
మాట మార్చిన విద్యాశాఖ అధికారులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్లో మాన్యువల్ విధానం అవలంబిస్తామని విద్యా శాఖాధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుకుంటున్నారు. ఇంతమంది కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ విధానాన్ని పక్కనబెట్టి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ను అమలు చేయడం సరికాదు.
–డి.గోపీనాథ్, పీఆర్టీయూ,
అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు