breaking news
Bhakarapeta forest area
-
Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం!
శేషాచల అడవుల్లో ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇష్టారాజ్యంగా అడవుల్లోకి చొరబడుతున్నారు. ఎర్రచందనం దుంగల నాణ్యత పరిశీలించేందుకు మొదట వాటి బెరడు తీసేస్తున్నారు. ఆపై నాణ్యత లేకుంటే అలాగే వదిలేస్తున్నారు. బెరడ తీసేయడంతో వందలాది వృక్షాలు నిలువునా ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి జిల్లా: శేషాచలం అడవుల్లో గొడ్డళ్ల చప్పుడు ఆగనంటోంది. తమిళ కూలీలు ఇష్టారాజ్యంగా చొరబడుతూ ఎర్రచందనం చెట్లను నేలకూల్చుతున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఇందులో బడా స్మగ్లర్ల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల కళ్లుగప్పుతున్నట్టు తెలుస్తోంది. క్వాలిటీ కోసం చంపేస్తున్నారు గతంలో ఎర్రచందనం వృక్షాలకు చిన్న పాటి రంధ్రం వేసి నాణ్యతను పరీక్షించేవారు. క్వాలిటీ ఉన్న చెట్లును నరికి తరలించేవారు. ఇప్పుడు కొత్త పంథాలో నాణ్యతను పరిశీలిస్తున్నారు. చెట్టును నరకకుండా పైన ఉన్న బెరడును తొలిచి నాణ్యతను చూస్తున్నారు. నాణ్యత లేకుంటే అలానే వదలేస్తున్నారు. బెరడు తీసేయడంతో ఎర్రచందనం చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శేషాచలం మొత్తంగా కొన్నివందల చెట్లు ఇలా చనిపోయి ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. టన్ను రూ.1.5 కోట్లు ఎర్ర స్మగ్లర్లు నం.1 క్వాలిటీకే మెుదట ప్రాధాన్యత ఇస్తున్నారు. అడవిలో ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్లి నాణ్యమైన దుంగలు ఎంచుకుంటున్నారు. బహిరంగ వేలంలో నం.1(గ్రేడ్–1) ఎర్ర దుంగలు టన్ను రూ.1.5 కోట్లు పలుకుతున్నట్టు సమాచారం. ఆయుధాలతో ఎదురుదాడి అటవీ ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లిన వారిపై తిరుగుబాటుకు సైతం కూలీలు లెక్కచేయడంలేదు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎర్రకూలీలను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపాడుకుంటాం ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, డిపార్టుమెంట్ ఆదేశలను పాటిస్తూ నిఘా పెట్టాం. వివిధ శాఖలతోపాటు అటవీసరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఎర్రచందనాన్ని కాపాడుకుంటాం. – పట్టాభి, రేంజర్, భాకరాపేట .. -
టాస్క్ఫోర్స్పై ఎర్ర కూలీల దాడి
►ఎర్రచందనం దుంగలు స్వాధీనం ►ఇద్దరు తమిళ కూలీల అరెస్టు ►కొనసాగుతున్న కూంబింగ్ భాకరాపేట : టాస్క్ఫోర్స్పై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి దిగిన సంఘటన బుధవారం ఉదయం భాకరాపేట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. రెడ్ శాండల్ టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు ఆదేశాల మేరకు తెల్లవారుజామున ఆర్ఎస్ఐ భాస్కర్ నేతృత్వంలో సిబ్బందితో కలసి భాకరాపేట ఘాట్ మార్గం నుంచి కూంబింగ్ నిర్వహించారు. భాకరాపేట అటవీ ప్రాంతంలోని గద్దలగూడు బండల సమీపంలో తమిళ కూలీలు తారసపడ్డారు. ఆర్ఎస్ఐ భాస్కర్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. దీంతో తమిళ కూలీలు వారిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. 12 మంది ఉన్న తమిళ కూలీల బృందంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు; మిగిలిన వారు పారిపోయారు. వీరి నుంచి 11 దుంగలు, వెంట తీసుకొచ్చిన బట్టలు, బ్యాగులు, అన్నం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జువాదిమలైకు చెందిన మనోహర్, రాజేంద్రన్ ఉన్నారు. మిగిలిన వారి కోసం మరో టాస్క్ఫోర్స్ బృందాన్ని డీఐజీ పంపించారు.