-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైదరాబాద్కు ప్రభాకర్రావు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్రావు హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు(ఆదివారం, జూన్8వ తేదీ) అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్రావు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ(special intelligence bureau) చీఫ్గా ఉండి ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్రావు సిట్ విచారణకు హాజరు కావడానికి నగరానికి వచ్చారు. రేపు(సోమవారం, జూన్9 వతేదీ ) సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్రావు. ప్రభాకర్రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్న దానిపై విచారణ జరుగనుంది. ఇక ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేయనన్నారు. ప్రధానంగా రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. -
ఆ డాక్టర్పై చర్యలు తీసుకోండి
పుట్టపర్తి టౌన్: తన భార్య మృతికి కారణమైన కదిరి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రుచితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కదిరికి చెందిన బాధితుడు మనోహర్ కోరారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. డాక్టర్ రుచితారెడ్డి తన దైనందిన విధుల అనంతరం స్థానికంగానే నిర్వహిస్తున్న రేణుకా వైద్యశాలలో రోగులకు చికిత్స చేస్తుంటారన్నారు. ఈ క్రమంలో కదిరిలోని గాంధీనగర్లో నివాసముంటున్న మనోహర్... అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చికిత్స నిమిత్తం రేణుకా వైద్యశాలకు తీసుకెళ్లారు. రూ.5 వేల ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. పది రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ కూడా సరైన చికిత్స అందజేయకపోవడంతో తిరుపతిలోని సిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మే 2న ఆమె మృతి చెందింది. డాక్టర్ రుచితారెడ్డి నిర్లక్ష్యం, సరైన వైద్యం అందించకపోవడంతోనే ఆమె మృతి చెందినట్లుగా అక్కడి వైద్యులు నిర్ధారణ చేశారని బాధితుడు తెలిపాడు. తన భార్య మృతికి కారణమైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని కదిరి పీఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయకుమార్ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డీఎస్సీ కదిరి పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. కాగా, ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 80 వినతులు అందగా.. ఎస్పీ రత్న స్వయంగా స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. పోలీసు స్పందనలో బాధితుడు మనోహర్ ఫిర్యాదు వివిధ సమస్యలపై 80 వినతులు -
అనుమానాలుంటే హైకోర్టుకు వెళ్లండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొట్టిపారేసింది. అందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. ‘‘ఎన్నికల ప్రక్రియపై అనుమానాలుంటే నేరుగా మాకు లేఖ రాయండి. బదులిస్తాం. అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చు. మహారాష్ట్ర పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఫుటేజీని న్యాయస్థానం క్షుణ్నంగా పరిశీలిస్తుంది’’ అని ఈసీ వర్గాలు ఆదివారం స్పష్టం చేశాయి. ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సమగ్రత, ఓటర్ల గోప్యతను ఈసీ కచ్చితంగా పరిరక్షిస్తుందని తెలిపాయి. ఓటర్ల గోప్యతపై దాడి చేయాలనుకోవడం సరైంది కాదని సూచించాయి. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించాయి. కాంగ్రెస్ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను రాహుల్ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల 15న కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తే ఎవరూ రాలేదని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం అసంబద్ధమని స్పష్టంచేశాయి.ప్రజాతీర్పు అపహాస్యం: ఫడ్నవీస్ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందీ సమీక్ష చేసుకోకుండా ప్రజాతీర్పును రాహుల్ అపహాస్యం చేస్తున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించడాన్ని తట్టుకోలేక నిందలు వేస్తున్నారని ఆదివారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆరోపించారు. శనివారం రాహుల్ కూడా అదే పత్రికకు రాసిన వ్యాసంలో మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. ‘‘మ్రహారాష్ట్రలో భారీగా బోగస్ ఓటర్లను చేరి్పంచారని, సాయంత్రం ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరిగిందని అనడం పెద్ద జోక్. యువ ఓటర్ల సంఖ్య పెరగడం మామూలే. క్యూ నుంచున్న వారిని సమయం ముగిసినా ఓటేసేందుకు అనుమతి స్తారని తెలియదా?’’ అని ప్రశ్నించారు. -
అమృత్ పథకంతో ఇంటింటా నీరు
● కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్చొప్పదండి: ఇంటింటికి నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అమృత్ 1, అమృత్ 2.0 పథకాల ద్వారా తెలంగాణలో రూ.6వేల కోట్ల పైచిలుకు నిధులతో, దేశంలో రూ 2.99లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. చొప్పదండి పట్టణంలో రూ.36.3కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీంకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ వాటాతో ఖర్చు చేస్తున్నాయన్నారు. అమృత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి34లక్షల నీటి కనెక్షన్లను అందించగలిగామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.852కోట్లు కేటాయించగా.. కేంద్రం వాటా రూ.481కోట్లు ఉందన్నారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. అతి త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామన్నారు. ఈఈ సంపత్కుమార్, నాగరాజు, నవీన్కుమార్, నాయకులు కొత్తూరి మహేశ్, గుర్రం నీరజ, శ్రీనివాస్రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, చందు, ముద్దం తిరుపతిగౌడ్, చేపూరి సత్యనారాయణ, చిల్ల శ్రవణ్ పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు మండలం తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీలో గత నెలలో జరిగిన చోరీ కేసును వన్టౌన్ సర్కిల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయతో ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీకి చెందిన పడవల వెంకట శ్రీనివాస్ ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. మే నెల 26న కుమారుల చదువుల నిమిత్తం రాజమహేంద్రవరంలో అద్దె ఇల్లు చూసుకునేందుకు కుటుంబంతో కలిసి ఇంటికి తాళాలు వేసి వెళ్ళారు. పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్లో బీరువా తాళాలు పగులగొట్టి దానిలోని బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. శ్రీనివాస్ ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వన్టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు సత్తినపల్లి రాకేష్ను సోమవారం మధ్యాహ్నం ఏలూరు హనుమాన్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. పెదపాడు ఇందిరా కాలనీకి చెందిన రాకేష్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. -
మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్కే..
తుమ్మపాల: పొంతన లేని సమాధానాలతో పీజీఆర్ఎస్ అర్జీదారులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ అర్జీదారులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యానికి గురై ఏర్పడిన సమస్యలపై కలెక్టరేట్లో మొరపెట్టుకుంటే జిల్లా అధికారులు సైతం అదే ధోరణి చూపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై క్రమేపి ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పీజీఆర్ఎస్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు అధికారులు ఎండార్స్మెంట్లు ఇస్తూ వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. దీంతో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు తప్ప ఇతర సంక్షేమ పథకాలు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించి వాటిపై విన్నవించేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 122 అర్జీలు రెవెన్యూ సంబంధిత అంశాలివే వచ్చాయి. పంచాయతీ రాజ్ – 32, సర్వే శాఖ –18, పోలీస్ –17, మరో 17 శాఖల్లో ఒకటి, రెండేసి అర్జీలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం 240 అర్జీలు రాగా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు పునరావృతమైనవే ఉన్నాయి. ● కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారుల వద్ద కలెక్టర్ విజయకృష్ణన్తోపాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, మనోరమ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాక.. వస్తున్న అర్జీదారులు మండల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆవేదన కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 240 అర్జీల నమోదుపాసుపుస్తకాలు మంజూరు చేయలేదు డీ–పట్టా భూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ పాయకరావుపేట మండలం కుమారపురం గ్రామానికి చెందిన గురుబిల్లి రాంబాబు అర్జీ చేసుకున్నాడు. తన అత్తగారైన కర్రి లక్ష్మి ద్వారా సంక్రమించిన డీపట్టా భూమి నేటికీ ఆన్లైన్ కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, సహాయం పొందలేక పోతున్నానని మొరపెట్టుకున్నాడు. వృద్ధాప్యంతో ఉన్న తనకు పాసుపుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరాడు. మెట్టింట్లో కూతురు ఉద్యోగం చేస్తే పింఛన్ రాదంట! వృద్ధాప్యంతో ఒంటరిగా జీవిస్తున్న తనకు ప్రభుత్వ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని గవరపాలెం అంబేడ్కర్ నగర్కు చెందిన జల్లూరి గొంతమ్మ పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంది. పట్టణంలో 23వ గ్రామ సచివాలయానికి పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పొయిందని వాపోయింది. పింఛన్ ఇస్తామంటూ ఇన్నాళ్లు తిప్పించుకుని, వివాహమైన కూతురు పేరు రేషన్ కార్డులో ఉందని, ఆమె ఉద్యోగం చేస్తున్నందున పింఛన్ రాదని ఇప్పుడు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒంటరిగా జీవిస్తున్న తనకు వివాహమై వెళ్లిపోయిన కూతురు వివరాలు జోడించి అన్యాయం చేయొద్దని, కలెక్టరమ్మ స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంది. -
Hyderabad: మేయర్కు బెదిరింపులు!
బంజారాహిల్స్(హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి గత మూడు రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, నిందితున్ని పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆమె పీఆర్ఓ అఖిల్ బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మేయర్కు మూడు రోజులుగా ఒకే వ్యక్తి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో మేయర్ పీఆర్ఓ ఫిర్యాదు చేయగా, ఈ నంబర్ కోసం ఆరా తీస్తున్నారు. అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. నిదింతుని జాడ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మేయర్ ఇంటికి గతంలోనూ ఓ వ్యక్తి వచ్చి బెదిరింపులకు పాల్పడగా, అప్పుడు నిదింతునిపై చర్యలు తీసుకున్నారు. -
బోనమో నమః
మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో బోనాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా జరిగింది. అన్నారం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, కమరాతి, అక్క మహంకాళి అమ్మవార్ల కల్యాణం, పట్నాల ఉత్సవాలు మొదలయ్యాయి. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బయలుదేరారు. మేకను గావు పట్టడం, బండారి చల్లుకోవడం, కత్తులతో నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గొల్ల, కురుమ సంఘం నాయకులు కత్తర్ల లక్ష్మయ్య, స్వామి, లక్ష్మణ్, అట్ల గట్టయ్య, అట్ల కొండయ్య, సంబు శ్రీనివాస్, దాడి ఐలయ్య, అట్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. – మానకొండూర్ -
రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కుప్పం : కుప్పం రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం దిబ్రూనగర్ నుంచి బెంగళూరు వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తుండగా కుప్పం రైల్వేస్టేషన్ రాగానే ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. రైల్వే పోలీసులు గాయపడిన వ్యక్తిని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. బ్లూకలర్ టీ షర్ట్ దరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. కర్ణాటకలో కుప్పం మహిళా దొంగల అరెస్టు రూ.6 లక్షల నగలు స్వాధీనం దొడ్డబళ్లాపురం : రద్దీగా ఉన్న బస్సులు, బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నలుగురు మహిళా దొంగలు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నివాసులైన శశి (35), మాధవి (40), అఖిల (30), విద్య (29) అనేవారిని కర్ణాటకలోని హాసన్ జిల్లా హొళేనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.38 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. హొళెనరసీపుర బస్టాండులో ఒక మహిళ బంగారు గొలుసు చోరీకి గురైంది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగలని తేలడంతో అరెస్ట్ చేశారు. వీరి మీద బెంగళూరులోని పలు పోలీస్స్టేషన్లలో చోరీ కేసులు నమోదై ఉన్నాయి. నలుగురూ ముఠాగా ఏర్పడి ఊరూరూ తిరుగుతూ చోరీలు చేసి మళ్లీ కుప్పంకు వెళ్లిపోయేవారని పోలీసులు తెలిపారు. -
నేటినుంచి.. అమ్మ మాట– అంగన్వాడీ బాట
మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో ‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం సూచించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలను గ్రామ పంచాయతీ కమ్యూనిటీ సహకారంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సెల్ఫీ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడానికి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమంలో కేంద్రాలను, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. మదర్ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కలిసి ప్రతి గ్రామంలో ర్యాలీలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల సేవలను వివరించాలని చెప్పారు. రోజువారీ కార్యక్రమాలు ఇలా.. 10న అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించడం, తల్లిదండ్రులు, పిల్లలను స్వాగతించి సెల్ఫీ తీసుకొని ప్రోత్సహించడం, ప్రతి గ్రామ మహిళా సంఘాల సభ్యులు, ఏయే గ్రామ ప్రజలతో ఎన్నుకొనబడిన గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించాలి. 11న సంవత్సరాల పిల్లలను టీచర్లు గుర్తించి, ఆ పిల్లల ఇంటిని సందర్శించడం, తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రంలో అడ్మిషన్స్ గురించి ఫ్రీ స్కూల్, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పిల్లలను నమోదు చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇందులో ఫ్రీ స్కూల్ విద్య అయిపోయిన వారికి సర్టిఫికెట్స్ అందించాలి. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి. 12, 13, 16 తేదీల్లో పోషణ్ పట్టిక, కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయడం, లబ్ధిదారులకు ఆహార పోషకాల గురించి వివరించాలి. 17న పూర్వ ప్రాథమిక విద్య గురించి, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వారంరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