-
పది టిప్పర్లు, జేసీబీ సీజ్
షాబాద్: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా తవ్వి, ప్రైవేట్ కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని తెలిపారు. సోలీపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 350లో ఉన్న 120 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి దాడులు నిర్వహించామన్నారు. పది టిప్పర్లు, ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. వీటికి సంబంధించిన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశామన్నారు. మరోమారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, ఈసీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. యజమానులు,డ్రైవర్లపై కేసులు నమోదు మరోసారి పట్టుబడితేనాన్ బెయిలబుల్ కేసులు షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ -
‘అయ్యో’ర్ల పడిగాపులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీలు బదిలీల కౌన్సెలింగ్ కోసం జిల్లా కేంద్రంలో పడిగాపులు కాశారు. రాత్రి 9.50 గంటల సమయం అయినప్పటికీ కౌన్సెలింగ్ను విద్యాశాఖ అధికారులు ప్రారంభించలేదు. ఈ కౌన్సెలింగ్కు హాజరైన ఎస్జీటీ టీచర్ల సీనియారిటీ ప్రకారం బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చీకటిలో కూర్చుని రాత్రంతా నిరీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాత్రి 9.20 గంటలకు ఎస్జీటీల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో సమగ్ర సీనియారిటీ జాబితాను ప్రదర్శించాలని టీచర్లు డిమాండ్ చేశారు. అధికారులు 350 వరకు జాబితాను విడుదల చేసి మిన్నకుండి పోయారు. సమగ్ర సీనియారిటీ జాబితాను విడుదల చేస్తే బదిలీల్లో న్యాయం జరుగుతుందని పలువురు ఎస్జీటీలు వెల్లడించారు. సంఘం నాయకులకు నో ఎంట్రీ కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో టీచర్ల తరపున సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ సంఘాలు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సంఘం నాయకులు హాల్లోకి రాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్నడూ లేని వింత విధానాలను చిత్తూరు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారని వివిధ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు ఇతర జిల్లాల్లో విచారించగా నాయకులను అనుమతిస్తున్నారని తెలిసింది. నేడు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ జిల్లాలోని ఎస్జీటీలకు నేటి నుంచి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీలు సీనియారిటీ జాబితా ప్రకారం సీరియల్ నం.351 నుంచి 700 వరకు ఉదయం 9.30 గంటలకు, సీరియల్ నం.701 నుంచి 1000 వరకు మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్జీటీలు చిత్తూరు శర్మన్ పాఠశాలలో జరిగే కౌన్సెలింగ్ కు తప్పక హాజరు కావాలని డీఈఓ కోరారు. రాత్రి 9.50 గంటలైనా ప్రారంభం కాని కౌన్సెలింగ్ -
మోదీ పాలన సువర్ణాధ్యాయం
సాక్షి,బళ్లారి: 2014లో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని, ఈ 11 ఏళ్ల మోదీ పాలన దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత మంచి పాలన మోదీ అందించారన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నారని కొనియాడారు. నెహ్రు, ఇందిరాగాంధీ ఇద్దరూ కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు. ఆర్టికల్–370 రద్దు చారిత్రాత్మకం ప్రధాని మోదీ పాలనలో జమ్ముకశ్మీర్లో ఆర్టికల్– 370ను రద్దు చారిత్రాత్మకం. ఉగ్రవాదం అణిచివేత, పేదరిక నిర్మూలన, జాతీయ రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సువర్ణయుగంగా పాలన సాగిస్తున్నారన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు, బీజేపీ అఽధికారంలో ఉన్న 11 ఏళ్ల పాలనకు ఎంతో తేడా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, సోమలింగప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ నాయకులు గుత్తిగనూరు విరుపాక్షిగౌడ, కే.ఎస్.దివాకర్, హనుమంతప్ప, కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెహ్రు, ఇందిరలది కుటుంబ పాలన దేశాభివృద్ధిలో మోదీ పాత్ర కీలకం కూకటివేళ్లతో ఉగ్రవాద నిర్మూలన మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి -
డాక్టర్ భూంరెడ్డికి నివాళి
కరీంనగర్కార్పొరేషన్/కరీంనగర్: ప్రముఖ వైద్యుడు డాక్టర్ భూంరెడ్డికి మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డిలు వేర్వేరుగా నివాళి అర్పించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యుడు భూంరెడ్డి మరణం బాధాకరమని అన్నారు. భూంరెడ్డి ఎంఎస్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఢిల్లీలో గోల్డ్మెడల్ తీసుకున్నాడని గుర్తు చేశారు. -
మహిళల రక్షణలో కూటమి విఫలం
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలు, చిన్నారులు, బాలికలు, యువతులపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరిపోతున్నాయని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటరులోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ అనంతపురంలో దళిత బాలికపై దుండగులు అమానుషంగా హత్యాచారానికి పాల్పడినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, చింతలపూడి మహిళా అధ్యక్షురాలు చండీప్రియ, కై కలూరు మహిళా అధ్యక్షురాలు దున్నా బేబి, దెందులూరు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు అంగడాల సీతారావమ్మ, జిల్లా అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు సాయిల స్వాతి, తొత్తడి వేదకుమారి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మందా జయలక్ష్మి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమలలో.. ద్వారకాతిరుమల: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరిగిన అకృత్యాలు, అన్యాయాలకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో, రాజమండ్రి సిటీ గోకవరం బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంగారమ్మ, పార్టీ ద్వారకాతిరుమల మండల మహిళా అధ్యక్షురాలు మల్లెపూడి నాగమణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వం వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. గోపాలపురం, దేవరపల్లి మండలాల మహిళా అధ్యక్షురాలు కప్పల వరలక్ష్మి, కడలి హైమావతి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు రక్షణేది పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సిపి మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కర్రా జయసరిత అన్నారు. మంగళవారం పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. జయ సరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలేనని.. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, సమన్వయకర్త గూడూరి ఉమాబాల, నరసాపురం మున్సిపల్ చైర్మన్ బర్రి వెంకటరమణ, జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, మద్దా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో.. భీమవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై దాడులు పెచ్చుమీరిపోయాయని వైఎస్సార్సీపీ నాయకురాలు గంటా అనితారాణి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భీమవరం 13వ వార్డులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు -
గుర్తు తెలియని మహిళ మృతి
గోదావరిఖని: స్థానిక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మంగళవారం మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఆరురోజుల క్రితం గోదావరినది ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ ఆరోగ్యం క్షీణించి చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చినట్లు వివరించారు. ఫొటోలో ఉన్న మహిళను గుర్తిస్తే 87126 56516 నంబర్కు సమాచారం అందించాలని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కోరారు. డాక్టర్ భూంరెడ్డి మృతికి సంతాపంకొత్తపల్లి(కరీంనగర్): రాజా బహద్దూర్ వెంకటరామరెడ్డి విజ్ఞాన పరిషత్ (రెడ్డి సంక్షేమ సంఘం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు వి.భూంరెడ్డి మృతికి సీతారాంపూర్లోని ఆర్బీవీఆర్ఆర్లో మంగళవారం సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శి బండ గోపాల్రెడ్డి, కోశాధికారి కాసర్ల మధూకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు గన్ను మహేశ్వర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి దాసరి రామ్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఏనుగు చుక్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు ఫెర్టిలైజర్సిటీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోదావరిఖని నుంచి పోతనకాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పలువు రు గాయాలతో బయటపడ్డారు. గోదావరిఖని పోతనకాలనీ ప్రధాన రహదారిపై గడిచిన నాలుగు నెలల్లో రాత్రివేళల్లోనే కార్లు విద్యుత్ స్తంభాలను ఢీకొన్న ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రైనీ ఎస్ఐపై అట్రాసిటీ కేసు సైదాపూర్: ట్రైనీ ఎస్ఐ అగస్త్య భార్గవ్పై సైదాపూర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేశారు. ఇటీవల భార్గవ్ మండలంలోని సోమారం శివారులో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. గొల్లగూడెంకు చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేసి కులం పేరుతో దూషించాడు, అంతేకాకుండా అకారణంగా చితకబాధాడు. దీంతో మహేందర్ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. మహేందర్ను చితకబాధిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ట్రైనీ ఎస్ఐ భార్గవ్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేశారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఇల్లెందురూరల్ : వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భాస్కర్నాయక్ సూచించారు. మండలంలోని రొంపేడు పీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. మందుల నిల్వలను పరిశీలించి రోజువారీ ఓపీ, ఐపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులను క్రమం తప్పకుండా పరీక్షించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని అన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, రొంపేడు పీహెచ్సీ వైద్యాధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ -
యథేచ్ఛగా లైంగిక దాడులు
కూటమి పాలనలో ● బాధితుల్లో ఆర్నెల్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధులు ● నేరాలకు పాల్పడుతున్న వారంతా టీడీపీ వారే ● మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకమే ఇందుకు కారణం ● మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బాధితుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాది కూటమి పాలనలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయని, రాష్ట్రంలో మహిళలు బతకాలంటే భయపడుతున్నారని, బాలికల తల్లిదండ్రులు గజగజా వణికిపోతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడిన వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరస నగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. ఈ ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు బయ టకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. మహిళలు ఇంట్లో ఉన్నా, బడిలో, కళాశాలలో ఉన్నా, చివరికి పని ప్రదేశంలో ఉన్నా అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల హిందూపురం, అనంతపురంలో చిన్నారి తన్మయి. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు కూటమి పెద్దలు పనికిమాలిన విషయాలపై దృష్టి పెడుతున్నారని, మహిళలపై ఇన్ని ఘటనలు జరి గినా సీఎం, డెప్యూటీ సీఎం, హోం మంత్రి ఎక్క డైనా స్పందించారా అని వరుదు కల్యాణి ప్రశ్నించారు. కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య చేశారని, ఉండి నియోజకవర్గంలో, భీమిలిలో ఇలా ఎక్కడా చూసినా ఇలాంటి ఘటనలు వినని రోజు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోజుకు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయని, నమోదు కానివి ఇంకా ఎన్నో ఉన్నాయని, గంటకు మూడు, నాలుగు లైంగికదాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న ఒక్క రివ్యూ చేయకపోవడం సిగ్గుచేటని, అవసరం లేని విషయాలపై, కక్షపూరిత రాజకీయాలపై ప్రెస్మీట్లు పెట్టే హోం మంత్రి ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏరులై పారుతున్న మద్యం కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కల్యాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి రూపుమాపుతామని గొప్పలు చెప్పారని, హోం మంత్రి నివసిస్తున్న విశాఖలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతోందని, ఆమె నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతోందని వివరించారు. కూటమి పాలనలో వీధికో గాంధార పుత్రుడు, వీధివీధినా గంజాయి పుత్రులే కనిపిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఆమె మాటే వింటున్నారని..!
● ఏడాది తిరగకముందే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ ● నెల్లిమర్ల టీడీపీ–జనసేన అంతర్గత పోరులో ఉద్యోగులకు తప్పని బదిలీలు పూసపాటిరేగ: రెవెన్యూ అధికారులందరూ ఆమె మాటే వింటున్నారు.. మనం చెబితే ఒక్కపనీ చేయడం లేదు.. ఇలా అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ మనుగడ కష్టం.. అందరూ జనసేనలోనే చేరిపోతారు.. ఇప్పటికే పార్టీలోని ఓ వర్గాన్ని ఆమె లాక్కున్నారు... ఇక రాజకీయం చేయలేం.. అంటూ ఇటీవల కడపలో జరిగిన మహానాడులో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అంతే.. వెంటనే ‘చినబాబు’ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లను బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలివ్వడం, ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడవకముందే తహసీల్దార్లకు స్థానచలనం తప్పలేదన్న చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది. జనసేన, టీడీపీ పార్టీలు ఆదిపత్య పోరు ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభీష్టం మేరకు ఏడాది కిందట తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నియామకాలు జరిగాయన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. అంతే.. ఏడాది తిరగక ముందే పూసపాటిరేగ, డెంకాడ , నెల్లిమర్ల, భోగాపురం మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీర్లతో పాటు వివిధ హాదాల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులను ఇటీవల బదిలీలు చేశారు. కొందరు కలెక్టర్ స్వయంగా బదిలీ చేశారని చెబుతున్నా ఇందులో నిజంలేదని మరికొందరి వాదన. ఏడాది పూర్తికాకుండా... ఎలాంటి ఒత్తిడి లేకుండా కలెక్టర్ అధికారులను ఎందుకు బదిలీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్యపోరు సాగుతోంది. పలు సార్లు సమావేశాల సాక్షిగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంతో ఎమ్మెల్యేకు మద్దతుగా అధికారులు ఉన్నారని, రెవెన్యూ పరమైన పనులు చేయడం లేదని, టీడీపీ బలహీనపడుతోందని టీడీపీ నాయకులు చినబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ కారణంతోనే ఉన్నతాధికారులకు చెప్పి నాలుగు మండలాల రెవెన్యూ అధికారులను ఒకేసారి బదిలీ చేసినట్టు భోగట్టా. పూసపాటిరేగ తహసీల్దార్ టి.గోవిందను కలెక్టర్రేట్ సి–సెక్షన్, డెంకాడ తహసీల్దార్ వి.పద్మావతిని వంగర మండలానికి, భోగాపురం తహసీల్దార్ సురేష్ పార్వతీపురం మన్యం, నెల్లిమర్ల తహసీల్దార్ పి.సుదర్శనరావును సంతకవిటి మండలాలకు బదిలీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 19 మంది తహసీల్దార్లకు బదిలీ కాగా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల తహసీల్దార్లకు బదిలీ కావడం గమనార్హం. -
ప్రాణాలు తీసిన కలహం
కోరుట్ల: రెండ్రోజుల క్రితం ముంబయిలోని వర్లిలో కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కోరుట్ల మండలం అయిలాపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం దంపతుల అంత్యక్రియలు అయిలాపూర్లో ఒకే చితిపై నిర్వహించారు. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన నాంపల్లి రాజమనోహార్(62), లత(51) దంపతులు కొన్నేళ్లుగా కొడుకు– కోడలుతో కలిసి ముంబయిలోని వర్లిలో నివాసముంటున్నారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు నెలకొనడంతో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో రాజమోహన్(62) తన వద్ద ఉన్న కంట్రీమేడ్ రివాల్వర్తో భార్య లతను కాల్చిచంపాడు. అనంతరం రాజమోహన్ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్లి పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, పోస్టుమార్టం అనంతరం దంపతులు రాజమోహన్–లత మృతదేహాలు మంగళవారం స్వగ్రామం అయిలాపూర్కు తీసుకువచ్చారు. దంపతుల మృతదేహాలను ఒకే చోట చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది. ఒకే చితిపై దంపతుల ఖననం అయిలాపూర్ గ్రామంలో విషాదం