వైద్యం.. మిథ్య | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. మిథ్య

Jun 9 2025 6:53 AM | Updated on Jun 9 2025 6:53 AM

వైద్య

వైద్యం.. మిథ్య

పడకేసిన పల్లె వైద్యం..

నర్సీపట్నం: పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య, సేవలు అందించేందుకు గత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి పెద్దపీట వేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అభ్యర్థన మేరకు జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గానికి మెడికల్‌ కళాశాలను కేటాయించడమే కాకుండా స్వయంగా కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సగం పనులు పూర్తయ్యాయి. జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో వైద్య విద్యతో పాటు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్న గ్రామీణ ప్రజల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది. మెడికల్‌ కళాశాలల నిర్వహణను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులు, పేదలకు శాపంగా మారనుంది. ప్రజలకు ఎంతో ఉపయోగపడే మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది.

భీమబోయిపాలెంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టారు. ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) ఇంజినీర్ల పర్యవేక్షణలో నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ పనులు చేపట్టింది. 12 నెలల్లో మెడికల్‌ కళాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాత్రింబవళ్లు నిర్మాణ పనులు చేశారు. 630 పడకలు ఏర్పాటు చేయడానికి, 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి వీలుగా మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. మెడికల్‌ కళాశాల నిర్మాణంతో విశాఖ కేజీహెచ్‌కు వెళ్లే బాధ తప్పుతుందని గ్రామీణ ప్రజలు సంతోషించారు. ప్రభుత్వం మారడంతో మెడికల్‌ కళాశాలకు గ్రహణం పట్టింది. ప్రజల ఆశలు ఆడియాసలయ్యాయి.

కళాశాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం

మెడికల్‌ కళాశాల నిర్మాణంతో నాణ్యమైన వైద్యం అందుతుందని భావించాం. కళాశాల నిర్మాణాన్ని కూట మి ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్య విద్య, కార్పొరేట్‌ స్థాయి సేవలను పేదలకు చేరువ చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటే, కూటమి నేతలు కార్పొరేట్‌కు ధారదత్తం చేయాలని భావించడం సరికాదు. – గీతా కృష్ణ,

విద్యార్థి సంఘ నాయకుడు, నర్సీపట్నం

వైద్యులు రావడం లేదు

గత ప్రభుత్వంలో వైద్యులు ఇంటి వద్దకే వచ్చి బీపీ, సుగర్‌తో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి, మందులు ఇచ్చేవారు. డాక్టర్లు రెండుసార్లు ఇంటికి వచ్చి చూసేవారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వైద్యసిబ్బంది, డాక్టర్లు ఎవరూ రావడం లేదు.

– షేక్‌ రోజా, పెదబొడ్డేపల్లి

విలేజ్‌ క్లినిక్‌

త వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. జిల్లాలో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో 424 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. పీహెచ్‌సీలకు ఇద్దరు వైద్యుల చొప్పున నియమించింది. వైద్యసిబ్బంది పోస్టులను సైతం భర్తీ చేసింది. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియామకంతో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్యశిబిరాలు, జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా 46 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 9 అర్బన్‌ పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడంతో పాటు వైద్యసిబ్బందిని భర్తీ చేసి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ఫ్యామిలీ ఫిజీషియన్‌, జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాల ద్వారా గ్రామీణులకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించింది. అందుకునుగుణంగా ఆ ఐదేళ్లలో ప్రజారోగ్యం తమ బాధ్యతగా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఊరుకు, ప్రతి గడపకు వెళ్లి వైద్య సేవలు అందించారు.ఎంతో ముందుచూపుతో ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఇద్దరు వైద్యులను నియమించింది. వారిలో ఒకరు ఆస్పత్రిలో మరొకరు 104 వాహనంలో ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించేవారు.

పల్లెల్లో అసాంక్రమిక వ్యాధులకు క్రమం తప్పకుండా నిర్ధారణ పరీక్షలు చేస్తూ మందులు ఇచ్చేవారు. చాపకిందనీరులా విస్తరిస్తున్న బీపీ, సుగర్‌, థైరాయిడ్‌ వ్యాధులను అరికట్టేందుకు గతంలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె వైద్యం పడకేసింది. ఇప్పుడు వైద్యులు పల్లెలకు వచ్చే పరిస్థితి లేదు. గ్రామాలకు వైద్యులకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. గతంలో వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పల్లెలో తిరిగే వారు. నేడు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నా పట్టించుకునే వారే లేరు. పల్లెల్లో ఎవరికి ఎలాంటి జబ్బు చేసినా పలకరించే దిక్కులేదు. జ్వరం వస్తే మంచానికే పరిమితం కావాలి. ప్రజారోగ్యం గాలిలో దీపం చందంగా మారింది. గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు కరువయ్యాయి. గతంలో 104 వాహనాలు నిర్ణీత కాల వ్యవధిలో గ్రామాలకు వెళ్లి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించి అవసరమైన మందులు ఇచ్చేవి. నేడు ఆ వాహనాలు పల్లెల్లో కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు

ఏడాదిలో దిగజారిన వైద్యసేవలు

ప్రభుత్వ వైద్య కళాశాలకు బ్రేక్‌

ప్రైవేటుపరం కానున్న వైద్య విద్య

ఆగిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు

పల్లెలకు వెళ్లని 104 వాహనాలు

గ్రామీణులకు అందని వైద్య సేవలు

వైద్యం.. మిథ్య 1
1/6

వైద్యం.. మిథ్య

వైద్యం.. మిథ్య 2
2/6

వైద్యం.. మిథ్య

వైద్యం.. మిథ్య 3
3/6

వైద్యం.. మిథ్య

వైద్యం.. మిథ్య 4
4/6

వైద్యం.. మిథ్య

వైద్యం.. మిథ్య 5
5/6

వైద్యం.. మిథ్య

వైద్యం.. మిథ్య 6
6/6

వైద్యం.. మిథ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement