-
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
బతికుండగానే చంపేశారు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ‘అర్జున్ సురవరం’ సినిమా వచ్చింది. నిరుద్యోగుల డిగ్రీ సర్టిఫికెట్లను వారికి తెలియకుండా సేకరించి, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈలోగా లోన్ కట్టలేదంటూ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులొచ్చి అరెస్టు చేస్తారు. బాధితుడైన హీరో.. ఆ స్కాంను బయటపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. సరిగ్గా హైదరాబాద్లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. తమ తోటి వ్యాపార భాగస్వామి తండ్రిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వారి ఆస్తినే తాకట్టు పెట్టి రూ.16 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు నేర స్వభావం ఉన్నవారి చేతిలో పడితే చిక్కులు ఎదురవుతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. సీన్ కట్ చేస్తే..: బంజారాహిల్స్ రోడ్నంబర్ 5లో రెన్లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రక్తం నుంచి తీసిన సీరమ్, అల్బుమిన్ తదితరాలను సేకరించి విక్రయిస్తుంది. 2017లో ఈ కంపెనీని ఆరుల్ ప్రకాశ్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్లు స్థాపించారు. వీరిద్దరూ కూడా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్.. మైసూర్ రాఘవేంద్ర మూడో డైరెక్టర్గా చేరాడు. రాఘవేంద్ర కుటుంబం పేరు మీద దక్షిణ బెంగళూరులోని కెంగెరి గ్రామంలో 3.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఆరుల్, అజీజ్లు కన్నేశారు. రాఘవేంద్రకు తెలియకుండా ఈ భూమి నకిలీ సేల్ డీడ్ సంపాదించారు. జానకీ రమాశర్మ అనే ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సాయంతో సదరు భూమిని తనఖాగా ఉంచి రుణం కోసం తొలుత ఎస్బీఐ సైఫాబాద్ శాఖలో రుణం కోసం యత్నించారు. అక్కడ యత్నం బెడిసికొట్టింది. ఈసారి మరింత పకడ్బందీగా మహబూబ్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్లో రాఘవేంద్ర పేరిట రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్.. డైరెక్టర్ రాఘవేంద్ర తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, నకిలీ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఫొటోలు, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సంపాదించారు. రుణం కోసం దరఖాస్తు పత్రాలకు జతచేసిన వివరాలు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లోని వివరాలతో పొంతనలేదు. అయినా వాటిని అలాగే సమర్పించారు. ఈ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే.. మహబూబ్గంజ్ బ్రాంచ్ ఆర్ఎంఎంఈ పవన్కుమార్, చీఫ్ మేనేజర్ జే.నాగేశ్వరశర్మ, బ్యాంకు మేనేజర్ శశిశంకర్లు రూ.16 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర అవాక్కయ్యాడు. తన తండ్రి చనిపోయాడంటూ పత్రాలు సృష్టించారని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ విషయంపైతానే స్వయంగా దర్యాప్తు చేశాడు. బ్యాంకుకు వచ్చి లోను మంజూరు చేసినఫైళ్లలో ఫొటో, సంతకం తనవి కావని నిరూపించాడు. దీంతో నాలుక్కరుచుకున్న ఎస్బీఐ ఉన్నతాధికారులు లోను ఖాతాను నిరర్ధక ఆస్తి (నాన్పెర్ఫామింగ్ అసెట్)గా గతేడాది మార్చి 8న ప్రకటించారు. బ్యాంకు అంతర్గత విచారణలో విభాగాధిపతి ధనార్జనరావు సహా పలువురు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అనంతరం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తమ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురువారం రాత్రి నిందితులుగా ఉన్న ఎస్బీఐ అధికారులు, రెన్లైఫ్ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. -
ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు
