
రాజకీయ పార్టీ కార్యక్రమంలా.. కుట్టు శిక్షణ కేంద్రం ప్రా
దేవరాపల్లి: స్థానిక పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూటమి పార్టీలకు చెందిన రాజకీయ కార్యక్రమం మాదిరిగా నిర్వహించారు. ఈ కేంద్రా న్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారా యణమూర్తి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ కార్పొరేషన్ సహకారంతో మండల స్థాయిలో నిర్వహిస్తున్న ఈశిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి మండల స్థాయిలో ప్రజాప్రతినిధులైన ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలకు సమాచారం ఇవ్వలేదు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూటమి పార్టీలకు చెందిన నాయుకులకు ఎలా సమాచారం ఇచ్చారని అధికారులపై పలువు రు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభానికి మండల స్థాయి కాదుకదా కనీసం గ్రామ స్థాయి అధికారి కూడా హాజరు కాలేదు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తమకు ప్రయాణ చార్జీలను సమకూర్చాలని కుట్టు శిక్షణకు హాజరైన మహిళలు ఎమ్మెల్యేను కోరారు. స్థానిక సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, పోతల పాత్రునాయుడు, కిలపర్తి భాస్కరరావు, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ, జెడ్పీటీసీలకు కనీస సమాచారం ఇవ్వని అధికారులు
అధికారుల తీరుపై
మండల ప్రజాప్రతినిధుల ఆగ్రహం