
మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే న్యాయం
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే న్యాయం జరుగుతుంది. వెబ్ కౌన్సెలింగ్లో ఎదురయ్యే ఇబ్బందులను నివారించాలి. వెబ్ కౌన్సెలింగ్లో 1,000 నుంచి 2,000 ఆప్షన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెబ్ కౌన్సెలింగ్ సమయంలో వాటిని వెతుక్కోవడం కష్టమవుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్ప డతాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడం బాధాకరం.
–ఇమంది పైడిరాజు, ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి