార్జీలో భాగంగా 80 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించాల్సి వచ్చేదని, 2030 నాటికి ఇది 200 బిలియన్ డాలర్లను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. చైనా, అమెరికా, కొరియా, ఇజ్రాయెల్ దేశాల కంటే ఆర్అండ్డీపై భారత్ పెడుతున్న ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఇది దేశ జీడీపీలో 1 శాతానికిలోపే ఉందని ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్ అహ్మద్ అన్నారు. ఇదీ చదవండి: ఇకపై మృదువైన రోబోలు.. అంతర్జాతీయ కస్టమర్లకు భారతీయ ఉత్పత్తులు మరింత చేరువయ్యేలా మార్కెటింగ్ సౌకర్యాలు కావాలని, మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) స్కీం కింద బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించాలని అహ్మద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రూ.5,000 కోట్ల కార్పస్తో దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన ఓ పథకాన్ని ప్రకటించేందుకున్న వీలును పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు. -
క్రిప్టో పరిశ్రమ.. బడ్జెట్లో నిర్మలమ్మ కరుణించేనా?
భారత్లో క్రిప్టో కరెన్సీ మీద ప్రభుత్వ స్టాండర్డ్ ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆంక్షలు, నియంత్రణ తప్పదని, ఆర్బీఐ ప్రత్యేక కరెన్సీల.. ఊహాగానాల నడుమే రోజురోజుకీ ఆదరణ మాత్రం పెరిగిపోతోంది. ప్రస్తుతం మన దేశంలో రెండు కోట్ల మందికిపైగా క్రిప్టో ఇన్వెస్టర్లు ఉండగా.. పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు ఎప్పుడో దాటేసిందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రేడర్స్లో క్రిప్టో కరెన్సీ మీద ఉన్న ఆసక్తి ఏపాటిదో భారత్లోని క్రిప్టో పెట్టుబడులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ఆసక్తి నుంచే క్రిప్టో యూనికార్న్లు పుట్టుకొస్తున్నాయి. 2032 నాటికి విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ అస్సెట్స్కి చేరుతుందని అంచనా. కాబట్టే క్రిప్టో ఇన్వెస్టర్లు బడ్జెట్ సెషన్స్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అసలు కొత్త క్రిప్టో బిల్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే చర్చకు వస్తుందనే అనుకున్నారంతా. కానీ, తుది మెరుగుల పేరుతో జాప్యం చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్లో ఉంటుందో లేదో గ్యారెంటీ లేదుగానీ.. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మాత్రం క్రిప్టో ఇండస్ట్రీ కొన్ని ఆశలు, అంచనాలు మాత్రం పెట్టుకుంది. పన్ను వర్గీకరణ క్రిప్టో ఆదాయాల పన్నుకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. అయినప్పటికీ అన్ని క్రిప్టో ప్లేయర్ల దృష్టి ఇప్పుడు పన్నుల అంశాలపై స్పష్టత కోసం వెతుకుతోంది. క్రిప్టోస్పై పన్ను విధించడం గురించి, దాని వర్తించే పన్ను రేట్లు, వర్గీకరణ, TDS/TCS, క్రిప్టోల అమ్మకం.. కొనుగోలుపై GST చిక్కులు లాంటి విషయాల్లో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి, క్రిప్టో పరిశ్రమ క్రిప్టో పన్నుల కోసం ఒక నిర్దిష్ట నిబంధనను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ప్రభుత్వం గతంలో క్రిప్టోకరెన్సీలను వినియోగాన్ని బట్టి వర్గీకరిస్తామని పేర్కొన్న విషయాన్ని క్రిప్టో పరిశ్రమ గుర్తు చేసుకుంటోంది. ఈ ప్రకటనే ట్యాక్సేషన్ కోణంలో పరిశ్రమకు సాయం చేకూర్చవచ్చని భావిస్తున్నారు. పన్ను విధానం ద్వారా క్రిప్టో సెక్టార్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉత్సాహం అందుతుందని ఆశిస్తున్నారు. రెగ్యులేషన్స్ క్రిప్టో వృద్ధికి ఆటంకం కలిగించే ముఖ్యమైన అంశం.. నిబంధనలు. రెగ్యులేటరీ బాడీ అనేది క్రిప్టోకరెన్సీ, బ్లాక్చెయిన్ ప్లేయర్ల పరిధిని మించి ఉండకూడదు. కాబట్టి క్రిప్టో స్పెక్ట్రమ్ ‘పెరుగుతున్న వాటాదారుల సంఖ్య’ను దృష్టిలో ఉంచుకుని ప్రొగెసివ్ రెగ్యులేటర్ గైడ్లైన్స్ తీసుకురావాలని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది. SEBI యొక్క పర్యవేక్షణలో, క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైన ట్రేడబుల్ ఆస్తిగా గుర్తించడం ద్వారా కూడా మరింత స్థిరత్వం దక్కనుంది. మరోవైపు పబ్లిక్-లెడ్జర్-ఆధారిత క్రిప్టో-ఆస్తులను.. ట్రేడింగ్ కోసం రిజిస్టర్ చేయమని ప్రోత్సహించడం కూడా గొప్ప పోటీతత్వానికి దారి తీయనుంది. ఈ అంశాల్ని రాబోయే బడ్జెట్లో కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే గనుక.. క్రిప్టో మార్కెట్ను ప్రోత్సహించవచ్చు, డిజిటల్ ఇండియా తో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్లవచ్చు. అడాప్షన్ ఈ రోజుల్లో బహుళ లావాదేవీలను సులభంగా వెరిఫై చేయడం కోసం, ట్రేస్ చేయడం కోసం ఉపయోగపడుతోంది బ్లాక్చెయిన్. కాబట్టి, బ్లాక్చెయిన్ను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం పరిపాలనా నమూనాలను రూపొందించగలిగితే అది మంచిదే అవుతుంది. బ్లాక్చెయిన్ విధానంలో లావాదేవీలను సురక్షితం చేయడం, ఖర్చులను తగ్గించడం, డాటా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా నగరాల్లో సాంకేతికతను ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుంది. క్రిప్టో విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఇంతకు ముందు బడ్జెట్లు ఆర్థిక సమ్మేళనానికి సంబంధించినవి, అయితే రాబోయే బడ్జెట్ కొత్త సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కీలకంగా వ్యవహరించనుందని నిపుణులు భావిస్తున్నారు. 2022 సంవత్సరం క్రిప్టో పరిశ్రమకు అద్భుతమైన సంవత్సరంగా భావిస్తోంది క్రిప్టో ఇండస్ట్రీ. పన్నులు, నియంత్రణ.. వర్గీకరణపై స్పష్టత, జనాభాలో విశ్వాసాన్ని త్వరగా తీసుకువస్తే క్రిప్టో పరిశ్రమ ఆశించిన మేర దూసుకుపోవడం మాత్రం ఖాయం. -
బడ్జెట్ 2022: మధ్యతరగతి వర్గానికి ఒకింత ఊరట!
బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి. రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది.. స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్లోనే స్పష్టత రానుంది. వర్క్ఫ్రమ్ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్! -
జైట్లీ బడ్జెట్ ఇలా ఉంటుందా!
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాలు బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో రెండోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి కూడా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు. అలాగే పన్ను మినహాయింపుల ద్వారా పొదుపు చర్యలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం లేకుండా గృహరుణాలకు మరింత రాయితీలు కల్పించాలని, 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని మధ్యతరగతి వారు ఆశిస్తున్నారు. ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసారాల శాఖలను కూడా జైట్లీ నిర్వహిస్తున్నందున బడ్జెట్లో తమకూ న్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు విశ్వసిస్తున్నాయి. 2014లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అరుణ్ జైట్లీ రూ. 2 లక్షలుగా ఉన్న ఆదాయం పన్ను రాయితీని రూ. 2.5 లక్షలకు పెంచడంతోపాటు పన్ను శ్లాబుల్లో రాయితీలను పెంచారు. పలు సందర్భాల్లో ఆదాయం పన్ను రాయితీలను పెంచుతామని అరుణ్ జైట్లీయే స్వయంగా ప్రకటించినందున ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల ఆదాయం పన్ను కనీస పరిమితిని కనీసం రూ. 3 లక్షలకు పెంచడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే శ్లాబుల్లోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న ఆదాయ వనరులను పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచవచ్చని, క్రూడాయిల్ (ముడి చమురు) దిగుమతులపై ఎత్తేసిన కస్టమ్స్ సుంకాన్ని తిరిగి విధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 120 డాలర్లు చేరుకున్న నేపథ్యంలో 2011, జూన్లో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర బ్యారెల్కు 60 డాలర్లకు చేరుకున్నందున తిరిగి సుంకం విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రూడాయిల్పై ఐదు శాతం సుంకం విధించినా కూడా రూ. 18 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. దేశీయంగా ఉత్పత్తవుతున్న క్రూడాయిల్పై రెండు శాతం పన్ను ఇప్పటికీ అమల్లో ఉంది. క్రూడాయిల్ వినియోగంలో మనం 80 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. సుంకం విధింపు వల్ల అనివార్యంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి. అధిక ఆదాయం పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి వంట గ్యాస్ (ఎల్పీజీ) సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా గత ఆరునెలలుగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ కారణంగా 20 నుంచి 30 శాతం వరకు భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. సరుకులు, సేవా పన్నులను పెంచడం ద్వారా ప్రత్యక్ష పన్నులను స్థిరీకరించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సేవా పన్నును 12 నుంచి 14 శాతానికి పెంచవచ్చని వారి అంచనా. అదే జరిగితే ఫోన్ కాల్స్ చార్జీలు, హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. జిమ్లు ప్రియమవుతాయి. క్లబ్ మెంబర్షిప్పులు భారమవుతాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే తగ్గినందున పది శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఆటోమొబైల్ రంగం ఎక్సైజ్ సుంకం తగ్గింపును కోరుకుంటున్నా.. ఆ దిశగా చర్యలు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement