-
కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డెయిరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడ్ గవర్నెన్స్లో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన ఈ–క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ 2023–24 వార్షిక రుణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ నాటికే రూ.4,77,234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. దీనిలో ప్రాధాన్యత రంగం కింద రూ.3.23 లక్షల కోట్లు అందించాల్సి ఉండగా రూ.2.88 లక్షల కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే రూ.2.31 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం కాగా రూ.2.08 లక్షల కోట్లు అందించామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.69 వేల కోట్లకు గాను రూ.71,113 కోట్లు అందజేశామని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యేతర రంగంలో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.1,88,557 కోట్లు ఇచ్చామన్నారు. అలాగే బ్యాంకు లింకేజ్ కింద 35 వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31,699 సంఘాలకు సాయం అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్టాండ్ అప్ ఇండియా కింద 13,078 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిసెంబరు నెలాఖరు నాటికి 12,768 మందికి సాయమందించామని తెలిపారు. పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14,860 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతేడాది డిసెంబర్ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం రవీంద్రబాబు వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాల్లో మంచి ప్రగతి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించడంలో మంచి ప్రగతిని సాధించారన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీ ఇన్చార్జి రాజేష్ కె.మహానా, యూబీఏ జీఎం గుణనాధ్ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్ బాబు, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
శ్రీనగర్: బ్యాంకులు వివిధ రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ కోరారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పించాలని మంగళవారం విజ్ఞప్తి చేశారు. కేంద్రపాలిత ప్రాంత స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ఆర్థిక అభివృద్ధిలో సాధారణంగా విద్య ఎంత కీలకమో ఆర్థిక అక్షరాస్యత కూడా అంతే ముఖ్యమన్నారు. ‘‘బ్యాంకులు వివిధ రుణ పథకాల గురించి ప్రజలలో అవగాహన పెంచాలి. దీనివల్ల ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు వారికి అందుతాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► పీఎం సేవానిధి స్కీమ్లో రుణగ్రహీతల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పథకం లబ్ధిదారులను మార్గనిర్దేశం చేసి, పీఎం ముద్రా యోజన కింద అధిక రుణాలు పొందే అర్హతను వారు పొందేందుకు కృషి జరగాలి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ చొరవలతో జమ్మూ, కశ్మీర్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక్కడ బ్యాంకింగ్ పోషిస్తున్న పాత్ర పట్ల సంతృప్తి ఉంది. జమ్మూ, కశ్మీర్లో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవల విస్తరణకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందిస్తుంది. ► గత రెండేళ్లలో దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయి. ఇది అభినందనీయం. -
బడుగులకు రుణాలివ్వని బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీపై పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్న మాటలు అబద్ధాలేనని తేలింది. ఆ ఐదేళ్లలో బడుగులకు అందాల్సిన సబ్సిడీ వారికి చేరలేదని వెల్లడైంది. ఆ సబ్సిడీ సొమ్మంతా బ్యాంకుల్లోనే మగ్గుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ కార్పొరేషన్లకు చెందిన సబ్సిడీ నిధులు రూ.515 కోట్లు ఎటువంటి వినియోగం లేకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఆయా వర్గాలకు రుణాలు మంజూరు చేయకపోవడంతో సబ్సిడీ నిధులు ఖాతాల్లోనే ఉండిపోయాయి. సబ్సిడీ రుణాల మంజూరు రికార్డులను తనిఖీ చేసి, పెండింగ్లో ఉన్న వినియోగ పత్రాలను ఇవ్వాలని సంబంధిత బ్యాంకు బ్రాంచ్లను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోరింది. పెండింగ్లో ఉన్న రుణాల సబ్సిడీ వివరాలను సంబంధిత శాఖలు కూడా బ్యాంకులకు సమర్పించాలని సూచించింది. మిగిలిపోయిన సబ్సిడీ రుణాల సొమ్మును బ్రాంచీలు ఆయా సంస్థలకు తిరిగి జమ చేయాలని ఆదేశించింది. సబ్సిడీ ద్వారా ఆ వర్గాలకు రుణాలివ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనట్లు ఈ నివేదికను బట్టి తేలింది. -
ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా పంటల సాగుకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడానికి రైతులకు అందుబాటులో ఆర్బీకేల్లో కియోస్క్లను పెట్టాం. అందులో రైతులు ఆర్డర్ చేస్తే నిర్దేశిత సమయంలోగా వారి గ్రామాల్లోనే వారి ఇంటి వద్దకే వారికి కావాల్సినవి అందుతాయి. ఈ వ్యవస్థ అంతా బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం కావాలి. సంపూర్ణ డిజిటలైజేషన్కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు 35 వేల రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని, వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి (3 శాతం) రుణాలు ఇస్తే, మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటికి బ్యాంకులు సహకారం అందించడంపై మార్గనిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, జియో ట్యాగింగ్ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామని తెలిపారు. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. సిమెంట్, స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని, చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కౌలు రైతులకు రుణాలు అందాలి ► కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ (సీసీఆర్సీలను) ఇచ్చాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాపింగ్కు అనుసంధానం చేశాం. ► ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులు. సీసీఆర్సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారిస్తున్నాం. వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్ ద్వారా ధృవీకరిస్తున్నాం. అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. ► వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంట రుణాలు కచ్చితంగా రుణాలు అందాలి. విత్తనం నుంచి విక్రయం వరకు.. ► రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్ చేసి మరీ ఇ– క్రాపింగ్ చేస్తున్నాం. ► పంటను సాగు చేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది. ► ఇ– క్రాపింగ్ అనేది సీసీఆర్సీ కార్డులకే కాదు, వడ్డీ లేని పంట రుణాలకు, ఇన్పుట్ సబ్సిడీకి, ఇన్సూరెన్స్కు.. ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది. అన్ని ఆర్బీకేల్లోనూ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలకు గాను బ్యాంకర్లు ఇప్పటికే 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను నియమించడం ప్రశంసనీయం. మిగిలిన 4240 చోట్ల కూడా వీలైనంత త్వరగా వారిని నియమించాలని కోరుతున్నాను. ► ప్రతి ఆర్బీకేలో ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండాలి. ఇతని సేవలను ఆర్బీకే వినియోగించుకోవాలి. ఇ– క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి. ఇది అంతిమంగా డిజిటలైజేషన్ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది. ► బ్యాంకింగ్ విషయంలో వైఎస్సార్ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామని చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్ కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్/ఆన్లైన్ సదుపాయం కల్పించడం అని చెప్పారు. ఇది మంచిదే. కానీ సేవల పరంగా ఇంకా ముందుకెళ్లాలి. ► అంతిమంగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికీ రుణాలు అందాలి. ఆర్బీకేలు, అందులో కియోస్క్లు లాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలు మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలి ► జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టి సారించాలి. ► ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తోంది. వీరికి తగిన తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. ► ఈ సమావేశంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్గా ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్ కుమార్ గార్గ్లు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు సహకరించాలి ► వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారైన మహిళ సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రమం తప్పకుండా నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున మొత్తంగా రూ.75 వేలు అందుతాయి. ► వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ మొత్తం అందుతుంది. తద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారిని రిలయన్స్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ యూనిలీవర్, అమూల్ లాంటి కంపెనీలతో టై అప్ చేశాం. ► ఈ మహిళలకు సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారు. చేయూత కింద ఇప్పటికే రెండుసార్లు నగదు అందించాం. మరో రెండుసార్లు అందిస్తాం. బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యే శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. ► మహిళ చేతిలో పెట్టే డబ్బు, బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని కోరుతున్నాను. ఇప్పటికే 1.17 లక్షల పాలిచ్చే పశువులను పంపిణీ చేశాం. 72,179 మేకలు, గొర్రెల యూనిట్లను కూడా అందించాం. ఫేజ్ –2లో భాగంగా కిరాణా దుకాణాల కోసం 22 వేల మంది, మరో 35,898 మంది పాలిచ్చే పశువులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కోరుతున్నాం. కష్టకాలంలో మీ సేవలు భేష్ ► కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధి మార్గాలు దెబ్బ తిన్నాయి. కోవిడ్ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతింది. ► గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది. ► దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 24.43 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. ► 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో క్షీణత 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను. ► గతేడాది ఇదే పీరియడ్తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయ రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం. ఏపీ కార్యక్రమాల పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో ఆసక్తి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తున్నాం. రాష్ట్రంలో చేయూత మహిళలకు స్వయం ఉపాధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన సమావేశాల్లో పలు ఉత్తరాది రాష్ట్రాలు ఏపీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లను కోరారు. పెద్ద సంస్థలతో కలిసి రిటైల్ దుకాణాలను మహిళలు నడుపుతున్న తీరు పట్ల బిహార్, యూపీ ఎంపీలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏపీ తరహాలోనూ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జగనన్న తోడులో భాగంగా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల్లో దేశంలోనే ఏపీ నంబర్వన్గా నిలిచింది. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ డిజిటలైజేషన్తో సులువుగా సేవలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సంపూర్ణ డిజటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సులువుగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. – సుధీర్కుమార్ జన్నావర్, చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న కార్యక్రమాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి దోహదపడ్డాయి. ఆర్బీకేలు కూడా వినూత్న వ్యవస్థ. వీటివల్ల రైతులకు చాలా ప్రయోజనం ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అమ్మకం, కియోస్క్ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఇప్పటి డిజిటల్ ఏజ్లో ముందడుగుగా భావిస్తున్నాం. – దినేష్కుమార్ గార్గ్, యూబీఐ ఈడీ, ముంబయి -
బ్యాంకులు మరింత తోడ్పడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాల్సిందిగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక పథకాలను నిరంతరాయంగా అమలుచేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, అందరికీ ఇళ్లు, టిడ్కో గృహాలు వంటి పథకాలకు బ్యాంకులు మరింతగా సహకరించాలి. ► రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టారు. వాటితోపాటు కౌలు రైతులందరికీ అవసరమైన మేర రుణాలు అందించాలి. ► రాష్ట్రంలో 130 శాతం క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తిని నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున బ్యాంకర్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద సుమారు 50 లక్షల మందికి బీమాను కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికీ బ్యాంకులు సహకరించాలి. ► పెండింగ్లో ఉన్న ‘జగనన్న తోడు’ దరఖాస్తుదారులందరికీ త్వరితగతిన సాయం చేయాలి. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకిచ్చే రుణాల వాటాలో మెరుగైన ప్రగతి కనబర్చాలి. ► స్వయం సహాయక సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధమైన విధానాన్ని పాటించాలి. కౌలు రైతులకు మరిన్ని రుణాలివ్వండి.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కౌలు రైతులకు రుణాలు మంజూరులో మెరుగైన ఫలితాలు సాధించకపోవడంపై గత డిసెంబర్లో సీఎం అసంతృప్తి వ్యక్తంచేసిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఆరి్థక సంవత్సరంలోనైనా వీరికి మెరుగైన రీతిలో రుణాలివ్వాలని కోరారు. వ్యవసాయానుబంధ రంగాల రైతులకూ సాయం చేయాలన్నారు. రైతుభరోసా కేంద్రాలను బలోపేతం చేసేందుకు బ్యాంకులు అన్నివిధాలా తోడ్పడాలని మంత్రి కన్నబాబు కోరారు. ఏపీలోనే అత్యధిక కౌలు రైతులకు రుణాలు నాబార్డు సీజీఎం సుదీర్ జన్నావర్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కౌలు రైతులకు రుణాలందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. అన్ని బ్యాంకులు మెరుగైన లక్ష్యాలు సాధించడాన్ని ఆయన కొనియాడారు. ఆర్బీఐ జీఎం సుందరం శంకర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో క్రెడిట్ రేట్ 6.2 శాతంగా ఉండగా ఏపీలో 15.92 శాతంగా ఉండడం అభినందనీయమన్నారు. చివరి త్రైమాసికంలో కూడా బ్యాంకులు తమ లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆక్వా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున అవకాశాలున్నాయని అందుకు బ్యాంకులు సహకారం అందించేందుకు ముందుకు రావాలని యుబీఐ సీజీఎం లాల్సింగ్ కోరారు. అంతకుముందు.. ఎస్ఎల్బీసీ కనీ్వనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం బ్రహ్మానందరెడ్డి సమావేశానికి స్వాగతం పలికి అజెండాను వివరించారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement