-
వైద్యం.. మిథ్య
పడకేసిన పల్లె వైద్యం.. నర్సీపట్నం: పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య, సేవలు అందించేందుకు గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి పెద్దపీట వేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అభ్యర్థన మేరకు జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను కేటాయించడమే కాకుండా స్వయంగా కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సగం పనులు పూర్తయ్యాయి. జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో వైద్య విద్యతో పాటు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్న గ్రామీణ ప్రజల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది. మెడికల్ కళాశాలల నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులు, పేదలకు శాపంగా మారనుంది. ప్రజలకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కళాశాల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. భీమబోయిపాలెంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారు. ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) ఇంజినీర్ల పర్యవేక్షణలో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ పనులు చేపట్టింది. 12 నెలల్లో మెడికల్ కళాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాత్రింబవళ్లు నిర్మాణ పనులు చేశారు. 630 పడకలు ఏర్పాటు చేయడానికి, 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి వీలుగా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. మెడికల్ కళాశాల నిర్మాణంతో విశాఖ కేజీహెచ్కు వెళ్లే బాధ తప్పుతుందని గ్రామీణ ప్రజలు సంతోషించారు. ప్రభుత్వం మారడంతో మెడికల్ కళాశాలకు గ్రహణం పట్టింది. ప్రజల ఆశలు ఆడియాసలయ్యాయి. కళాశాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణంతో నాణ్యమైన వైద్యం అందుతుందని భావించాం. కళాశాల నిర్మాణాన్ని కూట మి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్య విద్య, కార్పొరేట్ స్థాయి సేవలను పేదలకు చేరువ చేయాలని జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటే, కూటమి నేతలు కార్పొరేట్కు ధారదత్తం చేయాలని భావించడం సరికాదు. – గీతా కృష్ణ, విద్యార్థి సంఘ నాయకుడు, నర్సీపట్నం వైద్యులు రావడం లేదు గత ప్రభుత్వంలో వైద్యులు ఇంటి వద్దకే వచ్చి బీపీ, సుగర్తో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి, మందులు ఇచ్చేవారు. డాక్టర్లు రెండుసార్లు ఇంటికి వచ్చి చూసేవారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వైద్యసిబ్బంది, డాక్టర్లు ఎవరూ రావడం లేదు. – షేక్ రోజా, పెదబొడ్డేపల్లివిలేజ్ క్లినిక్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. జిల్లాలో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో 424 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. పీహెచ్సీలకు ఇద్దరు వైద్యుల చొప్పున నియమించింది. వైద్యసిబ్బంది పోస్టులను సైతం భర్తీ చేసింది. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియామకంతో ఫ్యామిలీ డాక్టర్ వైద్యశిబిరాలు, జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా 46 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 9 అర్బన్ పీహెచ్సీలను అభివృద్ధి చేయడంతో పాటు వైద్యసిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ఫ్యామిలీ ఫిజీషియన్, జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాల ద్వారా గ్రామీణులకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించింది. అందుకునుగుణంగా ఆ ఐదేళ్లలో ప్రజారోగ్యం తమ బాధ్యతగా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఊరుకు, ప్రతి గడపకు వెళ్లి వైద్య సేవలు అందించారు.ఎంతో ముందుచూపుతో ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఇద్దరు వైద్యులను నియమించింది. వారిలో ఒకరు ఆస్పత్రిలో మరొకరు 104 వాహనంలో ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించేవారు. పల్లెల్లో అసాంక్రమిక వ్యాధులకు క్రమం తప్పకుండా నిర్ధారణ పరీక్షలు చేస్తూ మందులు ఇచ్చేవారు. చాపకిందనీరులా విస్తరిస్తున్న బీపీ, సుగర్, థైరాయిడ్ వ్యాధులను అరికట్టేందుకు గతంలో ఏఎన్ఎం, ఆశావర్కర్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె వైద్యం పడకేసింది. ఇప్పుడు వైద్యులు పల్లెలకు వచ్చే పరిస్థితి లేదు. గ్రామాలకు వైద్యులకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. గతంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పల్లెలో తిరిగే వారు. నేడు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నా పట్టించుకునే వారే లేరు. పల్లెల్లో ఎవరికి ఎలాంటి జబ్బు చేసినా పలకరించే దిక్కులేదు. జ్వరం వస్తే మంచానికే పరిమితం కావాలి. ప్రజారోగ్యం గాలిలో దీపం చందంగా మారింది. గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు కరువయ్యాయి. గతంలో 104 వాహనాలు నిర్ణీత కాల వ్యవధిలో గ్రామాలకు వెళ్లి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించి అవసరమైన మందులు ఇచ్చేవి. నేడు ఆ వాహనాలు పల్లెల్లో కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు ఏడాదిలో దిగజారిన వైద్యసేవలు ప్రభుత్వ వైద్య కళాశాలకు బ్రేక్ ప్రైవేటుపరం కానున్న వైద్య విద్య ఆగిన ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు పల్లెలకు వెళ్లని 104 వాహనాలు గ్రామీణులకు అందని వైద్య సేవలు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : కలెక్టర్
అనంతపురం రూరల్: యోగాతో మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. ఆదివారం శిల్పారామంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 14న అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్ అందే హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు యోగా ర్యాలీలు నిర్వహించండి అనంతపురం అర్బన్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ యోగాపై ప్రజలను చైతన్య పరిచేలా ర్యాలీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. యోగా ర్యాలీ నిర్వహణపై కలెక్టర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు యోగాపై చైతన్య పరిచి ర్యాలీలో పాల్గొనేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో యోగా ర్యాలీలు విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. -
పౌష్టికాహారం, వ్యాయామంతో మంచి ఆరోగ్యం
రంపచోడవరం: మంచి ఆరోగ్యాన్ని పొందడం మన చేతుల్లోనే ఉందని, ఇందుకు మంచి పౌష్టికాహరం తీసుకుంటే వ్యాయామం చేయాలని సివిల్ జడ్జి టీవీ రాఘవేంద్రరావు అన్నారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలు అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా ఉండాలని, చెడు వ్యసనాల బారిన పడవద్దని సూచించారు. వైద్య శిబిరంలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. స్వామి ప్రజ్ఞనాధనంద మహరాజ్, స్వామి లోకమయనంద మహరాజ్లు వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. వైద్యులు జీవీ రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, టీవీ సుబ్బారావు, దాసరి ఉమా మహేష్, ఎస్. సంపత్కుమార్, జీఎస్ఎల్ వైద్యులు సేవలు అందించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో 87 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పది మందిని కంటి ఆపరేషన్ల కోసం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయానికి తరలించారు.సివిల్ జడ్జి రాఘవేంద్రరావు -
సామూహిక అక్షరాభ్యాసం
విత్తన నాణ్యతతో దిగుబడులు సాగులో నాణ్యమైన విత్తనాలు వినియోగించడం ద్వారా మంచి దిగుబడులు సాధించ వచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.నేడు బోయకొండలో యోగాంధ్ర ● ఉదయం 7గంటలకే ప్రారంభం ● ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాక ● ఏర్పాట్ల నిర్వహణపై కలెక్టర్ ఆరా కాణిపాకం కిటకిట కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు.సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 116 డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు 14, ఐటీఐ, నర్సింగ్, పాలిటెక్నిక్, మెడకల్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 53 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 64,789 మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు 32 వేలకు పైగా ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో.. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అరకొర జీతంపై స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంటికొక ఉద్యోగమని నమ్మించి మోసం కూటమి ప్రభుత్వం యువశక్తికి వెన్నుపోటు పొడిచింది. దేశాభ్యున్నతికి అండగా నిలిచే యువతను నిర్వీర్యం చేస్తోంది. అధికారంలోకి రాగానే ఇంటికొక ఉద్యోగం ఇస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, పవన్న్కళ్యాణ్, లోకేష్ తమ హామీల అమలును గాలికొదిలేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం...20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం...ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం అంటూ ఎన్నికల ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు ఏ మాత్రం నోరు మెదపడం లేదు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలనను చేరువ చేసేందుకు వైఎస్సార్సీపీ సర్కారు తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. రాజకీయ కక్ష్లతో డ్వామా, డీఆర్డీఏ, విద్యాశాఖ, జిల్లా పరిషత్ పలు శాఖల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను వేల మందిని జిల్లాలో తొలగించారు. పట్టాలు చేతబట్టుకొని.. జిల్లా వ్యాప్తంగా ఏటా ఇంజినీరింగ్ చదువులు పూర్తి చేసి 32 వేల మంది వరకు యువత పట్టాలతో బయటకు వస్తున్నారు. డిగ్రీ, పీజీలు చేసిన మరో 35 వేల మంది వరకు చదువులు పూర్తి చేసుకుని పట్టాలు చేతబట్టి ఉపాధి కోసం వెతుకుతున్నారు. వీరుకాకుండా చదువులు మధ్యలో ఆపేసిన మరో 15 వేల మంది తమ అర్హతలను బట్టి ఉద్యోగాల కోసం రోడ్లపై తిరుగుతున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ వంటి ఇతర కోర్సులను పూర్తి చేసిన యువత తమ అర్హత పత్రాలతో ఉద్యోగాల వేటలో ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి అంతంతే.. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు దిగజారాయి. ఏ నెలకానెల జీఎస్టీ ఆదాయం దిగజారుతుండటం వ్యాపారాల దుస్థితికి అద్దం పడుతోంది. అటు ఉద్యోగాలు లేక, పరిశ్రమల స్థాపనకు అవకాశం లేక, అల్లాడుతున్న యువత ఏదైనా ప్రైవేట్ సంస్థలో జాబ్ చేసుకుని కుటుంబానికి అండగా ఉందామని భావిస్తే దానికి సైతం ఈ ప్రభుత్వ విధానాలు గండికొడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో గత ఏడాది 32 శాతానికి పైగా వ్యాపారాలు పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కనీసం 35 శాతం పెరుగుదల ఉండే రంగాల్లోనూ అంతమేర తగ్గుదల ఉండటంతో యువతకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. గత ఐదేళ్లల్లో ఉద్యోగాల జాతర వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎంగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభించాయి. గడిచిన ప్రభుత్వం దాదాపుగా 4.56 లక్షల ఉద్యోగాలు జిల్లాలో భర్తీ చేసింది. అందులో 2 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. ఆప్కాస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం భద్రత కల్పించింది. యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్ష వరకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కనున్న రిజర్వు (ఏఆర్)కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకనటలో తెలిపారు. ప్రజలకు సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చనన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. నేడు అర్ధగిరి క్షేత్రంలో హుండీ లెక్కింపు తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం 9 గంటలకు హుండీ లెక్కిస్తామని ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి హనుమంతురావు తెలిపారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీ కానుకలు లెక్కిస్తామని వివరించారు. గురుకులాల్లో ఎంపిక ప్రక్రియ చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు తమ సీటు ఖరారు చేసుకోవాలని డీసీఓ గీత తెలిపారు. ఇటీవల నిర్వహించిన 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు జరిగిన పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందిన వారికి ఎంపిక ప్రక్రియ జరుగుతోందన్నారు. ఎంపికై న విద్యార్థుల మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలు, కళాశాలకు వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని డీసీఓ కోరారు. మొదటి జాబితాలో అర్హత పొందినవారు వెంటనే ప్రవేశం పొందాలని, లేనిపక్షంలో వారికి ప్రవేశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాను వెంటనే విడుదల చేస్తామన్నారు. స్మార్ట్ మీటర్ల విధానం వద్దు చిత్తూరు కార్పొరేషన్ : అధికారంలో లేనప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుపై కూటమి నేతలు గగ్గోలు పెట్టిన కూటమి నేడు స్మార్టు మీటర్ల బిగింపు వేగవంతం చేయాలని అనడం విడ్డూరంగా ఉందని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య పేర్కొన్నారు. ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్మార్టు మీటర్ల విధానం లోపభూయిష్టంగా ఉందని, దీనిని రద్దు చేయాలని ఆయన డిమాండు చేశారు. ఆదానీ సంస్థకు కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టును కేంద్రం ఇచ్చిందన్నారు. వారికి ఎదురు చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వాణిజ్య, పరిశ్రమల బిగింపు అయ్యాక నివాసాలకు మీటర్లను బిగించనున్నారని, వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు సౌకత్, భాస్కర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీసెట్–2025 పరీక్ష ఉమ్మడి జిల్లాలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం జరగనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తొలి రోజు 366 మంది హాజరవుతారని చెప్పారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కంటే అర్ధగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పీజీ సెట్ పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు జరగనున్నట్టు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామివారిని దర్శించుకోగా 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. చౌడేపల్లె : మండలంలోని బోయకొండ వద్ద సోమవారం ఉదయం 7 గంటలకే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఆదివారం యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యోగా డే కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి, రవాణాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరవుతారన్నారు. అన్నిశాఖల సమన్వయంతో నిర్ణీత సమయానికి బోయకొండ గోశాల వద్దకు చేరుకోవాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసనాలు నిర్వహిస్తారన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సుమారు 2 వేల మందితో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రవాణా, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. తొలుత స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఆస్థాన మండపంలో శ్రీసరస్వతిదేవిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం చిన్నపిల్లల చేత ఈవో పెంచల కిషోర్ అక్షరాలు దిద్దించారు. అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమానికి 200 మంది పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఈవో రవీంద్రబాబు,సిబ్బంది కోదండపాణి, హరి, మాధవరెడ్డి, వాసు పాల్గొన్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ బాబూ జాబు ఎక్కడ అంటున్న నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ ఊరించిన కూటమి ఏడాదవుతున్నా ఒక్క ఉద్యోగమూ ఇవ్వని ప్రభుత్వం ఊసేలేని జాబ్ క్యాలెండర్ ప్రకటన అడ్డగోలుగా వేల మంది ఉద్యోగాలతొలగింపు జిల్లాలో ఏటా 32 వేల ఇంజినీరింగ్ పట్టభద్రులు కూటమి టీడీపీ ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించింది. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రగల్భాలు పలికింది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆర్బాటం చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాల ఊసే మరిచిపోయింది..భృతి కలగా మారిపోయింది. ఇక జాబ్ క్యాలెండర్పై చేతులెత్తేసింది. ఇలా యువతను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా నిలువునా ముంచేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 4.56 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం యువతకు వెన్నుపోటు పొడిచింది. జిల్లాలోని కళాశాలల సమాచారం డిగ్రీ కళాశాలలు 116 ఇంజినీరింగ్ కళాశాలలు 14 ఐటీఐ కళాశాలలు 18 నర్సింగ్ కళాశాలలు 07 పాలిటెక్నిక్ కళాశాలలు 08 మెడికల్ 02 బీఈడీ కళాశాలలు 07 ఎంబీఏ, ఎంసీఏ 11 మొత్తం కళాశాలలు 183 జాబ్ క్యాలెండర్ ..నాటకం ప్రస్తుత మంత్రి నారా లోకేష్ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ గతంలో పదే పదే ఉదరగొట్టారు. యువతతో ఎక్కడ సమావేశాలు నిర్వహించినా జాబ్ క్యాలెండర్ మాటే ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ సర్కార్ పై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసి యువతను ఏ మార్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లేకుండా చేతులెత్తేశారు. దీనికి తోడు తమకు నష్టం కలిగించే నిర్ణయాలనే అమలు చేస్తున్నారంటూ జిల్లాలోని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్కు ఎగనామం జిల్లా వ్యాప్తంగా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు పది నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధుల కోసం విద్యార్థులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమో తదితర కోర్సులకు సంబంధించి ఏడాది ఫీజును రీయింబర్స్మెంట్లో నాలుగు విడతలుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అయితే 2024–25 విద్యాసంవత్సరం పూర్తయినా...ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చిల్లిగవ్వ చేతికందలేదు. దీంతో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూటమి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలు ఫీజులు చెల్లించాలని ఒత్తిళ్లు చేస్తుండటంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. భృతి.. బూటకం టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతిని ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి మాటే జిల్లాలో వినిపించడం లేదు. చిత్తూరు జిల్లాలో లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నమ్మి కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు భృతి ఊసే ఎత్తకపోవడం దుర్మార్గం. జాబ్ క్యాలెండర్ ఆర్భాటమేనా.. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి మరిచిపోయారు. నిరుద్యోగులను కూటమి ప్రభు త్వం మోసం చేసింది. ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. ఉద్యోగం రాకపోవడంతో సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. నిరుద్యోగులు కూట మి ప్రభుత్వాన్ని నమ్మి మరోసారి మోసపోయారు. – రమేష్, వి.కోట మండలం, చిత్తూరు జిల్లా మోసపూరిత వాగ్దానాలు చంద్రబాబు 2014 ఎన్నికల్లో నూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మళ్లీ మొన్న ఎన్నికల్లోనూ ఈ హామీ ఇచ్చా రు. సూపర్సిక్స్ హామీలతో అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసం చేయడం సమంజసం కాదు. – సద్ధాం, విద్యార్థి సంఘ నాయకుడు,చిత్తూరు నగరం నోటిఫికేషన్లు లేవు.. భృతి లేదు.. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామన్నారు. ఇప్పుడేమో సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది ఏ వర్గానికి ఎలాంటి మేలు చేయలేదు. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్నాను. ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. – కిషోర్, నిరుద్యోగి, నగరి మండలం కుటుంబంపై మరింత భారం ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో వచ్చేది. గత ఐదేళ్లు ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం ఫీజు మొత్తం ఒక్కసారి కట్టలేక విద్యార్థులంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. – ముస్తా, విద్యార్థి, కార్వేటినగరం నాలుగు లక్షల మంది యువతకు మొండిచేయి జిల్లాలోని యువత చంద్రబాబు అండ్ కో చేతిలో మరోసారి మోసపోయారు. ఏడాదికి నాలుగు లక్షలు కాదు కదా కొత్తగా నాలుగు పదుల సంఖ్యలోనైనా ఉద్యోగాల భర్తీని కూటమి ప్రభుత్వం చేపట్టలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. రూ.5 వేలు కాదు కదా రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారి ఉద్యోగాలు తొలగించి కడుపులు కొట్టారు. ఇక నిరుద్యోగ భృతి హామీ టీడీపీ 2014–19 పాలనలో మాదిరిగానే ప్రస్తుతం ఎగనామం పెట్టేశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపించారు. -
కోకో గింజల చోరీ కేసులో నలుగురి అరెస్టు
జంగారెడ్డిగూడెం: కోకో గింజల చోరీ కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, లక్కవరం పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల కోకో గింజల చోరీ జరిగింది. దొంగిలించిన రూ.8 లక్షలు విలువైన 2 వేల కేజీల కోకో గింజలు అమ్మేందుకు ప్రయత్నించిన క్రమంలో, దాడి చేసి జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లికి చెందిన కంకిపాటి కీర్తిరాజు, మానికల మంగరాజు, దొప్పసాని వెంకన్నబాబు, పుట్లగట్లగూడెంకు చెందిన కటారి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిలో కంకిపాటి కీర్తిరాజు పగలు మేకలు కాస్తూ పొలాల్లో ఉన్న కోకో గింజలు ఆరబెట్టిన ప్రదేశాలు గమనించి, బృందంలోని మరో ఐదుగురికి చెబుతాడు. ఆటోలో రహస్య ప్రదేశానికి తరలించేవారు. వీలుచూసుకుని అమ్మేవారు. వీరిపై జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, లక్కవరం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, టి.నరసాపురం పీఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్ల పరిధిలో సైతం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం పాటు, చోరీకి వినియోగించిన ఆటోను సీజ్ చేసినట్లు చెప్పారు. కేసును చేధించిన ఎస్సై జబీర్, ఏఎస్సై సంపత్కుమార్, పీసీలు రమేష్, బి.రాజశేఖర్లకు రివార్డు కోసం ఎస్పీకి సిపార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏడాది నిండా.. దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి,ఏలూరు : జిల్లాలో దాడుల సంస్కృతి తారాస్థాయికి చేరింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరు. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే గత ఏడాది కాలంలో జిల్లాలో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, పల్లెల్లో కూటమి నేతలు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోవడం నిత్యకృత్యంగా కొనసాగింది. ప్రధానంగా దెందులూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, పోలవరం నియోజకవర్గాల్లో దా డులు, హత్యాయత్నాలు, హత్యలు వరకు పలు ఘ టనలు నమోదయ్యాయి. తొలిసారిగా జిల్లాలో జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడుల సంస్కృతికి కూటమి నేతలు తెరతీశారు. అడ్డూ అదుపూ లేకుండా.. నూజివీడు మండలం తుక్కులూరులో గతేడాది సెప్టెంబర్ 23న టీడీపీ గ్రామ అధ్యక్షుడు అన్నే సురేష్ కార్యకర్తలు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కిరణ్లు అదే గ్రామానికి చెందిన అచ్చి నాగరాజు అనే వ్యక్తిని విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి నాగరాజును కారులో పడేసి పోలీస్స్టేషన్లో అప్పగించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర వైరల్గా మారి టీడీపీ సాగిస్తున్న అరాచకానికి మచ్చుతునకగా నిలిచింది. గతేడాది జూన్ 6న నూజివీడులో అప్పటి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నడకుదురు గిరిష్పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి యత్నించిన ఘటన వీడియో వైరల్గా మా రింది. కొద్దిరోజుల క్రితం అధికార పార్టీ ఒత్తిళ్లతో గిరీష్ టీడీపీలో చేరారు. అలాగే వేలేరుపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపరచడం, ఆగిరిపల్లి గ్రామ సర్పంచ్ చిమటా శ్రీనివాసరావు టెంట్ హౌస్లో టెంట్లు, కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, ఆగిరిపల్లి–2 ఎంపీటీసీ సాదం గోపినాథ్, మాజీ ఎంపీటీసీ పండుపై దాడులు, వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము ఎంపీటీసీ కొమ్ము రాంబాబు నివాసంపై దాడి చేసి ఇంట్లో ఫర్నీచర్ను ధ్వంసం చేయడం ఇలా వరుస విధ్వంస కాండలు కొనసాగాయి. అక్రమ కేసులు ఎన్నెన్నో.. ● టీడీపీ అరాచకాలకు సోషల్ మీడియా కేసులు పరాకాష్టగా మారాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, లోకేష్ ఆదేశాలతో ప్రతి మండలంలో టీడీపీ మండల అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే కేసులు నమోదు చేయడం, సీరియస్ టార్గెట్ అయితే నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేయడం యథేచ్ఛగా జరిగింది. ● 2023 జూలై 15న నూజివీడులోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర్రెడ్డి పోస్టు పెడితే కొద్దినెలల క్రితం టీడీపీ మండల అధ్యక్షుడు ముసునూరు సీతారామాంజనేయ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం రెండేళ్ల క్రితం ఘటనపై నాన్ బెయిల్బుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. ● లింగపాలెం మండలం మఠంగూడెంలోనూ ఇదే తరహాలో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు అరైస్టె 45 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. ● నిడమర్రు మండలంలో సోషల్ మీడియా కో–కన్వీనర్ బేతు సతీష్ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, న్యాయం చేయండని అన్నందుకు అరెస్టు చేశారు. ● బాపట్ల టౌన్ ఇస్లాంపేటకు చెందిన షేక్ సయ్యద్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని చింతలపూడి టీడీపీ మండల కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ● కొయ్యలగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన మద్దిపాటి కృష్ణ, జింటా వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తోట జయబాబుపై హత్యాయత్నం చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదుచేశారు. ● కన్నాపురం సర్పంచ్ భర్త కృష్ణపై కూటమి నేతలు దాడి చేసి అతనిపైనే రివర్స్ కేసులు నమోదు చేయించారు. అరాచకం కట్టలు తెంచుకుంది.. రెడ్బుక్ పేరుతో కూటమి నేతల దౌర్జనకాండ సాగింది.. పల్లెల్లో వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా భారీస్థాయిలో భౌతికదాడులు మొదలు ఆస్తుల విధ్వంసం కొనసాగింది. ప్రశాంతతకు మారుపేరైన పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలుగా కేసుల నమోదు, అరెస్ట్లు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు, వ్యక్తిగతంగా భౌతిక దాడులు, ఆస్తి నష్టాలపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయనిపరిస్థితి. ఇలా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగమే అమలైంది. అమాత్యులు మొదలు ప్రజాప్రతినిధులంతా వ్యక్తిగత టార్గెట్లను నిస్సిగ్గుగా కొనసాగించారు. దెందులూరులో రెచ్చిపోయిన మూకలు దెందులూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని నివాసంపై గతేడాది జూలై 7న వందల సంఖ్యలో కూటమి కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసి కార్యాలయ అద్దాలు, కుర్చీలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దాదాపు మూడు రోజుల పాటు పోలీస్ పికెటింగ్ హడావుడి కొనసాగినా కేసులు, అరెస్టులు జరగలేదు. అలాగే పెదవేగి మండలం కవ్వగుంట మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్యపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. పెదపాడు మండలం, ఏలూరు రూరల్ మండలం, పెదవేగిలోనూ పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, చేపల చెరువు సాగుకు అడ్డంకులు కల్పించడం యథేచ్ఛగా సాగాయి. దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం మామ గాంధీపై దాడి, క్రియాశీలక కార్యకర్త రవీంద్ర ఆటో విధ్వంసం అలాగే దెందులూరులో వైఎస్సార్ విగ్రహాన్ని, ప్రభుత్వ శిలాఫలాకలను ధ్వంసం చేయడం ఇలా టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కూటమి రెడ్బుక్ రాజ్యాంగం జిల్లాలో అంతులేని అరాచకం వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు తుక్కులూరులో వ్యక్తిపై దాడి చేసి తాళ్లతో నిర్బంధం నూజివీడు, చింతలపూడి, పోలవరంలో దాడుల పర్వం దెందులూరులో అధికార పార్టీ నేతల విధ్వంసాలు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు కూటమి ఏడాది పాలనంతా దౌర్జన్యాలే.. -
రైస్ మిల్లుల తనిఖీ
చోడవరం: పీడీఎస్ బియ్యం కొనుగోలు,అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి హెచ్చరించారు. మండలంలో వెంకన్నపాలెం, ముద్దుర్తి గ్రామాల్లో రైస్ మిల్లులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు పరిశీలించి, ధాన్యం, బియ్యం నిల్వల శాంపిల్స్ను తీసి పరీక్షలకు పంపారు. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే బియ్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు, అమ్మకాలు చేయరాదని, అటువంటివి జరిగినట్టు తమ పరిశీలనలో తేలితే కేసులు పెడతామని డీఎస్వో హెచ్చరించారు. అనంతరం గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. బియ్యం ఎగుమతుల రికార్డులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
అంధ మహిళా క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ శరత్బాబు, తన వంతుగా విజేత జట్టుకు రూ. 75 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 25 వేలు బహుమతులుగా అందజేస్తానని ప్రకటించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. పోటీలలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు, కేరళ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో ఒడిశా జట్టు, ఢిల్లీ జట్టును 49 పరుగుల తేడాతో ఓడించి గెలుపొందింది. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. రవీంద్రబాబు, ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్ ప్రతినిధి అనీల్, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాళ్లపాకలో 9న యోగాంధ్ర కార్యక్రమం
రాయచోటి: తాళ్లపాకలోని అన్నమయ్య సన్నిధిలో ఈనెల 9న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, తిరుమలేశునిపై 32వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య నడయాడిన నేలలో ఆయన పేరుతో జిల్లా ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది మే 9న 617 వసంతాలు పూర్తి చేసుకున్న అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకొని ఆయనను స్మరిస్తూ తాళ్లపాకలోని ఆయన విగ్రహం వద్ద సోమవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు 617 మందితో యోగాసనాలు వేయనున్నట్లు తెలిపారు. తిరుమలేశునిపై 32వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్యకు నివాళిగా జిల్లా వ్యాప్తంగా 32 వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించే విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మీడియా మిత్రులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాలకు చెందిన 1993 –94 బ్యా చ్కు చెందిన విద్యార్థులు ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవనంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. పదో తరగతి పూర్తి చేసుకుని 31ఏళ్లు పూర్తి కాగా అందరూ ఒకే వేదికపై కలుసుకుని ఆనా టి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు రా జేంద్రప్రసాద్, బిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2005 –06 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.