‘‘మా సినిమాకు హెల్ప్ చేయడానికి దేవుడిలా వచ్చిన చిరంజీవిగారు, ప్రేక్షకుల మౌత్ టాక్, మీడియా సపోర్ట్... మా ‘అర్జున్ సురవరం’ చిత్రం విజయం సాధించడానికి ఈ మూడు ప్రధాన కారణాలు’’ అని అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా బి.మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నవంబరు 29న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను నమ్మి, ప్రమోట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటనలోనే కాదు.. ప్రమోషన్స్లోనూ కోపరేట్ చేసిన లావణ్యాత్రిపాఠికి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనల్గా విజయం సాధించాం. సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సంతోష్. ‘‘మోసం విశ్వవ్యాప్తమైనప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య అని జార్జ్ ఆర్వెల్ చెప్పిన కొటేషన్ ఈ సినిమాకు స్ఫూర్తి’’ అన్నారు రాజ్కుమార్. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘అనుక్షణం సినిమా గురించి ఆలోచించే వ్యక్తి నిఖిల్. తనను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం హ్యాపీ’’ అన్నారు నటుడు రాజ్ తరుణ్. నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్ నటీనటులు సత్య, కేదార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన
సాక్షి, హైదరాబాద్: నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అర్జున్ సురవరం.. మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను చిత్ర యూనిట్ నేరుగా కలుస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు వెళ్లిన హీరో నిఖిల్ అక్కడ రోడ్డు మీద ఓ బండిపై తాజాగా విడుదలైన సినిమాలకు సంబంధించిన పైరసీ డీవీడీలను ఓ మహిళ అమ్ముతుండడం గమనించి షాక్కి గురయ్యాడు. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నాం. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ ఎందరో జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఇలా.. రూ.40కే మా సినిమాను అమ్మేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ బండిపై సీడీలు విక్రయిస్తున్న మహిళ తనకు ఏమీ తెలియదని చెప్తూ.. తన కుటుంబ పోషణ కోసమే ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Had so much fun interacting with Housefull Crowds in Guntur yesterday and on the way back stopped for tea and Found This ... #ArjunSuravaram and other movie DVD’s being openly sold🤦🏻♂️ pic.twitter.com/nEBCbtAeqh — Nikhil Siddhartha (@actor_Nikhil) December 8, 2019 -
ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కేరాఫ్ అర్జున్ సురవరం
నగరంలో సినీసందడి నెలకొంది. అర్జున్ సురవరం చిత్ర యూనిట్ విజయ యాత్రలో భాగంగా శ్రీకృష్ణా థియేటర్కు ఆ చిత్ర హీరో నిఖిల్, క్యారెక్టర్ నటుడు నాగినీడు, దర్శకుడు చేరుకుని కాసేపు ప్రేక్షకులను అలరించారు. వారితో మాట్లాడి సినిమా విశేషాలు పంచుకున్నారు. అనంతరం హీరో నిఖిల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఈ చిత్రం ప్రత్యేకతని తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలవల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారని... దానిపైనే తమ కథనం సాగిందని వివరించారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఏమిటో అర్జున్ సురవరం సినిమా ద్వారా తెలియజేశామని ఆ చిత్ర హీరో నిఖిల్ తెలిపారు. విజయయాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్ నగరంలోని కృష్ణా థియేటర్కు గురువారం మధ్యాహ్నం వచ్చింది. తొలుత థియేటర్లో ప్రేక్షకులతో కాసేపు మాట్లాడి, వారిని పలకరించి... వారితో సెల్ఫీలు దిగిన అనంతరం విలేకరులతో హీరో నిఖిల్ మాట్లాడుతూ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయని చెప్పడం ఈ సినిమా ఉద్దేశమన్నారు. జర్నలిస్టుగా నటించేందుకు కొన్నాళ్లపాటు జర్నలిస్టుల పనితీరును కూడా పరిశీలించినట్లు తెలిపారు. విజయనగరంలో ఇంతటి భారీస్ధాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుందని అసలు ఊహించలేదన్నారు. కేరెక్టర్ ఆర్టిస్టు నాగినీడు మాట్లాడుతూ మంచి సందేశం ఉన్న చిత్రాలను ప్రతీ ఒక్కరూ ఆదరిస్తారని మరో మారు రుజువైందన్నారు. చిత్ర దర్శకుడు టి.ఎన్.సంతోష్ నటులు విద్యులేఖా రామన్ మాట్లాడుతూ తెలుగులో తమ తొలి సినిమాకు ఇంత విజయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement