-
సార్ రేపటి నుంచి రారని చెప్పడంతో..
సాక్షి, ఆదిలాబాద్: విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు వృత్తిలో భాగంగా వేరే ప్రాంతాలకు బదిలీ కావడం, లేదంటే ఉద్యోగ విరమణ పొందడం సహజం. అయితే, కేవలం మాష్టారుగానే కాకుండా.. పిల్లలతో ఓ స్నేహితుడిలా, మార్గదిర్దేశకుడిగా వ్యవహరించేవారు అరుదు. అలాంటి వారిలో బజార్ హత్నూర్ మండలం ప్రాతమిక పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ ఒకరు. ఆయన నిన్న (ఫిబ్రవరి 29) పదవీ విరమణ పొందారు. శంకర్ సార్ రేపటి నుంచి పాఠశాలకు రారని తోటి ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పడంతో.. పిల్లలు ఆయనను చుట్టూచేరి వెళ్లొద్దంటూ భోరున ఏడ్చారు. విద్యార్థులు తనపట్ల చూపిన ప్రేమాభిమానాలకు ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ కన్నీరు పెట్టారు. (చదవండి: ఉచ్చుకు చిరుత బలి) -
ఉచ్చుకు చిరుత బలి
సాక్షి, బజార్హత్నూర్(ఆదిలాబాద్) : అడవి పందుల కోసం పంట చేను చుట్టూ అమర్చిన విద్యుత్ కంచెకు తగిలి ఓ చిరుతపులి బలైంది. బజార్హత్నూర్ మండలంలోని డేడ్రా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమర్డ(బి) గ్రామ సమీపంలో మంగళవా రం రాత్రి చౌహన్ నాందేవ్ తన చేనులో అ డవి పందుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా అటువైపు వచ్చిన చిరుతపులి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మండలంలోని డేడ్ర అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ అటవీ శాఖ ఎఫ్డీవో బర్నోబా, ఎఫ్ఆర్వో అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని డేడ్ర అటవీ బీట్లోని ఉమర్డ(బి) గ్రామానికి 50మీటర్ల దూరంలోని తన చేనులో చౌహన్ నాందేవ్ తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన చేనులో అడవి పందుల వేట కోసం సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగలను అమర్చారు. రాత్రి ఆ వైపుగా వచ్చిన చిరుతపులి విద్యుత్ తీగలు తగిలి షాక్తో మృతి చెందింది. ఉదయం మృతి చెందిన చిరుతపులిని చూసిన నాందేవ్ మరో ఆరుగురు చౌహన్ కృష్ణ, సిడం నాగోరావ్, కొడప కృష్ణ, పెందూర్ నాగేందర్, సోయం నాగేశ్వర్, మడవి సునిల్ సహకారంతో కళేబారాన్ని సంఘటన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని పొదల్లోకి తీసుకెళ్ళి కాల్చివేశారు. చౌహన్ నాందేవ్ తాగిన మైకంలో బజార్హత్నూర్ గ్రామానికి వచ్చి ఫోన్లో అటవీశాఖ ఎఫ్ఆర్వో అప్పయ్యకు ఉమర్డ గ్రామస్తులు చిరుతపులిని చంపారని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. దీంతో ఎఫ్ఎస్వో సుదర్శన్ సిబ్బందితో బజార్హత్నూర్ గ్రామానికి చేరుకుని నాందేవ్ను అదుపులో తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కాలిన బూడిదను, నాందేవ్ ఇంటివద్ద నుంచి చిరుతపులికి సంబంధించిన 9గోర్లు, 7మీసాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితులపై వైల్డ్లైప్ యాక్ట్ 1972 ప్రకారం సెక్షన్ 9, 39(1)(డీ), 44ఆర్/డబ్ల్యూ 51, ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం యూ/ఎస్ 20(1)(సీ), యూ/ఎస్ 3, యూ/ఎస్ 447, 429, 120(బి), ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశామని చౌహన్ కృష్ణ, కొడప కిషన్లు ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇన్ఫార్మరే ప్రధాన నిందితుడు డేడ్ర అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకున్న చిరుతుపులి మృతి సంఘటనలో ప్రధాన నిందితుడు చౌహన్ నాందేవ్ అటవీ శాఖ అధికారులకు చాలా రోజులుగా ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడు. ఉమర్ఢ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అటవీ శాఖ అధికారులతో నాందేవ్కు ఉన్న సన్నిహిత్యంతో మాంసం కోసం అటవీ జంతువులను వేటాడుతూ ఉంటాడని, మంగళవారం నాందేవ్ అటవీ పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు చిరుతపులి బలి అయిందని తెలిపారు. అనంతరం తాగిన మైకంలో అధికారులకు విషయం చెప్పాడని వివరించాడు. అక్రమ కేసులు పెట్టారని గ్రామస్తుల ఆందోళన లంబాడా కులానికి చెందిన చౌహన్ నాందేవ్ తన కుమారుడు చౌహన్ కృష్ణ ఇద్దరు చిరుతపులి మృతికి కారకులని గ్రామానికి చెందిన సిడం కాశీరాం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నాందేవ్ ఉదయం గ్రామానికి వచ్చి చిరుతపులి మృతిచెందిందని అటవీ శాఖ అధికారులకు తెలిస్తే జైలుకు పంపుతారని, నన్ను కాపాడలని వేడుకుంటే గ్రామస్తులు వెళ్ళారే తప్ప అందులో ఆదివాసీలు ఎవరు బాధ్యులు కారని ఇచ్చోడ రేంజ్ కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. సిడం కిషన్ ఢిల్లీలో ఆదివాసీ గర్జన సభలో ఉంటే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. మంగళవారం రాత్రి విచారణ పేరుతో ఎఫ్ఆర్వో అప్పయ్య ఉమార్డ గ్రామంలో ఆదివాసీ మహిళను తలుపులు పెట్టి విచారించడం ఏమిటని ప్రశ్నించారు. ఆదివాసీలు వందల సంఖ్యలో రేంజ్ కార్యాలయానికి చేరుకోవడంతో బోథ్, ఇచ్చోడ సీఐలు మల్లేష్, శ్రీనివాస్, ఎస్సైలు పుల్లయ్య, ఫరిద్, భరత్సుమన్, పోలీసు సిబ్బంది చేరుకొని ఆదివాసీ గిరిజనులను మెప్పించి అక్కడి నుంచి పంపించారు. -
ఇలా కడితే సొంతింటి కల సాకారం
బజార్హత్నూర్, న్యూస్లైన్ : తక్కువ వ్యయంతో సొంతింటి కలను సాకారం చేస్తోంది గృహ నిర్మాణ శాఖ. ఇంజినీర్ల సూచనల ప్రకారం నిర్మిస్తే మూడు గదులతో అందమైన ఇల్లు రూపుదిద్దుకుంటుంది. మండల కేంద్రమైన బజార్హత్నూర్లో నమూనా ఇంటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్మించారు. రూ.2లక్షలలోపే వ్యయమైందని తెలిపారు. ఈ భవనంపై లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఎస్సీలకు ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్షా 50వేలు, బీసీలకు రూ.70వేలు అందిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ డీఈ బసవేశ్వర్ తెలిపారు. నిర్మాణం ఇలా.. కట్ పిల్లర్స్పై బీమ్స్ వేసి పునాది నిర్మాణం చేపట్టారు. ఇందుకు 26 బస్తాల సిమెంటు ఉపయోగించారు. పునాదిపై సిమెంటు ఇటుకలతో గోడలు నిర్మించారు. 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి 1300 సిమెంటు ఇటుకలు వినియోగించారు. వీటికి రూ.18వేలు ఖర్చు చేశారు. గోడల నిర్మాణానికి 30 బస్తాల సిమెంటు వాడారు. మొత్తం సిమెంటు ఇటుకలు కావడంతో ప్లాస్టరింగ్కు తక్కువ సిమెంటు అవసరమైంది. స్లాబ్ నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. స్లాబ్ కోసం క్వింటాల్ 25కిలోల సలాక, 25బస్తాల సిమెంటు వాడారు. స్లాబ్ వేసేటప్పుడు ఇంటిపైకప్పు భాగంలో గూనలను ఉపయోగించారు. వీటిపై స్లాబ్ వేశారు. గూనలు వాడడం వల్ల సిమెంటు, కాంక్రిట్, సలాక, ఇసుక ఆదా అవుతుంది. అంతేగాకుండా వేసవిలో చల్లగానూ ఉంటుంది. ఇంటి లోపల పైకి చూస్తే గూనలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పైకప్పు కోసం 480 గూనలు వాడారు. ఆరు కిటికీలు, రెండు వెంటిలేటర్లు, రెండు తలుపులు రూ.6వేలతో కొనుగోలు చేసి బిగించారు. నమూనా గృహానికి రూ.2లక్షలు వ్యయమైందని గృహా నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement