-
లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో పైడి హరనాథరావు రచించిన లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఈ శతక పద్యములను సమాజ శ్రేయస్సు కాంక్షించి రచించినట్లు పేర్కొన్నారు. ధాన్యం పండించే రైతు, మంచుకొండల్లో ప్రాణాలు పణంగా పెట్టిన సైనికుడుపై పద్యాల రచన జరిగిందన్నారు. కార్యక్రమంలో నారాయణమూర్తి, కోమలరావు, నిష్టల నరసింహమూర్తి, బలివాడ మల్లేశ్వరరావు, గుమ్మా నగేష్, శివరాం, విశ్వనాథం కామేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, పట్నాయిక్, విశ్వేశ్వరరావు, రమణ, సూరిబాబు, సరస్వతి, లక్ష్మి, విజయలక్ష్మి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
వెలగని దీపం..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అమలుపై అందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేసినా, రెండో విడత ప్రారంభం నుంచే ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 2024 నవంబర్లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీమును అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తర్వాత రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ప్రతిరోజూ బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫిర్యాదులు బుట్టదాఖలు దీపం పథకం ఉచిత సిలిండర్ రాయితీ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి వద్ద నగదుకి సంబంధించి సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వం నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. రోజుకోమాట ఉచిత గ్యాస్ పథకంలో రెండో విడత నగదు విడుదలపై కూటమి ప్రభుత్వం కప్పగంతులు వేస్తోంది. రోజుకోమాట చెబుతూ ప్రజలను మభ్యపెడుతోంది. ఒక రోజు అన్ని డబ్బులు త్వరలో వేస్తామని చెబుతున్నారు. మరోసారి ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తాము, వారు ఆ డబ్బులతో సిలిండర్ విడిపించుకోవాలని చెబుతున్నారు. మరోసారి ఈ పథకం నడపడం సాధ్యం కాదని లోలోపల సమాచారం అందిస్తున్నారు. ఇలా ఈ ఉచిత గ్యాస్ పథకంపై ప్రభుత్వం రోజుకోమాట చెబుతోంది. ఈ ఉచిత సిలిండర్ పథకం ద్వారా అందజేసే నగదు జిల్లాలోని సివిల్ సప్లయ్, జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. తొలి విడతకు సంబంధించిన నగదు సంబంధిత గ్యాస్ (ఆయిల్) కంపెనీలకు జమ చేసింది. తొలి విడతకు సంబంధించి కొంత నగదు జమ చేయడంతో, ఆయిల్ కంపెనీలు ఆ నగదుని లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేశారు. అయితే రెండో విడతకు వచ్చేసరికి, ఈ నగదుని గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో లబ్ధిదారులకు సబ్సిడీ నగదు అందేలా కనిపించడం లేదు. రెండు నెలలైనా అందని దీపం– 2 సబ్సిడీ రెండో విడత సుమారు రూ.16,81,88,000ల బకాయిలు నగదు కోసం లబ్ధిదారుల ఎదురుచూపు ఇదీ విషయం... జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 37 ఏజెన్సీలు ఉన్నాయి. ఽవీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు అన్ని కలిపి 6,92,825 ఉన్నా యి. వీటిలో ప్రతినెల సుమారుగా 88 వేలుకి పైగా లబ్ధిదారులు గ్యాస్ను విడిపించుకుంటున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయాల్సింది. మొదటి విడతగా 2024 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు నిర్ణయించారు. ఈ విడతలో ఐదు నెలలకు గాను జిల్లావ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకొని విడిపించుకొన్నారు. వీరిలో 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యింది. 5,241 మంది లబ్ధిదారులకు రూ.49,78,950లు బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు రెండో విడత గడువును నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన నిధులు ఇప్పటివరకూ లబ్ధిదారులకు అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలు అనగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ను బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించి గ్యాస్ను పొందారు. అయితే వీరికి గాను ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ప్రాప్తికి సుమారుగా రూ.16,81,88,000లు చెల్లించాల్సింది. అయితే దీనికి అతిగతీ లేకుండా పోయింది. -
ఇంకుడు గుంతల పరిశీలన
జూలూరుపాడు: మండలంలో పలు గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన ఇంకుడు గుంతలు, కందకాలను ఆదివారం సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి పృథ్వీరాజ్ పరిశీలించారు. జూలూరుపాడు, కొత్తూరు, పాపకొల్లు, అన్నారుపాడు, భేతాళపాడు, కరివారిగూడెం, కొమ్ముగూడెం, మాచినేనిపేట, మాచినేనిపేటతండా, పడమటనర్సాపురం, సాయిరాంతండా, కాకర్ల, శంభునిగూడెం, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇంటి ప్రాంగణాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రహదారుల పక్కన నిర్మించిన ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. పడమటనర్సాపురం సమీపంలో గుట్ట చుట్టూ చేపట్టిన కందకం పనులను సందర్శించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఈసీ రాజు, ఈజీఎస్ ఏపీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కె ట్ జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి. మోడల్ మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత నిర్మాణా లను తొలగిస్తున్నారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి అమ్మకాలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రసిద్ధి కావడంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంగనర్, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల సైతం అమ్మకాలకు ఇక్కడకు వస్తుంటారు. దీంతో మిర్చి సీజన్లో నిత్యం లక్ష నుంచి 2 లక్షల బస్తాల వరకు పంట విక్రయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో యార్డులు సరిపోవడం లేదని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధునాతన మార్కెట్ నిర్మాణాలకు రూ. 155.30 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం మిర్చి సీజన్ ముగియడం, వేసవి సెలవులు ప్రకటించడంతో పాత నిర్మాణాలను సమూలంగా తొలగిస్తూ నూతన నిర్మాణ పనులను చకచకా చేయిస్తున్నారు. 75 ఏళ్ల నాటి గుర్తులు.. బ్రిటీష్ కాలం 1937లో నలుగురైదుగురు వ్యాపారులు కలిసి పరిసరప్రాంతాల రైతుల సౌకర్యార్థం గాంధీచౌక్లో బీట్బజార్ ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా జిల్లాలో నీటి వనరులు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో మార్కెట్ ఆవశ్యకత పెరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్గా గుట్టల బజార్లో ఏర్పాటైంది. అయితే 1969 నుంచి ప్రభుత్వం మార్కెట్ చట్టాన్ని అమలు చేయగా.. క్రమక్రమంగా దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంగా రూపుదిద్దుకుని పంటల కొనుగోళ్లలో గుర్తింపు సాధించింది. తొలుత అపరాలు, ఆపై పత్తి, మిర్చి పంటల సాగు పెరగడంతో ఖమ్మం మార్కెట్ అభివృద్ధి సాధించింది. అపరాల కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యార్డు ప్రస్తుతం మిర్చి యార్డుగా మారింది. ఈ యార్డులో 22 షెడ్లు, భూసార పరీక్షా కేంద్రం, మార్కెట్ కార్యాలయం ఉన్నాయి. దీంతో పాటు ఈ యార్డుకు పక్కనే మిర్చికి ప్రత్యేకంగా నిర్మించి.. మరో షెడ్, గోదాములు, జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయం, కార్మికుల కార్యాలయాలను కూడా తొలగించడంతో ఆనాటి గుర్తులన్నీ కనుమరుగయ్యాయి. పాత నిర్మాణాలపై భావోద్వేగం మార్కెట్ పాత నిర్మాణాలు కనుమరుగవుతుండడంతో ఇక్కడ పనిచేసే వ్యాపారులు, కార్మికులు భావోద్వేగానికి గురవుతున్నారు. కొందరు మార్కె ట్ తొలగిస్తున్న వీడియోలు తీసి పాటలు జోడించి సోషల్ మీడియాలో పెడుతుండగా.. మరికొందరు యార్డులో వ్యాపారులకు కేటాయించిన స్థానాలు, నిత్యం పనిచేసే ప్రాంతాలు, భోజనం చేసే ప్రాంతాలు, చెట్ల తొలగింపు చూసి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ మార్కెట్లో సుమారు 600 మంది వ్యాపారులు, 3 వేల మంది కార్మికులు పని చేస్తుండగా.. పరోక్షంగా నగరంలోని త్రీటౌన్ ప్రజలు వివిధ రకాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం రైతుల ప్రయోజనం కోసం ఖమ్మం మార్కెట్ను అభివృద్ధిలో భాగంగా పాత నిర్మాణాలను తొలగించి మోడల్ మార్కెట్గా రూపురేఖలు మార్చుతోంది. 7 అధునాతన షెడ్లతో పాటు ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు శ్రీకారం చట్టారు. మార్చి నుంచి మార్కెట్లోని ఓ భాగంలో ప్రారంభించిన పనులను ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పూర్తిస్థాయిలో పనులను చేపట్టారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.10 కోట్లతో నిర్మించిన షెడ్లను కూడా తొలగించి 15.39 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టారు. అజిలిటి భూమి కంపెనీ ఈ నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. 2026 జూన్ నాటికిపనులను పూర్తయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది. బీట్బజార్ నుంచి ఎదిగిన ఖమ్మం మార్కెట్ తొలుత గ్రెయిన్ మార్కెట్గా పేరు.. మోడల్ మార్కెట్ పేరుతో పాత నిర్మాణాల తొలగింపు రూ.155.30 కోట్లతో మారుతున్న రూపురేఖలు -
సౌందర్యలహరి శ్లోకాల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సనాతన భక్తి మండలి సభ్యురాలు నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆది శంకరాచార్య విరచితం సౌందర్యలహరి శ్లోకాల పోటీలు ఆదివారం నిర్వహించారు. 45 రోజులుగా వేసవి సెలవుల్లో 100 శ్లోకాలపై సుమారు 50 మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చామని భాగ్యలక్ష్మి తెలిపారు. శ్లోకాలతో పాటు సనాతన ధర్మం, శాస్త్ర విజ్ఞానం, రుషులు, మునుల గొప్పతనం వివరించామన్నారు. శిక్షణ తరగతులకు సహకరించిన ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్లోకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. -
ఆత్మరక్షణకు కరాటే దోహదం
చేవెళ్ల: కరాటే ఆత్మరక్షణతో పాటు శారీర దృఢత్వానికి దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ అన్నారు. మండల కేంద్రంలోని స్పోర్ట్స్ స్డేడియంలో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ కె.కృష్ణ నిర్వహించిన కరాటే శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా కరాటే బెల్టుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులు ప్రదానం చేశారు. అనంతరం శిక్షణ అందించిన మాస్టర్ కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో కరాటే బెల్ట్ల చీఫ్ ఎగ్జామినర్, 8వ బాక్ల్ బెల్టు డాన్ ఎండీ ఖాజాపాషా, అర్గనైజర్లు బ్లాక్ బెల్టు డాన్లు జంగయ్య, రాములు, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘మాగంటి’ లేనిలోటు తీరనిది
కడ్తాల్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ అభివృద్ధికి మాగంటి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. సింగిల్విండో చైర్మ న్ వెంకటేశ్గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకులు లచ్చిరామ్నాయక్, లాయక్అలీ, పాండు, చంద్రయ్య ఉన్నారు. సెల్ఫోన్ అప్పగింత ఆమనగల్లు: సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి పోలీసులు ఫోన్ అప్పగించారు. ఆమనగల్లు మండలం శంకరకొండతండా పరిధి దయ్యాలబోడుతండాకు చెందిన తరుణ్.. ఇటీవల పట్టణంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి, ఆమనగల్లు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కానిస్టేబుల్ రఘునాయక్.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఆచూకీ కనుగొన్నారు. అనంతరం ఆదివారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్.. బాధితుడికి మొబైల్ను అప్పగించారు. మృతుడి కుటుంబానికి పరామర్శ ఆమనగల్లు: ఆమనగల్లు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ యాదయ్య తండ్రి, వార్డు మాజీ సభ్యుడు గోరటి జంగయ్య అనారోగ్యంతో శనివారం మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబాన్ని, ఆదివారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు విక్రంరెడ్డి తదితరులు పరామర్శించారు. మంత్రి ‘వాకిటి’కి శుభాకాంక్షలు కడ్తాల్: మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని, ఆదివారం రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.రాహుల్లు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కందుకూరు: మండల పరిధిలోని లేమూరులో పోచమ్మతల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ పూజల అనంతరం హోమం, అమ్మవారి కల్యాణం నిర్వహించారు. గ్రామస్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాణాప్రతాప్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొని పూజలు చేశారు. వీరికి ఆలయ నిర్వాహకులు మెమొంటోలు అందించి సన్మానించారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి కొందుర్గు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ సొల్కమ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చౌదరిగూడ ఆర్య సమాజంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. -
మంత్రి బీసీకి పరిజ్ఞానం ఉందా?
డోన్: కనీస పరిజ్ఞానం లేకుండా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం డోన్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి బీసీ చేసిన ఆరోపణలను మాజీ మంత్రి బుగ్గన ఖండించారు. ‘సాక్షి’తో బుగ్గన ఫోన్లో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ఆర్థికశాఖ మంత్రులు వ్యక్తిగతంగా ఎలా బాధ్యత వహిస్తారనే విషయం మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. సరైన సమాచారం తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏడాదికే రూ. 5లక్షల కోట్ల అప్పు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో లక్షా ముప్పై వేల కోట్లు అప్పులు చేస్తే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఐదు లక్షల నూట తొంభై రెండు వేల కోట్లు అప్పు ఎందుకు చేసిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే అప్పులకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవులు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తే వైఎస్సార్సీపీ హయంలో చేసిన అప్పులకు తాను కూడా బాధ్యత వహిస్తానని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. అప్పుల విషయంపై మంత్రి బీసీ తనను డిబేట్కు రావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ కంటే పవిత్రమైన వేదిక వేరేది ఉందనుకుంటే ఎక్కడికై నా బీసీతో డిబేట్కు రావడానికి తాను సిద్ధమేనని మాజీ మంత్రి బుగ్గన ప్రతిసవాల్ విసిరారు. ఫ్యాక్టరీని తెరిపిస్తే మూత వేయించినది ఎవరు? 2014కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో మూత పడిన పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తెరిపించామని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే టీడీపీ ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీని మూత పడేటట్టు చేసి వందలాది కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఏ గ్రామానికి రోడ్డు వేయించారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము రోడ్లు వేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ.. డోన్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి రోడ్డు వేశారో చెప్పాలని మాజీ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. ఇతరులు ఇచ్చిన తప్పుడు సమాచారం మేరకు మాట్లాడటం మంత్ర బీసీకి భావ్యం కాదన్నారు. సమాచారం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తారా? మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన -
కారుణ్యం చూపండి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య కారణాల తో, దురదృష్టవశాత్తు ప్రమాదాల కారణంగా మరణించినవారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు తమకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. కారు ణ్య నియామకాల కింద తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 88 మంది మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు అవు ట్ సోర్సింగ్ పద్ధతిలో తమకు ఉపాధి కల్పించాలని, ఇళ్లు గడవక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల విద్యార్హతలు ఉన్నప్పటికీ తమకు అవకశాం కల్పించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యా యం చేయాలంటూ 2016 నుంచి పోరాటం చే స్తున్నారు. ఉన్నతాధికారులు, మంత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. అయితే కొందరు మరణించిన ఉద్యోగుల స్థానంలో కొందరు 2008 నుంచి 2016 వరకు పనిచేసినవారున్నారు. ఇలా పనిచేస్తున్నవారిని కూడా 2016 మార్చిలో ప్రభుత్వం తొలగించింది. విద్యార్హతలు ఉన్నవారిని కూడా తొలగించినట్లు ఆయా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వీరిని కారుణ్యం కింద పరిగణనలోకి తీసుకుని అవకాశాలు కల్పించాలని 2012లో అప్పటి గృహనిర్మాణ సంస్థ ఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు హైకోర్టు 2019లో ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ తమకు అవకాశాలు ఇవ్వలేదని కారుణ్య నియమాకాలు ఆశిస్తున్నవారు చెబుతున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ● ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గృహనిర్మాణ సంస్థ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం ఉంది. ప్రస్తుతం గృహనిర్మాణ సంస్థలో చాలామంది రెగ్యులర్ వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో తాజా గా రాష్ట్ర ప్రభుత్వం 390 మందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేసుకుంది. అయి తే ఈ నియామకాల్లో తమకు అవకాశాలు కల్పించాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని కారుణ్య నియామకాల కోసం ఆశిస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహనిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్లో ఉపాధి కల్పించాలంటున్న మరణించిన ఉద్యోగుల కుటుంబీకులు 2016 నుంచి పోరాటం చేస్తున్న 88 మంది అవకాశం ఇవ్వాలని 2019లో ఆదేశించిన హైకోర్టు తాజాగా 390 మంది అవుట్సోర్సింగ్లో నియామకం మరణించిన ఉద్యోగుల కుటుంబాలను మాత్రం పట్టించుకోని ప్రభుత్వంన్యాయం చేయాలి.. గృహనిర్మాణ సంస్థలో కా రుణ్య విధానంలో కేవలం అవుట్ సోర్సింగ్ నియామ కాలు కల్పించాలని మా త్రమే కోరుతున్నాం. ఉన్న 88 మందిలో కుటుంబం గడవలేనివారు ఎక్కువగా ఉన్నారు. తమకు న్యా యం చేయాలని కోరుతూ గతంలో అనేకసార్లు గృహనిర్మాణ సంస్థ ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్ల అ సోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మ రణించిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చే యాలని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. – పగిడిపల్లి రామకృష్ణ, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
మృగశిర కార్తె సందడి
నెహ్రూసెంటర్: మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే నానుడి ఉంది. ఆదివారం మృగశిర కార్తె కావడంతో జిల్లా కేంద్రంలో చేపలను కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. సాధారణ రోజుల్లో కేజీ రూ.150 నుంచి రూ. 500 వరకు వివిధ రకాల చేపలను విక్రయించే వారు. మృగశిర కార్తె సందర్భంగా అందుకు భిన్నంగా రూ. 250 నుంచి రూ. 600పైగా ధరలకు వివిధ రకాల చేపలను విక్రయించారు. అయినప్పటికీ ప్రజలు కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. చేపల కొనుగోలుకు ఆసక్తి చూపిన ప్రజలు కేజీ రూ. 250 నుంచి రూ. 600 వరకు అమ్మకాలు